breaking news
nuclear program
-
ఇరాన్పై ఐరాస మళ్లీ ఆంక్షలు
దుబాయ్: ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆ దేశంపై పూర్తి స్థాయి ఆంక్షలను విధించింది. ఇప్పటికే ఆ దేశ ప్రజలు సంపాదించిందంతా ఆహారం కోసమే ఖర్చు పెడుతూ, భవిష్యత్తుపై ఆందోళన చెందుతుండగా వారిపై ఆంక్షల వల మళ్లీ పడింది. అణు కార్యక్రమాన్ని వదిలేయాలంటూ చిట్టచివరి నిమిషంలో ఐరాసలో జరిగిన దౌత్య చర్చలు విఫలం కావడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీనిఫలితంగా, విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అవుతాయి. ఇరాన్ కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాలూ ఆగిపోతాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాలని చూస్తే మరిన్ని ఆంక్షలు మోపే ప్రమాదముంది. ఈ ఆంక్షలు ‘స్నాప్బ్యాక్’గా (స్వయంచాలికంగా–ఆటోమేటిక్)గా అమల్లోకి వస్తాయి. దీనివల్ల, ఇరాన్పై విధించిన ఇతర ఆంక్షల మాదిరిగా చైనా, రష్యాలు భద్రతామండలిలో వీటిని వీటో చేయడం కుదరదు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకేలతో ఇరాన్ 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో ఈ షర తులన్నీ ఉన్నాయి. జూన్లో ఇజ్రాయెల్తోపాటు అమెరికా తమ అణు కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ ఆ దేశం వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయి. 90% శుద్ధి చేసిన యురేనియంతో బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇరాన్ సొంతమవుతుంది. తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాలకేనంటూ ఇరాన్ చెబుతున్నా అమెరికా, పశి్చమదేశాలు అనుమానిస్తున్నాయి. నెల రోజుల క్రితమే స్నాప్బ్యాక్ను ప్రయోగిస్తామంటూ ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు హెచ్చరించాయి. అయినప్పటి కీ ఇరాన్ ఐఏఈఏ పరిశీలకులను అణు కేంద్రాల్లో తనిఖీలకు అనుమతించేందుకు అంగీకరించలేదు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించిన సవివర నివేదికను ఐఏఈఏకు పంపలేదు. దీంతో ఆంక్షలు అనివార్యమయ్యాయని పశ్చిమ దేశాలంటున్నాయి. శాంతియుత ప్రయోజనాల కోసమైతే యురే నియంను 60 శాతం వరకు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు కదా అని ప్రశి్నస్తున్నాయి.ఎన్పీటీ నుంచి వైదొలిగే యోచన ఐరాస ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇరాన్ ప్రతీకార చర్యలపై తీవ్ర సమాలోచనలు చేస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) నుంచి వైదొలిగే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ పరిశీలించే అవకాశాలున్నాయని ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ మహ్మద్ బఘెర్ కలిబాఫ్ తెలిపారు. ఆంక్షలను ఆయన అన్యాయమన్నారు. ఎన్పీటీ నుంచి వైదొలగడం ద్వారా అణు బాంబును తయారు చేసే అవకాశాలున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా ట్రంప్ హయాంలో 2018లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగినందున యూరప్ దేశాలైన యూకే, జర్మనీ, ఫ్రాన్స్లకు స్నాప్బ్యాక్ అమలు చేసే అర్హత లేదని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్కు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందుకోసం ముందుగా ఇరాన్ తమతో నేరుగా చర్చలకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఐఏఈఏ నుంచి వైదొలగడం ఇరాన్ తీవ్రమైన తప్పిదమని, ఇదే సాకుతో అమెరికా, ఇజ్రాయెల్లు ఆ దేశంపై మళ్లీ దాడులకు దిగే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు. -
వచ్చేవారం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
బ్రసెల్స్: ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా దేశాల మధ్య వచ్చేవారం పరోక్ష చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలతో ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితి విధించే దిశగా ఒప్పందం కుదిరే అవకాశముంది. మధ్యవర్తుల ద్వారా ఈ చర్చలు జరుగుతాయని శుక్రవారం ఇరాన్, అమెరికా ప్రకటించాయి. ఇప్పటికే ఈ అంశంపై ఇరుదేశాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ హయాంలో మూడేళ్ల కిత్రం అమెరికా వైదొలగింది. 2015 నాటి ఒప్పందం మేరకు ఇరాన్ తన అణు కార్యక్రమంపై స్వీయ ఆంక్షలు విధించుకోవాలి. అలాగే, అమెరికా, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇరాన్కు ఆంక్షల సడలింపుతో పాటు ఆర్థిక సాయం అందించాలి. ఇరాన్తో ఒప్పందానికి ప్రాధాన్యత ఇస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. చర్చలు వియెన్నాలో మంగళవారం ప్రారంభమవుతాయని అమెరికా హోం శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. ఇది సరైన ముందడుగు అని, అయితే, వెంటనే సానుకూల ఫలితాలను ఆశించలేమని వ్యాఖ్యానించారు. అమెరికా–ఇరాన్ మధ్య ఈ పరోక్ష చర్చలు ప్రారంభం కావడానికి యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వం చేసింది. -
ఫ్లాపీలకు అమెరికా ఇంకా టాటా చెప్పలేదంట
ప్రపంచానికే పెద్ద అన్నగా ఉన్న అమెరికాలో టెక్నాలజీ దిగ్గజాలేమి తక్కువ కాదు. ఏ టెక్నాలజీ అయినా మొదట కనుగొన్నేదీ, వాడేది ఆ దేశమే. అయితే అమెరికాలో పాత టెక్నాలజీలకు ఇంకా స్థానం పోవడం లేదట. ఏ న్యూక్లియర్ ప్రొగ్రామ్ రన్ అవ్వాలన్నా ఇంకా ఫ్లాపీ డెస్కులునే వాడుతున్నారని అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ ఆఫీస్(జీఏఓ) రిపోర్టు నివేదించింది. 1970 దశాబ్దానికి చెందిన కంప్యూటర్లలో 8 అంగుళాల ఫ్లాపీ డెస్కులనే పెంటాగాన్((అమెరికా డిఫెన్స్ ప్రధాన కార్యాలయం) ఇంకా వాడుతుందని పేర్కొంది. ఆ డెస్కులు దాదాపు అదే దశాబ్దంలోనే కనుమరుగయ్యాయి. 3.5 నుంచి 5.25 అంగుళాల డెస్కులు రావడంతో ఫ్లాపీ డెస్కులకు డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కడో ఓ దగ్గర కనిపిస్తున్నాయి. కానీ అమెరికాలో ఇంకా ఈ డెస్కులనే వాడుతున్నారని రిపోర్టు తెలిపింది. వాషింగ్టన్ మినహా అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నీ, డేట్ అయిపోయిన, కనుమరుగవుతున్నా పాత టెక్నాలజీలపై 6000 కోట్ల డాలర్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జీఏఓ రిపోర్టు తెలిపింది. ఈ ఖర్చు కొత్త ఐటీ సిస్టమ్ లపై పెట్టే పెట్టుబడుల కంటే మూడురెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ అవుట్ డేటడ్ టెక్నాలజీ ఫ్లాపీ సిస్టమ్ లపై దృష్టిపెట్టిన పెంటాగాన్ ఈ టెక్నాలజీల స్థానంలో కొత్త టెక్నాలజీలను వాడాలని ప్రయత్నిస్తోందని తెలిపింది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, న్యూక్లియర్ బాంబర్లు, ట్యాంకర్ సపోర్టు ఎయిర్ క్రాప్ట్ లను ఈ సిస్టమ్సే ప్రస్తుతం సమన్వయ పరుస్తున్నాయి. 2017 చివరి వరకూ ఈ సిస్టమ్ లను పెంటాగాన్ మార్చనుంది. ఇతర కార్యాలయాలకు కూడా ఈ సిస్టమ్ లను మార్చాలని నోటీసులు అందాయి. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ పాత తరం నుంచి బయటపడేసి కొత్తగా 21వ శతాబ్దంలోకి తీసుకురావడం అతిపెద్ద సవాల్ అని బోర్డు తెలిపింది.