breaking news
Premier solar
-
‘సోలార్’ కేరాఫ్ హైదరాబాద్
దక్షిణ భారత దేశంలో సోలార్ పవర్ ఉత్పత్తికి హైదరాబాద్ కీలక కేంద్రం కానుంది. నగరానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ భారీ ఎత్తున సోలార్ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయనుంది. దీనికి సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. 1.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ సెల్, మ్యాడ్యుల్ తయారీ పరిశ్రమని 2021 జులై 19న హైదరాబాద్ నగరంలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ప్రారంభించబోతుంది. రూ. 483 కోట్ల వ్యయంతో ఈ తయారీ యూనిట్ను నెలకొల్పారు. ఇందులో 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల మాడ్యుల్స్ తయారీ సామర్థ్యంతో కంపెనీ పని చేయనుంది. అధునాతన మల్టీక్రిస్టలీన్, మోనో పీఈఆర్సీ టెక్నాలజీని ఈ యూనిట్లో ఉపయోగించనున్నారు. రాబోయే రోజుల్లో మరో రూ. 1200 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సోలార్ మాడ్యుల్ తయారీ యూనిట్ని విస్తరిస్తామని ప్రీమియర్ ఎనర్జీస్ తెలిపింది. విస్తరణ తర్వాత సంస్థ సోలార్ మాడ్యుల్ తయారీ సామర్థ్యం 3 గిగావాట్లకు చేరుకుంటుందని ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ చిరంజీవ్ సలూజా తెలిపారు. ఈ ఆర్థిక సంవ్సతరానికి రూ.1500 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతకు ముందు ఏడాది కంపెనీ రెవెన్యూ రూ. 850 కోట్లగా నమోదు అయ్యిందని ఆయన అన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలు... మేడిన్ తెలంగాణ
ప్లాంటు ఏర్పాటు చేసిన ప్రీమియర్ సోలార్ సోలార్ మాడ్యూల్స్ తయారీ కేంద్రం కూడా; ఎల్లుండి ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ రంగంలో ఉన్న ప్రీమియర్ సోలార్ హైదరాబాద్ సమీపంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటు చేసింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఈ నెల 29న దీన్ని ప్రారంభిస్తారు. సంగారెడ్డి జిల్లా అన్నారంలోని ఈ ప్లాంటులో సోలార్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ రిక్షాలు, సోలార్ ఈ–బైక్స్, సోలార్ సైకిల్ రిక్షాలు, సోలార్ బైసికిల్స్ రూపొందిస్తారు. నెలకు 200 యూనిట్ల సామర్థ్యం దీని సొంతం. హైబ్రిడ్ ఈ–రిక్షా ఒకసారి చార్జ్ చేస్తే 125–130 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ప్రీమియర్ సొలార్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. దేశంలో తొలిసారిగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ధ్రువీకరణ పొందిన ఉత్పాదన ఇదేనన్నారు. సోలార్ సైకిల్ రిక్షా 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందన్నారు. మాడ్యూల్స్ తయారీకి రూ.400 కోట్లు.. ఇదే ఫెసిలిటీలో 200 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక మాడ్యూల్ తయారీ ప్లాంటును సైతం నెలకొల్పారు. దీన్ని నాలుగేళ్లలో 1,000 మెగా వాట్ల స్థాయికి తీసుకెళతామని కంపెనీ ఎండీ చిరంజీవ్ సింగ్ సలూజా తెలిపారు. మొత్తంగా రూ.400 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. కొత్త ప్లాంటుతో కంపెనీ దేశీ టాప్–5 జాబితాలో చేరింది. పవర్ ప్లాంట్లు, రూఫ్ టాప్ విభాగంలో 100 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. భవిష్యత్లో వేఫర్స్ తయారీ.. సోలార్ సెల్ తయారీకి కొత్త యూనిట్ను కూడా నెలకొల్పాలని కంపెనీ నిర్ణయించింది. 2018 సెప్టెంబర్కల్లా 250 మెగావాట్ల సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేస్తామని పేర్కొంది. 1,000 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగేళ్లలో ఈ విభాగంపై రూ.1,200 కోట్లు వెచ్చించనున్నారు. తెలంగాణ లేదా ఒడిశాలో ఈ ప్లాంటు వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలనుబట్టి ప్లాంటు స్థలాన్ని నిర్ణయిస్తామని కంపెనీ ఈడీ కార్తీక్ పొల్సానీ వెల్లడించారు. జపాన్, చైనా కంపెనీల భాగస్వామ్యంతో దీనిని స్థాపిస్తున్నట్టు చెప్పారు. ఇదే భాగస్వామ్యంలో భవిష్యత్తులో వేఫర్స్ తయారీలోకి అడుగుపెడతామని వెల్లడించారు. అన్నారం ప్లాంటులో ఇప్పటికే 50 మెగావాట్ల సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఉంది.