-
‘రాహుల్ కంటే మోదీ పాపులర్’ వ్యాఖ్యలు.. చిక్కుల్లో కార్తీ చిదంబరం
చెన్ననై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. మోదీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని.. ఆయన్ను మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని అన్నారు అదే విధంగా కాంగ్రెస్ వ్యతిరేకివస్తున్న ఈవీఎంల మిషన్ల వాడకం గురించి కార్తీ మద్దతుగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎమ్లపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పార్లమెంటరీ సభ్యుడికి నోటీసులు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి. చదవండి: జనవరి 22న ఉత్తర ప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవు -
ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు గురువారం కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకుగానూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ప్రియాంక గాంధీ తప్పుడు ప్రకటనలు చేశారని అక్టోబర్ 21వ తేదీన ఈసీఐకి ఫిర్యాదు వెళ్లింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. తన ప్రసంగం ద్వారా రెచ్చగొట్టేలా ఆమె మాట్లాడరని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఈసీ.. అక్టోబర్ 30 సాయంత్రలోపు నోటీసులకు స్పందించాలని ఆమెను కోరింది. నవంబర్ 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్టోబర్ 20వ తేదీన దౌసా బహిరంగ సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించారు. ‘‘మోదీ ఓ ఆలయానికి ఇచ్చిన విరాళం కవర్ను తెరిస్తే.. అందులో కేవలం 21రూ. మాత్రమే ఉన్నాయి. టీవీలో ఆ వార్త చూశా. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, బీజేపీ ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఆ ఎన్వెలప్ లాంటివే. అందులో ఏమీ ఉండవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రియాంక ప్రసంగానికి సంబంధించిన వీడియోను సైతం ఫిర్యాదుకు జత పరిచింది బీజేపీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైరల్గా వీడియో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్ భిల్వారా దేవ్ నారాయణ ఆలయాన్ని సందర్శించారు. దేవ్ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న ఆలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే హుండీలో విరాళాలు కూడా సమర్పించారు. అయితే ఈ ఆలయం హుండీ ప్రత్యేక సందర్భాల్లోనే తెరుస్తారు. భాద్రపద మాసం (హిందూ క్యాలెండర్ ప్రకారం) ఛత్ తిథి కావడంతో సెప్టెంబర్ 25వ తేదీన హుండీ తెరిచి.. విరాళాలు లెక్కించారు. అయితే అందులో ప్రధాని మోదీ పేరుతో ఉన్న కవరు కనిపించింది. ఆలయ పూజారి హేమ్రాజ్ పోస్వాల్ స్వయంగా కవర్ను తెరచి చూడగా ఇందులో కేవలం రూ. 21 రూపాయలు మాత్రమే కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
NCLAT సభ్యులకు కోర్టు ధిక్కార నోటీసులు
ఢిల్లీ: దేశసర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులిద్దరికి సుప్రీం కోర్టు కోర్టు ధిక్కారం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీన వాళ్లిద్దరిని తమ ఎదుట హాజరు కావాలని సీజేఐ ధర్మాసనం ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో అక్టోబర్ 13వ తేదీన ‘స్టేటస్ కో’(యధాతథ స్థితి) ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఆ ఆదేశాలతో సంబంధం లేకుండా.. ఎన్సీఎల్ఏటీ జ్యూడీషియల్ సభ్యుడు రాకేశ్ కుమార్, టెక్నికల్ మెంబర్ డాక్టర్ అలోక్ శ్రీవాస్తవలు ఈ వ్యవహారంపై దాఖలైన అప్పీల్పై తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత లాయర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆదేశాల గురించి తమకు తెలియదని ఆ ఇద్దరు సభ్యులు చైర్పర్సన్ ముందు వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని దర్యాప్తు నివేదికలో పొందుపరిచారు చైర్పర్సన్. అయితే దర్యాప్తు నివేదిక ఇవాళ సుప్రీం కోర్టుకు చేరింది. దానిని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. అయితే.. సుప్రీం కోర్టు ఆదేశాలు తెలిసి కూడా ఎన్సీఎల్ఏటీ తీర్పు వెల్లడించినట్లు ప్రాథమికంగా ధర్మాసనం గుర్తించింది. ఆ ఇద్దరు సభ్యులను అక్టోబర్ 30వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు సుప్రీం స్టేటస్ కో ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ ఎన్సీఎల్ఏటీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సైతం పక్కనపెట్టేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశాన్ని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ముందుకు బదిలీ చేసింది. -
‘చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర’
సాక్షి, విశాఖపట్నం: ఐటీ నోటీసులపై చంద్రబాబు నాయుడు సంబంధం లేని సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. రెండు రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ షో కాజ్ నోటీసుల గురించి జాతీయ మీడియా కథనాలు ఇస్తున్నాయి. అయినా ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. అలాంటప్పుడు ఐటీ నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వరు. ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర. ఆయన ఎదుగుదల.. ముందు వెనుక ఆస్తుల గురించి జనానికి తెలుసు. బాబు రాజకీయం అంతా కుట్రలు.. కుతంత్రాలే. చంద్రబాబు నేరుగా నాయకుడిగా ఎదగలేదు. వెన్నుపోటు ద్వారానే రాజకీయంగా ఎదిగారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకునిపై ఇన్ని కుంభ కోణాలు లేవు. నారా వారి పల్లి నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఆయనదో అవినీతి సామ్రాజ్యం. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్ర బాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు. బాబు మీరు దొరికి పోయారని మీకు తెలుసు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది తీగ.. ఇంక డొంక కదలాలి. ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి అంటూ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ 2020 నుంచి జూన్ వరకు నాలుగు నోటీసులు ఇచ్చారు...సంబంధం లేని వివరణ ఇస్తారు. 46 పేజీల షోకాజ్ నోటీసు ఇస్తే తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదునేను మీ జూరిడిక్షన్ లో లేను అంటారు. ఎంవిపి అనే వ్యక్తి కంపెనీ ల నుంచి అవినీతి సొమ్ము వసూలుకు మీడియేటర్ గా పని చేసినట్టు తేలింది. 2019లో చంద్రబాబుని ఎంవీపిని కలవడం ఆయన పీఏ శ్రీనివాస్ ప్రకారం పని చేయమని చెప్పడం జరిగింది. మొత్తం 118 కోట్లు చంద్రబాబు అందినట్టు నోటీసుల్లో వుంది. మీ పీఏ శ్రీనివాస్ మీ అక్రమాల గురించి చెబితే నా పేరు లేదంటారు. మీ కొడుకు పేరు కూడా నోటీసులో వుంది. చంద్ర బాబు స్కిల్డ్ క్రిమినల్ .అన్ స్కిల్డ్ పొలిటీషియన్ ఆధాయ పన్నుశాఖ దర్యాప్తులో విషయం బయట పడింది. సీమెన్స్ అనే సంస్థలో ఓ వ్యక్తి ద్వారా రూ. 3,356 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి ప్రభుత్వ వాటా రూ. 350 కోట్లు మళ్లించారు. యూరో లాటరీ మాదిరిగా సీమెన్స్ పేరిట మోసం చేశారు. ఈ 350 కోట్లు అత్యవసర క్యాబినెట్ ద్వారా మళ్లించారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరిట ..అమరావతి పేరిట ఎన్నో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి.. అవినీతి బాబు కథ విచారణకు ఈడీ జోక్యం చేసుకోవాలి అని మంత్రి అమర్నాథ్ కోరారు. -
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్అండ్టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్లు, చాట్లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్మెంట్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 -
గాలిపై దాడి ‘రాజిరెడ్డికి’ నోటీసులు?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గ్రూపు విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో నిత్యం వార్తలతో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కమిటీల కిరికిరి కొనసాగుతోంది. ఆ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకంపై తారాస్థాయిలో రచ్చ జరుగుతోంది. పలు మండల, పట్టణ కమిటీలను ఏకపక్షంగా ప్రకటించారంటూ హైదరాబాద్లోని గాంధీభవన్ను ముట్టడించగా, ఏకంగా పరస్పరం దాడులకు దిగు తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్లో ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతల మ ధ్య ఉన్న విభేదాలు ఇప్పటి వరకు జిల్లా స్థాయిలోనే బట్టబయలు కాగా, ఇప్పుడు గాంధీభవన్ స్థాయిలో రచ్చ జరగడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ కమిటీలు నియామకం ఏకపక్షమంటూ.. మెదక్ నియోజకవర్గంలోని, మండల, పట్టణ అధ్యక్ష పదవుల నియామకం రచ్చకు దారితీసింది. ఈ కమిటీలను ఏకపక్షంగా నియమించారని ఆరోపిస్తూ టీపీసీసీ సభ్యుడు సుప్రభాత్రావు వర్గం ఏకంగా గాంధీభవన్ను ముట్టడించింది. కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం ఐదు సంవత్సరాలు ఒకే పదవిలో కొనసాగుతున్న వారిని తొలగించాలని మరో పీసీసీ నేత మ్యాడం బాలకృష్ణ వర్గం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ‘ఆవుల’కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు? నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంలో ఏకంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్పై దాడి జరగ్గా, ఆలస్యంగా వెలుగు చూసింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆవుల రాజిరెడ్డి వర్గానికి చెందిన నాయకులు పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి నివాసం వద్ద ఏకంగా గాలిపై దాడి చేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్గా తీసుకుంది. ఇందుకు బాధ్యులైన వెల్దుర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షుడితో పాటు, మరో ముగ్గురుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనలో ఆవుల రాజిరెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. తెల్లాపూర్ కమిటీ విషయంలో కాటాకు షాక్.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పట్టణ అధ్యక్ష పదవి విషయంలోనూ వివాదం రాజుకుంది. ఈ కమిటీ విషయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుడు కాటా శ్రీనివాస్గౌడ్ షాక్ తగిలింది. ముందుగా కాటా శ్రీనివాస్గౌడ్ అనుచరుడు రవీందర్ను తెల్లాపూర్ పట్టణ అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించారు. కానీ ఈ పదవికి చిలుకమర్రి ప్రభాకర్రెడ్డిని నియమిస్తున్నట్లు టీపీసీసీ నుంచి ఉత్తర్వులు రావడం పార్టీ వర్గాల్లో రచ్చకు దారితీసింది. సిద్దిపేట డీసీసీపైనా తిరుగుబాటు బావుటా.. మండల, పట్టణ కమిటీల నియామకాల విషయంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపైనా ఆయన వ్యతిరేక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మండల, పట్టణ కమిటీల నియామకంలో ఏకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత జశ్వంత్రెడ్డి వర్గం నాయకులు ఇటీవల గాంధీభవన్ ముట్టడించారు. నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని జశ్వంత్రెడ్డి వర్గం ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. -
ఆహారం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
ఆత్మకూర్/అమరచింత/వనపర్తి: ఆహారం విషతు ల్యమై.. 60 మంది విద్యా ర్థినులు అనారోగ్యానికి గురికాగా.. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వనపర్తి జిల్లా అమరచింతలోని కేజీబీవీలో గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగితే.. శుక్రవా రం ఉదయం వరకు బాధిత విద్యా ర్థినులకు కనీ సం వైద్యం అందించలేకపోయారు. అమరచింతలోని కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 340 మంది విద్యా ర్థినులు చదువుకుంటున్నారు. గురువారం హాజరైన 270 మంది విద్యా ర్థినులు రాత్రి 7.30 గంటలకు అన్నం, పప్పు, సాంబార్, వంకాయకూర, మజ్జిగతో భోజనాలు చేశారు. అయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో వెంటనే అందుబాటులో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఏఎన్ఎం, ఇతర సిబ్బంది లేకపోవడంతో.. కోలుకుంటారని ఉదయం వరకు నిరీక్షించారు. కానీ, ఉదయం విద్యా ర్థినులు హాహాకారాలు చేయడంతో అంబులెన్స్లో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట 10 మందితో మొదలైన బాధితుల తరలింపు 50 మందికి చేరుకుంది. అమరచింతలోని డీఎంఆర్ ఆస్పత్రిలో మరో 10 మంది విద్యా ర్థినులను చేరి్పంచారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎస్వో తొలగింపు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్ అమరచింత కేజీబీవీలో విద్యా ర్థినులు అస్వస్థతకు గురైన సంఘటనను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తీవ్రంగా పరిగణించారు. కేజీబీవీ ఎస్వో స్వప్నరాణిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ, ఇన్చార్జ్ డీఈవో గోవిందరాజులు, జీసీడీవో సుబ్బలక్ష్మికి శుక్రవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా సాయంత్రం విధులకు హాజరు కాకపోవడం.. పరిశీలనకు వెళ్లిన కలెక్టర్కు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నట్లు కనిపించిన ఏఎస్డబ్ల్యూవో సేవ్యానాయక్ను.. రూరల్ ఎస్ఐ నాగన్నతో డ్రంకెన్ టెస్ట్ నిర్వహించి సస్పెండ్ చేశారు. కొన్నిరోజులుగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న కొత్తకోట ఎస్సీ హాస్టల్ వార్డెన్ సంతో‹Ùను కూడా సస్పెండ్ చేశారు. -
షోకాజ్ అందుకున్న మర్నాడే బీజేపీలోకి ఏలేటి
సాక్షి, న్యూఢిల్లీ/నిర్మల్: ‘నేనేమైనా ఉగ్రవాదినా? ఏమైనా తప్పు చేశానా? కారణం ఏమిటో చెప్పకుండా నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. గంటలోగా వివరణ కోరడం ఏమిటి? 15 ఏళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్న నన్ను ఎలాంటి ఆధారాల్లేకుండా, అభాండాలు వేసి బయటకు వెళ్లేలా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాల నుంచి విముక్తి కోసమే బీజేపీలో చేరా’అని తెలంగాణ సీనియర్ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్న మహేశ్వర్రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీలో చేరారు. గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత బీజేపీ చేరికల కమిటీ కన్వీ నర్ ఈటల రాజేందర్తో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ నివాసంలో ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. ఆ తరువాత ఆయన్ను తరుణ్ ఛుగ్, బండి సంజయ్, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సంగప్ప బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ మహేశ్వర్రెడ్డికి జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం జేపీ నడ్డా నివాసం వద్ద తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, మోదీతోనే అరాచక పాలనకు తెర రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడం కేవలం బీజేపీ, ప్రధాని మోదీ వల్లే సాధ్యమవుతుందని ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలసి అడుగులేసే దిశగా నడుస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏమీ పట్టనట్లుగా పార్లమెంటులో వారితో కలసి తిరుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్తో పొత్తు విషయంలో కాంగ్రెస్ నాయకులు రోజుకో విధంగా మాట్లాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని... దీంతో రాష్ట్రంలో పార్టీ దయనీయమైన పరిస్థితికి చేరుకుందని, ఎటుచూసినా అయోమయం నెలకొందని మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కోవర్టులుగా ఉన్నారనే నిందలను పలువురు కాంగ్రెస్ నేతలపై మోపుతున్నారని... అసలు ఎవరు ఎవరి కోవర్టులో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్లో ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేస్తున్న తనపై కావాలనే కొందరు సోషల్ మీడియాలో నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. కొంతకాలంగా కాంగ్రెస్లో ఒక నాయకుడు పథకం ప్రకారమే సీనియర్లను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందరం కలసికట్టుగా...: సంజయ్ రాష్ట్రంలో అహంకారపూరిత నియంత పాలనను అంతమొందించడానికి ప్రతి ఒక్కరం కలసికట్టుగా పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మహేశ్వర్రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. కేవలం నిర్మల్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీ బలపడేందుకు మహేశ్వర్రెడ్డి లాంటి నాయకులు ఉపయోగపడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలన్న ఏౖకైక లక్ష్యంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో మహేశ్వర్రెడ్డి చేరడం సంతోషకరమని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ తెలిపారు. రానున్న రోజుల్లో నిర్మల్ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణను అందరికీ అందించేలా బీజేపీనే చర్యలు చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. బీజేపీలో మహేశ్వర్రెడ్డి చేరికకు కారణాలివే సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీలో విభేదాలు... నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరి ణామాలు... వెరసి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడానికి కారణమయ్యాయి. కొంతకాలంగా మహేశ్వర్రెడ్డి పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నప్పటికీ నిర్మల్లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్లోనే ఆయన కొనసాగు తారని భావించారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్తో ముదిరిన విభేదాలు, తాజాగా ఇచ్చిన షోకాజ్ నోటీసుతో ఏలేటి అహం దెబ్బతింది. అదే సమయంలో నియోజకవర్గంలో అధికార పార్టీ అసంతృప్త నేతలు బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఏలేటి తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలసి ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కమలదళంలో చేరారు. మైనారిటీల ప్రభావం అధికంగా ఉండే నిర్మల్లో ఆయన నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందోననే అంశాలపై రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు. -
Amara Raja: చట్ట ప్రకారమే ముందుకెళ్లండి: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా.. షోకాజ్ నోటీస్ పై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే.. పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమర్ రాజాకు సూచించింది న్యాయస్థానం. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఈ తరుణంలో న్యాయస్థానం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి. జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై.. గతంలో అధికారుల విధులను అడ్డుకున్నందుకు పోలీసు కేసు నమోదైంది. -
షోకాజ్ నోటీసు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను అవమానకరంగా మాట్లాడినందుకు సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ జారీ చేసిన షోకాజ్ నోటీసు ఆధారంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేవీ సూర్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. షోకాజ్ నోటీసుపై అధికరణ 226 కింద దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని చెప్పారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. సంఘం అధ్యక్షుడి సమాధానం ఆధారంగా తుది చర్యలుంటాయన్నారు. ఉద్యోగ సంఘం వారి సమస్యలపై పోరాటం చేయడం, సంఘం ప్రతినిధులు గవర్నర్ను కలవడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కించపరుస్తూ మాట్లాడటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంతర్గత, సున్నిత, కీలక సమాచారాన్ని మీడియా ముఖంగా బహిర్గతం చేశారని, దీనిపైనే తమకు అభ్యంతరమని చెప్పారు. ఇది సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్ సంఘం ప్రతినిధులకు భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదా అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఏది పడితే అది మాట్లాడటానికి వీలు లేదన్నారు. వారికి నియమావళి ఉంటుందని, దానికి లోబడే పని చేయాలని చెప్పారు. అంతకు ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్ను కలిశారన్న కోపంతోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. సంఘం గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు నామమాత్రపు చర్యేనని తెలిపారు. -
‘ఇప్పటం’ పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాక కూల్చివేతల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రోడ్డును ఆక్రమించుకున్న ఇప్పటంలోని ఇళ్ల యజమానులకు మే 21న నోటీసులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హారీ కూల్చివేత నోటీసుల ఆధారంగా పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు మలసాని మనోహర్రెడ్డి, జి.నరేష్ కుమార్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లకు కొందరికి పోస్టు ద్వారా, మరికొందరికి వ్యక్తిగతంగా గతంలోనే నోటీసులు అందజేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. దీనిపై ఏమంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో పిటిషనర్లు వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ పిటిషనర్ల న్యాయవాది టి.సాయిసూర్య అంగీకరించారు. ఆ విషయాన్ని పిటిషన్లో ఎందుకు ప్రస్తావించలేదని న్యాయమూర్తి నిలదీశారు. ఉదయం కూల్చివేతలు మొదలుపెట్టడం, దానిపై హడావుడిగా లంచ్మోషన్ పిటిషన్ వేయడం, పిటిషనర్లు నిరక్షరాస్యులు కావడం తదితర కారణాలతో షోకాజ్ నోటీసుల విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదని సాయిసూర్య చెప్పారు. ఈ వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని చెప్పడంవల్లే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. కోర్టు ముందు వాస్తవాలను తొక్కిపెట్టినందుకు క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించారు. పిటిషనర్లు కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని వారి తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. -
టీపీసీసీ సీరియస్.. మీటింగ్కు ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: మీటింగ్కు హాజరు కాని 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది. నిన్న(శనివారం) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నేతృత్వంలో గాంధీభవన్లో కీలక భేటీ జరిగింది. సమావేశానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్కు 11 మంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. దీంతో క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయని కమిటీ హెచ్చరించింది. చదవండి: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం: చిరంజీవి -
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్!
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్! -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్ రికార్డ్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంకట్రెడ్డి ఆడియో లీక్పై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో వెంకట్రెడ్డికి ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం మునుగోడు ఓటర్తో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరిన వెంకట్రెడ్డి ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ కాగా, మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజగోపాల్రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు
-
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్లోని దాని తయారీ ప్లాంట్లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్) -
బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ సమాధానం.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రాజసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్ట్ 23న బీజేపీ అధిష్టానం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రాజాసింగ్ సతీమణి ఉషాబాయి అప్పట్లో కోరారు. ఈ క్రమంలో బీజేపీ షోకాజు నోటీసుకు రాజాసింగ్ సోమవారం సమాధానం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజసింగ్ లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తానెప్పుడూ పాల్పడలేదని. పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్లు కుట్రపూరితంగా తనపై 100 కేసులు పెట్టాయని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చదవండి: రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరే: బండి సంజయ్ ‘పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. హిందువులను ఇబ్బంది పెడుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాను. హిందులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారుకీ షోను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. మునావర్ ఫారుకీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్ళను కించపరచలేదు.’ అని బీజేపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు. చదవండి: విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్గఢ్లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్లీలా మైదాన్లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
నోరు జారా.. క్షమించండి: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకరవ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు అద్దంకి దయాకర్. శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్పై విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని సైతం ఉద్దేశిస్తూ.. పార్టీలో ఉంటే ఉండూ లేకుంటే.. అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశాడాయన. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అద్దంకి దయాకర్పై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతలు పలువురు అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా సీనియర్ల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఎవరూ నిలువరించకపోవడంపై ఏఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అద్దంకి దయాకర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో.. వెంకటరెడ్డి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా. ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను భావించను. నా వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ ఇవ్వాలని అనుకున్నా. ఈ లోపే షోకాజ్ నోటీసు ఇచ్చారు. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటా అని అద్దంకి దయాకర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. సీనియర్ నేత మల్లు రవి సైతం అద్దంకి క్షమాపణలపై స్పందించారు. కాంగ్రెస్ సోషల్ జస్టిస్ సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వాఖ్యల పై చర్చ జరిగింది. అద్దంకి చేసిన వాఖ్యలు ప్రజల్లో తప్పుడు చర్చకు దారి తీశాయి. వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పాలని నిర్ణయించాం. షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి అద్దంకి సిద్దంగా ఉన్నారు అని మల్లు రవి తెలిపారు. ఇదీ చదవండి: టార్గెట్ రేవంత్.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్! -
సీఎంకు చల్లటి చాయ్.. అధికారికి నోటీసులు
భోపాల్: ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రొటోకాల్ ఉల్లంఘన పేరిట జారీ అయిన ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రికి అందించిన టీ బాగోలేదని, పైగా చల్లగా ఉందంటూ మధ్యప్రదేశ్లో ఓ కిందిస్థాయి అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కాన్హౌ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఉన్నతాధికారుల ఆరోపణ. ఈ మేరకు ఛాతర్పూర్ జిల్లా రాజ్నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(ఎస్డీఎం) డీపీ ద్వివేది.. రాకేశ్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సోమవారం ఖజురహో ఎయిర్పోర్ట్లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు టిఫిన్తో పాటు టీ అందించారు అధికారులు. అయితే టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
ట్రాఫిక్ ఏసీపీ మార్నింగ్ వాక్! మండిపోయిన జనం ఏం చేశారంటే..
కొచ్చి: అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించాలనుకుంటే.. సోషల్ మీడియా ఊరుకోవట్లేదు. సామాజిక మాధ్యమాల సాయంతో జనాలు ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వెనువెంటనే జరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో ఓ ట్రాఫిక్ పోలీస్కు అలాంటి అనుభవమే ఎదురైంది. మార్నింగ్ వాక్ కోసం ఏకంగా ఓ రోడ్డునే బ్లాక్ చేయించాడు ట్రాఫిక్ విభాగంలోని ఉన్నతాధికారి. కొచ్చి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ (వెస్ట్) వినోద్ పిళ్లై.. క్వీన్స్వాక్వేలోని రోడ్డును మూయించేసి మరీ మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో నిరసనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆ రోడ్డు ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం మూసేయాలి. అయితే మిగతా రోజుల్లోనూ ఉదయం పూట ఆ రోడ్డును మూయించి.. మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై. అంతేకాదు ఆయన వాకింగ్ చేస్తున్నంత సేపు సిబ్బంది ట్రాఫిక్ డైవర్షన్ బాధ్యతలు చూసుకునేవాళ్లు. ఈయన దెబ్బకు పిల్లల్ని స్కూల్ బస్సులు ఎక్కించడానికి.. రోడ్డుకు మరోవైపు దాదాపు అర కిలోమీటర్ దూరం దాకా వెళ్లాల్సి వచ్చింది పేరెంట్స్. మూడు రోజుల పాటు ఈ సమస్యను ఎదుర్కొన్న స్థానికులు.. చిర్రెత్తుకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులతో నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో విషయం పైఅధికారుల దృష్టికి చేరింది. దీంతో వినోద్ పిళ్లైకి షో కాజ్ నోటీసు జారీ చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. కుక్క ఈవెనింగ్ వాక్ కోసమని కోసమని స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఘటనపై.. ఢిల్లీలో ఓ ఐఏఎస్ కపుల్ను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది కేంద్రం. చదవండి: ట్రెండింగ్లో ‘కుక్క’! కారణం ఏంటంటే.. -
ఆర్డర్ చేసిన ఫుడ్లో పాము చర్మం...షాక్లో కస్టమర్
Snake skin found in food: ఇటీవల కోవిడ్ -19 తర్వాత ప్రజలు నేరుగా రెస్టారెంట్కి వెళ్లి తినడాని కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అదీగాక జోమాటో, స్వీగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యూప్లు ప్రజలకు వెసులుబాటు కలిగించేలా మంచి డిస్కోంట్లు ఇచ్చి మరీ సేవలందింస్తుంది. వీకెండ్ సమయాల్లో మరింత ఆకర్షీణీయమైన పుడ్ ఆఫర్లతో భోజనప్రియులకు మరింత చేరువవుతోంది. దీంతో ప్రజలు కూడా ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వారికి ఊహించని భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ ఘటన మళ్లీ ఇంకెప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి జంకేలా చేసింది. వివరాల్లోకెళ్తే...కేరళలోని తిరువనంతపురంలో ప్రియా అనే ఒక మహిళ నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ నుంచి రెండు పరోటాలను ఆర్డర్ చేసింది. పైగా ఆర్డర్ కూడా సకాలంలోనే డెలివరీ అయింది. ఐతే ఆమె మొదటగా తమ కుమార్తెకు పరోటా పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ పరోటా పార్మిల్ని ఫ్యాకింగ్ చేసిన కవర్ మీద సుమారు అరవేలు పొడవు అంతా పాము చర్శం చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు రెస్టారెంట్ ఆహారాన్ని ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము చర్మం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు. అంతేకాదు వంటగదిలో తగినంత వెలుతురు కూడా లేదని సరైన పరిశుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేసున్నారని అన్నారు. సదరు రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయడం తోపాటు ఆ రెస్టారెంట్ యజమానికి షాకాజ్ నోటీసులు కూడా పంపించినట్లు వెల్లడించారు. (చదవండి: నిమ్మకాయలతో మామూలుగా ఉండదు.. జైలు అధికారి సస్పెండ్!) -
కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ!
సౌతాఫ్రికా టూర్లో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఒక సీనియర్ ప్లేయర్గా జట్టుకు అందుబాటులో ఉంటానని.. ఇన్ని రోజులు తనకు కెప్టెన్సీ అవకాశమిచ్చిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పెద్ద సందేశాన్ని రాసుకొచ్చాడు. ఇప్పుడంటే కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా తప్పుకున్నాడు కాబట్టి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. చదవండి: Kohli VS Bavuma: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది? కానీ ఇదే కోహ్లి.. సౌతాఫ్రికా టూర్ బయలుదేరడానికి ముందు మీడియా ముందుకు వచ్చి బీసీసీఐతో పాటు గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదమే. ఈ వివాదం ఎంత రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వన్డే కెప్టెన్సీ విషయంలో తనను అడగకుండానే బీసీసీఐ నిర్ణయం తీసుకుందని... కెప్టెన్గా తప్పుకోవద్దంటూ గంగూలీ తనను అడగలేదంటూ కోహ్లి కుండబద్దలు కొట్టాడు. దీంతో బీసీసీఐకి, కోహ్లికి.. పరోక్షంగా గంగూలీతో వివాదం తారాస్థాయికి చేరిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో భారత మాజీ క్రికెటర్లు జోక్యం చేసుకొని .. కోహ్లి ఆటపై దృష్టి పెట్టాలని పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: Virat Kohli-Sourav Ganguly: కోహ్లిపై మాట దాటేసిన దాదా.. కారణం అదేనా? తాజాగా దక్షిణాఫ్రికా టూర్కు ముందు కోహ్లి తనపై చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ షోకాజ్ నోటీసు ఇవ్వబోయాడని కొందరు క్రీడా పండితులు పేర్కొన్నారు. అయితే బీసీసీఐ బోర్డులో ఒక సభ్యుడి ఒత్తిడితో గంగూలీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇండియా హెడ్న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వడానికి డ్రాఫ్ట్ లెటర్ కూడా తయారు చేశాడని.. కానీ బోర్డు సభ్యుడు ఒకరు అడ్డుపడడంతో గంగూలీ ఆ ఆలోచనను మానుకున్నట్లు తెలిసింది. దక్షిణాఫ్రికా టూర్కు ముందు కోహ్లి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమై.. గంగూలీ కోహ్లికి షోకాజ్ నోటీసు ఇచ్చి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని క్రీడా పండితులు పేర్కొన్నారు. చదవండి: వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ..! -
9 నెలలు.. 40 మందికి ‘షోకాజ్’లు..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, వాటిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు మాత్రం పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలకు గాను 380 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామాల్లోనే ఉంటూ పరిశుభ్రత, పాలనలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కానీ చిన్నపాటి తప్పిదాలకే షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 9 నెలల కాలంలో 40 మందికి జారీ చేశారు. దీంతో కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. జీపీ కార్యదర్శులు చేసే పనులివే.. జీపీ కార్యదర్శులు నిత్యం గ్రామాల్లో ఉంటూ శానిటేషన్తోపాటు హరితహారం, పల్లెప్రగతి, ఉపాధిహామీ, ఇంకుడు గుంతలు, వర్మికంపోస్ట్ల షెడ్లు, రైతు కల్లాల నిర్మాణం తదితర పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన ప్రతీ పనిని ఫొటో తీసి, పీఎస్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా మానసికఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. రికార్డుల కస్టోడియన్తో తలనొప్పి.. గ్రామాల్లో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత పనులు సక్రమంగా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఆ నోటీసులకు సమాధానాలు ఇస్తూ రికార్డుల కస్టోడియన్ వంటి పనుల్లో తలమునకలవుతున్నారు. జీపీ కార్యదర్శులకు చెక్పవర్ లేకున్నా నిధుల దుర్వినియోగంలో రికార్డులు కస్టోడియన్ బాధ్యత ఉండటంతో వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముగ్గురి సస్పెన్షన్.. గతంలో జాబితాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేసిన శ్రీవాణి ఎంబీ రికార్డులు లేకుండానే నిధులు డ్రా చేసేలా అవకాశం ఇచ్చారని ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే ధర్మపురిలో పనిచేసిన చంద్రశేఖర్ 2018లో ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఇంటి నంబరు ఇచ్చారని, నెల రోజుల క్రితం సస్పెండ్ చేశారు. ధర్మపురి మండలం జైన పంచాయతీ నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి మహబూబ్ పాషా, సర్పంచ్, ఉపసర్పంచ్ సస్పెండ్ అయ్యారు. చదవండి: తెలుగు అకాడమీలో రూ.64 కోట్ల గోల్మాల్.. -
'మా' ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
గోల్డ్ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
ఆ ముసలోడికి ఏం రోగం..కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
బీసీలను ఆదరించడంలో సీఎం జగన్ ముందుంటారు: కొడాలి నాని
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
మత్స్యకారులకు గుడ్ న్యూస్
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement