breaking news
Question Hour canceled
-
ప్రశ్నోత్తరాలు లేకుండానే పార్లమెంటు ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: ఈ నెల ద్వితీయార్థంలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరెన్నో రకాలుగా కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. సెపె్టంబర్ 18–22 మధ్య ఐదు రోజుల పాటు వాటిని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషీ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఉభయ సభల్లో సాధారణంగా ఉదయాన్నే చేపట్టే ప్రశ్నోత్తరాలు ఈ సమావేశాల్లో ఉండబోవు. అలాగే ప్రైవేట్ సభ్యుల బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వబోరు. రాజ్యసభ, లోక్సభ సచివాలయాలు శనివారం ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ‘17వ లోక్సభ 13వ సమావేశాలు సెపె్టంబర్ 18 సోమవారం మొదలవుతాయి. ఉభయ సభలు సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది‘ అని లోక్సభ సచివాలయం; ‘రాజ్యసభ 261వ సమావేశాలు మొదలవుతాయి‘ అని రాజ్యసభ సచివాలయం వేర్వేరు బులెటిన్లలో పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను కేంద్రం ఇప్పటిదాకా గోప్యంగా ఉంచడం తెలిసిందే. ప్రత్యేక భేటీ కొత్త భవనంలో...? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత లోక్సభకు చివరివి అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. భేటీ అనంతరం ఉభయ సభలు సభ్యులకు ప్రత్యేక గ్రూప్ ఫోటో సెషన్కు ఏర్పాట్లు జరుగుతుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఈ సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశముందని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి కొత్త భవనంలో జరిగే తొలి సమావేశాలు గనుక ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తుండవచ్చని కూడా కొందరు అంటున్నారు. అత్యాధునిక రీతిలో సర్వ హంగులతో రికార్డు సమయంలో నిర్మితమైన పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత మే 28న ప్రారంభించడం తెలిసిందే. ప్రత్యేక సమావేశాలు ఇలా... ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఐదు సెషన్లు ఉంటాయి. సమావేశాలకు సంబంధించిన ప్రోవిజనల్ కేలండర్ను ఎంపీలకు విడిగా తెలియజేస్తారు. -
ప్రశ్నోత్తరాలు రద్దు, జీరో అవర్ అరగంటే
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సరికొత్త విధి, విధానాలతో ఉభయసభలు సోమవారం వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యాన్ని, సభ్యుల వాణిని అణచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించాయి. కోవిడ్ కారణంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తామని ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ అవర్ అత్యంత కీలకమని, ఈ సమయంలోనే ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం లభిస్తుందని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ఎంఐఎం, టీఎంసీ తదితర పార్టీల సభ్యులూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సాధారణంగా సభ ప్రారంభం కాగానే తొలి గంట ప్రశ్నోత్తరాల సమయంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజన అంశాలపై సభ్యులను మంత్రులను ప్రశ్నించి, సమాధానాలు పొందవచ్చు. తాజా సమావేశాల్లో, కరోనా ముప్పు కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల సభాకార్యక్రమాల్లో క్వశ్చన్ అవర్ను, ప్రైవేటు మెంబర్ బిజినెస్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభకు వివరించారు. ఈ నిర్ణయం తీసుకునేముందు రక్షణమంత్రి రాజ్నాథ్ దాదాపు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడారన్నారు. రాజ్నాథ్ కూడా మాట్లాడుతూ.. క్వశ్చన్ అవర్ను రద్దు చేయడానికి, జీరో అవర్ను 30 నిమిషాలకు కుదించడానికి దాదాపు అన్ని పార్టీల నాయకులు అంగీకరించారని వెల్లడించారు. సభ్యులెవరైనా ఏదైనా అంశంపై ప్రశ్నించాలనుకుంటే.. జీరో అవర్లో ప్రశ్నించవచ్చని తెలిపారు. తూర్పు లద్దాఖ్లో చైనా దుస్సాహసాల అంశాన్ని లేవనెత్తేందుకు కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్చౌధురి ప్రయత్నించారు. దీనికి అభ్యంతరపెట్టిన స్పీకర్.. మొదట బీఏసీ సమావేశంలో మొదట ఈ అంశాన్ని లేవనెత్తాలని ఆయనకు సూచించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ రాజ్యసభ కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతీరోజు 4 గంటల పాటు కాకుండా, సభాసమయాన్ని మరో గంట పెంచి, ఆ సమయాన్ని క్వశ్చన్ అవర్కు కేటాయించాలని ఆజాద్ సూచించారు. నెంబర్ 1, 2, 3.. స్పీకర్ పోడియానికి కుడి వైపు అధికార పక్షం కూర్చుంది. నెంబర్ 1 అని రాసి ఉన్న స్థానంలో ప్రధాని మోదీ, నెంబర్ 2 అని రాసి ఉన్న స్థానంలో రాజ్నాథ్ సింగ్, నెంబర్ 3 అని రాసి ఉన్న స్థానంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూర్చున్నారు. విపక్షం వైపు ముందు సీట్లలో డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, ఆధిర్ రంజన్ చౌధురి కూర్చున్నారు. రెండో వరుసలో నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా, సమాజ్వాదీ పార్టీ నేత ములాయం కూర్చున్నారు. ములాయం వీల్చెయిర్లో సభలోనికి వచ్చారు. ప్రధాని సభలోకి ప్రవేశించగానే అధికార పక్ష సభ్యులు భారత్మాతా కీ జై అనే నినాదాలతో ఆయనను స్వాగతించారు. సభ్యులంతా మాస్క్లు ధరించడంతో పాటు, కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటించారు. జై జవాన్ ! దేశమంతా మీ వెనుకే.. దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో విధుల్లో ఉన్న వీర సైనికులకు సంఘీభావం తెలుపుతూ, దేశమంతా వారి వెనుకే ఉందన్న సందేశాన్ని పార్లమెంటు ఏకగ్రీవంగా వెలువరిస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికులకు సంఘీభావం తెలపడం చట్ట సభల అత్యంత ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితులు ముంచుకొస్తున్న తరుణంలో కఠిన పర్వత ప్రదేశాల్లో మన సైనికులు అత్యంత ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తిస్తున్నారు’ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై సభలో వాడీవేడి చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉభయసభల్లో అన్ని ప్రజా ప్రయోజన అంశాలపై విలువైన, లోతైన చర్చలు జరగాలని, ఆ చర్చల ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాలని ఆయన కోరారు. అలాగే, కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సభాకార్యక్రమాలను రిపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకు సూచించారు. వారు ఇటు.. వీరు అటు తొలిసారి లోక్సభ సభ్యులు రాజ్యసభ చాంబర్లో కూర్చుని లోక్సభ కార్యక్రమాల్లో.. రాజ్యసభ సభ్యులు లోక్సభలో కూర్చుని రాజ్యసభ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ సభ్యులకు స్థానాలను ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉభయ సభల్లో, గ్యాలరీల్లోనూ సభ్యులకు సీట్లు కేటాయించారు. లోక్సభలో ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు, రాజ్యసభలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7వరకు సభా కార్యక్రమాలు నడిచాయి. కానీ, నేటి(మంగళవారం) నుంచి ఉదయం షిఫ్ట్లో రాజ్యసభ, మధ్యాహ్నం షిఫ్ట్లో లోక్సభ కార్యక్రమాలు సాగుతాయి. మాట్లాడే సభ్యుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘కూర్చుని ప్రసంగించడం కొందరికి కష్టం కావచ్చు’ అని చమత్కరించారు. అలాగే, ప్రతీ సభ్యుడి స్థానం ముందు పారదర్శక ప్లాస్టిక్ షీట్ను ఏర్పాటు చేశారు. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఒక సభ్యుడు, 13 మంది మాజీ సభ్యుల మృతికి సభ్యులు నివాళులర్పించారు. ఆ తరువాత, గంట వాయిదా అనంతరం సభ మళ్లీ సమావేశమైంది. ఆ సమయానికి సభకు హాజరైన సభ్యుల సంఖ్య కూడా కొంత పెరిగింది. 25 మంది ఎంపీలకు కరోనా సాక్షి, న్యూఢిల్లీ: 17 మంది లోక్సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శుక్ర, శని వారాల్లో పార్లమెంటు సభ్యులకు ఇక్కడి పార్లమెంటు అనుబంధ భవనంలో కరోనా టెస్టులు నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఆయా పరీక్షల రిపోర్టులు రాగా 25 మందికి వైరస్ సోకినట్టు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. వైరస్ బారిన పడినవారిలో లోక్సభ సభ్యుల్లో బీజేపీకి చెందిన 12 మంది, వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోవిడ్ 19 పాజిటివ్గా తేలిన ఎంపీలు కొందరు క్వారంటైన్లో ఉండగా.. మరికొందరు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాజస్తాన్కు చెందిన ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బెణివాల్కు పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అయితే, తాను జైపూర్లోని ఒక ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నానని, ఆ పరీక్షలో నెగెటివ్గా ఫలితం వచ్చిందని ఆయన తెలిపారు. ఏ ఫలితాన్ని తాను విశ్వసించాలని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సభానాయకుడు తావర్చంద్ గెహ్లోత్ ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్ను తమ అభ్యర్థిగా ప్రతిపాదించారు కానీ, ఓటింగ్కు పట్టుబట్ట లేదు. రాజ్యసభ డి³N్యటీ చైర్మన్గా మరోసారి ఎన్నికైన జేడీయూ నేత హరివంశ్ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన అన్ని పక్షాలకు చెందినవాడన్నారు. సభను నిష్పక్షపాతంతో నడుపుతారని, అద్భుతమైన అంపైర్ అని ప్రశంసించారు. జర్నలిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా అందరికీ ఆప్తుడుగా ఉన్నారన్నారు. రాజ్యసభలో కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న చైర్మన్ వెంకయ్యనాయుడు -
ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటుదాని మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బ్రిటీష్ హయాం నుంచీ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయని, సామాన్యుల సమస్యలు లేవనెత్తేందుకు ప్రశ్నోత్తరాలు కీలకమని కాంగ్రెస్ లోక్సభపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. సభలో ఎన్నికైన సభ్యులు ప్రశ్నించడం ప్రాథమిక హక్కని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. విపక్షాలు నిరసనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కరోనా నుంచి మన దేశం త్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు. (ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్) చరిత్రలో తొలిసారి ఈ విధంగా సమావేశాలు జరుగుతున్నాయని, అసాధారణ పరిస్థితుల్లో జరిగే సమావేశాలకు సహకరించాలని స్పీకర్ సభ్యులను కోరారు. మధ్యలో పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కల్పించుకుని సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నలు లేవనెత్తేందుకు వివిధ రకాల విధానాలు ఉన్నాయన్నారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్ష సభ్యులతోనూ ముందే చర్చించామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ గుర్తుచేశారు. సభ్యుల ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెబుతామన్నారు. సభ సజావుగా సాగేందుకు అందరి సహకారం అవసరమని రాజ్నాథ్ విజ్ఞప్తి చేశారు. (పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం). -
ప్రశ్నోత్తరాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ప్రయివేటు మెంబర్ బిజినెస్ను రద్దు చేస్తున్నట్టు లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా జారీచేసిన బులెటిన్లలో వెల్లడించాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వారాంతపు సెలవులు కూడా లేకుండా వరుసగా 18 రోజులపాటు జరిగే ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని, అలాగే శుక్రవారం మధ్యాహ్నం జరిగే ప్రయివేటు మెంబర్ బిజినెస్ను కూడా కార్యకలాపాల నుంచి తొలగించారు. లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరితో సహా ప్రతిపక్ష నాయకులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు క్వశ్చన్ అవర్ తొలగించవద్దని లేఖ రాశారు. ఒక సభకు సంబంధించిన ఎంపీల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసేందుకు రెండు సభల్లోని సీట్లను కేటాయించనున్నారు. రెండో సభలో కూర్చునే వారు సభాపతి ఉన్న సభలోకి కనిపించేలా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్సభ మొదటి రోజు మినహా మిగిలిన 17 రోజులు లోక్సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 లగంటల వరకు నడుస్తుంది. అయితే తొలి రోజు మాత్రం ఉదయం 9 నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. రాజ్యసభ మొదటి రోజు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకలాపాలను కలిగి ఉంటుంది. మొదటి రోజు మాత్రం మధ్యాహ్నం 3 నుండి 7 గంటల వరకు కార్యకలాపాలు కలిగి ఉంటుంది. అప్రజాస్వామికం: కాంగ్రెస్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్ను రద్దు చేయడం ఏకపక్షం, అప్రజాస్వామికమని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అ«ధీర్రంజన్ చౌధరి అన్నారు. కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సభ్యుల హక్కు అన్నారు. సమావేశాలకు ప్రాణాధారమైన ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆనంద్ శర్మ అన్నారు. చర్చల నుంచి పారిపోవడం లేదు: జోషి విపక్షాల విమర్శలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. సమావేశాల్లో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీఏసీలో తీసుకునే నిర్ణయం మేరకు ఏ అంశాన్ని చేపట్టడానికైనా తమకు అభ్యంతరం లేదన్నారు. ఎంపీలు ‘అన్స్టార్డ్’ప్రశ్నల అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, వీటికి లిఖితపూర్వక సమాధానాలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. జీరో అవర్ కనీసం అరగంటపాటు ఉంటుందని తెలిపారు. -
రేపు శాసనసభలో నేరుగా తెలంగాణ బిల్లుపై చర్చ
హైదరాబాద్: రేపు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా, మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో మాట్లాడుతూ రేపటి నుంచి రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. బీఏసీలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేసినా అసెంబ్లీలో చర్చ జరగవలసి ఉందని చెప్పారు. చర్చ జరిగితే కచ్చితంగా విభజనను వ్యతిరేకిస్తామని గంటా స్పష్టం చేశారు.