-
5న కక్ష్యలోకి జీఐశాట్–1
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను మొట్టమొదటి సారిగా భూస్థిర కక్ష్యలోకి పంపిస్తున్నారు. ప్రయోగమిలా... మంగళవారం : ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రివ్యూ) కమిటీ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ బుధవారం : బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధత సమావేశం. అనంతరం మూడు దశల రాకెట్ అనుసంధానం. తర్వాత తుదివిడత పరీక్షలు. లాంచ్ ఆ«థరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగింత. బుధవారం సాయంత్రం : ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రిహార్సల్స్. సా.3.43 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం. ఆ వెంటనే రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభం. గురువారం : సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్ఎల్వీ. భూస్థిర కక్ష్యలోకి జీఐశాట్ – 1. -
ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ ప్రయోగానికి రంగం సిద్ధం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 31న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్) ఉపగ్రహాన్ని మంగళవారం పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్కు అమర్చారు. 1,400 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని రాకెట్కు శిఖర భాగాన అనుసంధానించారు. అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేయను న్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్ఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు. -
పీఎస్ఎల్వీ-సీ33 కౌంట్డౌన్ షురూ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్సెంటర్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ -సీ33 రాకెట్ ప్రయోగానికి మంగళవారం ఉదయం 9.20 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న రాకెట్ను గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు ప్రయోగించనున్నారు. మొత్తం 51.30 గంటల కౌంట్డౌన్లో భాగంగా మంగళవారం రాకెట్కు నాలుగోదశలో ద్రవ ఇంధనం నింపారు. బుధవారం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాకెట్కు అవసరమైన అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి గురువారం మధ్యాహ్నం రాకెట్ను ప్రయోగిస్తారు. ఈ ప్రయోగంలో 1,425 కిలోల బరువైన ఉపగ్రహాన్ని రోదసీలోకి రాకెట్ మోసుకెళ్లనుంది. భారత క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఏర్పాటుకు 2014జులై 1 నుంచి ఇప్పటివరకు ఇస్రో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఏడోది, చివరిది అయిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ప్రయోగం విజయవంతమయ్యాక ఐఆర్ఎన్ఎస్ఎస్ను అందుబాటులోకి తెస్తారు. భూ, జల, వాయుమార్గాల స్థితిగతులను తెలియజేయడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. -
వాయిదాపడిన ఇస్రో ఉపగ్రహ ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నిర్దేశించిన సమయానికి ఉపగ్రహం తయారీ పూర్తికాకపోవడంతో మార్చి 31న జరగాల్సిన ఇస్రో... ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహ ప్రయోగం వాయిదాపడింది. ఏప్రిల్ మూడో వారానికి వాయిదాపడినట్లు తెలుస్తోంది. మార్చి 10న పీఎస్ఎల్వీ సీ32 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ను, మార్చి 31న ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీను ప్రయోగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మార్చి 10న ప్రయోగించబోయే ఉపగ్రహానికి షార్లోని క్లీన్రూంలో ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపడుతున్నారు. మరో రెండు మూడురోజుల్లోనే రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్కు శాటిలైట్ను అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. -
ఫ్రాన్స్తో కలసి అంగారకుడి పైకి..
న్యూఢిల్లీ: అతి తక్కువ వ్యయంతో అంగారకుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించిన ఇస్రో.. మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులకు రంగం సిద్ధం చేస్తోంది. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థతో కలసి అంగారకుడితోపాటు శుక్రగ్రహంపైకి ల్యాండర్లను పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ (ఎఫ్ఎస్ఏ) చీఫ్ జీన్వైవ్స్ లేగాల్ ఆదివారం ఢిల్లీలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇస్రో చేసిన మంగళ్యాన్ ప్రయోగం ఎంతో అద్భుతమని, అతి తక్కువ వ్యయంతో దానిని విజయవంతం చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని ఆయన చెప్పారు. తమ వద్ద అంగారకుడితోపాటు శుక్రగ్రహంపై విస్తృత పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారని.. మరోవైపు ఇస్రో కూడా పరిశోధనలు ముమ్మరం చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై పరిశోధనలో ఇస్రోతో కలసి పనిచేయనున్నామని, ఈ మేరకు సహకార ఒప్పందంపై సంతకాలు కూడా చేశామని తెలిపారు. అరుణగ్రహంపైకి ఇస్రో పంపనున్న తర్వాతి ఉపగ్రహ ప్రయోగంలో తమ పాత్ర కూడా ఉంటుందన్నారు. అంగారకుడితోపాటు శుక్రుడిపైకి కూడా ల్యాండర్ల (రోవర్ల)ను పంపే దిశగా కూడా ఇస్రోతో కలసి పనిచేస్తామని లేగాల్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement