-
రెండోదశ రీ సర్వే గ్రామాల్లో 2.69 లక్షల మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో క్లిష్టతరమైన అంశాలు కూడా తేలిగ్గా పరిష్కారమవుతున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో తమ భూములకు సంబంధించి మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు చేయించుకోవడం ఎంత కష్టమైన వ్యవహారమో అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పనుల్ని చాలా సులభతరంగా మార్చింది. రీ సర్వేలో రైతులు అడగకుండానే అవసరమైతే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు రెండేళ్లలో లక్షల సంఖ్యలో మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు జరిగాయి. ప్రస్తుతం రెండోదశగా రెండువేల గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్న క్రమంలో 2.69 లక్షల మ్యుటేషన్లు, 4.4 లక్షల సబ్ డివిజన్లు చేశారు. తొలిదశ రీ సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో గతంలోనే రెండులక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సబ్ డివిజన్లు చేశారు. మొత్తం ఈ నాలుగువేల గ్రామాల్లో ఇప్పటివరకు 4.69 లక్షల మ్యుటేషన్లు, 8.7 లక్షల సబ్ డివిజన్లు చేయడం గమనార్హం. అదే రైతులు చేయించుకుంటే రూ.80 కోట్లు కట్టాలి మామూలుగా అయితే పట్టా సబ్ డివిజ న్, మ్యుటేషన్ కోసం రైతులు దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టాలి. సబ్ డివిజన్కి రూ.600, మ్యుటేషన్కి రూ.100 చెల్లించాలి. దానికి గతంలో ఎక్కువ సమయం పట్టేది. దాంతోపాటు అనేక సమస్యలు. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సివచ్చేది. మధ్యలో లంచావతారులు. ఇప్పుడు రీ సర్వేలో ఇవేమీ లేకుండానే ప్రభుత్వం రైతుల భూమిని కొలిచి వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడం, డిజిటల్ రికార్డులు రూపొందించడంతోపాటు అవసరమైతే సొంత ఖర్చులతో మ్యుటేషన్, సబ్ డివిజన్లు కూడా చేసేస్తోంది. నాలుగువేల గ్రామాల్లో చేసిన మ్యుటేషన్లు, సబ్ డివిజన్లకు రైతులు ఫీజు చెల్లిస్తే.. రూ.80 కోట్లకుపైనే కట్టాలి. కానీ ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతులకు వాటిని బహుమానంగా ఇస్తోంది. అది కూడా రికార్డు సమయంలో లక్షల మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు పూర్తిచేస్తోంది. రెండేళ్లలో ఇన్ని లక్షల మ్యుటేషన్లు జరగడం సాధారణ విషయం కాదని నిపుణులు సైతం చెబుతున్నారు. -
వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను కలెక్టర్లు స్వాధీనం చేసుకునే పని వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను కలెక్టర్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తుంది. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!) ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు 60 శాతం రెవెన్యూ రికార్డులు కలెక్టరేట్కు చేరాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీఆర్వోలు, వీఆర్ఏలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, స్వచ్ఛందంగా రెవెన్యూ రికార్డులను అప్పగిస్తున్నారని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో ఒకింత ఆందోళన, మరికొంత ఆనందం నెలకొంది. వీఆర్వోలు, వీఆర్ఏలు బాధపడుతుండగా ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాధతో వీఆర్ఏ, వీఆర్వోలు స్వాగతిస్తూనే తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మాతృసంస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే శాఖకు వెళ్లమంటే తమకు ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు. -
తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్ సర్కార్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం సాయంత్రం కేబినెట్లో ఆమోదం పొందనున్న కొత్త చట్టం ఇక ముందు రిజిస్ట్రేషన్లు ఎలా ఉండాలో నిర్ణయించనున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లలో తహశీల్దార్ అధికారాలను సమీక్షించనున్న ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ను తహశీల్దార్లకు అప్పగించే యోచన గృహ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించే యోచన తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొన్ని కార్యాలయాలు తగ్గించి, మరికొన్ని చోట్ల కొత్తగా ఏర్పాటు చేసే యోచన పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు! గ్రామీణ ప్రాంతాల్లో 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గించే యోచన ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాలు 443 తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు ఏర్పాట్లు ధరణి వెబ్సైట్లో ఇక పూర్తి పారదర్శకంగా భూముల వివరాలు అక్రమాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ల వ్యవస్థను తీర్చిదిద్దే యత్నం వీఆర్వోల వద్ద రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం రికార్డుల స్వాధీనం ఏ మేరకు వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలగు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: వీఆర్వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!) -
కలెక్టర్ కనుమరుగు
సాక్షి, హైదరాబాద్ : కలెక్టర్ అనే పదం ఇక కనుమరుగు కానుంది. రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలు తేవాలని నిర్ణయించిన సర్కారు.. అధికారుల హోదాలో కూడా మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పాలనాధి కారిగా వ్యవహరించే కలెక్టర్ పేరును ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)గా మార్చాలనుకుంటోంది. ప్రస్తుతం జిల్లా పాలనాధికారిని సీడీఎం (కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్)గా పిలుస్తున్నప్పటికీ ఇం దులో కలెక్టర్ అనే పదాన్ని తొలగిం చాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలి సింది. బ్రిటిష్ పాలనలో భూమి శిస్తు వసూలు చేసే అధికారులను కలెక్ట ర్లుగా పిలిచేవారు. ప్రస్తుతం భూమి శిస్తు రద్దయినా కలెక్టర్ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రస్తుత కాలంలో కలెక్టర్ పదం సరికాదని పలు సంద ర్భాల్లో సీఎం కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టా లని భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చే విధంగా ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో జిల్లా పాలనాధికారిని కలెక్టర్ బదులు జిల్లా మేజిస్ట్రేట్గానే పిలుస్తున్నందున రాష్ట్రంలోనూ ఆ విధానాన్నే వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే జిల్లా అదనపు కలెక్టర్ల పోస్టుల్లోనూ మార్పులు జరగనున్నాయి. కొన్నాళ్ల క్రితం జాయింట్ కలెక్టర్ (జేసీ) పేరు, స్థాయి మార్చిన ప్రభుత్వం... ప్రతి జిల్లాకు జేసీ స్థానే ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించింది. ఇకపై వారి పేర్లలోనూ కలెక్టర్ అదృశ్యం కానుంది. వారిని అదనపు జిల్లా మేజిస్ట్రేట్లుగా పరిగణించాలని చట్టంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్ పోస్టులోనూ.. మండల స్థాయిలో ముఖ్య అ«ధికారిగా వ్యవహరించే తహసీల్దార్ పేరు మార్పుపైనా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రెవెన్యూ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపెట్టాలని భావిస్తున్న సర్కారు.. రిజిస్ట్రేషన్ శాఖతో వారిని అనుసంధానం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే భూముల క్రయవిక్రయాలు జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పాస్ పుస్తకాలను అక్కడికక్కడే జారీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త చట్టంలో కీలక సంస్కరణలు చేయాలని భావిస్తున్న సర్కారు.. తహసీల్దార్ అనే పదంపైనా పునరాలోచన చేస్తోంది. మండల వ్యవస్థ అమలులోకి రావడంతో అప్పటివరకు ఉన్న తహసీల్దార్ పేరును రద్దు చేసిన అప్పటి సీఎం ఎన్టీ రామారావు.. దాని స్థానే మండల రెవెన్యూ అధికారిగా నామకరణం చేశారు. అయితే దేశవ్యాప్తంగా తహసీల్దార్ హోదా ప్రాచుర్యం చెందడంతో కొన్ని ధ్రువపత్రాల చెలామణిలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మార్వో పేరును మార్చిన వై.ఎస్. సర్కారు.. మళ్లీ తహసీల్దార్గా పిలవడం మొదలుపెట్టింది. అయితే తాజాగా కొత్త రెవెన్యూ చట్టంలో ఈ పేరు మార్పిడిపైనా ఆలోచన జరుగుతోంది. భూ నిర్వహణాధికారి లేదా భూ మేనేజర్గా పిలిచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ పాత సమస్యలే ఉత్పన్నమవుతాయని భావిస్తే మాత్రం ప్రస్తుత పేరును కొనసాగించే వీలుందని ప్రచారం జరుగుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement