parlimament
-
ఈ బిల్లు అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటాం: రాహుల్
ఢిల్లీ: నారిశక్తి వందన్ అధినియం పేరుతో కేంద్రం తీసుకవచ్చిన బిల్లు వాస్తవానికి మహిళల రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు కానేకాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు చర్చపై ఆయన ఈ రోజు( శుక్రవారం) పార్లమెంటులో మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు.మా నానమ్మ ఇందిర వల్లే నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందని నిన్న సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అన్నారు. ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇదన్నారు. బీజేపీ సభ్యులు రాజ్యాంగం కంటే మనువాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరని, ప్రేవేటు రంగంలో కూడా రంగంలో కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు చేసిందేమీ లేదన్నారు.కులగణనను బైపాస్ చేసేందుకే కేంద్ర యత్నిస్తోందని అస్సోం, జమ్మూలో చేసినట్లు డీలిమిటేషన్ చేయాలనుకంటున్నారని ఆరోపించారు. ఈ బిల్లు దేశవ్యతిరేఖ బిల్లని ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చేయడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ ఆత్మని చంపే బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరాతమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
రాహుల్ గాంధీపై కేంద్రం సీరియస్
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది. దీనిపై రాహుల్ సాయంత్రం 5గం లోపు స్పీకర్ కార్యాలయంలోకి హజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.దీనిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. ఆయన చేసినవన్ని నిరాధార ఆరోపణలని తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసలు వాస్తవం లేదని దానికి సంబంధించిన చాలా నిజాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓటుచోరి అంటూ అంటూ రాహుల్ ఎలక్షన్ కమిషన్పై ఆయన చేసిన డ్రామా విఫలమయ్యిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.కాగా అంతకు ముందు రాహుల్ గాందీ పార్లమెంటులో మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని దానికి ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ అన్నారు.అయితే రాహుల్ ఎప్స్టీన్ ఫైల్స్ అంశం ప్రస్థావించాలని ప్రయత్నించగా స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ అదానీ, అంబానీ, హర్ధీప్ సింగ్ పేర్లను ప్రస్థావించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. -
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాను. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని ఆయన అన్నారు.పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని విజ్ఞప్తి చేశాను’అని స్పీకర్ తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు.బుధవారం ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు సభలో జరిగిన గందరగోళం, వాయిదాపై ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ..‘ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. లోక్సభలో కొంతమంది సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో గందరగోళం సృష్టించవచ్చని నాకు ముందస్తు సమాచారం వచ్చింది’ అని ఆయన వెల్లడించారు. -
పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం.. రాజ్నాథ్తో రాహుల్ గాంధీ
ఢిల్లీ: పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ వెలుపల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గులాబీ పూలు, జాతీయ పతకాన్ని అందించారు. ఆ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదానీ అంశం ఉభయ సభల్ని కుదిపేస్తుంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్కు వస్తున్న రాజ్నాథ్ సింగ్కు కూటమి నేతలు గులాబీ పూలు, జాతీయ జెండాలు చేతికి ఇచ్చి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్నాథ్ స్వీకరించారు.#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz— ANI (@ANI) December 11, 2024 నవంబర్ 20న నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యపై నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. అదానీ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి,. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టింది. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. -
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. - ఇక, ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2. - జూలై 18న పోలింగ్, - జూలై 21వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఈసారి బ్రాహ్మణులకు రాష్ట్రపతి, ముస్లింలకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అగ్రవర్ణాల నుంచి రేసులో సుమిత్రా మహాజన్, రాజ్నాథ్ సింగ్ ఉన్నట్టు సమాచారం. మైనార్టీ కోటాలో గులామ్ నబీ ఆజాద్, నఖ్వీ, అరిఫ్ మహ్మద్ ఖాన్ ఉన్నారు. ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి. -
బీజేపీ ఎంపీకి జయాబచ్చన్ కౌంటర్
న్యూఢిల్లీ: మాజీ సమాజ్వాదీ పార్టీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ నరేష్ అగర్వాల్ తన మీద చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జయాబచ్చన్ స్సందించారు. సినీ నటిగా తాను ఎంతో గర్వపడుతున్నానని, చిత్ర పరిశ్రమలో సభ్యురాలు అయినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇతరులు తనపై చేసిన కామెంట్స్ పట్టించుకోనని జయాబచ్చన్ తెలిపారు. తనకు రాజ్యసభలో మరోసారి అవకాశం కల్పించిన సమాజ్వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్వాదీ పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని దానిలో భాగంగానే తనకు మరోసారి అవకాశం కల్పించారన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్త పరుచుకునే హక్కు ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికి లేదన్నారు. కాగా సమాజ్వాదీ పార్టీ తనకు కాకుండా ఒక ఫిల్మ్ డ్యాన్సర్కు రాజ్యసభ సీటు ఇచ్చిందంటూ జయాపై నరేష్ అగర్వాల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నరేష్ అగర్వాల్ జయాపై వ్యాఖ్యలు చేయడం ఇది ఐదోసారి. గతంలో కూడా తనపై నరేష్ అనేక వ్యాఖ్యలు చేశారని నేనేప్పుడు వాటిని సీనియస్గా తీసుకోలేదని తెలిపారు. మరోవైపు జయాపై చేసిన కామెంట్స్ను రాజ్యసభలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నరేష్ అగర్వాల్...తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ అన్నారు. -
వీహెచ్పీ యాత్రపై రాజ్యసభలో రగడ
న్యూఢిల్లీ : వీహెచ్పీ యాత్రపై రాజ్యసభ సోమవారం దద్దరిల్లింది. ఎస్పీ, బీజేపీ సభ్యుల నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే వీహెచ్పీ యాత్రపై బీజేపీ, ఎస్పీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో ప్రారంభం అయిన కొద్ది సేపటికే రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సభ మరోసారి మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది. కాగా లోక్సభలోనూ ఇదే అంశంపై వాడీ వేడిగా చర్చ జరిగింది.


