-
10 ఎకరాలు.. రూ. 500 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖ ప్రైవేటీకరణ వైపు పరుగెడుతోంది. విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా ఆదాయ వనరులను సమీకరించునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతోపాటు రైళ్లను కూడా ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే బడా సంస్థలకు ఆహ్వానం పలికిన రైల్వేశాఖ.. తాజాగా ఖాళీ స్థలాల వినియోగంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మౌలాలి, మెట్టుగూడ, లాలాగూడ, చిలకలగూడ, తదితర ప్రాంతాల్లోని సుమారు 10 ఎకరాల విలువైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలోని రైల్వే అధికారుల క్వార్టర్స్ను అప్పగించేందుకు రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మొత్తం స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తోంది. అందరి చూపు అటు వైపే... సంగీత్ చౌరస్తా నుంచి రైల్ నిలయం వైపు వెళ్లే దారిలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే అధికారుల క్వార్టర్స్ ఇవి. 40 మందికి పైగా అధికారులు ఈ క్వార్టర్స్లో నివాం ఉంటున్నారు. జనరల్ మేనేజర్, అదనపు జనరల్ మేనేజర్ మినహాయించి కనీసం పదేళ్లకు పైగా సీనియారిటీ కలిగిన ఉన్నతస్థాయి అధికారులకు ఈ క్వార్టర్స్ కేటాయిస్తారు. ఈ ప్రాంగణంలో జీ+1 భవనాల్లో అన్ని వసతులు ఉంటాయి. ఇళ్లల్లో పని చేసేవాళ్లకు, డ్రైవర్లకు ఔట్ హౌస్లు ఉంటాయి. రైల్నిలయంతో పాటే ఈ క్వార్టర్లను 1965–1970 మధ్య కట్టించారు. ఇటు రైల్నిలయం, అటు సంచాలన్భవన్, హైదరాబాద్ భవన్, లేఖాభవన్, తదితర రైల్వేకార్యాలయాలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వే క్వార్టర్స్పై ప్రస్తుతం ఆర్ఎల్డీఏ కన్ను పడింది.ప్రైమ్ ల్యాండ్ కావడంతో దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. లీజుపైనే సందిగ్ధం... రెండేళ్ల క్రితమే రైల్వేస్థలాల లీజుకోసం రైల్ లాండ్ డెవలప్మెంట్ అథారిటీ సన్నాహాలు చేపట్టింది. మొదట్లో 39 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని భావించారు.కానీ నిర్మాణ సంస్థల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. దీంతో గడువును 99 ఏళ్లకు పెంచినట్లు సమాచారం.కానీ సాధారణంగా స్థలాలను పూర్తిగా కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలు లీజు స్థలాల పట్ల ఎలా ఆసక్తి చూపుతారనిదే సందిగ్ధం. లీజుకు ఇలా.... ⇔ రైళ్ల నిర్వహణ, సరుకు రవాణాపైనే కాకుండా రైల్వేస్థలాల నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించేందుకు రైల్వేశాఖ మూడేళ్ల క్రితం రైల్లాండ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రైల్వేస్థలాలను గుర్తించి బడా కార్పొరేట్ సంస్థలకు 99 ఏళ్ల వరకు లీజుకు ఇస్తుంది. ⇔ ప్రస్తుతం సికింద్రాబాద్లోని రైల్వేకార్టర్స్ స్థలంలో భారీ వ్యాపార,వాణిజ్య భవన సముదాయాలను నిర్మించి నిర్వహించేందుకు (బిల్డ్, ఆపరేట్) లీజుకు ఇవ్వనున్నారు. దీనిద్వారా రైల్వేకు రూ.150 కోట్లకు పైగా ఆదాయం రాబట్టవచ్చని అంచనా. -
ఇద్దరి ప్రాణాలు మింగిన ఆట
హైదరాబాద్: ఇద్దరు చిన్నారులు ఆడుకోవడానికి భవనం పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అనంతలోకాలకు వెళ్లిపోయారు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత తల్లిదండ్రులతోపాటుగా స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు కథనం మేరకు..రైల్వే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న బీదర్కు చెందిన కృష్ణప్రసాద్, రేణుక దంపతులకు ఏడాదిన్నర పాప శ్రావ్య. రైల్వే ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న బాబురావు, సుమిత్ర దంపతుల కుమార్తె పల్లవి (12). ఈ రెండు కుటుంబాలు చిలకలగూడలోని రైల్వే క్వార్టర్ నంబర్ 1010/ 9, 10 ఇళ్లలో నివసిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి శ్రావ్యతోపాటు పల్లవి ఆడుకుంటూ మూడవ అంతస్తుపైకి వెళ్లారు. టెర్రాస్ పిట్టగోడ ఒకటిన్నర అడుగుల ఎత్తే ఉండటంతో ప్రమాదవశాత్తు శ్రావ్య కిందపడబోయింది. వెంటనే పల్లవి శ్రావ్య గౌను పట్టుకుని గట్టిగా కేకలు వేసింది. కింది అంతస్తులో ఉన్న రేణుక పైకి వచ్చేలోగా గాలిలో వేలాడుతున్న శ్రావ్య గౌను చిరగడంతో పల్లవి వదిలేసింది. దీంతో కింద పార్కింగ్ చేసిన కారుపై శ్రావ్య పడిపోయింది. పైకి వస్తున్న శ్రావ్య తల్లికి పెద్ద శబ్దం వినిపించ డంతో కిందికి పరుగులు తీసింది. అయితే టెర్రాస్పైనే ఉన్న పల్లవి బ్యాలెన్స్ కోల్పోయి తలకిందులుగా కిందపడి అక్కడిక్కడే మృతి చెందింది. కారుపై పడిన చిన్నారి శ్రావ్యకు తీవ్ర గాయాలు కావడంతో ద్విచక్ర వాహనంపై లాలాగూడ రైల్వే ఆస్పత్రికి అక్కడి నుంచి కిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావ్య మృతి చెందింది. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. పరామర్శించిన మంత్రి పద్మారావు: సమాచారం అందుకున్న అబ్కారీమంత్రి తీగుళ్ల పద్మారావు బుధవారం ఉదయం గాంధీ మార్చురీ వద్దకు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తరలించేందుకు అవసరమైన రవాణా ఖర్చులను మంత్రి పద్మారావు చెల్లించారు. పట్టుకునేందుకు పరిగెత్తా అమ్మా అంటూ పల్లవి కేకలు వినిపించడంతో బయటకు వచ్చి చూశాను. ఎదురుగా ఉన్న క్వార్టర్స్ పై అంతస్తులో శ్రావ్య వేలాడుతూ, ఆమెను పట్టుకుని పల్లవి కనిపించారు. కిందపడితే పట్టుకుందామని పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆలోపే శ్రావ్య కారుపై పడిపోయింది. రెండు అడుగులు వేసేలోగా పల్లవి కూడా తన కాళ్ల వద్దే పడి మృతి చెందింది. బాధగా ఉంది. – హిమబిందు, ప్రత్యక్షసాక్షి ఆస్పత్రికి తరలించా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాను. ఇంతలో క్షణాల వ్యవధిలో రెండు మార్లు పెద్ద శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూసేసరికి పల్లవి రక్తపుమడుగులో పల్లవి, కారుపై శ్రావ్యలు పడిఉన్నారు. వెంటనే బైక్పై వారిద్దరినీ రైల్వే ఆస్పత్రికి తీసుకువెళ్లాను. అప్పటికే పల్లవి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. –కిరణ్కుమార్, ప్రత్యక్షసాక్షి -
చిక్కడపల్లి రైల్వే క్వార్టర్స్లో విషాదం
హైదరాబాద్: చిక్కడపల్లి రైల్వేక్వార్టర్స్లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ బిల్డింగ్ మూడవ అంతస్తుపై నుంచి పడి శ్రావ్య అనే 18 నెల పాప మృతిచెందింది. శ్రావ్యను కాపాడబోయి పల్లవి అనే 13 సంవత్సరాల పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరి మృతితో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
కలుషితనీరు తాగి 138 మందికి అస్వస్థత
చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ కలుషిత నీరు తాగి 138 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగిన వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితులను మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని రైల్వే అధికారులు పరిశీలించారు. -
పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు!
ఆదిలాబాద్ క్రైం: ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు వెళ్లారు. అది గమనించిన దొంగలు ఇదే సరైన సమయం అనుకున్నారేమో.. అదనుచూసి ఇంట్లో అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వేక్వార్టర్స్లో ఉండే రైల్వే ఉద్యోగి రఘునాథ్ కూతురు వివాహం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉంచిన రూ.80వేల నగదుతోపాటు మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివాహ వేడుక అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement