breaking news
Raksha Bandhan celebrations
-
జెన్ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్లు ఇస్తూ
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు హై-ఫైవ్లు ఇస్తూ, వారితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ మోదీ రాఖీ సంబరాలు జరుపుకున్నారు. మోదీకి చిన్నారులు రాఖీ కట్టారు.కాగా, రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్ర బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రజలు ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయ ఆచారాలతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.“రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆప్యాయత, అనురాగం, పరస్పర విశ్వాసంతో కూడిన బంధాలు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.లోక్సభ స్పీకర్ సందేశంకుటుంబ విలువలు, సంస్కృతికి ప్రతీకగా రాఖీ పౌర్ణమిని అభివర్ణించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. ఈ పండుగ కేవలం పవిత్రమైన దారాన్ని కట్టే వేడుక మాత్రమే కాదని అన్నారు. విశ్వాసం, గౌరవం, ప్రేమ, జీవితాంతం కలిసి ఉండాలనే ప్రతిజ్ఞకు ఇది ప్రతీక అని తెలిపారు.ఇదీ చదవండి: యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూమహిళల గౌరవం, ఆత్మగౌరవం, హక్కులు, కలలతో రక్షణ అనే భావన కూడా ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుమార్తె, ప్రతి సోదరి సురక్షితంగా, గౌరవంగా ఉన్నప్పుడే దేశం మరింత బలంగా మారుతుందని ఆయన అన్నారు. -
రాఖీ పండుగ సెలబ్రేషన్స్ లో ప్రముఖులు (ఫొటోలు)
-
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ రక్షాబంధన్ వేడుకలు.. ఫోటోలు
-
శ్రావణ పూర్ణిమకు అంతటి విశిష్టత ఎందుకు?
దైవారాధనకు అన్ని రోజులూ అనువైనవే. కానీ కొన్ని రోజులు మరీ అనువైనవని భావించటం ఆస్తికులకు ఒక ముచ్చట. అందుకే ఇన్ని పండగలు! ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక ప్రమాణాలకూ, ఇంద్రియాలకూ అందదు. దాన్ని మనిషి తన మనసు ద్వారా భావించి, చింతన చేసి, గ్రహించ వలసిందే.ఆ మనసును నియంత్రించే అధిష్ఠాన దేవత చంద్రుడు. అందుకే నిండు పున్నమి దినాలన్నీ మనసును ఉత్తేజితం చేస్తాయి. కాబట్టి, పున్నమి దినాలన్నీ ఆధ్యాత్మిక చింతనకూ, సాధనలకూ, కార్యకలాపాలకూ అనుకూలమైన పర్వదినాలుగా పరిగణిస్తారు. అందునా శ్రావణ, కార్తీక పూర్ణిమలు మరీ విశిష్టాలు. శివారాధనకు శ్రావణ పూర్ణిమ ఎంతో ప్రశస్తం.శ్రావణ పూర్ణిమ అనగానే మూడు విశేషాలు మనసుకు వస్తాయి. ఇది ‘రాఖీ’ పూర్ణిమ. రక్షాబంధనాల పూర్ణిమ. సోదరులూ, తత్సమానులైన వారి క్షేమాన్నీ, సర్వతోసమృద్ధినీ ఆకాంక్షిస్తూ, సోదరీమణులూ (తత్సమానురాళ్ళూ) అనురాగంతో, ఆత్మీయతతో వారి చేతికి రక్షాబంధనాలు కట్టే వేడుక అనేక శతాబ్దాలుగా వస్తున్నది.ఈ పూర్ణిమ హయగ్రీవ అవతార తిథి. బ్రహ్మ చేసిన సత్రయాగంలో విష్ణుమూర్తి వేదమయుడైన హయగ్రీవు డిగా అవతరించి, తనఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వేదవాణిని ప్రకటించాడని భాగవతం చెప్తుంది. జ్ఞాన సర్వస్వ మైన వేదాలను వినిపించిన జ్ఞానానందమయుడూ, నిర్మల స్ఫటికాకారుడూ, సకల విద్యలకూ ఆధారమూ అయిన హయగ్రీవుడి అవతార తిథి కాబట్టి శ్రావణ పూర్ణిమ, వేదాధ్యయన ఆరంభానికీ (‘ఉపాకర్మ’), వేద శ్రవణానికీ సముచితమైన ముహూర్తం. అందుకే, వేద విద్యార్థులూ, అధ్యాపకులూ, ఇతరులూ కూడా, శిథిలమై జీర్ణమైన దశలో ఉన్న యజ్ఞోపవీతాలను మార్చుకొనే ‘జంధ్యాల పూర్ణిమ’ కూడా ఇదే. ఇప్పటివరకూ వర్షాల వల్ల కుంటు పడిన ‘వానాకాలపు’ చదువులకు చురుకు పెంచి, ఈ పూర్ణిమ నుండి ఇక చదువులో శ్రద్ధనూ, వేగాన్నీ పెంచుకొంటే, అది వేద విద్యార్థులకూ, లౌకిక విద్యల విద్యార్థులకూ అందరికీ ప్రయోజనకరమే.– ఎం. మారుతి శాస్త్రిఇవి కూడా చదవండి: రక్షాబంధన్కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత.. -
దారం కాదు… దూరాలను దగ్గర చేసే ఒక్క రోజు!
ఆమె పెళ్లయి మరో ఇంటికి వెళ్లింది. అతను ఉద్యోగం కోసం మరో నగరంలో ఉన్నాడు. ఇద్దరూ రోజూ మాట్లాడకపోవచ్చు. వాట్సాప్ దగ్గరే చాట్ ఆగిపోవచ్చు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం ఫోన్ మోగుతుంది… “అన్నయ్యా, ఎప్పుడు వస్తావ్?” అని. అదే రక్షా బంధన్. ఇది కేవలం రాఖీ కట్టే పండుగ కాదు; దూరమైన బంధాలను మళ్లీ కలిపే భావోద్వేగ వేడుక.ఒకప్పుడు చాక్లెట్లు, కవర్లు, కొత్త బట్టలే రాఖీ ప్రత్యేకం. కానీ 2026లో ట్రెండ్ పూర్తిగా మారింది. ఇప్పుడు సోదర–సోదరీమణులు వస్తువుల కంటే కలిసి గడిపే సమయాన్ని బహుమతిగా ఎంచుకుంటున్నారు. ఒక కాఫీ, ఒక చిన్న ట్రిప్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే డిన్నర్… ఇవే ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తున్న రాఖీ గిఫ్ట్స్.చిన్నప్పుడు శత్రువులు.. టీవీ రిమోట్ కోసం కొట్టుకున్న రోజులు, చిప్స్ దాచిపెట్టి మళ్లీ ఇద్దరూ కలిసి తిన్న క్షణాలు, అమ్మకు తెలియకుండా రాత్రిళ్లు కథలు చెప్పుకున్న జ్ఞాపకాలు… ఇవన్నీ రాఖీ రోజున మళ్లీ మనసులో మెదులుతాయి. చాలా కుటుంబాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య సంవత్సరాలుగా మాటలు లేకపోవచ్చు. అహం, అపార్థాలు, చిన్న గొడవలు బంధాన్ని దూరం చేస్తాయి. ఈ రాఖీ రోజున “క్షమించు” అనే ఒక్క మాటతో కొత్త ప్రారంభం చేయాలని సంబంధ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బంధాలు గెలవాలి… వాదనలు కాదు.రక్త సంబంధానికే కాదుచరిత్రలో రక్షా బంధన్ కేవలం అన్నాచెల్లెళ్లకే పరిమితం కాలేదు. గురువులకు, సైనికులకు, కుటుంబ స్నేహితులకు కూడా రాఖీ కట్టి గౌరవం తెలిపే సంప్రదాయం ఉంది. రక్షణ అంటే కేవలం ఏదో బాడీగార్డ్గా ఉండాల్సిన పని కాదు.. అవసరమైనప్పుడు తోడుగా నిలబడే వాగ్దానం.ఈ ఏడాది సందేశం ఒక్కటేరాఖీ దారం చేతికి కట్టేది ఐదు నిమిషాలే. కానీ ఆ దారంలో దాగి ఉండేది ఏళ్ల అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలు, జీవితాంతం నిలిచే నమ్మకం. అందుకే ఈ పండుగలో అత్యంత విలువైన బహుమతి ఖరీదైన గిఫ్ట్ కాదు… “నేను ఉన్నాను” అని చెప్పే మనిషి. రాఖీ 2026 చెబుతున్న సందేశం ఇదే.. దూరం ఎంత ఉన్నా, నిజమైన బంధానికి ఒక దారం చాలు. -
మనకు మనం.. అన్న దన్ను అదనం..
ఒకప్పుడు రక్షణ అంటే బలమైన హస్తం. మణికట్టుపై ముడిపడే దారం. ఆపదలో ఆదుకునే అన్నయ్య భరోసా. కానీ, కాలం మారింది. ఇప్పుడు జెన్ జి. వారి దృష్టిలో రక్షణ అంటే కేవలం మగాడు వచ్చి కాపాడటం కాదు... ఒక మహిళకు మరో మహిళ తోడుగా నిలబడటం, తనను తానే రక్షించుకుంటానని వాగ్దానం చేసుకోవడం. అందుకే మార్కెట్లో ‘సిస్టర్హుడ్ రాఖీ’లు... ‘సెల్ఫ్రాఖీ’లు రాఖీ పౌమి వేళ సోషల్ మీడియా వేదికగా రక్షాబంధన్ 2.0 స్వరూపం..రాఖీ పౌమి వచ్చిందంటే చాలు... అన్నాచెల్లెళ్ల బంధం అనివార్యంగా ఇళ్లను ఉద్వేగభరితం చేస్తుంది. ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి’ వంటి పాటలు రేడియోలో మోగుతాయి. అన్నను గుర్తు చేసుకోని చెల్లెలు, చెల్లెలి శిరస్సు తాకి ఆశీర్వదించి, ఆమె చేతి మీదుగా రక్షాబంధనం కట్టుకోని అన్న ఉండడు. రాఖీ వచ్చిందంటే ఇంటికి కళ. రక్తానుబంధపు తీపి మిఠాయి సమయం.అయితే ఈసారి రాఖీ పండగలో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు లేని అమ్మాయిలే కాదు... ఉన్న అమ్మాయిలు కూడా తమ అక్కాచెల్లెళ్లకు, ప్రాణస్నేహితురాళ్లకు రాఖీలు కడుతున్నారు. పురాణాల్లో చెప్పిన ద్రౌపది, శ్రీకృష్ణుల సెంటిమెంట్ను గౌరవిస్తూనే... ఈ కాలానికి తగినట్టుగా తమకు తాము సొంత రక్షణ వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తున్నారు అమ్మాయిలు. ఇది పండగ జరుపుకునే పద్ధతి మారడం కాదు... స్త్రీల ఆత్మవిశ్వాసానికి, ఐక్యతకు నిదర్శనం.‘రక్ష’ అంటే శారీరక బలం కాదుసంప్రదాయం ప్రకారం రాఖీ కట్టించుకున్న సోదరుడు సోదరిని కాపాడతానని మాట ఇస్తాడు. కానీ ఇవాళ్టి రోజుల్లో ఒక అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు, ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు లేదా జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు తక్షణ రక్షణగా నిలుస్తున్నది ఎవరు? తోటి మహిళే! హాస్టల్ గదిలో అనారోగ్యంతో బాధపడుతుంటే బ్రెడ్ తెచ్చి ఇచ్చే రూమ్మేట్, ఆఫీసు పాలిటిక్స్ నుండి కాపాడే మహిళా కొలీగ్, అర్ధరాత్రి ప్రయాణంలో తోడుగా నిలిచే అపరిచిత స్త్రీ... వీరంతా ఒకరికొకరు రక్షకులే. శారీరక బలంతో కాపాడటం మాత్రమే రక్షణ కాదు; ఒక అమ్మాయి కుంగిపోతున్నప్పుడు వెన్నుతట్టి ‘నేనున్నా’ అనే మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కూడా రక్షణే. ఆ నమ్మకానికే ఈ తరం అమ్మాయిలు రాఖీ కడుతున్నారు. రక్షణ అనేది జెండర్తో కాదు, గుండె ధైర్యంతో ముడిపడి ఉందని చాటుతున్నారు.మారిన కుటుంబ వ్యవస్థఒకప్పటి ఇళ్లకూ ఇప్పటి ఇళ్లకూ సాపత్యం లేదు. ఉమ్మడి కుటుంబాలు పోయి మైక్రో ఫ్యామిలీలు వచ్చాయి. ఒకప్పుడు అన్నయ్యలకు మణికట్టు నిండా రాఖీలే. ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఇంటిలో అబ్బాయి చేతికి రాఖీ కట్టే ఆడపిల్ల ఉండటం లేదు. అలాగే సింగిల్ డాటర్ లేదా టూ డాటర్స్ కుటుంబాలు పెరిగాయి. వీళ్లు రాఖీ కట్టడానికి చేయి దొరకడం లేదు. అందుకే అన్నదమ్ములు లేరనే వెలితి తెలియకుండా గత కొన్నేళ్లుగా చెల్లెలికి అక్కే ‘నేనే నీ రక్ష’ అంటూ రాఖీలు కట్టుకోవడం ఆనవాయితీగా మారుతోంది. అన్నాచెల్లెళ్ల బంధమే కాదు, అక్కాచెల్లెళ్ల బంధం కూడా రాఖీయే అని చెప్పే తల్లులు పెరుగుతున్నారు. ఈ మార్పును బ్రాండ్స్ కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. అమెజాన్ వంటి సైట్లలో అక్కాచెల్లెళ్ల కోసం ప్రత్యేకంగా జీట్ట్ఛట ్ఞu్చఛీ ఖ్చజుజిజీ, ఆజీజ జీట/ఆ్చby జీటఖ్చజుజిజీటపేరుతో మార్కెట్లో రాఖీలు తెస్తున్నాయి. పాతకాలపు డిజైన్ల స్థానంలో ‘విమెన్ ఎంపవర్మెంట్ సింబల్’్స ఉన్న రాఖీలు ఇవాళ అమ్ముడవుతున్నాయి.ట్రెండింగ్లో సెల్ఫ్–లవ్ఈసారి డిజిటల్ స్పేస్లో # జీట్ట్ఛటటఊౌట జీట్ట్ఛటటహ్యాష్ట్యాగ్ మార్మోగిపోతోంది. కేవలం తోబుట్టువులకే పరిమితం కాకుండా, తమకు స్ఫూర్తినిచ్చిన ఇతర మహిళలకు, మహిళా బాస్లకు అమ్మాయిలు కృతజ్ఞతగా రాఖీలు పంపుతున్నారు. అంతేకాదు, మరో అద్భుతమైన ట్రెండ్ ఏంటంటే... ’సెల్ఫ్ లవ్ రాఖీ’. తమ మణికట్టుకే తాము రాఖీ కట్టుకుంటూ ‘నా జీవితానికి, నా రక్షణకు, నా ఆర్థిక స్వాతంత్య్రానికి, నా ఎదుగుదలకు నేనే బాధ్యత వహిస్తాను’ అని అమ్మాయిలు సెల్ఫ్–డిక్లరేషన్ ఇస్తున్నారు. ‘అమ్మాయిలు ఎవరికో రాఖీ కట్టి, నన్ను కాపాడమని వేడుకునే రోజులు పోయాయి. మనల్ని మనం కాపాడుకునే ధైర్యం మన చేతుల్లోనే ఉంది’ అని అంటున్నారు వాళ్లు.అసలు ‘రాఖీ’ ఎప్పుడూ ‘దారం’ కాదు. అది ఒక మాట. ‘భయపడకు, నేనున్నాను‘ అనే మాట. ఇన్నాళ్లూ ఆ మాటను అబ్బాయిలు మాత్రమే చె΄్పాలి అనుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలు కూడా చెబుతున్నారు. అమ్మాయిలు అమ్మాయిలకు రాఖీ కట్టుకోవడం అంటే పురుష సమాజానికి వ్యతిరేకంగా మారడం కాదు... తమలోని అంతర్గత శక్తిని గుర్తించడం. ఆడపిల్ల ఒంటరి కాదు, ఒక అమ్మాయికి మరో అమ్మాయి తోడుంటే ఆ శక్తే వేరు అని చాటిచెప్పడం. అందుకే ఈ రాఖీ పౌమి కేవలం తోబుట్టువుల పండగ మాత్రమే కాదు... స్త్రీ శక్తి ఐక్యతా దినోత్సవం! -
రాఖీ పౌర్ణమి సందర్భంగా.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా... (ఫొటోలు)
-
రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)
-
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ సంప్రదాయాలను మరవటం లేదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా మాతృదేశ విశ్వాసాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు వేదికైన రక్షాబంధన్ ను న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ టెంపుల్ రాఖీ పండగ సంబరాలకు వేదిక అయింది.నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలుగు కుటుంబాలు ఆనందోత్సహాల మధ్య రాఖీ పండగను నిర్వహించారు. తోడబుట్టిన సోదరులకు కొందరు అక్కాచెల్లెళ్లు రాఖీలు కడితే, తాము స్ధిరపడిన అమెరికాలో బాంధవ్యాల రీత్యా సోదరభావం ఏర్పడిన అన్నలు, తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టి, వారి నోరు తీపిచేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు.చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి నైటా నేతృత్వంలో బహుమతులు అందించారు. అలాగే హాజరైనవారందరికీ నైటా కార్యవర్గం పసందైన విందును కూడా ఏర్పాటుచేసింది. వారాంతం కావటంతో తెలుగు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి రాఖీ వేడుకలకు మరింత శోభను తెచ్చారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వయిజరీ కమిటీ, ట్రస్టీలు, ఈవెంట్ స్పాన్సర్లు పాల్గొన్నారు.(చదవండి: ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్లో అమానుష ఘటన) -
అక్క చెల్లెమ్మలకు YS జగన్ రాఖీ శుభాకాంక్షలు
-
ఈసారి మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్
రాఖీ (రక్షాబంధన్) పండుగ వస్తుందంటే.. మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే.. వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కోనేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.''ఈ సంవత్సరం మార్కెట్లలో చైనీస్ రాఖీలు, వస్తువులు కనిపించడం లేదు" అని CAIT సెక్రటరీ జనరల్ & చాందినీ చౌక్ ఎంపీ 'ప్రవీణ్ ఖండేల్వాల్' పేర్కొన్నారు. వినియోగదారులు కూడా చాలావరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని అన్నారు.రక్షా బంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయవాదానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్లో మోదీ రాఖీ, ఆపరేషన్ సిందూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..రాఖీలు మాత్రమే కాకుండా.. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా రూ.4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రక్షాబంధన్ భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్లలో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. -
ఉరి సెక్టార్ లో సైనికులకు రాఖీలు కట్టిన స్థానిక మహిళలు
-
Raksha bandhan 2024 : ప్రముఖుల రక్షాబంధన్ వేడుక (ఫొటోలు)
-
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్గా ఉన్న తన సోదరుడు గౌరవ్తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్ఫోన్ సిస్టమ్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్పై అద్భుతమైన యాడ్ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్లో.. -
ప్రగతిభవన్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
సీఎం కేసీఆర్కు రాఖీ కట్టిన అక్కలు, చెల్లి
సాక్షి, హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి. కేసీఆర్ అక్కాచెల్లెళ్ల రాకతో ప్రగతిభవన్లో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరుడికి రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి కేటీఆర్కు రాఖీ కడుతున్న కవిత. చిత్రంలో కేటీఆర్ సతీమణి శైలిమ తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారు తమ సోదరుడిని నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే విధంగా కేటీఆర్, కవిత సీఎం కేసీఆర్ మనుమడు, మనుమరాలు కూడా రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ కూతురు అలేఖ్య తన అన్న హిమాన్షుకు రాఖీ కట్టింది. తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు దీవించారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ పౌర్ణమి సందర్భంగా.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా...
అమ్మానాన్నలు మనకు జన్మనివ్వడంతో పాటు మనకు ఇచ్చే మరో గొప్ప వరం తోబుట్టువులు. ఈ ప్రపంచంలోని బంధాల అన్నింటిలోనూ సోదర, సోదరీ బంధం ప్రత్యేకమైనది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం వెలకట్టలేనిది. అంతేకాదు తోడబుట్టకపోయినా కొంతమంది అంతటి ఆప్యాయత, అనుగారాలు పంచే బంధాలు కలిగి ఉండి అదృష్టవంతులు అనిపించుకుంటారు. ఇలా సహోదర భావంతో మెలుగుతూ.. ‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష’ అంటూ రాఖీ కట్టుకునే పర్వదినం నేడు. మరి ఈ పండుగ రోజు మీ ఆప్తులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి. దూరంగా ఉన్నా సరే నేను నీతోనే ఉన్నా అనే భావనతో మనల్ని దగ్గర చేసేందుకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఇలా ఉపయోగించుకోండి! సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన రహస్యాలు తెలిసిన వాళ్లు మనకు అత్యంత ఆప్తులు. వాళ్లే మన తోబుట్టువులు. రాఖీ పూర్ణిమ అందరిలో సరికొత్త కాంతులు తేవాలి. హ్యాపీ రాఖీ బంధన్ ఈ బంధం పెవికాల్ కంటే పటిష్టమైనది. దీన్ని విడగొట్టడం ఎవరి తరమూ కాదు. ప్రతీ అణువులోనూ నిండిన సోదర, సోదరీ ప్రేమానుబంధం. అందరికీ హ్యాపీ రాఖీ పూర్ణిమ. డైరెక్టుగా కట్టినా, పోస్ట్ ద్వారా వచ్చినా.. రాఖీ రాఖీయే. దాన్ని పంపే సోదరి తన ప్రేమంతా అందులో కూర్చుతుంది. అలాంటి వారందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. రాఖీపూర్ణమ అంటే నాకెంతో ఇష్టం. చేతులకు రాఖీలు, సోదరీమణుల దీవెనలూ ఎప్పటికీ కావాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అక్కా, చెల్లీ, అన్నా, తమ్ముడూ.. ఈ పిలుపుల్లో ఉండే తీపి చక్కెర కంటే తియ్యన. తోబుట్టువుల బంధం కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ హ్యాపీ రక్షా బంధన్. Raksha Bandhan Wishes: ‘అమ్మలోని ‘అ' పదం.. నాన్నలోని ‘నా' పదం కలిపితేనే ‘అన్న' అన్నైనా.. తమ్ముడైనా నీకు అందివ్వగలిగేది ఆనందమే'' మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ హ్యాపీ రక్షా బంధన్ ‘‘గులాబీకి ముళ్లు రక్ష.. చేపకి నీరు రక్ష.. పుట్టిన బిడ్డకు తల్లి రక్ష.. నా అక్క చెల్లెళ్లందరికీ నేను రక్ష''గా ఉంటానని హామీ ఇస్తూ సోదరీమణులందరికీ హ్యాపీ రక్షాబంధన్.. ‘‘చిరునవ్వుకు చిరునామా.. మంచి మమతకు మారురూపం... ఆప్యాయతకు నిలువెత్తు రూపమే రక్షాబంధన్'' రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. ‘‘నేను ఏమి చేస్తే మంచిగా ఉంటానో.. నా సోదరులకు బాగా తెలుసు.. అందుకే వారు నాతో ఎప్పటికీ ఉంటారు'' ‘నాకు ఉన్న సోదరుడు స్నేహితుడి లాంటి వాడు. అలాంటి సోదరుడు ఎవ్వరికీ ఉండరు. అందుకే నేను చాలా లక్కీ అని నమ్ముతాను'' Raksha Bandhan Quotes: ప్రపంచం మారుతుంది, కాలం గడుస్తుంది. తోబుట్టువుల ప్రేమానురాగాలు మాత్రం స్థిరంగా ఉంటాయి. వాటికి కాలపరిమితి లేదు. ప్రకృతి ఇచ్చిన స్నేహితుడు సోదరుడు తోబుట్టువుకి తగిన గుర్తింపు తోబుట్టువు వల్లే వస్తుంది. వారి మధ్య బంధం అపరిమితం. ఒకే రక్త సంబంధం కలిగిన పిల్లలలో ఏర్పడిన అనుబంధం తెలియని శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని మరేదీ ఇవ్వలేదు. మన సహోదరులు, సోదరీమణులూ మన వ్యక్తిగత కథల్లో తెల్లవారుజాము నుంచి సాయం సంధ్య వరకు మనతో ఉంటారు. హృదయపూర్వకంగా లభించే బహుమతి సోదరి. తను కట్టే రాఖీ.. మన జీవితానికి అర్థం, పరమార్థం. నాకు సొంత తోబుట్టువులు లేకపోవచ్చు. నా చేతికి కట్టే ప్రతీ రాఖీలో ఆ అనుబంధాన్ని నేను పొందుతాను. రాఖీ పౌర్ణమి వేళ ఈ విషెస్, కోట్స్ మీ స్నేహితులు, బంధువులకు పంపుకోండి. -
సీఎం జగన్ కు రాఖీలు కట్టిన ఎంపీలు
-
అన్న చెల్లెల్ల అనుబంధానికి రాఖీ ప్రతీక
-
పర్యావరణం ఉట్టిపడేలా రాఖీ పండుగను నిర్వహించేందుకు గ్రీన్ వేవ్స్ సంస్థ ప్లాన్
-
బిగ్బాస్ దివితో రక్షాబంధన్ స్పెషల్ చిట్ చాట్
-
Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు
సాక్షి, జగిత్యాల: ప్లాస్టిక్తో తయారయ్యే వస్తువులు పర్యావరణం, మనిషి ఆరోగ్యానికి హానికరంగా మారాయి. ఈనేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లెక్చరర్గా పనిచేస్తున్న ఓ అభ్యుదయ మహిళ, ఆవు పేడ, సహజసిద్ధమైన పూలతో అందమైన రాఖీలు తయారు చేసి, హైదరాబాద్ లాంటి నగరాల్లో విక్రయిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన డాక్టర్ చెన్నమనేని పద్మ హైదరాబాద్లో లెక్చరర్గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించడమంటే ఇష్టం. బోర్నపల్లిలో 200 దేశీయ ఆవులతో మురిళీధర గోదామం గోశాల ఏర్పాటు చేసింది. వీకెండ్తో పాటు సెలవుల్లో ఆవు మూత్రం, పేడతో రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు దీపావళికి ప్రమిదలు, వరలక్ష్మీ పూజకు అవసరమైన సామగ్రి తదితర వస్తువులను ఆవు పేడతో తయారు చేసి శభాష్ అన్పించుకుంది. గోమయ రాఖీలు.. గోశాలలో ఆవులు విసర్జించిన పేడను దాదాపు నెల రోజుల పాటు ఎండబెట్టారు. పిడకల మాదిరిగా తయారైన ఆవుపేడను గ్రైండర్ లేదా ప్రత్యేక మిషన్లో వేసి గోధుమ పిండిలా తయారు చేశారు. అలా తయారైన మెత్తటి పేడకు గోరు గమ్ పౌడర్ (సోయా చిక్కుడుతో తయారైనది)తో పాటు కొంత చెరువు మట్టిని రొట్టె పిండిలా కలిపి రకరకాల డిజైన్ సాంచా(మోడల్)ల్లో పెట్టి నీడలో ఆరబెట్టి, దారాన్ని అతికించారు. తర్వాత చామంతి, గులాబీ పూలను ఎండబెట్టి, పూల రేకులను గ్రైండ్ చేసి రంగులు తయారు చేస్తారు. రాఖీలకు ఏ రంగు అవసరమనుకుంటే ఆ రంగులను వాడుతారు. ఉపయోగాలు.. రక్షాబంధన్ అనంతరం చేతిక కట్టిన రాఖీ తీసివేసిన తర్వాత అది ఎరువుగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా రాఖీ చేతులకు ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా గోమయ రాఖీ యాంటీ రేడియేషన్గా పనిచేసి, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో వీటికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. అయితే వీటి ద్వారా సంపాదన కంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవితం విలువైనది మనిషి జీవితం చాలా విలువైనది. ప్రస్తుత మన అలవాట్లు, వాడే రసాయన పదార్థాల వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. ఆవు మూత్రం, పేడను పంటలకు ఎరువుగానే కాకుండా, మనిషి రోజు వారీ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. దీంతో రాఖీలు తయారు చేశాం. – డాక్టర్ పద్మ, గోమాయ రాఖీల తయారీదారు గి‘రాఖీ’ వెలుగులు సిరిసిల్ల: కొన్నేళ్ల క్రితం వరకు రాజన్న సిరిసిల్ల్ల వస్త్రోత్పత్తి, బీడీల తయారీకి ప్రసిద్ధి చెందింది. నేత కుటుంబంలోని మహిళలు బీ డీలు తయారు చేస్తూ ఇంటి పోషణలో తోడుగా నిలిచేవారు. ఈనేపథ్యంలో చాలా రోజులు గా సిరిసిల్లలో బీడీ పరిశ్రమ కుదేలై పనిదొ రక్క సతమతమవుతున్న మహిళలు ప్రత్యామ్నాయ ఉపాధిగా రాఖీలు తయారు చేస్తూ ఆర్థికంగా సంపాదిస్తున్నారు. బీడీల తయారీ కంటే మంచిది కావడంతో యువత, విద్యార్థులు, గృహిణులు ఉత్సాహంగా ఏడాదిలో పదినెలలు రాఖీలు తయారు చేస్తున్నారు. కలిసొచ్చిన లాక్డౌన్.. లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి రాఖీల దిగుమతి చాలా వరకు తగ్గింది. అయితే సిరిసిల్ల, చందుర్తిలో రాఖీ పరిశ్రమను శ్రీహరి–తేజస్విని దంపతులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నారు. ఇక్కడి రాఖీలు ప్రజలను ఆకట్టుకోవాలంటే మహా నగరాల్లో నుంచి వచ్చే రాఖీలకు దీటుగా తయారు చేయాలి. ఈక్రమంలో రాఖీల తయారీకి ముడి సరుకును ముంబాయిలోని మల్లాడ్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు. రంగురాళ్లు, సిల్వర్, గోల్డెన్, దేవుళ్ల బొమ్మలు, వివిధ పార్టీల గుర్తులతో రాఖీలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. మణికంఠ రాఖీ సెంటర్ బ్రాండ్ పేరు పక్క జిల్లాలకు పాకింది. రాఖీల నాణ్యత ఎక్కువ, ఖరీదు తక్కువ కావడం, లాక్డౌన్తో ఇతర రాష్ట్రాల్లో రాఖీల తయారీ తగ్గడం సిరిసిల్ల రాఖీలకు మరింత కలిసొచ్చింది. తక్కువ ధరల్లో.. సిరిసిల్లలో తయారయ్యే రాఖీలు చూసేందుకు అందంగా, తక్కువ ధరలో దొరకడం వీటికి క్రేజ్ పెరిగింది. రూ.2 నుంచి రూ.100 వరకు ఖరీదు చేసే రాఖీలు ఇక్కడ తయారవుతున్నాయి. ఏటా జిల్లా కేంద్రంతో పాటు చందుర్తి మండలం లింగంపేట లో సుమారు 16లక్షల రాఖీలు తయారు చేస్తున్నా రు. జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ తది తర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
వైభవంగా రక్షాబంధన్
వరంగల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. బైక్లు నడిపేటప్పుడు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి పలు ప్రాంతాల్లో హెల్మెట్లను బహూకరించారు. సోదరులు తమకు తోచిన కట్నకానుకలను అందించారు. వృద్ధాశ్రమాలు, అనాథ బాలల ఆశ్రమాల్లో కూడా వేడుకలు వైభవంగా జరిగాయి. -
రాఖీ పండగ: ఆదర్శంగా నిలిచిన గంభీర్..!
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ వినూత్న నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రక్షా బంధన్ సందర్భంగా ట్రాన్స్జెండర్లతో రాఖీ కట్టించుకుని సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఆడా, మగా అనే లింగభేదం ఎందుకు. ముందు మనుషులుగా మసలుకోవడం ప్రధానం. అభినా అహెర్, సిమ్రాన్ షైక్ ప్రేమతో నా చేతికి కట్టిన రాఖీలు ఎప్పుడూ గుర్తుంటాయి’అని అని ట్విటర్లో పేర్కొన్నారు. వారిద్దరి సోదర ప్రేమను నేను అంగీకరించాను. మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. మనుషులను మనుషులుగా గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. ట్రాన్స్జెండర్లయినా.. వారూ మనుషులేనని చెప్తూ.. లింగమార్పిడి చేయించుకున్న వారిపట్ల అమానుషంగా ప్రవర్తించే కొందరికి ఆయన హితవు పలికారు. కేరళలో జరుపుకునే ఓనమ్ పండుగకు క్రికెటర్లంతా.. శుభాకాంక్షలు తెలుపుతుంటే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగకు గంభీర్ ఇలా స్పందించాడు. -
స్త్రీజాతికి పూర్వ గౌరవం రావాలి
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రస్తుత సమాజంలో స్త్రీజాతికి పూర్వ గౌరవం రావాలనే సంకల్పంతో చిలుకూరు బాలాజీ దేవాలయంలో చేపట్టిన ‘రక్షా బంధనం’ ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అర్చకులు రాఖీలతో ప్రదక్షిణ చేసి ప్రధాన ఆలయం ఎదుట ఉన్న మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. సూర్య భగవానుడికి, అమ్మవారికి అష్టోత్తరంతో అర్చన నిర్వహించారు. పూజాకార్యక్రమాల అనంతరం రాఖీలను ఆలయానికి వచ్చిన మహిళా భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వారు ముక్కుమొఖం తెలియని కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమమంతా కనులపండగలా జరిగింది. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరిపై అదే భావన కలిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. సమాజంలో మార్పుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. ఇప్పటితో ఇది ఆగిపోదన్నారు. మహిళల ఆత్మగౌరవం పెరిగే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సమాజంలో అందరూ సోదరభావంతో మెలగా ల్సిన అవసరం ఉందని రంగరాజన్ అభిప్రా యపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ సందడి
సదాశివపేట/సిద్దిపేట టౌన్: రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో పండుగ సందడి కనిపించింది. ఆయా చోట్ల వెలిసిన దుకాణాల్లో రాఖీల ను కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు బారులుతీరారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనురాగాలకు చిహ్నంగా జరుపుకునే సంబరాలను వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. రూ.1 నుంచి రూ.150 వరకు మార్కెట్లలో అందుబాటులో ఉన్న రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేటలోని సుభాష్రోడ్, బస్టాండ్, మెదక్ రోడ్, మెయిన్రోడ్, కాంచీట్ చౌరస్తా, కరీంనగర్ రహదారి పక్కన వందలాది రాఖీల దుకాణాలు వెలిశాయి. 50 పైసల నుంచి రూ. 500ల ఖరీదైన రాఖీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విక్రయానికి పెట్టారు. రాఖీలు దుకాణాలు, స్వీట్ దుకాణాలు కొనుగోలుదారులతో సందడి గా మారాయి. ఆదివారం పండుగ నిర్వహ ణకు వివిధ సంఘాలు ఏర్పాట్లు చేశాయి.


