సాక్షి, అమరావతి: ఇంటర్మిడియట్ పబ్లిక్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. మొత్తం 2,432 మంది విద్యార్థులు రీ–కౌంటింగ్కు, 11,883 మంది విద్యార్థులు రీ–వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను bie.ap.gov.inలో చూడవచ్చని ఇంటర్ విద్యా కార్యదర్శి రంజిత్ బాషా బుధవారం తెలిపారు. ఫలితాల్లో ఏమైనా తేడా వస్తే ఇంటర్ విద్య మండలి పోర్టల్ లేదా 93929 11819 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.


