-
Ind vs Eng: అతడు జడేజా కాదు కదా.. టీమిండియాకు కష్టమే
India vs England 2nd Test: ఇంగ్లండ్తో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్ జడ్డూ అని.. అతడు లేని లోటును ప్రస్తుత జట్టులోని ఏ ఆటగాడూ తీర్చలేడని పేర్కొన్నాడు. కాగా స్టోక్స్ బృందంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత మ్యాచ్ టీమిండియా చేతిలో ఉందనిపించినప్పటికీ.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఇంగ్లండ్ గెలిచి సత్తా చాటింది. మొదటి టెస్టులో అదరగొట్టాడు అయితే, ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లలో స్పిన్ ఆల్రౌండర్ జడేజా పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఉప్పల్ టెస్టులో మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 89 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ వైజాగ్లో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడటంతో వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్లకు పిలుపునిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. టీమిండియాకు కష్టమే ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. ‘‘జడ్డూ ఉంటేనే టీమిండియాకు బలం. బ్యాటర్గా.. బౌలర్గా.. గన్ ఫీల్డర్గా అతడి సేవలను జట్టు కచ్చితంగా మిస్సవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో అతడే నంబర్ వన్ టెస్టు ఆల్రౌండర్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఆధిక్యంలో నిలిచిందంటే అందుకు కారణం జడేజానే. అతడు ఉన్నా.. మరో జడ్డూ కాలేడు కదా జట్టులో ఉంటే అతడు కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీయడం కూడా గ్యారెంటీ. జడ్డూ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల బ్యాటర్ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. కాబట్టి వాషింగ్టన్ సుందర్కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అతడు పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడేమో గానీ వికెట్లు మాత్రం తీయలేడు. బ్యాటింగ్ పరంగా అతడు మెరుగైన ఆటగాడే. అయితే, వాషీ జడ్డూ మాత్రం కాలేడు కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టులో ఆడించినా జడ్డూ లేని లోటును మాత్రం పూడ్చలేడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా - ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Rishabh Pant: చచ్చిపోయానేమో అనుకున్నా.. -
టీమిండియాకు బిగ్ షాక్! రాహుల్, జడేజా దూరం: బీసీసీఐ ప్రకటన
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్కు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. "వైజాగ్లో ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ సైతం కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని" బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా ఫీల్డింగ్లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్టుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చింది. ఎప్పటినుంచో జట్టులో ఛాన్స్కు ఎదురుచూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్కు ఎట్టకేలకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. రెండో టెస్టుకు రాహుల్, జడ్డూ దూరం కావడంతో సర్ఫారాజ్కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అతడితో పాటు యూపీ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. The Men's Selection Committee have added Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar to India's squad.#INDvENG https://t.co/xgxI8NsxpV — BCCI (@BCCI) January 29, 2024 -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్ను సమర్థించిన రవిశాస్త్రి -
11 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్.. సెమీస్లో నార్త్, సెంట్రల్ జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్లో సౌత్ జోన్తో నార్త్ జోన్; వెస్ట్ జోన్తో సెంట్రల్ జోన్ తలపడతాయి. సెంట్రల్ జోన్తో జరిగిన మ్యాచ్లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్తో మ్యాచ్లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్ కుమార్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో సెంట్రల్ జోన్, నార్త్జోన్ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్జోన్తో జరుగుతున్న పోరులో సెంట్రల్ ఆటగాళ్లు హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్లో రాణించగా, సౌరభ్ కుమార్ (4/33) స్పిన్ బౌలింగ్తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్జోన్ రెండో ఇన్నింగ్స్లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్సింగ్ తొలి వికెట్కు 124 పరుగులు జోడించారు. అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈస్ట్జోన్ సౌరభ్ స్పిన్ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. నార్త్ ఆల్రౌండ్ దెబ్బకు... నార్త్జోన్ ఆల్రౌండ్ దెబ్బకు నార్త్ ఈస్ట్జోన్ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్ ఈస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన నార్త్ ఈస్ట్జోన్ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో నార్త్కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను నార్త్జోన్ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రభ్ సిమ్రన్సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్ ఈస్ట్జోన్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
Advertisement