-
స్విగ్గీ అకౌంట్తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే?
ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఖాతాలను హ్యాకింగ్ చేసి ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ నివాసితులైన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) సుల్తాన్పూర్కు చెందిన ఒక మహిళ స్విగ్గీ అకౌంట్ను హ్యాక్ చేసి సుమారు లక్ష రూపాయలు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సామాన్య డెలివరీ బాయ్స్.. స్విగ్గీ ఖాతాలను హ్యాక్ చేయడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టం ఉపయోగించి ఓ మహిళకు ఫోన్ చేసి.. స్విగ్గి అధికారులమని నమ్మించి ఆమె యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటివి తెలుసుకున్నారు. అకౌంట్ డీటైల్స్ తెలుసుకున్న తరువాత సుమారు రూ. 97 వేలు మాయమయ్యాయి. అకౌంట్ నుంచి భారీగా డబ్బులు కట్ అవుతుండటం గుర్తించిన మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపైన సమగ్ర విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్విగ్గీ అకౌంట్స్ హ్యాచ్ చేసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేవారు. వచ్చిన డబ్బును చట్టబద్దమైన లావాదేవీలుగా మార్చుకోవడానికి వారు పనిచేసే మెడికల్ షాపుకు వచ్చిన వ్యక్తులకు ఇచ్చి వారి యూపీఐ ఐడీల ద్వారా తమ అకౌంట్లలో పడేలా చేసుకునే వారు. -
లక్ష రూపాయల లోపు లభించే సూపర్బైక్స్ ఇవే!
సాక్షి, ముంబై: 190 మిలియన్లకు పైగా వాహనాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్గా నిలస్తోంది ఇండియా. ముఖ్యంగా హోండా,హీరో, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ బైక్లో మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచరలతో లభించే ట్రెండీలుక్స్తో సరసమైన ధరలో లభించే బైక్స్పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలలోపు ధరలో అందుబాటులోఉన్న బైక్లపై ఓ లుక్కేద్దాం. హోండా ఎస్పీ125 బీఎస్-6 నిబంధనలకుఅనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్ హోండా ఎస్పీ 125. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో కూడిన BS6 కంప్లైంట్ 125cc ఇంజన్తో10.5bhp గరిష్ట శక్తిని 10.3Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈబైక్ రెండు వేరియంట్లలో, 5 కలర్స్లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) హీరో గ్లామర్ హీరోకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్లలో ఒకటి హీరో గ్లామర్ ..124.7cc ఇంజన్తో పనిచేస్తుంది.ఇది 10.72 bhp శక్తిని, 10.6 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్-6 కంప్లైంట్ మోడల్తో చిన్న మార్పులతో మేక్ఓవర్ అయిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,753 హీరో గ్లామర్ 12 వేరియంట్లు,13 కలర్ ఆప్షన్లలో లభ్యం. హోండా షైన్ హోండా షైన్ కూడా ఈ సెగ్మెంట్లో చాలా పాపులర్ బైక్. 124cc సింగిల్ సిలిండర్ఎయిర్-కూల్డ్ ఇంజన్తో పనిచేస్తుంది. 10 bhp , 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్న హోండా షైన్ ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) హీరో సూపర్ స్ప్లెండర్ హీరో ఐకానిక్ బైక్ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్ 10.72 bhp, 10.6 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభ ధర రూ. 77,939 . టీవీఎస్ రైడర్ 125 టీవీఎస్ రైడర్ 125 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్తో 11.2 bhp శక్తిని , 11.2 Nm గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. 4 కలర్స్, 3 వేరియంట్లలో లభ్యం. అద్భుతమైన డిజైన్తో ఆకట్టుకునే ఈ బైక్ ప్రారంభ ధర రూ. 88,078(ఎక్స్-షోరూమ్) బజాజ్ పల్సర్ 125 బజాజ్ పల్సర్ 125 ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న పల్సర్ మోనికర్తో అత్యంత సరసమైన బైక్. రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర. 4 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్లలో లభ్యం.ఈ బైక్లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, DTSI ఇంజన్తో 1.64 bhp , 10.8 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
ఈపీఎఫ్వో ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తన ఖాతాదారులకు ఊరటనిస్తోంది. కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్వో సభ్యులు తమ పీఎఫ్ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదు, ఈ మేరకు ఈపీఎఫ్వో జూన్ 1న ఒక సర్క్యులర్ జారీ చేసింది. కరోనావైరస్ సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఒక లక్ష మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఇపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తం ఖాతాకు జమ చేస్తామని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ సభ్యులు ఈ అడ్వాన్స్ ఎలా తీసుకోవచ్చో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ♦ రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సీజీజహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే, అపుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ♦ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి , రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ♦ అతడు, లేదా కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసిన ఒక గంటలోపే లక్ష రూపాయల మొత్తాన్ని జమచేస్తారు. ♦ ఈపీఎఫ్వో బోర్డు మే నెలలో జారీ చేసిన కోవిడ్ -19 అడ్వాన్స్కు ఇది పూర్తిగా భిన్నం.. ఇందులో మొత్తం ఫండ్లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. -
ఇన్వెస్టర్లపై ఎల్టీసీజీ బాంబు
సాక్షి, ముంబై: భయపడ్డట్టుగానే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీర్ఘకాలిక పెట్టుబడులపై బాంబు వేశారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపైనా పన్ను విధించేందుకు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపై రూ. లక్షకు మించి ఆర్జించిన పక్షంలో 10 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్లో జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీల లావాదేవీల ద్వారా పన్ను(ఎల్టీసీజీ ) ఆదాయం రూ. 9,000 కోట్లుమాత్రమే లభిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఒక దశలో స్టాక్మార్కెట్లు 450 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. అయితే భారీగా కోలుకుని 200పాయింట్ల లాభాల్లోకి మళ్లినా...తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి. 10 శాతం పన్ను లక్షకు పైగా పెట్టుబడులుపై 10 శాతం ఎల్టీసీజీ(దీర్ఘకాలిక మూలధన పన్ను)ను విధించనున్నట్టు ప్రకటించారు. ఈ పన్ను విధింపును 2013, జనవరి 31నుంచి లెక్కిస్తారు. అంటే ఈక్వీటీ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసిన సంవత్సరం తరువాత లక్ష రూపాయలకుపైన పెట్టుబడులపై 10శాతం పన్ను (రూ.వెయ్యి) చెల్లించాల్సిందే. ఇది హేతుబద్ధం కాదని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న షేర్లు, యూనిట్ల నుంచి మినహాయించిన మూలధన లాభాలు 2017-2018 సంవత్సరానికి అంచనా వేసిన రిటర్న్స్ ప్రకారం రూ. 3,67,000 కోట్ల రూపాయలని తెలియజేశారు. ఎల్టీసీజీ విధింపుపై ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇది ఈక్విటీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీర్ఘకాలంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తుందని మరికొంతమంది చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఆదాయం మార్పిడికి సంబంధించి భారీ అక్రమాలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ విశ్లేషకుడు సందీప్ సబర్వాల్ తెలిపారు. ఈ భయంతో తక్షణమే ప్రాఫిట్బుకింగ్కు ఇన్వెస్టర్లు దిగుతారని మరో విశ్లేషకుడు మనీష్ పాండా పేర్కొన్నారు. ఎస్టీటీ అలాగే ఉంచడం దారుణమన్నారు. దీన్ని రిమూవ్ చేసి వుండాల్సిందని ఐఐఎఫ్ఎల్ ఫౌండర్ నిర్మల్ జైన్ అభిప్రాయపడ్డారు. ఒకే పన్ను ఒకే దేశం అనే బీజేపీ విధానానికి ఈ చర్య వ్యతిరేకమని రిలయన్స్ సెక్యూరిటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బి.గోపి కుమార్ విమర్శించారు. సెక్యూరిటీల లావాదేవీ పన్నును (ఎస్టీటీ) తొలగించకుండా ఎల్టీసీజీ విధించడం అంటే ఒకే సమయంలో రెండు రకాల పన్నులు విధించడమే అన్నారు. మరోవైపు అమెరికా తరహాలో భారీ పరిశ్రమలకు లభిస్తుందనుకున్న ఊరట కాస్తా ఉసూరు మనిపించింది. కార్పొరేట్ పన్నులపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం గమనార్హం. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగానే కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. -
భారత అథ్లెట్లందరికీ తలా లక్ష రూపాయలు
రియో ఒలింపిక్ గేమ్స్కు భారత గుడ్విల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న నటుడు సల్మాన్ ఖాన్ ప్రతీ భారత అథ్లెట్కు ప్రోత్సాహకంగా లక్షా వేయి రూపాయల చొప్పున అందిస్తానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘మన ఒలింపిక్ అథ్లెట్లకు మరింత ప్రోత్సాహంగా బహుమానం ఇవ్వబోతున్నాను. క్రీడలకు కేంద్రం చాలా మద్దతు ఇస్తోంది. దీంట్లో భాగంగా మనం కూడా తోడ్పాటునందించాలి’ అని సల్మాన్ ట్వీట్ చేశాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement