breaking news
remote car
-
రిమోట్ కారు పేలి...
టేకులపల్లి : రిమోట్ కారు పేలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ కొత్తూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాయం శ్రీను, రజిత దంపతుల కుమారుడు అరవింద్ అదే గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్నారు. శుక్రవారం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చి తన రిమోట్ కారుతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో రిమోట్ కారు పేలి ముక్కలైంది. అరవింద్ ఎడమ చేయికి, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. రిమోట్ కారు పేలినపుడు బాంబు పేలినట్లు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. -
రిమోట్ కారు పేలి బాలుడికి తీవ్ర గాయాలు
-
రిమోట్ కారు పేలి బాలుడికి త్రీవ గాయాలు..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఓ రిమోట్ కారు పేలడంతో పది సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని టేకులపల్లి మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన అరవింద్(10) జాతరలో కొనుగోలు చేసిన రిమోట్ కారుతో ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో కారు ఒక్కసారిగా పేలడంతో బాలుడికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆ చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో బాలుడి ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. అంతేకాక కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చాయి. బాలుడి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసేందుకు ఏర్పాటు చేశారు. -
పేలిన రిమోట్ కారు..బాలుడికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఓ రిమోట్ కారు అకస్మాత్తుగా పేలడంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం టేకులపల్లి మండలం పరిధిలోని కొప్పురాయి పంచాయతీ కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాయం అరవింద్ (10) రిమోట్ కారుతో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో అరవింద్ ఎడమ అరచేయి నుజ్జు నుజ్జు అయింది. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయి. స్థానికంగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. -
ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం
-
ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం
తరగతి గదిలో పేలిన డిటోనేటర్ ముగ్గురు విద్యార్థులకు గాయాలు ఒకరి పరిస్థితి విషమం ఇబ్రహీంపూర్ హైస్కూల్లో ఘటన రఘునాథపల్లి, న్యూస్లైన్ : రోడ్డుపై దొరికిన డిటోనేటర్తో సరదాగా చేసిన ప్రయోగం ఓ విద్యార్థి ప్రాణం మీదకు వచ్చింది. రిమోట్ కారును మొబైల్ బ్యాటరీతో నడిపిన ఆ విద్యార్థి అదే తరహాలో చేసిన ప్రయోగం వికటించింది. సెలఫోన్ బ్యాటరీకి డిటోనేటర్ వైరును అనుసంధానం చేయడంతో అది పేలి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రయోగం చేసిన విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ హైస్కూల్లో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపూర్ హైస్కూల్లో అదే గ్రామానికి చెందిన సర్జన మల్లేష్, రమ దంపతుల కుమారుడు నరేష్(11) ఆరో తరగతి చదువుతున్నాడు. రోజులాగే శుక్రవారం తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళుతున్న నరేష్కు రోడ్డుపై డిటోనేటర్ కనిపించింది. దానిని అతడు బ్యాగులో వేసుకుని పాఠశాలకు చేరుకున్నాడు. అప్పటికే తన బ్యాగులోని రిమోట్కారును మొబైల్ బ్యాటరీతో అనుసంధానం చేసి విద్యార్థులతో కలిసి ఆడాడు. క్లాస్ టీచర్ సిద్దులు రావడంతో విద్యార్థులు ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. వెనక బెంచీలో కూర్చున్న నరేష్ డిటోనేటర్ తీసి బ్యాగులో బ్యాటరీకి అనుసంధానం చేశాడు. బ్యాటరీ నుంచి వచ్చిన శక్తికి డిటోనేటర్ పెద్దపెట్టున పేలింది. దీంతో పక్కన ఉన్న విద్యార్థులు బండ్ర క్రాంతికుమార్, పబ్బ అజయ్కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడుతో విద్యార్థులు అరుస్తూ బయటకు పరుగులు పెట్టారు. భయూందోళనకు గురైన ఉపాధ్యాయులు కొద్దిసేపట్లో తేరుకుని సంఘటన స్థలానికి చేరుకోగా నరేష్ చేతి వేళ్లు నుజ్జునుజ్జరుు విలవిలలాడుతూ కనిపించాడు. తీవ్ర రక్తస్రావమవుతుండడంతో వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడు శబ్దం విని గ్రామస్తులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ఎక్కడిది ఈ డిటోనేటర్.. పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్ విద్యార్థికి ఎక్కడి నుంచి వచ్చింది.. గ్రామంలో రోడ్డుపై దానిని ఎవరు పడేశారు.. ప్రమాదమని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామశివారులోని గుట్టపై బండలను పగులకొట్టేందుకు క్రషర్ యజమా ని డిటోనేటర్లను తరలిస్తుండగా రోడ్డుపైపడి ఉంటుందని గ్రామస్తులు పేర్కొం టున్నారు. పేలుడుకు అభంశుభం తెలియని విద్యార్థి పరిస్థితి విషమంగా మా రిందని, డిటోనోటర్ను నిర్లక్ష్యంగా పడేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రషర్ను రద్దుచేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వరుస పేలుళ్లతో ఆందోళన మండలంలోని గోవర్ధనగిరి క్రషర్ వద్ద జనవరి 3న జిలెటెన్ స్టిక్స్ పేలి ఛత్తీస్గఢ్కు చెందిన ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. నెల రోజులు గడవక ముందే ఇబ్రహీంపూర్లో డిటోనేటర్ పేలడం గ్రామస్తులను భయూందోళనకు గురిచేసింది. ఇలా క్రషర్ల కారణంగా వరుస పేలుళ్లు జరుగుతున్నా పోలీసులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వె లువెత్తుతున్నాయి. ఎంపీ రాజయ్య పరామర్శ కాగా పేలుడు జరిగిన విషయాన్ని తెలుసుకు న్న ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, లింగాల జగదీష్చందర్రెడ్డి, కాసర్ల నర్సమ్మ పాఠశాలకు చేరుకుని వివరాలు హెచ్ఎం సత్తిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.