-
ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!
సినిమా అంటే వినోదం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కలర్ఫుల్ స్క్రీన్స్ వరకు, మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల దాకా ఎక్కడా ఎంటర్టైన్మెంట్కు ఇసుమంత లోటు కూడా కనిపించదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంటుంది చిత్రపరిశ్రమ. అటు ప్రేక్షకులు కూడా సినిమాలను ఆస్వాదిస్తారు, అందులో నటించే హీరోహీరోయిన్లను ఆరాధిస్తారు. ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు.. ఎంత పెద్ద సినిమా అయినా మూడు వారాలకు తట్టాబుట్టా సర్దాల్సిందే! ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏ చిత్రాన్ని ఎక్కువమంది చూశారో తెలుసా? బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దంగల్ సినిమాలనుకుంటే పొరపాటే! అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే. అంజాద్ ఖాన్కు ఇది తొలి చిత్రం. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్.. ఇలా అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమాకు టికెట్ల ఊచకోత జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. దర్శకుడు రమేశ్ సిప్పీ తెరకెక్కించిన ఈ ఐకానిక్ చిత్రం 1975లో రిలీజైంది. తొలి షోకే హిట్ టాక్.. ఫలితంగా ఆల్టైం బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రికార్డును దశాబ్ద కాలంపాటు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. షోలే తొలిసారి రిలీజైనప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు మొత్తంగా భారత్లో 15-18 కోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇతర దేశాల్లో కూడా షోలేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది ఏ రేంజ్లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు కొనేశారు అక్కడి జనాలు. ఇతర దేశాల్లో తక్కువలో తక్కువ 2 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోయాయట! అంటే ప్రపంచవ్యాప్తంగా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోవడంతో భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. అప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల దాకా రాబట్టింది. ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే దాని విలువ సుమారు రూ.2800 కోట్ల దాకా ఉంటుంది. టాప్ 10 చిత్రాలు కేవలం భారత్లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల జాబితా విషయానికి వస్తే.. షోలే 15 కోట్లతో తొలి స్థానంలో ఉంది. బాహుబలి 2: ది కన్క్లూజన్ 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఇ ఆజమ్, మదర్ ఇండియా.. చెరో 10 కోట్లు, హమ్ ఆప్కే హై కోన్..7.4 కోట్లు, ముఖద్దార్ కా సికిందర్.. 6.7 కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని.. 6.2 కోట్లు, క్రాంతి.. 6 కోట్లు, బాబీ.. 5.3 కోట్లు, గంగా జమున.. 5.2 కోట్లు, గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంఘం.. చెరో 5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక? -
'త్వరలో షోలే-2 రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'
ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా టి20 సిరీస్పై కన్నేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా తొలి టి10 ఆడేందుకు రాంచీలో అడుగుపెట్టింది. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లి లేకుండానే పాండ్యా కెప్టెన్సీలో మరో టి20 సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్లో సెమీస్ వైఫల్యం అనంతరం బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ నుంచి పాండ్యాకు అప్పజెప్పింది. వచ్చే టి20 వరల్డ్కప్ వరకు సరికొత్త జట్టును తయారు చేయాలనే లక్ష్యంతో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వగా.. దానిని అతను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఐర్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలపై టి20 సిరీస్లు గెలిచిన పాండ్యా.. తాజాగా మరోసారి రోహిత్ గైర్హాజరీలో కివీస్తో టి20 సిరీస్కు టీమిండియాను నడిపించనున్నాడు. ఇక శుక్రవారం(జనవరి 27న) రాంచీ వేదికగా కివీస్, భారత్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇక రాంచీ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి స్వస్థలమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా బుధవారం రాత్రి టీమిండియా రాంచీలో అడుగుపెట్టింది. మరుసటి రోజే హార్దిక్ పాండ్యా తన అభిమాన ఆటగాడు ధోనితో గడిపేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ధోని ఇంట్లో ఉన్న బైక్ గ్యారేజీ సెంటర్లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా పాండ్యా.. ధోనిని మోటార్సైకిల్లో సైడ్కార్లో ఎక్కించుకున్న ఫోటోను షేర్ చేశాడు. ''త్వరలో షోలే-2 మీ ముందుకు రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'' అంటూ కామెంట్ చేశాడు. షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. భారతీయ సినిమా గర్వించదగ్గ షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్రలు ''యే దోస్తీ హమ్ నహీ చోడేంగే..'' పాట సందర్భంగా ఇదే తరహాలో బైక్పై వెళ్లడం గుర్తుండే ఉంటుంది. డ్రైవర్ సీటులో ధర్మేంద్ర ఉంటే.. పక్కన సైడ్కార్లో అమితాబ్ కూర్చొని పాట పాడుకుంటూ వెళ్తారు. అచ్చం అదే ఫోటోని రిపీట్ చేసిన పాండ్యా.. మోటార్సైకిల్ను తాను డ్రైవ్ చేయగా.. పక్కన సైడ్కార్లో ధోని దర్జాగా కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Sholay 2 coming soon 😉 pic.twitter.com/WixkPuBHg0 — hardik pandya (@hardikpandya7) January 26, 2023 చదవండి: టాప్లెస్గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి! -
ధావన్: 'జట్టుకు దూరమయ్యావు! ఎంటర్టైన్మెంట్తో బతికేస్తున్నావా'
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్ను కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుత పరిస్థితులు దృష్యా ధావన్ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా టీమిండియాలోకి రావాలని గబ్బర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. అయితే ఐదు మ్యాచ్లు కలిపి (12,8,14,12,0).. 56 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ధావన్ రీఎంట్రీపై నీలీనీడలు కమ్ముకున్నాయి. చదవండి: 10 ఫోర్లు, 4సిక్స్లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్! ఆటకు దూరంగా ఉన్నప్పటికి ధావన్ తన అభిమానులను అలరించాలనుకున్నాడు. అందుకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోనూ షేర్ చేశాడు. బాలీవుడ్ బ్లాక్బాస్టర్ షోలే సినిమాలో విలన్ గబ్బర్సింగ్ పాపులర్ డైలాగ్ ''కిత్నే ఆద్మీ తే''ను తన స్టైల్లో అనుకరించాడు. ప్రస్తుతం ధావన్ చెప్పిన డైలాగ్ వైరల్గా మారింది. అయితే ధావన్ వీడియో చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.'' టీమిండియాకు ఎలాగో దూరమయ్యావు.. ఎంటర్టైన్మెంట్ మీద పడ్డావు. ఇలాంటివి మానేసి ఆటపై దృష్టి పెడితే బాగుంటుంది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ధావన్ టీమిండియా తరపున టి20 ప్రపంచకప్కు ముందు శ్రీలంకతో జరిగిన వన్డే, టి20 సిరీస్లో ఆఖరిసారిగా పాల్గొన్నాడు. లంక పర్యటనకు వెళ్లిన రెండో టీమిండియా జట్టుకు ధావన్ కెప్టెన్సీ చేశాడు. టి20 సిరీస్ను లంక గెలుచుకోగా.. వన్డే సిరీస్ను మాత్రం టీమిండియా 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక అప్పటినుంచి ధావన్ మళ్లీ టీమిండియాకు ఆడలేదు. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
గబ్బర్ సింగ్ జయంతి.. 10 పవర్ఫుల్ డైలాగ్లు
Amjad Khan Birth Anniversary: సినిమాల్లో హీరోల తర్వాత పవర్ఫుల్గా ఉండే క్యారెక్టర్లు విలన్లవే. వారు ఎంత విలనిజం చూపిస్తే హీరోకు అంత మంచిపేరు వస్తుంది. అలాంటి చాలా మంది విలన్లను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చూసింది. కానీ అందులో గబ్బర్ సింగ్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాడు. అత్యంత చెడ్డవాడిగా, గొప్ప విలన్గా ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా గబ్బర్ అవుతాడు. ఆ పాత్రలో నటించిన అంజాద్ ఖాన్ తప్ప మరెవరూ ఆ ఐకానికి క్యారెక్టర్కు న్యాయం చేయలేకపోయేవారేమో. షోలేలో అతని నటన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్, ఇతరులను కనపడకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప నటనను కనబర్చిన అంజాద్ ఖాన్ 81వ జయంతి రేపు (నవంబర్ 12). ఆయన జయంతి సందర్భంగా షోలే చిత్రంలో అంజాద్ ఖాన్ కొట్టిన డైలాగ్లను ఓసారి గుర్తు చేసుకుందామా. 1. కిత్నే ఆద్మీ తే.. 2. జబ్ తక్ తేరే పైర్ చలేంగే ఉస్కీ సాన్స్ చలెగీ.. తేరే పైర్ రూకే తో యే బందూక్ చలేగీ 3. తేరా క్యా హోగా కాలియా ? 4. జో డర్ గయా.. సమ్జో మర్ గయ 5. యహా సే పచాస్ పచాస్ కోస్ దూర్ గావో మే.. జబ్ బచ్చా రాత్ కో రోతా హై, తో మా కెహెతీ హై బేటే సో జావో.. సోజా నహీ తో గబ్బర్ సింగ్ ఆ జాయేగా 6. హోలీ కబ్ హై.. కబ్ హై హోలీ, కబ్? 7. యే రామ్ఘర్ వాలే ఆప్నీ బేటియోంకా కౌన్ చక్కీ కా పిసా ఆతా కిలాతే హై రే? 8. క్యా సమజాకర్ ఆయే తే.. కీ సర్దార్ బహుత్ ఖుష్ హోగా, శెభాషీ దేగా? 9. చే గోలీ ఔర్ ఆద్మీ తీన్.. బహుత్ నయిన్సాఫీ హై యే 10. యే హాత్ హమ్ కో దే ఠాకూర్.. -
‘షోలే’ నటుడు కన్నుమూత
బాలీవుడ్తోపాటు గుజరాతీ సినిమాల్లో నటించిన పాత తరం నటుడు అరవింద్ జోషి (84) కన్నుమూశారు. ప్రస్తుత గుజరాతీ నటుడు శర్మాన్ జోషి అతడి కుమారుడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో వారం కిందట ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు సరితా జోషి మీడియాకు తెలిపారు. అరవింద్ జోషి హిందీలో ‘షోలే’, ‘లవ్ మ్యారేజ్’, ‘నామ్’, ‘ఇత్తేఫక్’ తదితర చిత్రాల్లో నటించారు. అయితే మాతృభాష గుజరాతీలో ‘గర్వో గరాసియో’, ‘ఘెర్ ఘెర్ మతినా చులా ’ తదితర సినిమాలు చేశాడు. ఆయన మృతికి బాలీవుడ్, గుజరాతీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరవింద్ జోషికి భార్య, ఇద్దరు కుమారులు శర్మాన్ జోషి, మాన్సి జోషి. వీరిద్దరూ నటులుగా కొనసాగుతున్నారు. శర్మన్ జోషి త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అరవింద్ జోషి మృతి పట్ల నటుడు పరేశ్ రావల్, మరికొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్
ప్రచార హోరు..
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేయాలి
బిల్లులు రాక రెండేళ్లు..
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement