-
టీడీపీనేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీనేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. ఐపీసీ 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద శరత్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు చేశారు. అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో పన్ను ఎగవేసారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. శరత్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈనెల 26న ఏపీ ఎస్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అవెక్స్ కంపెనీలో 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు అడిషనల్ డైరక్టరు హోదాలో శరత్ ఉన్నారు. సుమారు రూ. 16కోట్లు మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట శరత్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు పత్తిపాటి పుల్లారావు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇతర నాయకులు చేరుకున్నారు. సీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. -
టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్
-
ఆ అమ్మను ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా!
ఆశ్వీయుజమాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి తొమ్మిదిరాత్రులు జరుపుకొనే దేవీనవరాత్రులు అనేక రుగ్మతలను నివారించడంతోపాటు తలపెట్టిన పనులలో విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయకారిణి అమ్మే! త్రిమూర్తులకు, దశావతారాలకు అన్నింటికీ మూలం అమ్మే! ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలనీ, దేవీ శరన్నవరాత్రోత్సవాలనీ ప్రసిద్ధి చెందాయి. శరన్నవరాత్రుల విశేషాలు హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ దశమికి ‘దశహరా’ అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా ఉంది. రాత్రి అంటే తిథి అనే అర్థం కూడా. దీనిప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈవేళ పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గాష్టమి దుర్గాదేవి ‘లోహుడు’ అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు. ఇక దుర్గ అంటే దుర్గమమైనది, దుర్గతులను తొలగించేది అని అర్థం. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. ‘దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్య్రం మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది‘, అని దైవజ్ఞులు వివరిస్తారు. ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలపై అదుపును, తదుపరి మూడురోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణం,‘దుం’ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. మహర్నవమి మానవ కోటిని పునీతులను చేయడం కోసం భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరెన్నో ప్రయాసలకోర్చి గంగను దివి నుంచి భువికి తెచ్చినది ఈరోజే! ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథిని గూర్చి చెప్పడంలోని ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది. కాబట్టి ‘సిద్ధిదా’ అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. సామూహిక లలితా సహస్ర నామార్చనలు, కుంకుమ పూజలు ఈ పండుగ ఆచారాలలో ఇంకొన్ని. దసరా పండుగకు ఒకరోజు ముందు ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆచారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ పర్వదినాన రైతులు కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, కుట్టుపని వారు తమ కుట్టు యంత్రాలకు, చేనేత కార్మికులు తమ మగ్గాలకు, కర్మాగారాలలో పని చేసే కార్మికులు తమ యంత్ర పరికరాలకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో పూజలు చేస్తారు. వాటిని అమ్మవారి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం... పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అందువల్ల ఆయుధాలు తుప్పు పట్టకుండా చెడకుండా సురక్షితంగా ఉన్నాయి. యుద్ధానికి వెళ్లడానికి ముందు అర్జునుడు తన గాండీవానికి, భీమసేనుడు తన గదాయుధానికి ప్రత్యేకంగా పూజలు జరిపించారని ప్రతీతి. శక్తి స్వరూపిణిని.. అలా పాండవులు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు. ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి. బొమ్మల కొలువు.. ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను ‘గోలు’ అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా బొమ్మల కొలువును నిర్వహించడం పరిపాటి. విజయదశమి దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెబుతున్నాయి.‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అను పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం లాంటివి చూడకుండా విజయదశమి నాడు చేపడితే ఆ కార్యంలో విజయం తథ్యం అని పెద్దలు చెబుతారు. ‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ’జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారివారి ఆయుధాలను, వస్త్రాలను శమీవృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి, తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది, శమీవృక్ష రూపాన ఉన్న‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితాదేవి’ని పూజించి, రావణుని సంహరించడం ద్వారా యుద్ధంలో విజయం సాధించాడు. తెలంగాణ ప్రాంతంలో శమీపూజ తర్వాత శుభానికి సూచిక అయిన‘పాలపిట్ట’ను చూసే ఆచారం ఉంది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ దిగువ ఇచ్చిన శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు. ‘శమీ శమయతే పాపం శమీశత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ! అనే శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అమ్మవారి అలంకారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. శ్రీశైల భ్రమరాంబికకు ఒకవిధంగా అలంకారం చేస్తే, విజయవాడ కనకదుర్గమ్మకు మరోవిధంగా అలంకారాలు చేస్తారు. అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! అందరికీ అమ్మ కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈ విజయ దశమి అందరికీ సకల శుభాలూ, తలపెట్టిన కార్యక్రమాలన్నింటిలోనూ జయాలను చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. కనక దుర్గాదేవి (పాడ్యమి) శ్రీ బాలాత్రిపురసుందరి ( విదియ ) శ్రీ అన్నపూర్ణాదేవి (తదియ ) శ్రీ గాయత్రీదేవి ( చవితి ) శ్రీ లలితాత్రిపుర సుందరి ( పంచమి ) శ్రీ మహాలక్ష్మీదేవి ( షష్ఠి) శ్రీ సరస్వతీదేవి (సప్తమి ) శ్రీ దుర్గాదేవి (అష్టమి) శ్రీ మహిషాసురమర్దిని దేవి (నవమి ) శ్రీ రాజరాజేశ్వరీ దేవి (దశమి) దేవీ అలంకారాలు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది. భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంలో అగుపించే అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు, సంతాన సౌభాగ్యాలు, సుఖశాంతులు చేకూరుతాయని, శత్రుజయం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. చల్లని చూపు ఆ అమ్మ కంటిలో నవరసాలను శంకరాచార్యులు వర్ణిస్తారు. చేప స్తన్యం ఇచ్చి తన పిల్లలను పోషించదు. చేప తన పిల్లను పోషించినప్పుడు కేవలం అలా కన్నులతో తల్లిచేప చూసేసరికి పిల్ల చేపకు ఆకలి తీరిపోతుంది. మీన నేత్రాలతో ఉంటుందని అమ్మవారికి మీనాక్షి అనిపేరు. అమ్మ కళ్ళ వైభవాన్ని అనుభవించి, అమ్మకంటి వంక ఒకసారి చూసినట్లయితే మనలో ఇప్పటివరకు ఉన్న ఆందోళనలు ఉపశమించి శాంతి, సంతోషం కలుగుతాయి. ∙డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు! వాటి ప్రాశస్యం ఏంటంటే..) -
కథ చెప్పే విధానం ముఖ్యం
‘‘ఏ సినిమాకైనా కథ కంటే ఆ కథని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే విధానం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిగారు బెస్ట్. మా ‘మేమ్ ఫేమస్’ కథని సుమంత్ ప్రభాస్ చక్కగా చెప్పారు. యూత్తో పాటు తల్లితండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ అన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మేమ్ ఫేమస్’లో లీడ్ రోల్ కోసం ఆడిషన్స్ చేశాం. అయితే ఆ పాత్రకి ఎవరూ సరిపోకపోవడంతో చివరికి సుమంత్ ప్రభాసే నటించాడు. తన ప్రతిభ, ఎనర్జీ చూస్తే భవిష్యత్లో తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడనిపిస్తోంది. ‘పెళ్ళి చూపులు’ సినిమాలోని సెన్సిబిలిటీస్, ‘జాతిరత్నాలు’ మూవీలోని వినోదం కలిస్తే మా ‘మేమ్ ఫేమస్’. ప్రస్తుతం వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ యంగ్ స్టార్ హీరోతో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
మేజర్ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్
‘‘మేజర్’లాంటి గౌరవప్రదమైన సినిమా తీశాం. దేశమంతా మంచి పేరు వచి్చంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క’’ అన్నారు నిర్మాతలు అనురాగ్, శరత్. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్, శరత్ మాట్లాడుతూ– ‘‘మాకు ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ అనే నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ షో మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా 200 సినిమాలు మార్కెటింగ్ చేశాం. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడివి శేష్ చెప్పాడు. నమ్రతగారికి కూడా ఈ కథ నచ్చడంతో మాతో భాగమయ్యారు. ‘మేజర్’ని తెలుగు, హిందీలోనే తీద్దామనుకున్నాం. కేరళలో ఉండే సందీప్ తల్లిదండ్రులను కలిశాక మలయాళంలోనూ డబ్ చేశాం. సందీప్ తల్లిదండ్రులకు రాయల్టీ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నా వారు తిరస్కరించారు. ఆర్మీలో చేరాలనుకున్నవారికి తగిన సపోర్ట్గా నిలిచేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ అనే సోషల్ మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయలీ్ట. ‘రైటర్ పద్మభూషణ్, మేం ఫేమస్’ సినిమాలు నిర్మించాం. తొట్టెంపూడి వేణు లీడ్ రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement