breaking news
public transport bus
-
బస్సులో వస్తావా? ఉద్యోగం లేదు పో..
జాబ్ ఇంటర్వ్యూకు బస్సులో వచ్చిన యువతికి ఉద్యోగం లేదు.. ఏమీ లేదు పో.. అంటూ ఓ కంపెనీ వెనక్కి పంపేసింది. తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవాన్ని ఆ యువతి ప్రొఫెషనల్ సామాజిక వేదిక రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. తన అర్హతలు, నైపుణ్యాలు చూడకుండా కేవలం తాను ప్రజా రవాణాను ఉపయోగించినందుకు ఇంటర్వ్యూ నుంచి పంపించేశారని ఆమె వాపోయారు.యువతి రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. బస్సు దిగి కంపెనీ భవనంలోకి నడిచి వస్తున్న ఆమెను సెక్యూరిటీ కెమెరాల్లో గమనించిన హైరింగ్ మేనేజర్.. ఇంటర్వ్యూ మొదలవ్వగానే ఆమె అర్హతలు లేదా అనుభవం గురించి కాకుండా మొదట ఆమె బస్సులో రావడం గురించే అడిగాడు. ప్రజా రవాణాను ఉపయోగించినందుకు అసహనం వ్యక్తం చేసిన ఆయన అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగానూ కామెంట్ చేశాడు. ఎర్రగా ఉన్న ఆమె జుట్టును "అన్ ప్రొఫెషనల్" అని వ్యాఖ్యానించాడు.అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే.. "ఇప్పుడే ఇంటర్వ్యూకు వెళ్లొచ్చాను. నేను కంపెనీ భవనం వైపు నడిచిరావడం కెమెరాల్లో చూశానని బాస్ చెప్పారు. నీకు మంచి ట్రాన్స్పోర్ట్ లేదా అని అడిగారు. ప్రజా రవాణాను ఉపయోగించకూడదని చెప్పి కొన్ని నిమిషాలు మందలించాడు. నన్ను ఎవరూ నియమించుకోరని, తానైతే ఇలాంటి వారికి అస్సలు జాబివ్వనని చెప్పాడు. ఎందుకంటే వారు సమయానికి రారు. ఇక నా ఎర్రటి జుట్టు గురించి ఫిర్యాదు చేయడం కొనసాగించాడు. అది నన్ను అన్ ప్రొఫెషనల్ గా మార్చింది అన్నాడు. ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగలేదు. తమకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను పంపించేశారు."అయితే ఇంతకీ సదరు కంపెనీ ఏది.. అనుచితంగా ప్రవర్తించిన ఆ హైరింగ్ మేనేజర్ పేరేంటి అన్నది ఆమె వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ పోస్ట్కు చాలా మంది యూజర్లు ప్రతిస్పందించారు. అలా ప్రవర్తించిన ఆ మేనేజర్ తీరును తప్పుబట్టారు. ఆమెకు మద్దుతుగా నిలిచారు. -
ఈజిప్ట్ బస్సు బాంబుదాడిలో ఐదుగురికి గాయాలు
కైరో: ఈజిప్ట్ రాజధాని కైరోలో ఓ ప్రజా రవాణా బస్సుపై బాంబుదాడి జరిగింది. ఈ బాంబుదాడిలో భద్రతా అధికారులతో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఉత్తర కైరీ సమీప నగరమైన నాసర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ బాంబును బస్సులో పెట్టారా ? లేక ఏ దుండగుడు అయినా బస్సుపై బాంబు విసిరిడా ? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇస్లామిస్ట్ అధ్యక్షుడైన మెహ్మద్ మెర్సీ పదవీచ్యుత్తుడైన నాటి నుంచి తీవ్రవాదులు ఈ బాంబు దాడులకు తెగబడుతున్నట్టు సమాచారం. కానీ, తీవ్రవాదులు, జవానులనే తమ ప్రథమ లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడుతున్నట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. కాగా, సరిగ్గా రెండు రోజుల క్రితం జరిగిన కారు ఆత్మహుతి దాడిలో కూడా పోలీసులనే లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు 15మంది ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన నైల్ డెల్టా నగరంలోని ప్రధాన కార్యాలయం వద్ద చోటుచేసుకుంది.