శరత్‌ మ్యాక్సివిజన్‌ విస్తరణ

MaxiVision Hospitals buys Sharat Laser Eye Hospital - Sakshi

జేవీ ద్వారా 15 కేంద్రాల ఏర్పాటు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంటి వైద్య రంగంలో ఉన్న మ్యాక్సివిజన్‌.. వరంగల్‌ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న శరత్‌ లేజర్‌ ఐ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. అలాగే ఇరు సంస్థలు కలిసి శరత్‌ మ్యాక్సివిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో మ్యాక్సివిజన్‌కు 51%, శరత్‌కు 49% వాటా ఉంటుంది. 2021 నాటికి జేవీ కింద 15 ఆసుపత్రులను స్థాపిస్తామని మ్యాక్సివిజన్‌ చైర్మన్‌ జీఎస్‌కే వేలు వెల్లడించారు. శరత్‌ లేజర్‌ ఐ హాస్పిటల్‌ ఫౌండర్‌ శరత్‌ బాబు చిలుకూరి, మ్యాక్సివిజన్‌ ఫౌండర్‌ మెంటార్‌ కాసు ప్రసాద్‌ రెడ్డితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సులకు ఆప్టోమెట్రీ కళాశాలలను వరంగల్, హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top