breaking news
professor laxmi
-
ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
-
ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
హైదరాబాద్: గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. సంధ్యారాణి ఆత్మహత్య కేసును శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి పరారీలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది... హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మూడు వారాలు గడువు ఇవ్వాలని కోర్టును ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, తనపై కేసును కొట్టేయాలని ప్రొఫెసర్ లక్ష్మి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రొఫెసర్ లక్ష్మికి ‘ఖాకీ’ కవచం!
అరెస్ట్ కాకుండా పావులు కదుపుతున్న పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సమాచారం ముందుగానే అందుతుండటంతో అప్రమత్తం అవుతున్న ప్రొఫెసర్ ఎప్పటికçప్పుడు మకాం మార్చేస్తున్న వైనం బెయిల్ తీసుకున్న తర్వాతే గుంటూరు రావాలని యోచన సాక్షి, గుంటూరు: డాక్టర్ సంధ్యారాణి మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మికి కొందరు పోలీస్ ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి నుంచి అందుతున్న సమాచారంతోనే ఆమె పోలీసులకు చిక్కకుండా ఎప్పటికçప్పుడు తప్పించుకుంటున్నట్లు సమాచారం. గతంలో గుంటూరులో పనిచేసిన ఓ ఉన్నతాధికారితో పాటు, ప్రొఫెసర్ లక్ష్మి భర్తకు సన్నిహితులుగా ఉన్న మరో ఇద్దరు పోలీస్ అధికారుల సలహా మేరకే ఆమె పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిరోజే ప్రొఫెసర్ లక్ష్మి కోసం ఇంటికి వెళ్లిన పోలీసులతో తన భార్యను అప్పగిస్తానంటూ విజయసారథి నమ్మబలకడంతో ఆయన్ని వదిలేశారు. అయితే విజయసారథి మరుసటి రోజు భార్యతో సహా ఇతర రాష్ట్రాలకు పరారయ్యాడు. అప్పట్నుంచి పోలీసు బృందాలు ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల కోసం గాలిస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రొఫెసర్ లక్ష్మి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. కానీ ఎన్ని రోజులైనా పరారీలో ఉండి.. బెయిల్ తీసుకున్న తర్వాతే గుంటూరు రావాలనే యోచనలో లక్ష్మి దంపతులు ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఇటీవల గుంటూరులోని ఆమె ఇంటితో పాటు ఆసుపత్రిలో పోలీసులు తనిఖీలు చేయగా డైరీలు లభ్యమయ్యాయి. ఇందులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో వారు సెల్ఫోన్, ఏటీఎం కార్డులను కూడా వాడకుండా పక్కన పడేశారు. దీంతో వీరి ఆచూకీ కనుగొనడం పోలీసులకు సమస్యగా మారింది. సొంత వారే సహకరిస్తుండటంతో.. తొలుత ఈ కేసుకు నగరంపాలెం సీఐ మొహమ్మద్ హుస్సేన్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించగా, ఆయన్ని తొలగించి గుంటూరు వెస్ట్ డీఎస్పీ సరితకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. అయినా సొంత డిపార్ట్మెంట్కు చెందిన వారే సహకరిస్తుండటంతో ప్రొఫెసర్ లక్ష్మి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమవుతున్నారు. కాగా, ప్రొఫెసర్ లక్షి్మకి సహకరించిన వారు కూడా శిక్షార్హులవుతారంటూ డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర తేల్చి వారిపై చర్యలు చేపడతారా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల రద్దుతో వెనక్కి వస్తున్న పోలీసు బృందాలు దేశవ్యాప్తంగా రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పాటు, బుధ, గురువారాల్లో ఏటీఎంలు మూసివేయడంతో ప్రొఫెసర్ లక్ష్మి కోసం గాలించేందుకు వెళ్లిన పోలీసు బృందాలు డబ్బుల్లేక వెనక్కి వస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వీరు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు సమాచారం. -
లక్ష్మి అరెస్టుకు ఆదేశించాం: ప్రత్తిపాటి
మెడికల్ స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్, డాక్టర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్యారాణి ఆత్మహత్య కేసులో చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య ఘటనతో సమ్మె కొనసాగిస్తున్న మెడికోలో ఆందోళన విరమించి విధుల్లో చేరాలని మంత్రి సూచించారు. లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజ్ ప్రమాదంపై ప్రత్యేక కమిటితో విచారణ చేపడతామని పుల్లారావు పేర్కొన్నారు. మూడు నెలల్లో బాధిత రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెడికో సంధ్యారాణి తన డైరీలో రాసి సూసైడ్ చేసుకుంది. కాగా, ప్రొఫెసర్ ఏవీవీ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు మరోసారి స్పష్టంచేశారు. నిన్న (శుక్రవారం) కూడా జూడాలు లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి చుట్టూ ర్యాలీ నిర్వహించారు. గతంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. డాక్టర్ లక్ష్మి తన పలుకుబడిని తట్టుకోలేక సదరు ప్రొఫెసర్ బదిలీ చేయించుకొని వెళ్లారని, నేడు లక్ష్మి వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.