recounting
-
ఈ రిమార్కు ఎవరిది మంత్రివర్యా?
సాక్షి, అమరావతి: ‘‘వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం..’’ అని ఘనంగా చెప్పుకొనేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్కు గ్రహపాటుగా మారింది. ‘‘మేం రికార్డు సృష్టించాం’’అని గొప్పలు పోయేందుకు చేసిన తప్పు.. పరీక్షలు రాసిన విద్యార్థుల పాలిట శాపమైంది. సర్కారు అనాలోచిత చర్య.. వేలమందికి తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చింది. పదో తరగతి అంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ ప్రతిభ చూపితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.భవిష్యత్లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఇంతటి కీలకమైన విద్యార్థి దశపై కూటమి సర్కారు దారుణమైన దెబ్బకొట్టింది. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని గాలికి వదిలేసి ‘దిద్దుకోలేని తప్పు’ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో గొప్పలకు పోయి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తప్పులు దొర్లడం యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది.జీవితం తారుమారు..!టెన్త్ మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ, కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది.మూడంచెల్లోనూ పొరపాట్లే..పదో తరగతి పరీక్ష పేపర్లను మూడు అంచెల్లో దిద్దుతారు. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి ముగ్గురు టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు నుంచి ప్రతి జవాబును దిద్దారా? మార్కులు వేశారా? అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా రెండో దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా మూడింటిని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. కానీ, 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకోవడం, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11 వేల పేపర్లలో మార్కుల్లో మార్పులు రావడం చూస్తుంటే మూడంచెల వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొడుకుపై ప్రేమ.. సస్పెండ్ డ్రామా!పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకటా? రెండా? కోకొల్లలుగా ప్రభుత్వ తప్పులు బయటకొస్తున్నాయి. జూన్ 1 వరకు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పులపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు తనయుడిగానే కాకుండా పార్టీ, ప్రభుత్వంలో లోకేశ్ కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతుండడంతో ‘తన శాఖ పనితీరులో ముందున్నట్టు’ గొప్పులు చెప్పుకొనేందుకు విద్యా శాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూల్యాంకనం పూర్తి చేయాలని, నిబంధనలను పక్కనపెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొర్లడానికి కారణమైంది. కానీ, పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రజాగ్రహాన్ని దారిమళ్ళించేందుకు, కుమారుడు లోకేశ్పై ప్రేమతో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా డ్రామాకు తెరదీశారు. బాధ్యుల సస్పెన్షన్ అంటూ ఎత్తులు వేశారు.తప్పిదం ప్రభుత్వానిది.. మూల్యం విద్యార్థులదా?పరీక్షలు మంచిగా రాసినా... మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే? ఏమిటి పరిస్థితి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన భారీ తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? అని నిలదీస్తున్నారు. ఆ పాపాన్ని చంద్రబాబు మోస్తారా? అని అడుగుతున్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా విఫలమైన లోకేశ్ను ప్రథమ బాధ్యుడిగా గుర్తించి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి అంటే.. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో ఫీజులు కట్టించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమా? అని ఎద్దేవా చేస్తున్నారు.ఒత్తిడిలో మూల్యాంకనంపదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధ్యాయులపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ఒత్తిడి తెచ్చి వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడంతో కూటమి ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కుల మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికీ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పేపర్లను దిద్దిన తర్వాత నాలుగు విభాగాలుగా మార్కులు వేస్తారు. ఇందులో కొన్నింటిని లెక్కించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.కొట్టివేతలతో...రాజమహేంద్రవరం విద్యార్థి మణికంఠకు పదో తరగతి ఫలితాల్లో 505 మార్కులు వచ్చాయి. తెలుగులో 97, ఇంగ్లిష్లో 81, గణితంలో 86, సైన్స్లో 97, సోషల్లో 92 రాగా.. హిందీలో మాత్రం 52 వచ్చాయి. విద్యార్థి తండ్రి వీరభద్రరావు రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేశారు. మార్కుల్లో ‘మార్పు లేదు’ అని సమాధానం వచ్చింది. అయితే, జవాబు పత్రాల్లో సరైన సమాధానాలు రాసినప్పటికీ వాటిని కొట్టివేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు» రికార్డుల కోసం ప్రభుత్వం » విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది» వేలాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది» ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి» వైఎస్సార్సీపీ ట్వీట్సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘పరీక్ష రాసినవారిలో 60 శాతం మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. పదో తరగతి బోర్డు చేసిన షాకింగ్ తప్పులు.. పాసైనవారిని కూడా ఫెయిల్ చేశాయి. విద్యా మంత్రి నారా లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కులను తారుమారు చేశారు. 66,363 పేపర్ల రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటికే ఆందోళన చెందిన బోర్డు.. సమీక్ష తర్వాత 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, లోకేశ్ మౌనంగా ఉన్నారు. ఈ తప్పుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల కోసం ప్రయత్నించిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. -
విద్యార్థుల ఆందోళనబాట.. బోర్డు దోబూచులాట
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డు దోబూచులాట రానురానూ వివాదాస్పదమవుతోంది. ఫస్టియర్లో ఫెయిలైన విద్యార్థుల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు, నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారో కూడా స్పష్టతనివ్వక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రెండో సంవత్సరానికి సమర్థతను బేరీజు వేసుకోవ డానికే పరీక్షలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయ డంతో ఫెయిలైన విద్యార్థుల విషయంలో బోర్డు నిర్ణయమేంటని అయోమయం పెరుగుతోంది. అందరినీ పాస్ చేయాలని తాము ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని బోర్డు అధికారులు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడం జాప్యమవు తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరినీ పాస్ చేయాలని రోజూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే 39 వేల రీ వెరిఫికేషన్ దరఖాస్తులు ఇటీవలి ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో దాదాపు 2 లక్షల మందికిపైగా ఫెయిల్ అయ్యారు. వీరిలో 39,039 మంది రీ వెరిఫికేషన్ కోసం.. 4,200 మంది రీ కౌంటింగ్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. రీ వెరిఫికేషన్ దరఖాస్తుదారులకు వారి జవాబు పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. రీ కౌంటింగ్ అయితే మార్కులను మరోసారి లెక్కి స్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా అధ్యాప కులను నియమించాలి. కానీ ఇంకా ఈ దిశగా పని మొదలుకాలేదు. అందరినీ పాస్ చేయాలనే డిమాండ్ వస్తుండటంతోనే జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఫస్టియర్పై నిర్ణయం రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీన్ని తీవ్రం చేసేందుకూ వ్యూహాలు రచిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో మారుమూల ప్రాంతాలకు ఆన్లైన్ విద్య అందలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవర్గాలకు చెందినవారే ఎక్కువ మంది ఫెయిలయ్యారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. దీంతో అలందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బోర్డు కార్యాలయం వద్ద జగ్గారెడ్డి ధర్నా ఇంటర్లో ఫెయిలైన 2.36 లక్షల మంది విద్యార్థులను తక్షణమే పాస్ చేయాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట 2 గంటలు ధర్నా చేశారు. విద్యార్థులు చనిపోతుంటే సర్కారు మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. ఆన్లైన్ క్లాసులే సరిగా జరగనప్పుడు, పేదలకు ఆ విద్య చేరనప్పుడు పరీక్షలెలా రాస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నేపథ్యంలో బోర్డు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. -
టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. రెండు చోట్ల ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించగా, మరో రెండుచోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇకపోతే, బీఎన్ రెడ్డి నగర్లో రీ కౌంటింగ్ జరిగింది. తొలుత టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నపై బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై టీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేయడంతో అక్కడ రీకౌంటింగ్ జరిపారు. రీకౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి 39 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అసలు అభ్యర్థికి రావాల్సిన ఓట్లు డమ్మి అభ్యర్థికి పడటంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఓ రకంగా చెప్పాలంటే డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్ఎస్ అసలు అభ్యర్థి ఓడిపోయినట్టయింది. -
పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్కు షాక్
వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన పెన్సిల్వేనియాలో పోలింగ్లో అక్రమాలు జరిగాయనీ, రీకౌంటింగ్ చేపట్టా లంటూ ట్రంప్ బృందం వేసిన పిటిషన్లను పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసింది. పోలింగ్లో అక్రమాలంటూ చేసిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని జడ్జి మాథ్యూ బ్రాన్ పేర్కొన్నారు. దాదాపు 70 లక్షల ఓట్లను చెల్లనివంటూ ప్రకటించాలని కోరడం తగదంటూ పిటిషన్ను తోసి పుచ్చారు. ఈ పరిణామంపై అధ్యక్షుడు ట్రంప్ అటార్నీ రూడీ గిలియానీ స్పందిం చారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టుకు త్వరగా వెళ్లేందుకు పెన్సిల్వేనియా కోర్టు తీర్పు దోహదపడుతుందన్నారు. ఆధారాలను పరిశీ లించకుండానే, ఒబామా హయాంలో నియమించిన ఈ జడ్జి పిటిషన్ను కొట్టేశారని ఆరోపించారు. ఈ తీర్పుపై త్వరలోనే థర్డ్ సర్క్యూట్ కోర్టుకు వెళతామన్నారు. -
బిహార్లో నేనే విజేత: తేజస్వి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ కెరటంగా నిలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తానే అసలు సిసలైన విజేతనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నప్పటికీ ప్రజల హృదయాలను తామే గెలిచామన్నారు. గురువారం మహాకూటమి శాసనసభా నేతగా ఎన్నికైన తేజస్విæ ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్లపై నిప్పులు చెరిగారు. వారు దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. 20 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదని, చాలా ఓట్లని చెల్లని ఓట్లు అంటూ పక్కన పెట్టారని విమర్శించారు. ఆ స్థానాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘నితీశ్‡ ఛరిష్మా ఏమైపోయింది ? ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారిపోయింది. మార్పు కావాలని ప్రజలు అనుకుంటున్నారు. నితీశ్ సీఎం పీఠంపై కూర్చోవచ్చు కానీ మనం ప్రజల హృదయాల్లో నిలిచాం’ అని తేజస్వి అన్నారు. ఎన్డీయే, మహాఘట్ బంధన్ మధ్య ఓట్ల తేడా కేవలం 12,270 మాత్రమేనని అలాంటప్పుడు వారికి 15 సీట్లు అధికంగా ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఓట్ల తేడా 0.03% ఎన్నికల్లో హోరాహోరి పోరు మధ్య బొటాబొటి సీట్ల మెజారిటీతో అధికార పీఠాన్ని దక్కించుకున్న ఎన్డీయే ఓట్ల విషయంలో మరీ వెనుకబడిపోయింది. ఎన్డీయేకి, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్కి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 0.03శాతం. ఎన్డీయే కూటమికి 37.26శాతం ఓట్లు పోలయితే, మహాఘట్ బంధన్ కూటమికి 37.23% ఓట్లు పోలయ్యాయి. మిగిలిన పార్టీలకు 25.51% ఓట్లు వచ్చాయి. మొత్తం పోలయిన 3.14 కోట్ల ఓట్లలో ఎన్డీయేకి 1,57,01,226 ఓట్లు వస్తే, మహాఘట్ బంధన్కి 1,56,88,458 ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు కూటముల మధ్య తేడా కేవలం 12,768 ఓట్లు మాత్రమే. ఇరుపక్షాల మధ్య గెలుపు ఆధిక్యాలు అత్యంత స్వల్పంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. 243 సీట్లకు గాను 130 సీట్లకు సంబంధించి మొత్తం పోలయిన ఓట్లలో సగటు ఆధిక్యం 16,825గా ఉంది. -
ఆగస్టు 3 నుంచి డీఈడీ ఫస్టియర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 8వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. 2018–2020 బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా పరీక్షలకు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంటలో ఇస్తారని డైరెక్టర్ తెలిపారు. ఎల్పీటీ పరీక్ష ఫలితాలు విడుదల సాక్షి, అమరావతి: 2018–19 బ్యాచ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ విద్యార్థులకు, అంతకు ముందు ఫెయిలైన వారికి జనవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 95.31 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. తమ కార్యాలయ వెబ్సైట్లో ఫలితాలను పొందుపరిచినట్లు చెప్పారు. రీ కౌంటింగ్ కోసం జూన్ 15లోగా ఏపీసీఎఫ్ఎంఎస్లో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. -
ఇంటర్ బోర్డు వివాదం.. ఈ నెల 15కు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్ బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరో వారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ రామచందర్రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు. దాంతో ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను కూడా ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. కాగా ఈ నెల 10వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గ్లోబరీనాను ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్
-
పంచాయితీ ఎన్నికలు: మస్తాబాద్లో రీకౌంటింగ్
-
నందిగామలో ఉద్రిక్తత
-
ఒపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
– పదిలో 41.67, ఇంటర్లో 54.43 శాతం ఉత్తీర్ణత – గతేడాది కంటే మెరుగైన ఫలితాలు కర్నూలు సిటీ: ఒపెన్ స్కూల్ పరీక్షల ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలకు 2839 మంది హాజరుకాగా, 1183 మంది ( 41.67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పది ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో12వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి రాష్ట్రంలో 9వ స్థానం దక్కించుకుంది. ఇంటర్లో 3399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1850 మంది (54.43 శాతం) ఉత్తీర్ణత సాధించి, 9వ స్థానంలో నిలిచారు. గతేడాది 11వ స్థానంలో ఉన్నట్లు ఒపెన్ స్కూల్ అధికార వర్గాలు తెలిపాయి. రీకౌంటింగ్కు అవకాశం! ఒపెన్ స్కూల్స్ పరీక్షల్లో వచ్చిన ఫలితాలపై అనుమానాలు ఉంటే రీకౌంటింగ్కు అవకాశం కల్పించారు. పదోతరగతికి సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు ఫీజు రూ.100 చొప్పున, ఇంటర్ అయితే రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రీవెరిఫికేషన్కైతే ఒక్కో సబ్జెక్టుకు 1000 ప్రకారం ఫీజులు ఏపీ ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఈ నెల 5 నుంచి 15 వరకు విద్యాశాఖ గడువు ఇచ్చింది. -
అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్? రీ కౌంటింగ్ కు పట్టు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్వింగ్ రాష్ట్రాల్లో హ్యాకింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్వింగ్ రాష్ట్రాలైన మిచిగాన్, విస్కన్సిన్, పెన్సిల్వేనియా ఎన్నికల్లో హ్యాంకింగ్ జరిగిందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని ఆ దేశానికి చెందిన ప్రముఖ డేటా సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదులు చెబుతున్నారు. ఈ మూడు స్వింగ్ రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. కాగా, సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదుల ఆధారాలతో రీకౌంటింగ్ చేపట్టాలని గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జిల్ స్టెయిన్ డిమాండ్ చేశారు. ఇందుకోసం ఓ ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ పేజీని ప్రారంభించి ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను సేకరించారు. ఎన్నికల ఫలితాలను పునఃసమీక్షించేలా చేయడానికే నిధులు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల సమాచారం, పార్టీల డేటా బేస్ లు, కొంత మంది ఈ-మెయిల్ అకౌంట్లు ఎన్నికల సందర్భంగా హ్యాకింగ్ కు గురయ్యాయని అన్నారు. 2016 ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి పదవిని చేపట్టకముందే హ్యాకింగ్ పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. జిల్ స్టెయిన్ వ్యాఖ్యలపై స్పందించిన డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ప్రతినిధి హేమా అబెదిన్ ఎన్నికల హ్యాకింగ్ పై జస్టిస్ డిపార్ట్ మెంటు ద్వారా స్వతంత్ర విచారణ జరగాలని ప్రజలు కోరాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దాదాపు 2 మిలియన్ల పాపులర్ ఓట్లను గెలుచుకున్న హిల్లరీ క్లింటన్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టం వల్ల ఎన్నికల్లో ఓడిపోయారు. మిచిగాన్, విస్కన్సిన్, పెన్సిల్వేనియాల్లో హ్యాకింగ్ కారణంగానే క్లింటన్ ఓడిపోయారని సైంటిస్టులు అంటున్నారు. ఎన్నికల్లో 70శాతం పేపర్ బ్యాలెట్లు(బ్యాకప్ కోసం) ఉపయోగించినా వాటిని సరిగా చెక్ చేయలేదని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రొ.జే అలెక్స్ హాల్డర్ మ్యాన్ అన్నారు. అంతేకాకుండా ఓటింగ్ మెషీన్లు అన్నింటిలో సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగి ఉంటే రిగ్గింగ్ కు ఆస్కారం ఉండేది కాదని అన్నారు. మూడు స్వింగ్ రాష్ట్రాల్లోని నాయకులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించక తప్పదని చెప్పారు. ఎన్నికల ఓట్లు రీ కౌంటింగ్ కు చివరి అవకాశం ఈ శుక్రవారం నుంచి బుధవారం వరకూ మాత్రమే ఉంది. ట్రంప్ కు పెన్సిల్వేనియాలో 20, మిచిగాన్ లో 16, విస్కన్సిన్ లో10 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చిన ఆధిక్యంతోనే అధ్యక్ష పదవికి అవసరమయ్యే 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ట్రంప్ కైవసం చేసుకున్నారు. -
బుడతవలసలో రీకౌంటింగ్ నేడే
లావేరు: మండలంలోని బుడతవలస పంచాయతీ ఎన్నికలుకు శనివారం రీ కౌంటింగ్ జరుగనుంది. దీంతో మండలంలోని వైఎస్ఆర్ సీపీ, టీడీపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. 2013 జూలై నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్లో ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు ఏకపక్షంగా వ్యవహరించారని, తనకు పడిన 61 ఓట్లును చెల్లని ఓట్లుగా పరిగణించడం వల్లనే తాను పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఓడిపోయానని, రీకౌంటింగ్ చేయమని అడిగినా ఎన్నికల అధికారి పట్టించుకోలేదని మళ్లీ తిరిగి రీకౌంటింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బుడుమూరు పాపారావు శ్రీకాకుళం పీడీఎఫ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పీడీఎఫ్ కోర్టు జడ్జి పద్మావతి శనివారం బుడతవలస పంచాయతీ ఎన్నికలకు శ్రీకాకుళంలోని కోర్టులో రీకౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఎన్నికలు రీకౌంటింగ్ కావడంతో ఎన్నికల ఫలితాల కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పొందూరు ట్రెజరీ నుంచి లావేరు మండల అధికారులు బ్యాలెట్ బాక్సును తీసుకెళ్లనున్నారు. ఈ నెల 1న బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలట్ బాక్సును లావేరు ఎంపీడీఓ కిరణ్కుమార్, సూపరింటెండెంట్ విజయరంగారావులు శ్రీకాకుళంలోని పీడీఎఫ్ కోర్టుకు తీసుకువెళ్లగా 6న రీకౌంటింగ్ ఉంటుందని, అప్పుడు బ్యాలట్ బాక్సును తీసుకురావాలని జడ్జి ఆదేశించారు. దీంతో ఆ రోజు పొందూరు ట్రెజరీ కార్యాలయంలో ఎంపీడీఓ బ్యాలెట్ బాక్సును భద్రపరిచారు.