shiva raj kumar
-
తెలుగులో కన్నడ బ్లాక్ బస్టర్ ‘వీర చంద్రహాస’
‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్, ఇప్పుడు ‘వీర చంద్రహాస’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్పై ఎన్ఎస్ రాజ్కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై ఘన విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్పై ఎమ్వీ రాధాకృష్ణ విడుదల చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో విజయవంతంగా రిలీజ్ చేసిన రాధాకృష్ణ, ఇప్పుడు ‘వీర చంద్రహాస’ రైట్స్ను సొంతం చేసుకున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, “‘వీర చంద్రహాస’ కన్నడలో హిట్ టాక్తో పాటు బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందని గట్టి నమ్మకం ఉంది. రవి బస్రూర్ సంగీతంతో అలరించడమే కాక, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించడం సంతోషకరం” అని తెలిపారు.‘వీర చంద్రహాస’ మహాభారతంలోని అశ్వమేధిక పర్వం ఆధారంగా రూపొందిన కథ. ఒక అనాథ బాలుడు పరాక్రమవంతుడై, సద్గుణవంతుడై వీర చంద్రహాసుడిగా ఎదిగే గాథను చిత్రిస్తుంది. సినిమా చరిత్రలో తొలిసారిగా యక్షగానం వెండితెరపై వైభవంగా ఆవిష్కృతమై, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది. -
'పెద్ది' కోసం తెలుగు ట్రైనింగ్.. వర్షం పడింది
'గేమ్ ఛేంజర్' దెబ్బకు మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇప్పుడు వాళ్లందరి కళ్లు 'పెద్ది'(Peddi Movie)పైనే ఉన్నాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్.. రీసెంట్ గా శ్రీరామ నవమి సందర్భంగా రిలీజైంది. సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే చకచకా షూటింగ్ జరుగుతోంది. తాజాగా తను నటించిన '45' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shiva Rajkumar).. 'పెద్ది' షూటింగ్ సంగతులు కూడా చెప్పుకొచ్చాడు. షూటింగ్ మొదలవడానికి 20 రోజుల ముందు హైదరాబాద్ వచ్చానని, దర్శకుడు బుచ్చిబాబు దగ్గర తెలుగు నేర్చుకున్నానని అన్నాడు.(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?) అలా తెలుగు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సెట్స్ లో అడుగుపెట్టానని చెప్పిన శివరాజ్ కుమార్.. తెలుగులోనే డైలాగ్స్ చెప్పానని, పెద్ది సినిమా మంచి ఎక్స్ పీరియెన్స్ ఇస్తోందని చెప్పాడు. 2 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నని.. వర్షం కురిసి ప్రకృతి తనకు స్వాగతం పలికిందని చెప్పుకొచ్చాడు. పెద్ది గ్లింప్స్ అయితే తనకు చాలా నచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.చరణ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'పెద్ది'లో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు) -
హీరో శివ రాజ్కుమార్పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): ప్రముఖ నటుడు శివ రాజ్కుమార్ను బావమరిది కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ లోక్సభ ఎన్నికల్లో శివమొగ్గలో శివ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ బాధలో ఉండగానే బావమరిది, బీజేపీ నేత కుమార బంగారప్ప హేళనలు ఆయన అభిమానులను మరింత వేదనకు గురిచేశాయి. కుమార బంగారప్ప ఇంటిని హీరో శివరాజ్ కుమార్ అభిమానులు శనివారం ముట్టడించారు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్, శివరాజ్ కుమార్ కుటుంబాల గురించి కుమార ఇటీవల చులకనగా మాట్లాడారు. అది తమకు బాధకు గురి చేసిందని, ఆయన బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అభిమానులు పట్టుబట్టారు. బెంగళూరులో సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటి గేట్ లోపలికి చొరబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ రాజ్కుమార్ ఫొటోలను ప్రదర్శించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుండగా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంటి నుంచి వెళ్లాలని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆ తరువాత కేఎస్ఆర్పీ పోలీసులతో అధిక భద్రత కల్పిపించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీప పార్కు చుట్టుపక్కల నిల్చున్నవారిని సైతం నిర్బంధించారు. హేళనగా కుమార పోస్టు తన సోదరుడు, మంత్రి మధు బంగారప్ప, సోదరి గీతాను, గీతా భర్త శివరాజ్కుమార్ గురించి సోషల్ మీడియాలో హేళనగా రాశారు. శివరాజ్కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. మా గ్రామ జాతరలో నృత్యం చేసే పనికి దరఖాస్తు వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నా చెల్లెలు గీతా.. సినిమా డ్యాన్సర్ కాబట్టి ఊరికే ఉండాల్సిన పని లేదు. దొడ్డమనె వ్యవహారం చాలా ఉంటుంది. వేరేవారికి అవకాశం లభించరాదు. బెదిరించడం, భయపెట్టడం, హుషార్ అనే మాటలు ఏమున్నా గొంతు లోపలే, నాలుగు గోడల లోపలే ఉండాలి. మా సైన్యం ఆన్లోనే ఉంటుంది అని హెచ్చరికలు చేశారు.pic.twitter.com/6YPDJcjkmh— Kumar Bangarappa (@kumarbangarappa) June 4, 2024 -
ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అక్టోబర్లో వచ్చేస్తున్నాడు
శివ రాజ్కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ (ఎమ్మెల్సీ) సమర్పణలో సందేశ్ ఎన్. నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 19న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మ్యూజిక్ ...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చెన్నై లయోలా కాలేజ్లో అభిమానుల సమక్షంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ‘ఘోస్ట్’. రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో శివరాజ్కుమార్ పాత్రకు వచ్చిన మంచి స్పందన ‘ఘోస్ట్’ పై మరిన్ని అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ అక్టోబర్లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
గౌరవమే స్వేచ్ఛ
ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంకా అరుళ్ మోహనన్, నివేదితా సతీష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో టీజీ త్యాగరాజన్ సమర్పణలో జి. శరవణన్, సాయి సిద్ధార్థ్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ‘గౌరవమే స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ తో శుక్రవారం ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ లుక్ను షేర్ చేశారు ధనుష్. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1930–1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్లో కనిపిస్తారు. ఆల్రెడీ 85 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఓటీటీలోకి ఉపేంద్ర ‘కబ్జ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జ’. శ్రియ హీరోయిన్గా నటించింది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 17న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏప్రిల్ 14 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెసాన్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. 1960 ప్రాంతంలో జరిగే గ్యాంగ్స్టర్ కథ ఇది. కేజీయఫ్ సినిమా తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే విడుదలైన తొలి రోజే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ని తెచ్చుకుంది. అయితే కర్ణాటక విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. a tale of unforeseen circumstances transforming an innocent young man into the most dreaded gangster ever! 🔥#KabzaaOnPrime, Apr 14 pic.twitter.com/wCRRyIDeAI — prime video IN (@PrimeVideoIN) April 11, 2023 -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
సింపుల్గా నటుడు శివరాజ్కుమార్ బర్త్డే సెలబ్రేషన్స్
యశవంతపుర: ప్రముఖ నటుడు శివరాజ్కుమార్ సోమవారం 59వ వసంతంలోకి అడుగు పెట్టారు. కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలను ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకున్నారు. భార్య గీతాతో కలిసి కేక్ను కట్ చేశారు. సోదరులు రాఘవేంద్ర, పునీత్ రాజ్కుమార్లు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Dr.Shivarajkumar Fc (@dr.shivarajkumar) -
బాలయ్యతో కాదు లారెన్స్తో..!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా శివలింగ. ఇటీవలే ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోగా ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే అదే సమయంలో బాలకృష్ణ హీరోగా శివలింగ సినిమాను టాలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచన ఉందన్న టాక్ వినిపించింది. అంతేకాదు చిత్ర దర్శకుడు పి వాసు కూడా శివ లింగ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ, ఇప్పట్లో పి వాసుకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే బాలకృష్ణతో అనుకున్న శివలింగ రీమేక్ను లారెన్స్ హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. లారెన్స్ హీరోగా నటిస్తే ఒకేసారి తెలుగు, తమిళలో రిలీజ్ చేయోచ్చేనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.