rajyasabha condidate
-
'నన్ను గదిలో పెట్టి రాజకీయం చేశారు'
గుంటూరు : తెలుగుదేశం పార్టీలో డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పుష్పరాజ్ అన్నారు. సీనియర్లను విస్మరించి కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి పదవులిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీటు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నాటి టీడీపీకీ, ఇప్పటి టీడీపీకి ఎంతో తేడా ఉందని పుష్పరాజ్ అన్నారు. తనకు రాజ్యసభ సీటు వస్తుందని ఆశించానని, రాకపోవడంతో నిరాశకు గురైనట్లు ఆయన తెలిపారు. సీటు దక్కపోవడాన్ని తన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని పుష్పరాజ్ తెలిపారు. తనను గదిలో పెట్టి రాజకీయం చేశారని పుష్పరాజ్ వ్యాఖల్యు చేశారు. పదవుల విషయంలో తనను ప్రతిసారి బాధపెడుతున్నారని ఆయన అన్నారు. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పుష్పరాజ్ తనకు రాజ్యసభ సీటు కేటాయించాలంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు మాత్రం మొండిచెయ్యి మిగిలింది. టీడీపీ నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ తరఫున కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
రాజ్యసభ అభ్యర్థిగా విజయ సాయిరెడ్డి
-
రాజ్యసభ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారికి 4 సెట్ల నామినేషన్లు అందజేత సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గురువారం ఉదయం తన నామినేషన్ను దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకుని అక్కడ 11.45 నిమిషాలకు తన నామినేషన్ను రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సత్యనారాయణ (ఏపీ శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి)కు అందజేశారు. తొలి సెట్పై విజయసాయిరెడ్డి పేరును పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. కళత్తూరు నారాయణస్వామి, గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడుతో పాటు పది మంది ఎమ్మెల్యేలు దానిపై సంతకాలు చేశారు. మిగతా 3 సెట్లపై 30 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా సంతకాలు చేశారు. ఇటీవలి రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్రంగా గాయమైకోలుకుంటున్న విజయసాయిరెడ్డికి మద్దతుగా వైఎస్సార్ీసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి ఇతర సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, శాసనమండలిలో పార్టీపక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కొడాలి నాని అసెంబ్లీ కార్యదర్శి చాంబర్లోనికి విజయసాయిరెడ్డితో వెళ్లి నామినేషన్లు వేయించారు. ఏకగ్రీవంగా ఖరారు.. నామినేషన్కు దాఖలుకు ముందు విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతల సమావేశంలో ఏకగ్రీవంగా ఖరారు చేశా రు. ఉదయం 9 గంటలకు జరిగిన ఈ సమావేశంలో నేతలతో చర్చించిన తర్వాత విజయసాయిరెడ్డి పేరును వైఎస్ జగన్ అధికారికంగా అందరి సమక్షంలో ప్రకటించారు. -
న్యాయం వైపు నిలిచినందుకే
* విజయసాయిరెడ్డి ఎంపికపై వైఎస్ జగన్ * విలువల కోసం ముద్దాయిగా మారడానికి కూడా సిద్ధపడ్డారు * మానవ సంబంధాలు, విశ్వాసానికి కట్టుబడిన వారికి పార్టీలో సముచిత స్థానం * వ్యక్తులను వాడుకుని వదిలేయడం నాకు చేతకాదు సాక్షి, హైదరాబాద్: నిజాయతీ, విలువలకు కట్టుబడి మానవ సంబంధాల కోసం గట్టిగా నిలబడినందుకే విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ తరఫున ఎంపిక చేశామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆయన గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపిన తరువాత విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆయన ఎంపికకు గల కారణాలను వివరించారు. తనపై కొందరు కుట్రలు పన్ని, కుమ్మక్కై రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించినప్పుడు దర్యాప్తు సందర్భంగా సాయిరెడ్డి నైతిక విలువలకే కట్టుబడ్డారని చెప్పారు. ఈ వ్యవహారంలో మొత్తం నెపాన్ని జగన్పై నెట్టేస్తే సాయిరెడ్డిని కేసుల్లో సాక్షిగానే ఉంచి ముద్దాయిగా చేయబోమని దర్యాప్తు సందర్భంగా విపరీతంగా ఒత్తిడి చేశారని, అయినా ఆయన లొంగకుండా న్యాయం వైపే నిలబడ్డారని కొనియాడారు. ఈ వ్యవహారాల్లో ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగలేదని, జరిగిందే చెబుతాను గానీ, జరగనిది చెప్పబోనంటూ సాయిరెడ్డి దృఢంగా వ్యవహరించారని, విలువల కోసం ముద్దాయిగా మారడానికి కూడా సిద్ధపడ్డారని జగన్ పేర్కొన్నారు. మానవ సంబంధాలు, విశ్వాసానికి కట్టుబడిన వారికి వైఎస్సార్సీపీలో సముచిత స్థానం లభిస్తుందనే సందేశం ఇవ్వదలిచామన్నారు. ఒక్క మాట జగన్కు వ్యతిరేకంగా చెబితే వదలి వేస్తామని కొందరు ఒత్తిడి తెచ్చినా సాయిరెడ్డి విలువలకే కట్టుబడ్డారని తెలిపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తులను వాడుకుని వదలి వేయడం కొందరి లాగా తనకు చేతకాదని, అది తన నైజం కూడా కాదని స్పష్టం చేశారు. చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయాలు మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇవాళ చేస్తున్న రాజకీయాలు దుర్మార్గమైనవని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, నట్టేట ముంచుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. కేవలం ఒకే ఒక్క మాట కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎవరైతే పార్టీ కోసం శ్రమించారో, మానవ సంబంధాలకు విలువనిచ్చారో వారిని నాయకుడనే వాడు అర్థం చేసుకోవాలని, ఆ ఆలోచనతోనే ఈ ఎంపిక జరిగిందని వివరించారు. అందరి సమక్షంలో విజయసాయిరెడ్డికి మంచి మనసుతో ‘బీ ఫాం’ ఇచ్చి పంపాలని భావించామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల హర్షధ్వానాల మధ్య విజయసాయిరెడ్డికి ‘బీ ఫాం’ అందజేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు బుట్టా రేణుక, వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం: విజయసాయిరెడ్డి తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతోనే ఉంటానని, వారితో తనకు మూడు తరాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై గురుతర బాధ్యతను ఉంచి, రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో ప్రజల శ్రేయస్సుకు పనికి వచ్చే చట్టాల రూపకల్పనలో, వాటి అమలు విషయంలో ఒక ప్రతిపక్ష సభ్యుడిగా తన బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. చట్టసభల్లో విలువలు పడిపోతున్నాయని, వాటిని కాపాడడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎంపికపై పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలంతా తన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా సమర్థించారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేడు గుంటూరు జిల్లాకు జగన్ * పెదగొట్టిపాడులో మృతుల కుటుంబాలకు పరామర్శ సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఉదయం 8.30కు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏటుకూరు బైపాస్ మీదుగా ఉదయం 10 గంటలకు ప్రత్తిపాడు వెళతారని చెప్పారు. అక్కడ్నుంచి 10.30 గంటలకు పెదగొట్టిపాడు వెళ్లి ఇటీవల గుంటూరులో భవన నిర్మాణ పనుల్లో మృతిచెందిన ఏడుగురు యువకుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని పేర్కొన్నారు. -
నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా: సాయిరెడ్డి
హైదరాబాద్ : పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి విజయ సాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ తరఫునుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభలో పార్టీ వాణిని వినిపిస్తానని విజయ సాయిరెడ్డి తెలిపారు. అలాగే పార్టీ ప్రాబల్యం పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
రాజ్యసభ అభ్యర్థిగా విజయ సాయిరెడ్డి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేరు ఖరారు అయింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సుదీర్ఘ భేటీ అనంతరం అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించారు. విజయ సాయిరెడ్డి ఎంపిక పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపినవారికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ దాఖలు అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి అసెంబ్లీకి వెళ్లిన విజయ సాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ విజయ సాయిరెడ్డి నామినేషన్ పత్రాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారాయణస్వామి, గిడ్డి ఈశ్వరి, ముత్యాల నాయుడు సంతకాలు చేశారు. అలాగే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, ఉప్పులేటి కల్పన,కొడాలి నాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ...విజయసాయిరెడ్డిని ప్రతిపాదిస్తూ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేశారు. -
పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై నేతలతో చర్చించి ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. జూన్ 11న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కానున్న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.