-
ఆర్గానిక్ విధానం లో నాటు కోళ్ల పెంపకం
-
తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే?
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా స్వయం సహాయక సంఘాల్లో ఔత్సాహికుల కోసం పెరటికోళ్ల పెంపకం(లైవ్స్టాక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గొర్రెల పంపిణీ మాదిరగా మేలుజాతి పెరటి కోళ్లను ఈ పథకం ద్వారా రాయితీపై పంపిణీ చేయనుంది. ఇప్పటికే జిల్లాలో వెలుగు కార్యాలయాల వద్ద లైవ్స్టాక్ యూనిట్ల పంపిణీ సైతం ప్రారంభమైంది. పెరట్లోనే ఆదాయం.. పెరటి కోళ్ల పెంపకం అనేది మహిళలకు తక్కువ సమయంలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే వారు నెలకు రూ.10వేలు వరకు సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి వద్ద తినిపడేసే వ్యర్థ పదార్థాలతో పాటు పథకం కింద అందజేసే దాణాను కోళ్లకు ఆహారంగా వేస్తే సరిపోతుంది. బాయిలర్ కోడి గుడ్డు రూ.5 ధర పలుకుతుంటే, ఈ దేశవాళీ పెరటి కోడి గుడ్లు ఒక్కొక్కటి రూ.10 వరకు పలుకుతుంది. సాధారణ కోళ్ల కంటే రెట్టింపు బరువుతో మాంసం అమ్మకానికి ఉపయోగపడతాయి. కుక్కల బెడద నుంచి కాపాడుకుంటే సరిపోతుంది. యూనిట్ల కోసం దరఖాస్తు ఇలా.. పెరటి కోళ్ల పెంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వీటిని సబ్సిడీపై సమకూరుస్తుంటే వాటి రక్షణ, వ్యాక్సినేషన్ ఇతర బాధ్యతలు పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ చూస్తోంది. మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయంలో ఏపీఎంలకు గ్రామాల్లోని సీఎఫ్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లబ్ధిదారులకు వాహనం ద్వారా కోళ్లు సరఫరా చేస్తారు. సంరక్షణ నియమావళి, ఇతర సౌకర్యాలను అధికారులే వివరిస్తారు యూనిట్ ధర రూ.3970. ఇందులో ఎనిమిది కోడిపెట్టలు, మూడు కోడి పుంజులు ఉంటాయి. ఒక్కో కోడి నాలుగు కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఆరోగ్య పరిస్థితి బట్టి 160 నుంచి 180 వరకు గుడ్లు పెడతాయి. వీటితో పాటు 30 కేజీల దాణా అందించనున్నారు. మార్కెట్లో కిలో దాణా రూ.240 వరకు పలుకుతుంది. కోళ్లు ఎటువంటి అనారోగ్యం కాకుండా నలభై రోజులు వరకు పనిచేసే డీ వార్మింగ్– ఎండీ వ్యాక్సినేషన్ చేయించి అందిస్తారు. మెడికల్ కిట్లు సైతం సరఫరా చేస్తారు. ఇందులో లివర్ టానిక్, బి–కాంప్లెక్సు వంటి యాంటి బయాటిక్లు ఉంటాయి. చదవండి: ‘ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’ చురుగ్గా గుర్తింపు ప్రక్రియ జిల్లాలోని 25 మండలాలకు గాను 2500 యూనిట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది. మండలానికి తొలిదశలో భాగంగా 100 యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో 1530 యూనిట్లకు సరఫరా చేసేందుకు లబ్దిదారుల గుర్తింపు జరిగింది. పలాస మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనం వద్ద పథకం తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. ఏపీఎంలను సంప్రదించాలి పెరటికోళ్ల పెంపకం ఇటీవలే ప్రారంభమైంది. మండలాల వారిగా కోళ్ల పంపిణీ జరుగుతోంది. యూనిట్ల కోసం వెలుగు కార్యాలయంలో ఉన్న ఏపీఎంలను సంప్రదించాలి. – డాక్టర్ మోతిక సన్యాసిరావు, డీఆర్డీఏ డీపీఎం, శ్రీకాకుళం -
పెరటి కోళ్లతో జీవనోపాధి.. 10 వేల యూనిట్లు టార్గెట్
ఒకప్పుడు పల్లెల్లోనే నాటు కోళ్లు సందడి చేసేవి. కోడి కూతతోనే గ్రామాల్లో ప్రజలు మేల్కొనేవారు. ప్రతీ ఇంట్లో 10 నుంచి 15 కోళ్లు ఉండేవి. నాటు కోడి గుడ్లు, మాంసంతో వారి జీవనోపాధికి చేదోడుగా నిలిచేవి. ప్రజలకు ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా దన్నుగా నిలిచిన వీటి పెంపకం క్రమంగా తగ్గుతూ వచ్చింది. పల్లెలో పట్టణ వాతావరణం వ్యాపించడంతో వీటి స్థానంలో బ్రాయిలర్ కోళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఒకవైపు నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పెరటి కోళ్ల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా జిల్లాలో పదివేల యూనిట్లు అందజేసే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చీమకుర్తి(ప్రకాశం జిల్లా): డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లో ఆసక్తి చూపే మహిళలకు రూ.4800 విలువ చేసే పెరటి కోళ్ల యూనిట్ను వడ్డీ లేని రుణం కింద అందించనుంది. ఒక్కో యూనిట్ కింద 9 కోడి పెట్టలు, 3 కోడిపుంజులు, వాటి పెంపకానికి అవసరమైన 30 కేజీల దాణాను మొత్తం కలిపి కూడా రూ.4800కే అందిస్తోంది. 9 కోడిపెట్టలు వరుసగా 100 గుడ్లు వరకు పెడుతుంది. రెండేళ్ల తర్వాత ఒక్కో కోడి కనీసం 2 కేజీల మాంసం అందిస్తుంది. ఈ విధంగా 12 కోళ్ల ద్వారా 24 కేజీల మాంసం వస్తుంది. నాటుకోడి కేజీ మాంసం ధర రూ.400 పలుకుతుందని అధికారుల అంచనా. ఇలా 24 కేజీల నుంచి రూ.9,600 ఆదాయం వస్తుంది. అలాగే కోడిగుడ్లు, మాంసంతో కలిపి రెండేళ్లలో కనీసం రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. వచ్చిన ఆదాయంలో వైఎస్సార్ క్రాంతి పథం గ్రూపులకు 24 లేక 36 వాయిదాలలో వడ్డీ లేకుండా రుణం కింద ఇచ్చిన రూ.4800ను నెల నెలా చెల్లించగా, ఇంకా దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు లాభసాటిగా ఉంటుంది. అనంతపురం నుంచి దిగుమతి డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా అందించే నాటుకోళ్లను అనంతపురంలోనున్న ఎస్సెల్ బ్రీడ్ కంపెనీ వారి ద్వారా దిగుమతి చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి కనీసం 10 వేల యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పెరటి కోళ్ల పెంపకంతో పాటు పొట్టేళ్లు, మేకలను కూడా ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్ను అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పీడీ తెలిపారు. జీవనోపాధికి ఇప్పటికే పలు పథకాలు జిల్లాలో డీఆర్డీఏ సంస్థ ద్వారా వైఎస్సార్ క్రాంతి పథకం నుంచి గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళల జీవనోపాధి కోసం ఇప్పటికే పలు పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ వారి జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దానికోసం డీఆర్డీఏలో ఉన్న సుమారు రూ.200 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. దానిలో భాగంగా స్త్రీనిధి, ఉన్నతి (ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్), సీఐఎప్ (కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్), హెచ్డీఐఎఫ్ (హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) పథకాలను అందిస్తోంది. స్త్రీనిధితో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయల వరకు జీవనోపాధి పెంపునకు అందిస్తుంది. వాటి ద్వారా గొర్రెలు, గేదెలను పెంచుకోవచ్చు. ఉన్నతి పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే సబ్ప్లాన్ పథకం నుంచి అందిస్తారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఒక్కో వ్యక్తికి రూ.50 వేల వరకు రుణ సదుపాయం వడ్డీలేకుండానే అందిస్తారు. సీఐఎఫ్ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలను ఇస్తారు. అయితే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేటాయించాల్సి ఉంటుంది. హెచ్డీఐఎఫ్ ద్వారా గరిష్టంగా రూ.50 వేలను హెల్త్ యాక్టివిటీ కింద ముందుగానే ఎంపిక చేసిన 15 మండలాల్లో మాత్రమే అందిస్తున్నారు. వాటితో పాటు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ తోడు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 10 వేల యూనిట్ల వరకు పంపిణీకి సిద్ధం జిల్లాలోని 38 మండలాల్లో రానున్న ఏడాది లోపు 10 వేల యూనిట్లను పంపిణీ చేసేందుకు వైఎస్సార్ క్రాంతిపథం సిద్ధమవుతోంది. మొదటి విడతగా 4 వేల యూనిట్లను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కనిగిరి మండలాల్లో దాదాపు 600 యూనిట్లకు పైగా పంపిణీ చేశారు. 10 వేల యూనిట్ల పెరటి కోళ్లు అందించేందుకు చర్యలు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన 10 వేల యూనిట్లను డ్వాక్రా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో యూనిట్ ద్వారా 9 కోడిపెట్టలు, 3 కోడిపుంజులు, 30 కేజీల దాణాలను అందిస్తున్నాం. ఈ సంవత్సరం 4 వేల యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 6 మండలాల్లో అందించాం. త్వరలో పొట్టేళ్లు, మేకలను కూడా అందించేందుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నాం. – బీ.బాబూరావు, పీడీ, డీఆర్డీఏ, ఒంగోలు మా కుటుంబంలోనే 4 యూనిట్లను తీసుకున్నాం జగనన్న పేద మహిళల ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకొచ్చిన పెరటి కోళ్ల పెంపకం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. మా కుటుంబంలోనే నాతో పాటు నా కుమార్తె, కోడలు వేరువేరుగా 4 యూనిట్లను తీసుకున్నాం. మా ఎస్సీ కాలనీలో మొత్తం 30 యూనిట్లను ఇచ్చారు. పెరటి కోళ్ల వలన గుడ్లు, మాంసం ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో జీవనోపాధి పెరగటమే కాకుండా ఖర్చులకు ఉపయోగపడుతుంది. – జంగాల లలిత కుమారి, ఆశాజ్యోతి గ్రూపు, మద్దులూరు, సంతనూతలపాడు -
కోళ్లయందు ‘కడక్నాథ్’ వేరయా..!
రాజాం సిటీ: చర్మం నలుపు, మాంసం నలుపు, ముక్కు, గోళ్లు, ఎముకలు.. ఆఖరకు నాలుక కూడా నలుపే. ఈ నలుపే ఇప్పుడు జిల్లా వాసుల మనసు గెలుచుకుంటోంది. కొత్త రుచుల అన్వేషణలో మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్నాథ్ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి రాజాం తదితర ప్రాంతాల్లో కొక్కొరొక్కో అంటోంది. మటన్తో సమానంగా దీని మాంసం ధర పలుకుతున్నా.. ఫర్లేదండి అంటూ జిల్లావాసులు ఇష్టంగా లాగించేస్తున్నారు. కోళ్లయందు కడక్నాథ్లు వేరయా అనిపించుకుంటున్న ఈ బ్రీడ్ గురించి తెలుసుకుంటే.. మొత్తం నలుపే.. కడక్నాథ్ కోళ్లు కొత్తవేం కావు. పేపర్లు, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఇవి బాగా తెలుసు. అయితే సిక్కోలులో లభ్యం కావడం మాత్రం కొత్తే. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో చాలా కాలంగా ఈ కోడి రుచులు పంచుతోంది. ఆయా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. సాధారణంగా కోళ్లులో బొచ్చు రంగు రంగులుగా ఉన్నప్పటికీ మాంసం మాత్రం ఎరుపుగానే ఉంటుంది. ఈ కడక్నాథ్ కోళ్లు మాత్రం బొచ్చుతోపాటు చర్మం, ముక్కు, గోళ్లు, ఎముక లు, చివరికి నాలుక కూడా నలుపుగానే ఉంటుంది. ఈ కోళ్లను మాంసం కోసం పెంపకం చేపడుతుంటారు. వీటి గుడ్లు కాఫీకలర్తోపాటు కొంత పింక్ కలర్లో ఉంటాయని కోళ్ల ఫారం యజమానులు చెబుతున్నారు. పోషక విలువలు భేష్ కడక్నాథ్ కోళ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొవ్వు, కొలె్రస్టాల్ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను కూడా నియంత్రిస్తుంది. పురిటి నొప్పులు తగ్గించడంలోనూ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రయోజనాలతోపాటు మంచి రుచిగా ఉండడంతోపాటు కడక్నాథ్ చికెన్ ధర రూ. 800లు వరకు పలుకుతోంది. తేడా ఇదే.. కడక్నాథ్ కోళ్లు మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్లో లభించే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు పెరుగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్నాథ్ కోడికి తేడా ఉంది. కడక్నాథ్ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంటుందని పెంపకందారులు చెబుతున్నారు. రుచి బాగుంది... ఈ ప్రాంతంలో కడక్నాథ్ కోళ్లు విక్రయిస్తున్నారని తెలుసుకుని వచ్చాం. నాటు కోడి మాంసం కంటే చాలా బాగుంది. ఈ మాంసం తిన్న తర్వాత బ్రాయిలర్ కోడి మాంసం తినాలనిపించడంలేదు. కోడితోపాటు మాంసం కూడా నలుపురంగులో ఉండడంతో ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ వంటకం తర్వాత దాని రుచి చాలా బాగుంది. ఇప్పుడు వారంలో ఓ సారి ఈ మాంసం మాత్రమే తింటున్నాం. – ఆర్.తిరుపతిరావు, జి.నారాయణరావు, మాంసం ప్రియులు డిమాండ్ ఉంది రాజాం ప్రాంతంలో ఎక్కువగా బ్రాయిలర్ ఫారాలు మాత్రమే ఉన్నాయి. వీటికి భిన్నంగా ఏదైనా వ్యాపారం చేయాలని నాటుకోళ్లఫారం పెట్టాను. మొదటిసారిగా నా స్నేహితుల ద్వారా కడక్నాథ్ కోళ్లు గురించి విన్నాను చిన్న పిల్లలను కొనుగోలు చేసి పెంపకం చేపట్టాను. మా ఫారంలో ఉన్నాయని తెలుసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫారంలో నాటుకోళ్లుతోపాటు వీటిని పెంచు తున్నా. నాటుకోళ్ల కంటే కడక్నాథ్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. – ఎస్.చిన్నబాబు, ఎస్ఆర్ఎన్ కోళ్లఫారం యజమాని, పొనుగుటివలస, రాజాం బలవర్ధకమైన ఆహారం ప్రస్తుతం మార్కెట్లో లభించే బ్రాయిలర్, నాటు కోళ్ల కంటే కడక్నాథ్ కోడి మాంసం బలవర్ధకమైన ఆహారం. మిగతా వాటి కంటే కొవ్వు శాతం తక్కువగా ఉండడంతోపాటు ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మాంసకృత్తులు లభిస్తాయి. ఈ మాంసం తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. – డాక్టర్ శివ్వాల మన్మథరావు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, రాజాం చదవండి: ‘నాన్నా.. నా మనసేమీ బాలేదు’ హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం -
ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..
విజయనగరం ఫోర్ట్: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతకు ఓ చక్కని ఉపాధి మార్గం పెరటికోళ్ల పెంపకం. గ్రామీణ ప్రాంత రైతులే కాదు... పట్టణాల్లోని యువతకు కూడా ఇదో ఆదాయ వనరుగా మలచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయం పొందడానికి ఆస్కారం ఉండే ఈ తరహా వ్యాపకం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి పెంపకంపై పశుసంవర్థకశాఖ జేడీ ఎం.వి.ఎ.నరసింహం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. (చదవండి: ప్రాధేయపడినా కనికరించలేదు..) ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లు పెంచుకుంటే అధిక ఆదాయం వస్తోంది. ఈ కోళ్లు అధిక ఉత్పాదక శక్తి కల్గి ఉండి ఏడాదికి 160 నుంచి 180 గుడ్లు పెడతాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుంటాయి. ♦వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పోషణ ఖర్చు తక్కువ. సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే ఉంటాయి. ♦వీటి గుడ్లు నాటు కోడి గుడ్లు కన్నా పెద్దవిగా ఉంటాయి. పుంజుల్లో ఎదుగుదల నాటుకోళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండి, అధిక బరువు కల్గి ఉంటాయి. ఇవి నాటు కోళ్లమాదిరి త్వరగా మనిషికి మచ్చిక అవుతాయి. ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లకు పొదుగు లక్షణాలు లేకపోవడం వల్ల ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లు నాటు కోడి కిందగానీ, ఇంక్యూబేటర్ ద్వారా గాని పొదిగించి పిల్లలు పొందవచ్చు. కోడి పిల్లల సంరక్షణ: ♦నేలపై రెండు అంగుళాల మందంలో గుండ్రంగా వరి ఊకను గానీ వేరుశనగ తొక్కును గానీ పరిచి దానిపై ఒక పొర మందంగా పేపర్లు పరచాలి. ♦దానిపై ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే అట్ట ముక్క లు గానీ జీఐ షీట్లు గానీ అమర్చాలి. దీనిని చిక్ గార్డ్ అంటారు. ♦7 నుంచి 8 అంగుళాల వైశాల్యం ఉండే ప్రదేశం 250 కోడి పిల్లలు ఉండేందుకు సరిపోతుంది. ♦కోడి పిల్లలకు ఉష్ణోగ్రతను అందించేందుకు ఒక గొడు గు వంటి దానిని నేలపై ఉంచి అడుగు ఎత్తులో వేలాడ దీసి దానికి ఒక కోడి పిల్లకు ఒక వాట్ చొప్పున లెక్కవేసి విద్యుత్ బల్బులు అమర్చాలి. ♦100 కోడి పిల్లలకు 100 వాట్ బల్బులు సరిపోతాయి. ♦మొదటగా పిల్లలను తెచ్చిన వెంటనే బీకాంప్లెక్స్ను కలిపిన నీటిని వేరుగా ఉంచి కోడి పిల్ల ముక్కులు దానిలో ముంచి తరువాత చిక్ గార్డ్లోకి వదలాలి. ♦పేపర్పైన నూకలాగా మరపట్టిన మొక్క జొన్నను పలుచగా చల్లాలి. మొదటి వారం అంతా 24 గంటలు బల్బు వెలుగుతూ ఉండేలా చూడాలి. రెండో వారం నుంచి ఉష్ణోగ్రత తగ్గించాలి. ♦దీనికోసం గొడుగును కొంచెం ఎత్తు పెంచడం గానీ బల్బు సామర్ధ్యం తగ్గించడం గానీ చేయాలి. ♦10వ రోజున పేపర్ తీసివేసి చిక్గార్డు సైజ్ పెంచాలి. క్రమేపీ వయస్సు పెరిగిన కొద్దీ చిక్ గార్డు వెడల్పు చేస్తూ రెండో వారం చివరిలోగాని మూడవ వారంలో పూర్తిగా తీసి వేయవచ్చు. అనంతరం చిక్ గార్డు నుంచి బయటకు తీసి స్వేచ్ఛగా మెల్లగా పెరటిలోకి అలవాటు చేయాలి. ♦పెరటి కోళ్లకు దాణా కోనాల్సిన అవసరం ఉండదు. ఇవి కీటకాలు, గింజలు లేత గడ్డి ఇంట్లో ఉండే వ్యర్ధ పదార్థాలను తిని బతుకుతాయి. ♦పెరట్లో దొరికే ఆహారాన్ని బట్టి నూకలు మొక్కజొన్న తవుడుతో తయారు చేసిన సమీకృత దాణాను కూడా కొద్దిగా అందించాలి. ♦ఈ రకానికి చెందిన కోళ్లు 6 నెలల వయస్సు వచ్చేసరికి గుడ్డు పెట్టడం మొదలు పెడుతుంది. ఈ దశలో కాంతిని అందించడం అనేది ముఖ్యమైన చర్య. దీని కోసం గృహ వసతి అవసరం. ♦ఎంత కాంతి అందించాలి అనేది కాలాలను, వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. శీతా కాలం అయితే రాత్రి సమయాల్లో కాంతిని నాలుగు, ఐదు గంటలు పాటు, వేసవి కాలంలో రెండునుంచి 3 గంటలపాటు సూర్యాస్తమయం తరువాత అందించాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రమాదంలో రాజ్యాంగం
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement