-
రెండ్రోజుల క్రితం విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
-
అధిక వేగంతో టిప్పర్ బీభత్సం
-
మల్లేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
గోకవరం/గండేపల్లి: అతివేగం, నిర్లక్ష్యం నాలుగు నిండుప్రాణాలను బలితీసుకున్నది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారు జీడి పిక్కల ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా ఉంగుటూరు తదితర గ్రామాల నుంచి సుమారు 13 మంది అనకాపల్లి జిల్లా కశింకోటలో పరమటమ్మతల్లి జాతరలో ప్రదర్శన ఇచ్చేందుకు టాటా మేజిక్ వాహనంలో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు గండేపల్లి మండలం మల్లేపల్లి వచ్చే సరికి హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ ట్రాలీని అతి వేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన దుబ్బాకుల ప్రసాద్ (47) అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లజర్లకు చెందిన డ్రైవర్ నల్లకాసుల వెంకట్రావు (కొండ) (28), నల్లజర్ల మండలం నబీపట గ్రామానికి చెందిన పెనుపాక గుబ్బల మంగమ్మ (30) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, ఉండ్రాజవరం మండలం చివటంకు చెందిన గారపాటి మహేష్ (20), రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని బుధవారం పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనం డ్రైవర్ అతివేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందన్నారు. కాగా, టాటా మేజిక్ వాహనం ట్రాలీని ఢీకొట్టి డ్రైవర్తో సహా ఇరుక్కుపోగా.. సుమారు అరగంట పాటు శ్రమించి బయటకు తీశారు. టాటా మేజిక్ డ్రైవర్ కుడికాలు దాదాపు తెగిపోయింది. క్షతగాత్రులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ప్రాణాలు తీస్తున్న అతివేగం
సాక్షి, అమరావతి: దేశంలో జాతీయ రహదారులపై అతివేగమే (ఓవర్ స్పీడ్) అత్యధిక రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు కారణమని తేలింది. ఆ తరువాత తప్పుడు మార్గంలో డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. 2019, 2020 సంవత్సరాల్లో ఈ రెండు కారణాల వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం 2020లో రోడ్డు ప్రమాదాలపై విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అతివేగం కారణంగా దేశంలో జాతీయ రహదారులపై 74 శాతం ప్రమాదాలు జరుగుతుండగా.. 69 శాతానికిపైగా మరణాలు నమోదవుతున్నట్లు తెలిపింది. డ్రగ్స్, మద్యం తీసుకుని డ్రైవింగ్ చేయడం కారణంగా 33.3 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల 26.3 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వివరించింది. రెడ్లైట్ సిగ్నల్స్ జంపింగ్ చేయడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాల్లో కొందరు మరణిస్తున్నట్లు తెలిపింది. 2019తో పోలిస్తే 2020లో ఈ ప్రమాదాలు, మరణాలు కూడా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. -
మొన్ననే ప్రారంభం.. అంతలోనే ప్రమాదాలు
సిమ్లా: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రపంచంలోనే పొడవైన అటల్ రోహ్తంగ్ టన్నెల్ ప్రమాదాలకు నెలవుగా మారింది. సేవలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే ఆ రహదారిపై మూడు వాహన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పర్యాటకులు వేగంగా వాహనాలు తోలడం, కొందరు యువకులు బైకులపై రేసింగులు చేయడంతో ఈ ప్రమాదాలు జరిగినట్టు బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) తెలిపింది. ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ రన్నింగ్లోనే కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ బ్రిగేడియర్ కేపీ.పురుషోత్తం ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: డాక్టర్ అందమైన జ్ఞాపకం.. రాక్చమ్ కుగ్రామం) అంతేకాకాండా టన్నెల్ మధ్యలో ఎవరూ వాహనాలు నిలుపొద్దని సూచించారు. టన్నెల్ లోపల సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన ట్రాఫిక్ అధికారులను కోరారు. ఈ విషయంపై కులు ఎస్పీ గౌరవ్ సింగ్ మాట్లాడుతూ.. టన్నెల్ లోపల రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే టన్నెల్ లోపల సీడ్ గన్స్ ఆధారంగా అతివేగంగా వెళ్లిన వారికి నోటీసులు జారీ చేస్తామని అన్నారు. టన్నెల్ లోపల గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టన్నెల్ లోపల రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్లాల్ మర్కంద స్థానిక అధికారులను ఆదేశించారు. ఇదిలాఉండగా.. అటల్ రోహ్తంగ్ టన్నెల్ ద్వారా పేలుడు పదార్థాల రవాణాను బీఆర్ఓ నిషేధించింది. వచ్చే రెండు నెలలపాటు డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్పై తాత్కాలిక నిషేధం విధించినట్టు వెల్లడించింది. దాంతోపాటు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 5 వరకు.. మొత్తం రెండు గంటలపాటు మెయింటెన్స్ నిమిత్తం టన్నెల్ మూసి ఉంటుందని తెలిపింది. కాగా, హరియాణాలోని 9.02 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ను ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించారు. (చదవండి: బాధ్యతగా కృత్రిమ మేధ వినియోగం: మోదీ)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
గంటల్లోనే పరిహారం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement