breaking news
older man
-
మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య
రాచెర్ల (ప్రకాశం జిల్లా) : కన్నకొడుకులే తనను సాకడానికి వంతులు వేసుకొని పోట్లాడుకోవడంతో మనస్తాపం చెంది ఓ తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మదిరె పెద్దిరెడ్డి(79)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో ఒకరు ఆర్మీలో పనిచేస్తుండగా.. మరో కొడుకు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ఎవరు సాకాలనే విషయంపై ఇద్దరు కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి తోడు ఎవరు తండ్రిని సాకితే తండ్రి దగ్గర ఉన్న రూ. లక్ష వారికే చెందాలి అంటూ మాట్లాడుకోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దిరెడ్డి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు
కంకిపాడు (విజయవాడ) : దుకాణానికి వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బామర్ల శివరామకృష్ణ ప్రాసద్(64) అనే వృద్ధుడు తన ఇంటి సమీపంలోని దుకాణంలో సరుకులు కొనడానికి వచ్చిన తొమ్మిదేళ్ల బాలికతో సోమవారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.