-
నేవీ రాడార్ స్టేషన్ కోసం అటవీ భూములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికారాబాద్ మండలం పూ డూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ (రాడార్) స్టేషన్ ఏ ర్పాటు ఖరారయ్యింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని తూర్పు నౌకాదళ కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ కలి శారు. వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు కోసం అట వీ భూముల బదిలీ ఒప్పందంపై వికారాబాద్ డీఎఫ్వో, నా వల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు సంతకాలు చేశారు. దామ గూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దేశంలోనే రెండోది భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేష న్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే స్టేష న్ దేశంలో రెండోది కాగా.. తమిళ నాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావ రణ అనుమతులు, క్లియరెన్స్లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. వాస్తవానికి 2014లోనే నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లు కూడా నేవీ చెల్లించింది. అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు నేవీ అంగీకరించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ దిశగా ముందడుగు పడింది. 2027లో పూర్తి దామగూడెంలో నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ప్రాజెక్టులో భాగంగా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటు పూర్తి కానుంది. -
అమెరికా నిర్మించిన రాడార్ స్టేషన్ని ధ్వంసం చేసిన రష్యా
it would consider NATO transport carrying weapons in Ukraine: ఉక్రెయిన్లోని జోలోట్ పట్టణం సమీపంలో అమెరికా నిర్మించిన రాడార్ స్టేషన్ను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్లో ఆయుధాలను మోసుకెళ్లే నాటో రవాణాను నాశనం చేసేందుకు ఉద్దేశించిన లక్ష్యంలో భాగంగా ఆ స్టేషన్ని ధ్వంసం చేసినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా రష్యా బలగాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. పైగా మే 9 రష్యా విక్టరీ డే పురస్కరించుకుని మాస్కోలోని రెడ్ స్క్వేర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైనిక బలగాలకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ తన బలగాలను ఉద్దేశించి ..."మీరు మాతృభూమి కోసం, భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. పైగా మీరు రెండవ ప్రపంచ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోరు. అయినా ఈ గడ్డ పై ఉరితీసేవారికి, వేధించేవారికి, నాజీలకు చోటు ఉండదు." అని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా రష్యా విక్టరీ డే సంర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ... ఉక్రెయిన్కు రెండు విక్టరీ డేస్లు ఉంటాయని చెప్పడం కొసమెరుపు. పైగా జెలన్ స్కీ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకులు చేసిన వాటిని ఎప్పటికీ మరచిపోం అని వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ఇక్కడ 8 మిలియన్లకు పైగా ఉక్రేనియన్లు మరణించడమే కాకుండా ప్రతి ఐదవ ఉక్రేనియన్ ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఈ మేరకు ఈ యుద్ధం దాదాపు 50 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొందని జెలెన్ స్కీ అన్నారు. అదీ గాక ఉక్రెయిన్ పై రష్యా నిరవధిక దాడుల జరిపి నేటికి 75వ రోజుకు చేరుకుంది. ఐతే రష్యా ప్రధాన సంధానకర్త వ్లాదిమిర్ మెడిన్స్కీ ఉక్రెయిన్తో శాంతి చర్చలు ఆగలేదని కాకపోతే మెక్కుబడిగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. (చదవండి: అంచనాలను తలకిందులు చేస్తూ.. ఉక్రెయిన్లోని ‘మాతృభూమి’ రక్షణ కోసమే పోరాటం: పుతిన్) -
నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు కొలిక్కి!
పూడూరు: మండలంలోని దామగుండం అటవీ ప్రాంతం శివారులో నెలకొల్పే నౌకాదళ రాడార్ కేంద్రం (నేవీ స్ట్రాటజిక్ సెంటర్) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్తో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నౌకౌదళం, అటవీశాఖ, జిల్లా ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నౌకాదళ రాడార్ కేంద్రాన్ని మండలంలోని దామగుండం సమీపంలో 2,900 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందుకు మరోచోట ఢీ రిజర్వు చేయనున్నారు. ఈ రాడార్ కేంద్రం ఏర్పాటుతో శత్రు దేశాల జలాంతర్గాముల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి పొంచి ఉండే ప్రమాదాలను కూడా తెలుసుకోవచ్చు. కాగా.. పూడూరు మండలానికే వన్నె తెచ్చే దామగుండం రామలింగేశ్వరాలయాన్ని వదిలేసి నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు నౌకాదళం అధికారులు అంగీకరించారు. సీఎంతో సోమవారం జరిగే సమావేశంలోని అంశాల తుది నివేదికను కేంద్ర అటవీశాఖ, నౌకాదళానికి పంపించనున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ పోలింగ్పై సీఎం జగన్ ట్వీట్
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
కేఎల్ రాహుల్ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- మెడికల్ బోర్డు చీఫ్పై సుప్రీం ఆగ్రహం
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement