breaking news
Operation Bluestar
-
ఆపరేషన్ బ్లూస్టార్ తప్పుడు నిర్ణయం
సిమ్లా: సిక్కులకు పరమ పవిత్రమైన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో తిష్ట వేసిన సిక్కు వేర్పాటువాదులను ఏరివేసేందుకు 1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమలుచేసిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. వేరే విధంగా ఉగ్రవాదులను లొంగదీసుకునే మార్గం ఉన్నా, బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. ఆ తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తంచేయగా, కాంగ్రెస్పై బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.ఇందిర ఒక్కరి నిర్ణయం కాదుఆపరేషన్ బ్లూస్టార్ ఇందిరాగాంధీ ఒక్కరి నిర్ణయం కాదని పీ చిదంబరం తెలిపారు. హిమాచల్ప్రదేశ్లోని కసౌలీలో నిర్వహించిన కుశ్వంత్సింగ్ లిటరరీ ఫెస్టివల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత హరిందర్సింగ్ భవేజా రాసిన తన అనుభవాలు, జ్ఞాపకాల సంకలనం ‘దె విల్ షూట్ యూ మేడం: మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్’ ఆవిష్కరణ సందర్భంగా భవేజాతో చర్చలో చిదంబరం పాల్గొన్నారు. ‘మిలిటెంట్లను తరిమివేసేందుకు (గోల్డెన్టెంపుల్ నుంచి) వాళ్లందరీ నిర్బంధించేందుకు వేరే మార్గాలు ఉన్నాయి. కానీ, ఆపరేషన్ బ్లూస్టార్ తప్పుడు మార్గం. ఆ పొరపాటుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించారని నేను అంగీకరిస్తాను. అయితే, ఆ నిర్ణయం ఇందిరాగాంధీ ఒక్కరిదే కాదు. సైన్యం, నిఘా వర్గాలు, పోలీసులు, సివిల్ డిఫెన్స్ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం. అందువల్ల ఇందిరాగాంధీని ఒక్కరినే పూర్తిగా నిందించటం సరికాదు. ఇక్కడ ఏ సైన్యాధికారినీ తప్పుబట్టం లేదు. కానీ, ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన కొన్నాళ్ల తర్వాత మిలిటరీ ప్రమేయం లేకుండా ఉగ్రవాదులను ఎలా లొంగదీసుకోవచ్చో మేం చూపించాం’ అని చిదంబరం అన్నారు. ఏమిటీ ఆపరేషన్ బ్లూస్టార్పంజాబ్ను స్వంతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సిక్కు వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రన్వాలే నాయకత్వంలో వందలమంది సాయు«ధులు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో తిష్టవేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వారిని అంతమొందించేందుకు 1984 జూన్ 1 నుంచి 10 వరకు ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. సైనికులు బూట్లు, ఆయుధాలతో గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించటంతో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చి చంపారు. అయితే, 1986, 88లో కూడా స్వర్ణ దేవాలయంలో సిక్కు వేర్పాటువాదులు స్వర్ణ దేవాలయంలో తిష్టవేశారు. అప్పుడు సైనిక చర్య లేకుండానే వారిని ప్రభుత్వం లొంగదీసుకుంది. కాంగ్రెస్ అసహనం.. బీజేపీకి అవకాశంచిదంబరం వ్యాఖ్యలపై సొంతపార్టీ కాంగ్రెస్ నేరుగా స్పందించకపోయినా.. తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం తీవ్ర మనస్తాపం చెందిందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ‘పార్టీ నుంచి పదవులు, అవకాశాలు అన్నీ పొందిన సీనియర్ నాయకులు ఏవైనా ప్రకటనలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పార్టీకి ఇబ్బందులు కలిగించేలా మాట్లాడవద్దు. అలా మాట్లాడటం అలవాటుగా అస్సలు మారకూడదు. పార్టీ అగ్ర నాయకత్వంతోపాటు పార్టీ మొత్తం తీవ్రంగా కలత చెందింది (చిదంబరం వ్యాఖ్యలతో). పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై ఆగ్రహంగా ఉంది’ అని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ముంబైపై 2008లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంతో యుద్ధం చేయాలని భావించినా, అమెరికా అడ్డుకోవటం వల్లే ఆగిపోయామని చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ను ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించేందుకు బీజేపీకి చిదంబరం వ్యాఖ్యలు మంచి అవకాశంగా మారాయి. కాంగ్రెస్ తప్పిదాలను చిదంబరం చాలా ఆలస్యంగా అంగీకరిస్తున్నారు. ముంబై దాడుల తర్వాత అమెరికా, అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లనే పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా వెనక్కు తగ్గామని మొన్ననే తెలిపారు. ఇప్పుడు ఆపరేషన్ బ్లూస్టార్ కూడా తప్పిదమని ఒప్పుకున్నారు’ అని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. నిజాన్ని చరిత్ర కచ్చితంగా రిక్డారు చేయాలి. ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టడం నాడు జాతీయ అత్యవసరం కాదు. అది రాజకీయ దుస్సాహసం. ఒక జాతీయవాదిగా ఆపరేషన్ బ్లూస్టార్ పూర్తిగా అవసరం లేని చర్య అని నేను భావిస్తున్నా. చిదంబరం నిజమే చెప్పారు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ పేర్కొన్నారు. -
‘మరి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పదా’
చంఢీగడ్ : జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటికి సరిగ్గా వందేళ్లు. బ్రిటీష్ - ఇండియా చరిత్రలో ఈ మారణహోమం ఓ మచ్చగా మిగిలిపోతుందని రెండు రోజుల క్రితం బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థెరిసా వ్యాఖ్యలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి పాల్పడినందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంబాజ్ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ‘అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి గాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కోరడం బాగానే ఉంది. మరి మీ పార్టీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ సంగతేంటి. దానికి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పాల్సిన పని లేదా’ అని ప్రశ్నించారు. అంతేకాక మీరు స్వయంగా దగ్గరుండి రాహుల్ గాంధీని సిక్కుల పవిత్రంగా భావించే శ్రీ అకాళి తక్త్ సాహిబ్లోకి తీసుకెళ్లారు.. మరి దీనికేం సమధానం చెప్తారంటూ హర్సిమ్రత్ కౌర్ వరుస ట్వీట్లు చేశారు. 1984లోఅమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. హర్సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. అంతేకాక స్వర్ణ దేవాలయంలోకి ఆయుధాలను, ట్యాంక్లను తీసుకువచ్చిన గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించే ధైర్యం అమరీందర్కు లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన అమరేందర్.. ‘మీరు, మీ భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మీ ముత్తాత సర్దార్ సుందర్ సింగ్ మజిథియి జలియాన్ వాలాబాగ్ మారణకాండ అనంతరం జనరల్ డయ్యర్కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. దాంతో ఆయన ప్రభు భక్తికి మెచ్చి బ్రిటన్ ప్రభుత్వం అతన్ని నైట్హుడ్ బిరుదతో సత్కరించడం గుర్తులేదా’ అని రీట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్వీట్ల యుద్ధం ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. -
'ఆపరేషన్ బ్లూ స్టార్'కు 32 ఏళ్లు
అమృత్ సర్: సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ దేవాలయంపై 'ఆపరేషన్ బ్లూ స్టార్' పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 32 ఏళ్లు. ఈ సందర్భంగా సోమవారం గోల్డెన్ టెంపుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కొన్ని సిక్కు రాడికల్ గ్రూపులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్ సింగ్ మక్కార్ లు ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం,ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో స్వర్ణ మందిరం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ ఏఎస్ చహల్ తెలిపారు. సిక్కు ఆలయంలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1984 సైనిక చర్యకు ఆదేశించారు. భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది (అనధికార అంచనా ప్రకారం వేలాది మంది) చనిపోగా, అనంతరం జరిగిన ప్రతీకార హత్య, మూకుమ్మడి హత్యాకాండలలో మరిన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కుల ఊచకోత గురించిన కేసు ఇప్పటికీ కాంగ్రెస్ నేతలను వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. కాగా సిక్కు అంగరక్షకుల చేతిలో ఇందిరాగాంధీ మరణించారు.


