-
ముఖ్యమంత్రా.. చెడ్డీగ్యాంగ్ లీడరా?
పటాన్చెరుటౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటతీరు చూస్తుంటే ముఖ్యమంత్రా..? లేక చడ్డీగ్యాంగ్ లీడరా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో గణేశ్గడ్డ దేవస్థానం వద్ద ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శిస్తే.. సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరితే.. ‘చడ్డీ విప్పుతా.. డ్రాయర్ విప్పుతా’ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఇదేం భాషో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ భాషను ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, కానీ, ఆ ఆటలు సాగవని..మెదక్ గడ్డ బీఆర్ఎస్కు అడ్డా అని చెప్పారు. -
Om Singh Rathore: బుల్లెట్ బాబా టెంపుల్
మన దేశంలో జాతీయ రహదారుల పక్కన ఆలయాలు కనిపిస్తుంటాయి. అయితే జోద్పూర్–అహ్మదాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆలయం మాత్రం ఆసక్తికరం. ఆదిత్య కొంద్వార్ అనే రచయిత ఈ ఆలయానికి సంబంధించి విషయాలను ‘ఎక్స్’లో షేర్ చేశాడు. చాలా సంవత్సరాల క్రితం...‘బుల్లెట్ బాబా’ గా పిలుచుకొనే ఓమ్ సింగ్ రాథోడ్ నడుపుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ను పోలీస్స్టేషన్లో పెట్టారు. అయితే మరుసటి రోజు ఈ బైక్ కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయేలా ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ ‘బుల్లెట్ బైక్’కు పూజలు చేయడం మొదలుపెట్టారు. తరువాత ఒక ఆలయాన్ని కట్టి ఈ బుల్లెట్ బైక్ను విగ్రహంలా ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఇది ‘బుల్లెట్ బాబా టెంపుల్’గా ప్రసిద్ధి పొందింది. రోడ్డుపై ప్రయాణం చేసేవారు ఈ ఆలయం దగ్గర ఆగి ‘ఎలాంటి ప్రమాదం జరగకూడదు’ అని మొక్కుకుంటూ వెళుతుంటారు. -
సీఎం కుర్చీలో రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్రెడ్డి గురువారం సచివాలయంలో లాంఛనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం 4.20 గంటలకు సతీమణితో కలసి సచివాలయానికి చేరుకున్న రేవంత్కు.. ప్రధానద్వారం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పలువురు ఉన్నతాధికారులు పోలీసు అధికార బ్యాండ్ మోగుతుండగా ఘనంగా స్వాగతం పలికారు. రేవంత్ అక్కడి నుంచి నడుచుకుంటూనే సచివాలయం లోపలికి వెళ్లారు. సీఎం చాంబర్ వద్ద ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత సతీమణి గీతతో కలసి రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 4.46 నిమిషాలకు ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో ఆసీనులయ్యారు. సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతిధులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సచివాలయంలోనే రేవంత్ అధ్యక్షతన నూతన మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. తెరుచుకున్న సచివాలయం ద్వారాలు రాష్ట్ర నూతన సచివాలయం ద్వారాలు గురువారం ప్రజలందరి కోసం తెరుచుకున్నాయి. సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక సచివాలయానికి వస్తారని తెలియడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సచివాలయానికి చేరుకున్నారు. అధికారులు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలకు పాస్లు ఇచ్చి లోపలికి అనుమతించారు. దీంతో సచివాలయం లోపల సందడి కనిపించింది. తొలిసారిగా జర్నలిస్టులను పాస్ల అవసరం లేకుండా మీడియా గుర్తింపు కార్డులు చూసి కొత్త సచివాలయంలోకి అనుమతించారు. గతంలో సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయడం, ప్రధాన భవనం లోపలే మీడియా సెంటర్ను ఏర్పాటు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడంపై మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
ఈ కొండ గట్టెక్కిస్తుందని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు. కొండగట్టు అంటే సీఎం కేసీఆర్కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు. ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు. -
ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తిలో ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపీనాథ్ మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్కే గ్రూప్స్ అధినేత పద్మశ్రీ డాక్టర్ రవి పిళ్లై, సుమారు 20 మంది రష్యా దేశస్థులు కూడా ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement