National Green Tribunal
-
‘మర్రి’కి అభయమిచ్చే వరకు విస్తరణ వద్దు
బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ కూడలి వరకు నాలుగు వరుసలకు విస్తరించే రోడ్డు ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. విస్తరణలో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) సరిగ్గా వ్యవహరించకపోవటాన్ని తప్పుపట్టిన జాతీయ హరిత ట్రిబ్యునల్.. మళ్లీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు (పర్యావరణంపై ప్రభావ అంచనా నివేదిక) అందించే వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించొద్దని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్మర్రి వృక్షాలే కేంద్రంగా.. నగర శివారులోని అప్పా కూడలి నుంచి చేవెళ్ల–వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ కూడలి వరకు జాతీయ రహదారిని ఎన్హెచ్ఏఐ నాలుగు వరుసలతో 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. ఇది కర్ణాటకలోని బీజాపూర్ వరకు విస్తరించిన రోడ్డు. ఎగువన పరిగి మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు గతంలోనే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల విభాగం ఈ రోడ్డును విస్తరించింది. నగర శివారు నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివి ఎన్హెచ్ఏఐ అదీనంలో ఉంది. దాదాపు రూ.950 కోట్లతో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మన్నెగూడ వరకు రోడ్డుకిరువైపులా స్వాతంత్య్రానికి పూర్వం నాటిన 915 మర్రి వృక్షాలున్నాయి. నాలుగు వరుసలకు విస్తరించాలంటే ఈ మొత్తం చెట్లను తొలగించాల్సి వస్తుంది. చేవెళ్ల, మొయినాబాద్ పట్టణాల వద్ద రోడ్డు విస్తరణలో ఇళ్లను కూడా తొలగించాల్సి రావటంతో ఆ రెండు చోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలనుకున్నారు. దీంతో మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద ఉన్న 232 చెట్లను తొలగించాల్సిన పని లేకుండాపోయింది. ఈ వృక్షాలను కొట్టకుండా కాపాడాలంటూ బాలాంత్రపు తేజ సహా పలువురు సామాజిక కార్యకర్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. పలుదఫాల విచారణ అనంతరం, ఆ వృక్షాల తొలగింపు వల్ల పర్యావరణంపై ఉండే ప్రభావాన్ని అంచనా వేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో గతేడాది జనవరిలో ఆ శాఖ అదీనంలోని నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) అధ్యయనం చేసి ఎన్హెచ్ఏఐకి నివేదిక సమర్పించింది. కొన్ని చెట్ల పరిరక్షణకు వీలుగా సెంట్రల్ మీడియం వెడల్పు తగ్గించామని, దాని వల్ల 50 చెట్లు తొలగించాల్సిన అవసరం లేకుండా పోయిందని, బైపాస్ల వల్ల 232 మిగులుతున్నాయని, స్థానిక ముడిమ్యాల అటవీ ప్రాంతం వద్ద మిగిలే మరికొన్ని చెట్లు సహా మొత్తం 393 వృక్షాలు అలాగే మిగిలి ఉంటాయని, మిగతా వృక్షాలను ట్రాన్స్లొకేట్ పద్ధతిలో వేరే చోట నాటుతామని ట్రిబ్యునల్కు విన్నవించింది. ట్రిబ్యునల్ అసంతృప్తి.. ఏమన్నదంటే.. » ఎన్హెచ్ఏఐ సమర్పించిన నివేదికపై ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. » ప్రస్తుతమున్న అలైన్మెంట్ ప్రకారమే రోడ్డును విస్తరించాలని ఎందుకు అనుకుంటున్నారు. కొత్తగా మరో రోడ్డు నిర్మిస్తే అయ్యే నష్టమేంటన్న మాటకు ఎందుకు స్పష్టమైన సమాధానం ఇవ్వటం లేదు. » మర్రి వృక్షాలు కీలక భాగాల్లో సున్నితంగా ఉంటాయి. వాటిని ట్రాన్స్లొకేట్ చేసిన సందర్భంలో మనుగడ శాతం తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందులోనూ ఎక్కువ వయసు ఉన్న వృక్షాల మనుగడలో తీసుకునే చర్యలేమిటో శాస్త్రీయబద్ధ నివేదిక రూపంలో సమర్పించలేదు. » ట్రాన్స్లొకేట్ చేసిన తర్వాత వృక్షాలు మనుగడ సాగించేందుకు తీసుకునే చర్యలేమిటో ప్రాజెక్టు రిపోర్టులో చేర్చలేదు. దానికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో వెల్లడించలేదు. » అందుకే మరోసారి శాస్త్రీయపద్ధతిలో నిపుణుల ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాలి. అప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలి. -
‘రాయలసీమ’పై కేంద్రం కొరడా
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి డీపీఆర్ తయారీ ముసుగులో ఏపీ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తోందని అందిన ఫిర్యాదులపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. డీపీఆర్ తయారీ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని, ఎక్కడైనా తవ్వకాలు జరిపితే వాటినీ పూడ్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని దాని వాస్తవ పూర్వస్థితికి పునరుద్ధరించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత నెల 27న రాయలసీమ ప్రాజెక్టుపై వచ్చిన ఫిర్యాదుపై చర్చించి కేంద్ర నిపుణుల మదింపు కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి అదనపు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో, డీపీఆర్ తయారీకి సంబంధించిన పనులు మినహా ఇతర ఏ చర్యలు ప్రాజెక్టు సైట్లో చేపట్టలేదని పేర్కొంటూ అఫిడవిట్ రూపంలో స్వీయధ్రువీకరణ సమర్పించాలని స్పష్టంచేసింది. సైట్ పునరుద్ధరణకు తీసుకున్న చర్యలను ఫొటోలు, ఇతర ఆధారాలతో సహా సమర్పించాలని, ఇందుకు వాడిన పద్ధతులను, గడువులనూ తెలపాలని ఆదేశించింది. అఫిడవిట్లో అవాస్తవాలను పొందుపరిస్తే జల, వాయు, పర్యావరణ చట్టాల కింద సంబంధిత అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ప్రాంతీయ అధికారి, కేంద్ర జలసంఘం, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రాజెక్టు సైట్ను తనిఖీ చేశాక ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరింది. డీపీఆర్ తయారీ ముసుగులో పర్యావరణానికి ఏదైనా హానీ చేసినట్టు తనిఖీల్లో గుర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ విజయం: మంత్రి ఉత్తమ్రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమేనని నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం కృష్ణా బోర్డు, ఎన్జీటీ, కృష్ణా ట్రిబ్యునల్–2, సుప్రీం కోర్టులను ఆశ్రయించిందన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని తాను కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా, శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి లేఖ రాశారన్నారు. -
బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
సాక్షి, అమరావతి : పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం ద్వారా స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందని శ్రావణ్కుమార్ అనే న్యాయవాది తమ దృష్టికి తెచ్చిన అంశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ధర్మకర్తలా పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర వహించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సహజ వనరులపై ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుచేసింది. ప్రజలకు సమాన హక్కులు ఉన్న సహజ వనరులను కొందరు పెద్దల ముఠాకే దోచిపెట్టడం సమానత్వం సిద్ధాంతాన్ని అవహేళన చేయడమేనని స్పష్టంచేసింది. ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తవ్వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని అప్పట్లో ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతిన్నదని.. దానివల్ల ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రజల హక్కులను ఇసుక స్మగ్లర్లు కాలరాస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమిటని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని 2019, ఏప్రిల్ 4న అల్టిమేటం జారీచేసింది. మహిళా సంఘాల ముసుగులో దోపిడీ.. నిజానికి.. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక రీచ్ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళలకు అప్పగిస్తూ తొలుత ప్రకటించింది. మహిళా సంఘాల ముసుగులో ముఖ్యనేత దన్నుతో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్లను హస్తగతం చేసుకుని.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2016, మార్చి 4న ఆ విధానాన్ని రద్దుచేసి.. ఉచిత ఇసుక ముసుగులో తమ ముఠా దోపిడీకి అప్పటి సీఎం చంద్రబాబు రాచబాట వేశారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ప్రకాశం బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లు, మర పడవలు ఏర్పాటుచేశారు. తద్వారా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయించిన ముఠా పెద్దఎత్తున అక్రమార్జన సాగించింది. దీనిపై 2016లోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2017, ఫిబ్రవరి 23న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. అయినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2019 జనవరి 17–18న చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్కు అల్టిమేటం జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టంచేసింది. ‘‘సహజ వనరులు ప్రజల ఆస్తులు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాలి. నియంత్రణ లేకుండా ఇసుకను తవ్వి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేయడంవల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించిన వారి నుంచి పరిహారాన్ని వసూలుచేసి.. దానితో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వం బాధ్యత’’. – 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేసిన వ్యాఖ్య. -
రూ. పది కోట్లు డిపాజిట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానాలో రూ.పది కోట్లు కట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు చేపడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రమౌళీశ్వరరెడ్డి వేర్వే రుగా దాఖలు చేసిన పిటిషన్లను ఎన్జీటీ చెన్నై బెంచ్ గతంలో విచారించిన సంగతి తెలిసిందే. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రూ.528 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.92.85 కోట్లు, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు అదనంగా రూ.300 కోట్లు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.920.85 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దు మొత్తం జరిమానా ఎంతంటూ ధర్మాసనం ప్రశ్నించగా డిండి ప్రాజెక్టు విషయంలో రూ.92 కోట్ల జరిమానా విధించారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ఎవరు పరిష్కరించాలి? కేంద్ర ప్రభుత్వమా? లేక కోర్టు చొరవ తీసుకోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం నుంచి తగిన మార్గదర్శకాలు తీసుకుంటానని న్యాయవాది తెలుపగా మార్గదర్శకాలు త్వరగా తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యలు చేసే వరకు వేచి చూడొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, ప్రస్తుత డిండి కేసుతో సంబంధం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. చివరగా... ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం డిండి ప్రాజెక్టుకు విధించిన రూ 92 కోట్ల జరిమానాలో రూ.పది కోట్లను కేఆర్ఎంబీ ఎదుట మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన జరిమానా విషయంలో ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై అభ్యంతరం ఉంటే నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పనులు కొనసాగించుకోవచ్చు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తాగు నీటి అవసరాలకు సంబంధించి 75 టీఎంసీల మేర పనులు కొనసాగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఎనీ్టటీ విధించిన రూ.528కోట్ల జరిమానాలపై స్టే ఇస్తూ ఫిబ్రవరి 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రెండు పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేయా లని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
గౌరవెల్లిని ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.అఝగేషన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివాదిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదావరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’ గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్ విడుదలైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమతులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Sitamma Sagar: కేసీఆర్ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ/భద్రాద్రి: తెలంగాణ సర్కార్కు ఎన్జీటీ నుంచి మరో ఝలక్ తగిలింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించతలబెట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజ్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేకులు వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల్ని వెంటనే నిలిపివేయాలని, అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది ట్రిబ్యునల్. గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద కేసీఆర్ సర్కార్.. ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింటి. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో.. సీతమ్మ సాగర్గా నామకరణం చేసింది. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ఒకవైపు బ్యారేజీ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండగా.. పర్యావరణ అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని ఇప్పుడు ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం. ఈ మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదీ చదవండి: మా మెట్రో ఏం పాపం చేసింది? -
తెలంగాణ సర్కార్కు ఎన్జీటీ షాక్!
సాక్షి, అమరావతి: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్పై గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. యథేచ్ఛగా పనులు చేయడంవల్ల పర్యావరణానికి అపారనష్టం వాటిల్లిందని తేల్చింది. దీంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంలో 1.5 శాతం చొప్పున మొత్తం రూ.620.85 కోట్లను జరిమానాగా తెలంగాణ సర్కార్కు విధించింది. అంతేకాక.. చట్టాలను అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘిస్తున్నందున అదనంగా మరో రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం రూ.920.85 కోట్లను మూణ్నెళ్లలోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని స్పష్టంచేసింది. తెలంగాణ సర్కార్ జరిమానాగా చెల్లించే రూ.920.85 కోట్లతో నమామి గంగే ప్రాజెక్టు తరహాలో కృష్ణా నదీ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. అలాగే, పర్యావరణ అనుమతి తీసుకునే వరకూ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను కొనసాగించకూడదని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. ఆ రెండు ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కృష్ణా బోర్డుకు పంపి, సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకుని, అపెక్స్ కౌన్సిల్ మంజూరు చేశాకే వాటి పనులు చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం ఎన్జీటీ తుది తీర్పు ఇచ్చింది. వివాదం నేపథ్యం ఇదీ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి.. రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015, జూన్ 10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన జలాలు దక్కవని.. దీనివల్ల ఆయకట్టులో పర్యావరణం దెబ్బతింటుందని ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ను ఆశ్రయించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులతో జతకలిసింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2060 (పునరుత్పత్తి జలాలతో కలిపి 2130) టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఉమ్మడి రాష్ట్రానికి 800 టీఎంసీలు (పునరుత్పత్తితో కలిపి 811) టీఎంసీలు కేటాయించిందని ఎన్జీటికి ఏపీ ప్రభుత్వం వివరించింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల్లేవని.. వాటి ద్వారా 120 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తే.. శ్రీశైలం, సాగర్పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ఇది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని వాదించింది. దీనితో ఏకీభవించిన ఎన్జీటీ.. తక్షణమే పనులు నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న తెలంగాణ సర్కార్ను ఆదేశించింది. ఎన్జీటీ ఉత్తర్వులు తెలంగాణ బేఖాతరు కానీ, ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను తెలంగాణ సర్కార్ కొనసాగించింది. దాదాపు 90 శాతం పనులు పూర్తిచేసింది. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కృష్ణా బోర్డు నేతృత్వంలో కమిటీని ఎన్జీటీ నియమించింది. క్షేత్రస్థాయిలో ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన కమిటీ.. ఎన్జీటీ ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించినట్లు తేల్చింది. ఆ మేరకు ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, రైతులు, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు వాదనలను విన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగస్టు 17న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తీర్పును గురువారం వెల్లడించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది. మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధించింది. జరిమానాను కేఆర్ఎంబీ వద్ద జమ చేయాలని ఎన్జీటీ పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. చదవండి: కరోనా కొత్త వేరియంట్పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ -
షాకింగ్.. హైదరాబాద్ పరిధిలో 134 జలాశయాలు కబ్జా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో స్వచ్ఛమైన వర్షపు నీటితో కళకళలాడాల్సిన చెరువులు కబ్జాల చెరలో చిక్కిశల్యమవుతున్నాయి. ఒకవైపు మురుగు ముప్పు.. మరోవైపు ఆక్రమణలు ఆయా జలాశయాల ఉసురు తీస్తున్నాయి. మహానగరం పరిధిలో మొత్తంగా 185 చెరువులుండగా వీటిలో ఇప్పటివరకు 134 చెరువులు కబ్జాలకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్కు నివేదించడం గమనార్హం. ఇందులో పలు జలాశయాల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. మొత్తంగా 134 జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో 8,718 .. బఫర్జోన్లో 5,343 అక్రమ నిర్మాణాలున్నట్లు పేర్కొంది. సదరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం నివేదికలో స్పష్టంచేసింది. 51 చెరువులకు ఊరట.. మహానగరం పరిధిలో కేవలం 51 చెరువులు మాత్రమే కబ్జాలకు గురికాకుండా ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక 30 చెరువులు 85 శాతం ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. మరో 104 జలాశయాలు 15 శాతం కబ్జాకు గురైనట్లు నివేదికలో పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 185 జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ హద్దులను సిద్ధం చేసి హెచ్ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. ఇప్పటికే 157 చెరువుల ఎఫ్టీఎల్ బౌండరీలకు సంబంధించి తుది నోటిఫికేషన్ హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రదర్శిస్తున్నామని పేర్కొంది. నూతనంగా ఆయా జలాశయాల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాల సహకారంతో సంబంధిత వ్యక్తులపై ఇరిగేషన్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించింది. న్యాయపరమైన చిక్కులతో సాగని పనులు.. నగరంలో పలు చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఇరిగేషన్ శాఖ ఆయా జలాశయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడడం లేదని నివేదికలో తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేని చోట ఆక్రమణలను తొలగించి ఎఫ్టీఎల్ బౌండరీల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశామని పేర్కొంది. నగరంలో 63 జలాశయాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుకు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.94 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుతోపాటు ఆయా జలాశయాల చుట్టూ సీసీటీవీలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. -
ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు
సాక్షి, విజయవాడ: ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వల్ల పెనాల్టీ విధించలేదు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్జీటీ సంతృప్తి చెందింది. తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్జీటీ పెనాల్టీ విధించింది. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
Diwali 2022: పండుగ పచ్చగా.. గ్రీన్ క్రాకర్స్కు పెరిగిన ఆదరణ
దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. ఏమిటీ గ్రీన్ క్రాకర్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్గా పిలుస్తున్నారు. మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్ని గుర్తించడం ఎలా ? ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ? పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా? కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్కే అనుమతినిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ.3,500 కోట్లు జరిమానా
కోల్కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గట్టి షాకిచ్చింది. రాష్ట్రంలో ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని రూ.3500 కోట్లు జరిమానా విధించింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు సంబంధించి 12,819కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అయితే.. పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి చూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలు నిర్వర్తించటంలో ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్ ప్రభుత్వం జమ చేయాలి‘ అని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెత్త నిర్వహణపై ఇకనైనా బెంగాల్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో రోజుకు 2,758 మిలియన్ల లీటర్ల మురుగు నీరు పోగవుతోందని, అయితే.. 44 ఎస్టీపీల ఏర్పాటుతో కేవలం 1,268 ఎంఎల్డీలు మాత్రమే శుభ్రం చేస్తున్నారని పేర్కొంది. రెండింటి మధ్య అంతరం భారీగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ‘ప్రపంచం నుంచే కమ్యూనిస్టులు కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’.. అమిత్ షా ఆరోపణలు -
ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది. ఇదీ చదవండి: ‘విద్యారంగంలో దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తెచ్చాం’ -
ఎన్జీటీ ఉన్నది సామాన్యుల కోసం
సాక్షి, న్యూఢిల్లీ: ‘జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉన్నది న్యాయస్థానాన్ని ఆశ్రయించలేని సామాన్యుల కోసం. చట్టసభ సభ్యులకు కాదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభ సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలు కూడా ఎన్జీటీ విచారణకు స్వీకరిస్తోందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్జీటీ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేసింది. విశాఖలోని రిషికొండ నిర్మాణాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ కమిటీ, కోస్టల్ జోన్ అథారిటీ, అటవీ శాఖ అనుమతులు వచ్చిన తర్వాతే రిషికొండపై నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ప్రతివాది రాసిన లేఖపై ఎన్జీటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి ఉల్లంఘనలు చేయలేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పర్యావరణ అనుమతులు సరైనవా కాదా అనేది పరిశీలించడానికి మరో కమిటీని నియమించిందన్నారు. ఆ తర్వాత కూడా ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండానే నిర్మాణాలపై ఎన్జీటీ ఏకపక్షంగా స్టే విధించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని, స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ప్రతులు అందలేదని, అధ్యయనం చేయడానికి సమయం కావాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది కోరడంతో బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. రిషికొండ నిర్మాణాలపై హైకోర్టులో తదుపరి విచారణ ఎప్పుడో చెప్పాలని ఏపీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. -
Telangana: రేవంత్రెడ్డికి హైకోర్టులో ఝలక్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ/మీర్జాగూడలో హిమాయత్ సాగర్, ఉస్మాన్సాగర్ల క్యాచ్మెంట్ ఏరియాల్లో జీవో 111 రూల్స్ను ఉల్లంఘించి ఐటీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్లో దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చింది. అర్హత లేని పిటిషన్లో సంయుక్త కమిటీ దర్యాప్తునకు ఆదేశించడం సరికాదని స్పష్టం చేసింది. రేవంత్రెడ్డి పిటిషన్ను, ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కేటీఆర్, ఫామ్హౌస్ యజమాని ప్రదీప్రెడ్డి విడివిడిగా వేసిన రిట్లను అనుమతిస్తూ జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పి.నవీన్రావ్ల డివిజన్ బెంచ్ బుధవారం తీర్పు చెప్పింది. ఎన్జీటీ రూల్స్ ప్రకారం నిర్మాణం జరిగిన ఆరు నెలల్లోగా ఎవరైనా ఫిర్యాదు చేయాలని, అయితే ఏనాడో నిర్మాణం జరిగిన దానిపై రేవంత్ పిటిషన్ వేస్తే దానిని ఎన్జీటీ విచారించే అర్హత లేదని చెప్పింది. పైగా, కేటీఆర్ ఆ నిర్మాణం చేయలేదని, ఆ భూమికి యజమాని కూడా కాదని చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చింది. ‘కేటీఆర్కు నోటీసు కూడా జారీ చేయకుండా నేరుగా ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదు. నోటీసు ఇవ్వకుండా సంయుక్త కమిటీ ఏర్పాటు చెల్లదు. ఫాం హౌస్ ఓనర్ ప్రదీప్రెడ్డిని ప్రతివాదిగా చేయకుండా రేవంత్ ఎన్జీటీలో పిటిషన్ వేసి ఉత్తర్వులు పొందడం చెల్లదు’అని పేర్కొంటూ.. ఎన్జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలేగానీ హైకోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదన్న రేవంత్ వాదనను తిరస్కరించింది. ఎన్జీటీ ఉత్తర్వులపై జోక్యం చేసుకునే పరిధి హైకోర్టులకు కూడా ఉంది. ఇద్దరి పిటిషన్లను అనుమతిస్తున్నాం.. అని తీర్పులో పేర్కొంది. -
ఆ ఫాంహౌస్ కేటీఆర్ది కాదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్ మంత్రి కె.తారకరామారావుది కాదని, అయినా ఆయనే యజ మాని అంటూ తప్పుడు సమాచారంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారని కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి హైకోర్టులో నివేదించారు. జీవో 111 పరిధిలోని జన్వాడ ఫాంహౌస్లో అక్రమనిర్మాణాలు చేపట్టారంటూ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి ఎన్జీటీ చెన్నై బెంచ్లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలంటూ కేటీఆర్, ఫాంహౌస్ యజమాని ప్రదీప్రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఏవైనా నిర్మాణాలు చేపట్టినా 8 నెలల్లోగా ఎన్జీటీకి ఫిర్యాదు చేయాల్సి ఉందని, దాదాపు ఆరేళ్ల తర్వాత రేవంత్రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారని, కాలాతీతమైన తర్వాత దాఖలు చేసిన పిటిషన్ను విచారించే పరిధి ఎన్జీటీకి లేదన్నారు. ఫాంహౌస్ యజమాని ప్రదీప్రెడ్డిని ప్రతివాదిగా చేర్చకుండా ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. జలాశయాలను కాపాడేందుకే... హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టకుండా జీవో 111 తీసుకొచ్చారని రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 2020 ఫిబ్రవరిలో జన్వాడ ఫాంహౌస్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా తెలిసిందని, పరిశీలించేందుకు అక్కడికి వెళ్తే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని తెలిపారు. జీవో 111 పరిధిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా జలాశయాలను కాపాడేందుకే రేవంత్రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అయితే, ఎన్జీటీ ఉత్తర్వులపై రివ్యూ చేసే అధికారం ఈ కోర్టుకు ఉందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రాంచందర్రావు నివేదించారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఇదిలా ఉండగా రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఎన్జీటీ జన్వాడ ఫాంహౌస్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో లేదో పరిశీలించి నివేదిక సమర్పించేందుకు నిపుణులతో కమిటీ వేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు!
చండీఘడ్: రాష్ట్రంలోని మైనింగ్ జోన్లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 15 నుంచి 20 మంది ఘటనలో చిక్కుకున్నారు. తోషమ్ బ్లాక్లోని దాడం మైనింగ్ జోన్లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మైనింగ్ ఏరియాలో వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడటంతో, వాహనాల్లో కార్మికులందరూ చిక్కుకున్నట్లు సమాచారం. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్ వేదికగా తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇద్దరు మృతి చెందారని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మీడియాకు తెలిపారు. కాగా దాడం మైనింగ్ ప్రాంతం, ఖనాక్ పహారీలో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఐతే కాలుష్యం కారణంగా నేషనల్ గ్నీన్ ట్రిబ్యునల్ విధించిన రెండు నెలలు నిషేధాన్ని గురువారం ఎత్తివేయగా శుక్రవారం నుంచి మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిషేధం తర్వాత కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద ప్రమాదం జరడగంతో తాజా సంఘటన చర్చనీయాంశమైంది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ -
ఏపీ సీఎస్పై కోర్టు ధిక్కారం అవసరం లేదు: ఎన్జీటీ తీర్పు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతి తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిశానిర్దేశం చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన (ఈఐఏ)–2006 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి.. పర్యావరణ అనుమతి జారీచేసే ప్రక్రియను వేగంగా ముగించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్జీటీ (చెన్నై బెంచ్) ఉత్తర్వులు జారీచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైతు, తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారించింది. డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన పనులు మాత్రమే చేశామని ఏపీ సర్కార్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఎత్తిపోతల పనులు చేపట్టినందుకుగానూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. డీపీఆర్ రూపకల్పన కోసం చేసిన పనులను మదింపు చేయడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం, సీడబ్ల్యూసీ అధికారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కమిటీతో ఎత్తిపోతల పనులను మదింపు చేసి.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా విఘాతం కలిగిందా? లేదా? అనే కోణంలో అధ్యయనం చేసి, నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ రూపకల్పన కోసం మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ సూచించిన మార్గదర్శకాలను ఈఐఏ–2006లో చేర్చి.. పర్యావరణ అనుమతివ్వాలని నిర్దేశించింది. నివేదిక, పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ డీపీఆర్కు సంబంధించిన పనులతో సహా ఎలాంటి పనులు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. చదవండి: చురుగ్గా ‘వైద్య’ పోస్టుల భర్తీ -
‘భోగాపురం’ అనుమతులు సరైనవే
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనంత వరకు ఆ నిర్ణయంలో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోలేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేసేందుకు నిరాకరించింది. అనుమతులు రద్దుకు సహేతుక కారణాలు లేవని స్పష్టంచేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిందని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నీటి వనరుల విషయంలో మాత్రమే తాము జోక్యం చేసుకుంటున్నామంది. తాము నిర్దేశించిన పరిమితికి మించి నీరు అవసరమైతే పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని నిబంధనల్లో మార్పు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై బెంచ్ జుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ సభ్యుడు డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటితో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నం రాంనగర్కు చెందిన దాట్ల శ్రీదేవీ దాఖలు చేసిన అప్పీల్పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ప్రభుత్వం తరఫున సయ్యద్ నూరుల్లా షరీఫ్, దొంతిరెడ్డి మాధురీరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. భోగాపురం విమానాశ్రయానికి ఎంత భూమి అవసరమన్న వివరాలను దాచిపెట్టారన్న పిటిషనర్ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. ‘పౌర విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉండకూడదన్న నిషేధం ఏదీ లేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్టు భోగాపురం విమానాశ్రయానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుత విమానాశ్రయం నావికాదళానికి సంబంధించింది. పౌర విమానాశ్రయంగా దానిని నిర్వహించే విషయంలో కొన్ని పరిమితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఓ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకుంది.’ అని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. -
‘పాలమూరు–రంగారెడ్డి’ని ఆపాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాల్సిందేనని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పించుకోవడానికే తాగునీటి పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు చేపడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. పిటిషనర్లు పర్యావరణ అంశంతో ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ పరిధి తమకుందని పేర్కొంది. పర్యావరణ అనుమతులు పొందే వరకూ ప్రాజెక్టుపై తెలంగాణ ముందుకు వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సంయుక్త కమిటీలో తెలంగాణ సభ్యులు మినహా మిగతా సభ్యులు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తాము విశ్వసిస్తున్నామని జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘పాలమూరు–రంగారెడ్డి’ని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తోందని, ఇది ఆంధ్రప్రదేశ్పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ డి.చంద్రమౌళీశ్వర్రెడ్డి, అవ్వ వెంకటసుబ్బారెడ్డి, ఎస్కే.జానీబాషా, వజ్రాల కోటిరెడ్డి, నరబోయిన వెంకటరావు, సిద్దదాపు గాంధీ, గరికపాటి వెంకటరామనాయుడు, అన్నెం సోరెడ్డి, పండిపాటి వెంకయ్యలు దాఖలు చేసిన పిటిషన్పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. అనుమతులు తీసుకున్నాకే... తెలంగాణ, ఏపీ, పిటిషనర్ల, కేంద్రం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతించింది. అయితే ఇది ప్రాజెక్టు నిర్మాణానికి కాదని గుర్తుచేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణకు కేంద్రం సూచించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించలేదని.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కృష్ణా బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇవన్నీ ఇలా ఉన్నా.. తెలంగాణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్ణయం పర్యావరణంపై ప్రభావం చూపడంతోపాటు ఏపీ ప్రజలు, పిటిషనర్ల (రైతులు) ప్రయోజనాలపైనా ప్రభావం చూపుతుంది. చెంచు గిరిజనులు ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం(పంప్హౌస్) చేపట్టడానికి తెలంగాణకు అనుమతి లేదు. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తే ఇక సాగునీటికి కాలువలు తీయడం మినహా ఏమీ లేదు’అని తెలంగాణ సర్కార్కు తేల్చిచెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ► ‘ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ఆరు నెలల్లోనే పిటిషన్ దాఖలు చేయాలనడం వాస్తవమే, సెక్షన్ 15 ప్రకారం పిటిషన్ను పరిశీలించే అధికారం మాత్రం మాకుంది’ ► ‘తెలంగాణ పేర్కొన్నట్లు 7.5 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా.. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కడుతున్నారంటే సాగునీటి అవసరాలకు కూడా అని భావిస్తున్నాం. పర్యావరణ అనుమతులు కూడా తాగునీటికే ఉన్నాయి.. సాగునీటికి కాదని కమిటీ స్పష్టం చేసింది’. ► ‘అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతితో పనులు చేపట్టాలి’ – పాలమూరు–రంగారెడ్డి కేసులో ఎన్జీటీ -
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్పై ఎన్జీటీ స్టే
-
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే
న్యూఢిల్లీ: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మించొద్దని ఎన్జీటీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి కోసమని చెప్పి సాగునీటి కోసం నిర్మాణాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చంద్రమౌళీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఎన్జీటీ తీర్పు వెలువరించింది. చదవండి: (ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ పదవీకాలం పొడిగింపు) -
పాలమూరు–రంగారెడ్డిపై కేంద్రం వైఖరి తెలపాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం వైఖరి ఏమిటో తెలపాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం తన వైఖరి వెంటనే చెప్పాలని ఏజీ శ్రీరామ్ కోరారు. కేంద్రం వైఖరి ఏమిటో చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీకి చెందిన రైతులు డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు ఆరు నెలల కాల పరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించరాదని పేర్కొన్నారు. ఏపీ రైతుల పిటిషన్ ప్రవేశ సమయంలోనే విచారణకు నిరాకరించాలన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసి కూడా ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్రావు తెలిపారు. కేవలం తాగునీటి కోసమే అయితే అంతంత సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు? సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్టుంది కదా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణా నదిలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోందని రాంచందర్రావు తెలిపారు. ప్రాజెక్టు సమీప 13 మండలాల్లో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలున్నాయని, భూగర్భ జలాల వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలోనే భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత అండర్ టేకింగ్ ఇచ్చినట్టుగా తాగునీటి కోసమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామనిస్పష్టం చేశారు. ఈ కేసులో కేంద్రం వైఖరి చెప్పాలన్న అంశంపై కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రాథమిక దశలోనే విచారణ ఉందని తుది విచారణలో తప్పకుండా వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం వింటామన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తాగునీటిని అందించడానికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. అయితే, కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీ రైతుల డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలైన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసీ ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం.. తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్రావు వెల్లడించారు. తాగునీటి కోసమే అయితే అంత సామర్థ్యమున్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు.. సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్లుంది కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణాలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోంందని రాంచందర్రావు చెప్పారు. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫోర్లైడ్ బాధిత గ్రామాలని, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో తప్పకుండా తమ వైఖరి వెల్లడిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం (నేడు) వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. చదవండి: టీఆర్ఎస్ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు -
‘రాయలసీమ’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు రిజర్వు చేసింది. రాయలసీమపై గతంలో ఎన్జీటీ ఇచి్చన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ను దాఖలు చేసింది. వీటిని తాజాగా సోమవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. జియాలజిస్టుల సూచనలు, డీపీఆర్ అవసరాల మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. ఎన్జీటీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేపట్టం లేదని స్పష్టం చేశారు. ఆదేశాల ధిక్కరణ పిటిషన్ల విచారణ ఎన్జీటీ పరిధిలో లేదంటూ పలు కేసులు ప్రస్తావించారు. ఎన్జీటీని ఏపీ తప్పుదోవ పట్టించలేదని పేర్కొన్నారు. డీపీఆర్ పరిధి దాటి పనులు చేస్తే దానిపై చర్యలు తీసుకొనే అధికారం విషయంలో చట్టపరంగా ఎక్కడా స్పష్టత లేదన్నారు. అదనపు పనులపై చర్యలు తీసుకొనే అధికారం పర్యావరణ శాఖకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫు మరో న్యాయవాది మాధురి దొంతిరెడ్డి, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్లు హాజరయ్యారు. -
‘డిండి’ సాగునీటి ప్రాజెక్టే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ‘డిండి’ ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టు అని స్పష్టమవుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. త్వరితగతిన వైఖరి చెప్పకుంటే స్టేటస్కో విధించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. డిండి ఎత్తిపోతల వల్ల ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని కృష్ణా బోర్డు, కేంద్ర జలశక్తి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు పక్కనపెడితే.. అసలు ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా –2008 నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా చేయలేదన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి 3.60 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంతో 2015 జూన్లో తెలంగాణ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం ప్రారంభించిందని చెప్పారు. ఈ వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఉన్నాయన్నారు. పర్యావరణ అనుమతులు లేని ఈ ప్రాజెక్టు నిలిపి వేయాలని ఏజీ శ్రీరామ్ కోరారు. ఏపీ వాదనలపై తెలంగాణ వైఖరి చెప్పాలని ధర్మాసనం కోరింది. మూడు వారాల సమయం కావాలన్న తెలంగాణ ఏఏజీ.. ఏపీ పిటిషన్పై ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు తెలిపారు. మూడు వారాల సమయం కావాలని కోరగా ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. ప్రాథమికంగా ఇరిగేషన్ కాంపొనెంటు ఉందని అర్థం అవుతోందని, పర్యావరణ శాఖ అనుమతులు తప్పని సరిగా ఉండాలని స్పష్టం చేసింది. సమయం ఎక్కువ కోరితే స్టేటస్ కో విధిస్తామని పేర్కొంది. ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ప్రారంభమైందని, కాలపరిమితి ముగిసిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి విచారణకు అర్హత లేదని రాంచందర్రావు తెలిపారు. ఈ తరహా పిటిషన్లు వ్యక్తులు దాఖలు చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కాదన్నారు. 2007లో ఈ ప్రాజెక్టుకు జీవోలు జారీ అయినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో మళ్లీ జీవోలు ఇచ్చారని ఏపీ ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ శాఖ తదితరులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఈ నెల 8 లోగా వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. -
తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడి రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు చేపడుతున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆధారాలతో ఎన్జీటీని తప్పుదోవ పట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సృష్టించిన (ఫ్యాబ్రికేటెడ్) ఆధారాలతో వీడియోలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 192 మేరకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల వద్ద పనులు చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన విషయం విదితమే. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి ఎన్జీటీకి అధికారం ఉందా అనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లో ప్రస్తావించింది. అనంతరం ఎన్జీటీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. ఆయా పిటిషన్లను గురువారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద చేపడుతున్న పనులు, సర్వే.. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు రూపొందిస్తున్న డీపీఆర్కు సంబంధించినవి మాత్రమేనని తెలిపారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల వద్ద పరిశీలించిన కృష్ణాబోర్డు గతనెల 13న, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈనెల 8న ఎన్జీటీకి సమర్పించిన నివేదికల్లో.. ప్రాజెక్టు పరిసరాల్లో ఎలాంటి పనులు కొనసాగడంలేదని స్పష్టం చేశాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించి జరుగుతున్న పనులను రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులుగా వీడియో క్లిప్పింగ్లు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కల్పించుకున్న ధర్మాసనం..ట్రిబ్యునల్ తీర్పులు అమలు కాకపోతే చూస్తూ ఉండాలా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని గవినోళ్ల శ్రీనివాస్ న్యాయవాది శ్రావణ్కుమార్, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు తెలిపారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
అక్కడ పనులు జరగడం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టడం లేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పేర్కొంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు సంబంధించిన పనులు మాత్రమే ఇప్పటి వరకు చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనానికి నివేదిక అందించింది. ఏపీ ప్రభుత్వం ధిక్కరణ చర్యలకు పాల్పడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నెల 6న ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అందించిన నివేదికను ధర్మాసనం రికార్డులోకి తీసుకుంది. కృష్ణా బోర్డు, కేంద్రం నివేదికల్లో ఛాయాచిత్రాలు చూస్తుంటే ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయ్యాక ఏపీ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని ఆరోపించారు. ధర్మాసనం అనుమతిస్తే డ్రోన్ల ద్వారా వీడియో ఆధారాలు అందజేస్తామని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచంద్రరావు తెలిపారు. ఆధారాలు ఏవైనా ఉంటే తమకు, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల వద్ద ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డిలు ధర్మాసనానికి పునరుద్ఘాటించారు. ఉల్లంఘనలు జరిగాయని చర్యలు తీసుకొనే అధికార పరిధి ఎన్జీటీకి ఉందా.. అనే అంశంపై వాదనలకు అవకాశం ఇవ్వాలని కోరారు. పనులు నిలిపి వేశామని అండర్ టేకింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. పర్యావరణ శాఖ నివేదిక ఇలా.. ► 2021 ఆగస్టులో కృష్ణా బోర్డు ఎన్జీటీకి నివేదిక సమర్పించిన విషయం గమనించాం. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వ 854 అడుగుల కంటే తక్కువ ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డౌన్ స్ట్రీమ్ కోసం శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ధ్యేయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ► ఈ ప్రాజెక్టు కోసం గాలేరు నగరి– సుజల స్రవంతి, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టుల నిమిత్తం ఇచ్చిన పర్యావరణ అనుమతులు సవరించాలంటూ ప్రాజెక్టు యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. రివర్ వ్యాలీ, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ దీన్ని అంచనా వేస్తోంది. ► రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నట్లుగా ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి గుర్తులు లేవు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన నిర్మాణ సామగ్రి మాత్రమే ఉంది. ఎన్జీటీ అనుమతించిన డీపీఆర్కు సంబంధించిన పనులు మాత్రమే చేపడుతున్నట్లు ప్రాజెక్టు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని తెలియజేసే ఛాయా చిత్రాలు పొందు పరుస్తున్నాం. -
ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రెస్ నోట్ ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టవచ్చా? బాధితుడి తరఫున ట్రిబ్యునల్ సభ్యుడు విచారణ ప్రారంభించవచ్చా? పార్టీతో ట్రిబ్యునల్ సభ్యుడు జతకట్టే అవకాశం లేదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చట్టం–2010 ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలు, లేఖలు, విజ్ఞప్తులు ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా? అనే అంశంపై జస్టిస్ ఎం.ఎం.ఖానీ్వల్కర్, జస్టిస్ హృషికేశ్, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా వ్యర్థాల తొలగింపుపై ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టి, ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కేరళలో క్వారీల ఏర్పాటుకు నివాస స్థలాల నుంచి కనీస దూర నియమాన్ని 200 మీటర్లు నుంచి 50 మీటర్లకు తగ్గించారంటూ వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ కేసులో ఎన్జీటీకి అధికార పరిధి ఉందని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కొత్త క్వారీల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది. నిబంధనలు సమగ్ర ప్రాతిపదికన చదవాలి ఎన్జీటీకి న్యాయ సమీక్ష చేసే అధికారం లేదని ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14 చెబుతోందని థామ్సన్ అగ్రిగేట్స్, క్రిస్టల్ అగ్రిగేట్స్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ పరిధి విస్తరణ నిర్ణయం విషయంలో సెక్షన్ 14(1), (2)లు కలిపి చదవాలని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ దరఖాస్తు స్వీకరించడానికి అవసరమైన షరతులను సెక్షన్ 14(3) వివరిస్తోందని, ఎవరైనా దరఖాస్తుతో వస్తే సెక్షన్ 14లోని సబ్సెక్షన్ 3 ప్రకారం స్వీకరించాలని, అంతేకానీ ఓ లేఖ ద్వారా విచారణ చేపట్టరాదని వి.గిరి తెలిపారు. ఆర్టికల్ 323ఏ ప్రకారం ఎన్జీటీ ఏర్పాటు కాలేదు ఆర్టికల్ 323ఏ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఎన్జీటీ కాదని కేరళ తరఫున్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు. అందుకే శాసన అధికారాలను సమీక్షించే అధికారం ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, 32 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్న అధికారాలు ఎన్జీటీకి లేవన్నారు. ఎన్జీటీ చట్టంలోని ఏ ప్రొవిజన్ కూడా ట్రిబ్యునల్కు సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జీటీ సుమోటోగా కేసు చేపట్టాలంటే చట్టంలో ఉండాలని జైదీప్ తెలిపారు. అధికార పరిధి ఉన్న కోర్టులు కూడా చట్టబద్ధమైన నిబం« దనలకు వ్యతిరేకంగా వెళ్లవని వ్యాఖ్యానించారు. శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలి ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదు, ఎందుకంటే చట్టం ఆ మేరకు అవకాశం కల్పించలేదని ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా తెలిపారు. శాసనంలోని భాష నుంచి శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్కు అలాంటి అధికారం ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఎన్జీటీకి సుమోటో అధికార పరిధి ఉందని చెబితే, చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుందని ధ్రువ్ మెహతా పేర్కొన్నారు. అధికారం లేకున్నా చట్టం ద్వారా నిరోధించలేం ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేకున్నా చట్టం ద్వారా దాని పనితీరును నిరోధించలేమని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. సుమోటో విచారణలో ఎన్జీటీ బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అయితే, ట్రిబ్యునల్కు ఎలాంటి సుమోటో అధికారాలు లేవని ఆమె తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కోర్టులకే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టులే సుమోటో విచారణలు చేపట్టాలని అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. నేషనల్ ఎన్విరానిమెంటల్ అప్పీలేట్ అథారిటీ యాక్ట్ 1997 ప్రకారం ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్–2010 వచ్చాకా అథారిటీ యాక్ట్ రద్దయిందన్నారు. ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఉందని గ్రోవర్ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ట్రిబ్యునల్ దృష్టికి ఏదైనా అంశం వస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. లా కమిషన్ నివేదిక చెబుతోంది ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనేది చట్టసభల ఉద్దేశమని 186వ లా కమిషన్ నివేదిక చెబుతోందని ఓ పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వెల్లడించారు. ఎన్జీటీకి విస్తృత అధికారాలు ఇవ్వడాన్ని ‘స్థానిక’ అంశాలు డైల్యూట్ చేసినప్పటికీ సుమోటోగా కేసులు స్వీకరించే అధికారం పొందేంతగా లేదని స్పష్టం చేశారు. అప్లికేషన్ ద్వారానే విచారణ చేపట్టాలనే అధికార పరిధిని చట్టం పేర్కొందని, సుమోటో విచారణల ద్వారా కాదని తెలిపారు. ప్రతిపాదిత ట్రిబ్యునళ్ల పరిధి దాటి ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ అప్పీలేట్, న్యాయ సమీక్ష హైకోర్టుల పరిధిలోకి తీసుకొచ్చామని లాకమిషన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. -
లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్
నాతవరం: విశాఖ జిల్లాలో లేటరైట్ నిక్షేపాలున్న కొండలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున బుధవారం పరిశీలించారు. నాతవరం మండలంలో సుందరకోట శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల కోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరికేశారని గునుపూడికి చెందిన కె.మరిడయ్య జాతీయ హరిత ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో కలెక్టర్ లేటరైట్ నిక్షేపాలున్న కొండలను సందర్శించారు. కొండపైకి కారు వెళ్లే అవకాశం లేదు. దీంతో జీపులో, ద్విచక్రవాహనంపై కొంత దూరం ప్రయాణించి, సుమారు రెండు కిలోమీటర్లు నడిచి కొండలను చేరుకున్నారు. అటవీ, రెవెన్యూ భూములు, వాటి సరిహద్దుల మ్యాప్లను తహసీల్దార్ జానకమ్మ వివరించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదీ మరిడయ్యతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న విషయాలకు, క్షేత్రస్థ్ధాయిలో కనిపిస్తున్న దానికి పొంతన లేకపోవడం, భారీ వృక్షాలు లేకపోవడంపై ఫిర్యాదీని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ లేటరైట్ తవ్వకాల కోసం వేసిన రోడ్లను పరిశీలించామని చెప్పారు. నిబంధనలను పాటించారా లేదా అన్న విషయంపై అటవీ, మైనింగ్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కలెక్టర్తోపాటు జేసీ వేణుగోపాలరెడ్డి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్లమురుగన్, సైంటిస్టు సురేష్బాబు, ఇతర అధికారులు ఉన్నారు. -
మరో అధికారిని నియమించగానే ‘సీమ’ ఎత్తిపోతల పరిశీలన
సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ దేవేందర్రావు స్థానంలో అదే స్థాయి కలిగిన మరో అధికారిని నియమించాక కమిటీని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీ లించి నివేదిక ఇస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్(చెన్నై)కు కృష్ణా బోర్డు తెలిపింది. ఎత్తిపోతలపై తుది నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే శుక్రవారం ఎన్జీటీకి మధ్యంతర నివేదిక అందజేశారు. మధ్యంతర నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. ► రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టనున్న ప్రదేశాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మార్చి 4న ఎన్జీటీ ఆదేశాలు జా రీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ని ర్ణయించాం. సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించాలని కోరగా కృష్ణా–గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్(కేజీబీవో)లో సీఈగా ఉన్న పి.దేవేం దర్రావును నియమించింది. ఆయనతోపాటు కృష్ణా బోర్డు అధి కారులతో సీమ ఎత్తిపోతల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశాం. ► జూలై 23న ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 5న పర్యటించాలని భావించాం. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.దేవేందర్రావును కమిటీలో నియమించడంపై ఈనెల 3న ఎన్జీటీ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఈనెల 4న ఎన్జీటీ స్పందిస్తూ రెండు రాష్ట్రాలతో సంబంధం లేని అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ► ఈ పరిణామాల నేపథ్యంలో మరో అధికారిని సీడబ్ల్యూసీ నియమించిన వెంటనే కమిటీని ఏర్పాటు చేసి సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇస్తాం. -
ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరిన ఎన్జీటీ
సాక్షి, చెన్నై/ అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) బుధవారం విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్ తనిఖీ బృందంలో తెలంగాణ స్థానికత ఉన్న సీడబ్ల్యూసీ అధికారిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ఆంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్తో కూడిన ఎన్జీటీ చెన్నై బెంచ్ ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరింది. దీంతో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా తనిఖీకి వెళ్లేందుకు సిద్ధమని కృష్ణా బోర్డు పేర్కొంది. ఈనెల 9న నివేదిక అందజేయాలని ఎన్జీటీ కృష్ణా బోర్డును ఆదేశించింది. -
Krishna, Godavari Board: ఏమీ తేల్చలేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. బోర్డుల పూర్తి స్థాయి భేటీ నిర్వహించాకే సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసిన తెలంగాణ మంగళవారం నాటి భేటీకి గైర్హాజరయ్యింది. కాగా ఆంధ్ర ప్రదేశ్.. గెజిట్లోని పలు అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిపై కేంద్రానికి లేఖ రాసి అక్కడినుంచి స్పష్టత వచ్చాకే అన్ని అంశాలపై స్పందిస్తామని తెలిపింది. ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు), నిధులు సహా ఏ ఇతర అంశాలైనా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకే ముందుకెళతామని అధికారులు చెప్పారు. సీఎం సూచనలతోనే దూరం! కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండ్యల అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో ఈ ఉమ్మడి సమావేశం జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి సోమవారమే తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. అయితే ఈ భేటీకి దూరంగా ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ ఇంజనీర్లు ఎవరూ మంగళవారం నాటి సమావేశానికి హాజరు కాలేదు. బోర్డుల పూర్తిస్థాయి భేటీ తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ.. మంగళవారం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. మా ప్రభుత్వంతో చర్చించాక చెబుతాం: ఏపీ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, వాటి అనుమతులు, అనుమతుల్లేని ప్రాజెక్టుల వివరాలు, సీఐఎస్ఎఫ్ భద్రత, నిధుల విడుదల, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసే విషయాన్ని బోర్డులు ప్రస్తావించినట్లు తెలిసింది. తమకు సహకరించాలని, అవసరమైన నివేదికలు, వివరాలు ఇవ్వాలని బోర్డులు ఏపీని కోరాయి. దీనిపై స్పందించిన ఏపీ ఇంజనీర్లు.. అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, పర్యవేక్షణకు సిబ్బంది కేటాయింపులు, నిధుల విడుదల వంటి అంశాలపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాస్తామని చెప్పారు. ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వడం, నిధుల విడుదల, ప్రాజెక్టులకు అనుమతుల విషయాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గోదావరిలో మున్ముందు తీవ్ర సమస్యలు: ఏపీ ఈఎన్సీ ఉమ్మడి భేటీ ముగిసిన తర్వాత ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలపై ఓ స్పష్టత వచ్చాకే నోటిఫికేషన్ అమలుపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని బోర్డుకు చెప్పామని తెలిపారు. అన్ని ప్రాజెక్టులు, గెజిట్లో సూచించిన అన్ని అంశాలపై బోర్డు పర్యవేక్షణ అక్కర్లేదని, కేవలం క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూస్తే సరిపోతుందని అన్నారు. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగం, మళ్లింపు అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు కృష్ణాలో కన్నా గోదావరిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1,430 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో 1,350 టీఎంసీలను వినియోగించేలా తెలంగాణ కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, దేవాదుల వంటి పథకాలు చేపడుతోంది. గోదావరిలో మిగులు జలాలు లేవు. ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోలేని నీరు మాత్రమే దిగువకు వస్తోంది. ఆయా రాష్ట్రాలు వినియోగం మొదలు పెట్టినా, తెలంగాణ 1,350 టీఎంసీలు వాడినా పూర్తి దిగువ రాష్ట్రమైన ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్( జీడీఎస్)కు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఇది ఏపీకి తీరని నష్టం చేకూర్చుతుంది..’ అని తెలిపారు. పోలవరం, పట్టిసీమలతో మళ్లిస్తున్న గోదావరి జలాలకు గానూ తమకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణ కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ సైతం 241 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లిస్తోందని, మరి దీని మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. సముద్రంలోకి పూర్తి వృధాగా పోతున్న సందర్భంలో తాము మళ్లించుకునే నీటిని వినియోగ వాటాల కింద పరిగణించరాదని కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని తెలిపారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. 5న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 5న జరిగే ఈ పర్యటనకు సహకరించాలని ఏపీని బోర్డు కోరింది. ఇందుకు అంగీకరించిన ఏపీ.. కమిటీలో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా చూడాలని షరతు పెట్టింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం చేసిందీ తెలియలేదు. అయితే తెలంగాణ కోరుతున్నట్లుగా ఈ 12న పూర్తి స్థాయి బోర్డుల భేటీ జరిగే అవకాశం ఉందని తెలిసింది. -
AP: ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించలేదని, తమకు అలాంటి ఉద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని, అందులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో ప్రధానాంశాలు ఇవీ.. ► కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపుల మేరకే శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు కన్నా దిగువన ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు వాటా నీటిని తీసుకునే అవకాశం లేదు. ► 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేందుకు ప్రతిపాదిత పథకాన్ని చేపట్టాం. ఈ నీటిని శ్రీశైలం కుడికాలువ, తెలుగు గంగ ద్వారా చెన్నై నగరానికి తాగునీరు, తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు–నగరి సుజల స్రవంతి, ఎస్ఆర్బీసీకి తరలించాలి. రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన 101 టీఎంసీల మేరకు శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపడుతున్నాం. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నప్పుడు కేటాయింపులున్నా నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. అందువల్లే కేటాయించిన వాటా నీటిని వినియోగించుకునేందుకే 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేలా సీమ ఎత్తిపోతలకు ప్రణాళిక రూపొందించాం. అది కూడా పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకే. ► 2020 జూలై 13న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ అవసరమైన అధ్యయనం చేయాలని ఎన్జీటీ పేర్కొంది. తదనుగుణంగా తక్కువ ధరకు బిడ్ చేసిన బిడ్డర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చారు. ► 2020 అక్టోబర్ 29న ఇచ్చిన ఆదేశాల్లో ట్రిబ్యునల్ పలు సూచనలు చేసింది. బిడ్డర్ సమగ్ర సర్వే చేయాలని, ముచ్చుమర్రి వద్ద భూసేకరణను నివారించడంలో భాగంగా మరే ఇతర ప్రాంతంలోనైనా పథకం నిర్మాణం చేపట్టవచ్చా? అనే అంశంపై సర్వే చేయాలని సూచించింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎడమ వైపున రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని బిడ్డర్ తెలిపారు. ► బిడ్డర్ నివేదికను సాంకేతిక కమిటీ పరిశీలించి అనుమతించింది. అనంతరం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పథకం నిర్మాణం నిమిత్తం తనిఖీ చేయాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2020 డిసెంబర్ 4న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫీజిబిలిటీ నివేదిక ఇచ్చింది. నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంత కన్జర్వేటర్ను అభిప్రాయాలు చెప్పాలని కోరగా బిడ్డర్ సూచించిన ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్లోకి రాదని నివేదించారు. ఈ మేరకు మార్పులు చేసిన వివరాలను ఎన్జీటీ ముందు ఉంచుతున్నాం. మార్పుల ప్రకారం కొత్తగా సాగులోకి వచ్చే ప్రాంతం ఏమీ లేదు. ప్రస్తుత కాలువ సామర్థ్యం కూడా పెరగదు. ► పథకంలో మార్పులు చేసిన అనంతరం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఈ ఏడాది జూన్ 30న కేంద్ర జల సంఘానికి, జూలై 1న కృష్ణా బోర్డుకు అందచేశాం. మార్పులు చేసిన ప్రతిపాదిత పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఈ ఏడాది జూన్ 9న కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. జూన్ 17, జూలై 7న నిర్వహించిన సమావేశాల్లో జలశక్తి నిపుణుల కమిటీ మార్పుల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించి కొన్ని వివరణలు కోరింది. అది పెండింగ్లో ఉంది. ► సాగు, తాగు నీరు నిమిత్తం కేటాయించిన జలాలను తీసుకునేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారని నిపుణుల కమిటీ తేల్చింది. ఎత్తిపోతల ద్వారా తీసుకునే జలాలు ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి సుజల స్రవంతి కోసమేనని, కొత్తగా సాగు ప్రాంతం ఏమీ లేదని, పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. మార్పులు చేసిన ప్రతిపాదనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ► ఎన్జీటీ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉత్తరం వైపు ఎలాంటి కాంక్రీట్ పనులు జరగడం లేదు. ప్రతిపాదిత కొత్త స్థలంలో ఫౌండేషన్ నిమిత్తం తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 29 నాటి ఆదేశాలను ఉల్లంఘించలేదు. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆ పిటిషన్ను కొట్టివేసి భారీ జరిమానా విధించాలని కోరుతున్నాం. -
‘పాలమూరు–రంగారెడ్డి’ పరిశీలనకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించేందుకు సంయుక్త కమిటీని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయ సీనియర్ అధికారి లేదా హైదరాబాద్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, జియాలజీ మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లేదా డైరెక్టర్ సూచించిన సాయిల్ టెక్నాలజీ సీనియర్ అధికారి, నేషనల్ ఎన్విరానిమెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్తలను ఇందులో సభ్యులుగా పేర్కొంది. ఉల్లంఘనలు గుర్తిస్తే కేంద్ర జల సంఘం సీనియర్ అధికారిని అదనపు సభ్యుడిగా చేర్చనున్నట్లు ఎన్జీటీ తెలిపింది. తాగునీటి ప్రాజెక్టు అయినా.. సాగు కోసం తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మిస్తూ నిబంధనలు ఉల్లంఘించిందంటూ మరో పిటిషన్లో ఆరోపించిన విషయాన్ని ఎన్జీటీ ప్రస్తావించింది. ఈ అంశంపై కూడా కమిటీ పరిశీలించాలని సూచించింది. ‘తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ చట్టాల ఉల్లంఘన చేసిందా? పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) అధ్యయనం చేయకుండా, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక లేకుండా, ఈఐఏ నోటిఫికేషన్, 2006 నిబంధనలను ఉల్లంఘించిందా? పర్యావరణ నష్టం ఎంత? తాగునీటి కోసమే చేపడుతున్నారా లేదా సాగునీటికి కూడా విస్తరించే అవకాశం ఉందా? ప్రాజెక్టు నిమిత్తం ప్రజలను తరలించారా?’అనే అంశాలు కమిటీ పరిశీలించాలని ఎన్జీటీ ఆదేశించింది. తనిఖీ కోసం మహబూబ్నగర్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే ఆయా జిల్లాల కలెక్టర్లను కో–ఆప్ట్ సభ్యులుగా చేర్చుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 27 లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని పేర్కొంది. కడప జిల్లాకు చెందిన డి.చంద్రమౌళీశ్వరరెడ్డి సహా 9 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్ను ఈనెల 15న జస్టిస్ కె.రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్య గోపాల్ విచారించిన విషయం తెలిసిందే. -
సింగరేణి అక్రమ మైనింగ్పై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సింగరేణి అక్రమ మైనింగ్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శనివారం ఆగ్రహం వ్యక్త చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్ చేస్తున్నారని మండిపడింది. నందునాయక్, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్లో విచారణ చేపట్టింది. కాగా, అదనపు మైనింగ్పై ఎన్జీటీకి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ చేయొద్దని సింగరేణిని ఎన్జీటీ ఆదేశించింది. ఇప్పటికే చేపట్టిన అక్రమ మైనింగ్కు నష్టపరిహారం చెల్లించాని పేర్కొంది. కాలుష్య బారిన పడిన బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని తెలిపింది. అంతేకాకుండా గ్రీన్బెల్ట్పై నివేదిక సమర్పించాలని నిపుణుల కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కాగా తదుపరి విచారణను వచ్చేనెల(ఆగస్టు) 12కు వాయిదా వేశారు. -
పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు – రంగారెడ్డి ప్రాజె క్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా లేదా.. అనే అంశంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం నివేదిక కోరింది. ఈ మేరకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ ప్రాజెక్టులో పర్యా వరణ ఉల్లంఘనలు జరిగాయని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ రామకృష్ణన్ బెంచ్ విచారించింది. ఉదండా పూర్ రిజర్వాయర్ కోసం 16 కిలోమీటర్ల అడ్డుకట్ట (బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతు న్నారని పిటిషనర్ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మా ణంలో పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. కాగా, 2016లో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను తాగునీటి ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడితే ఇప్పుడు కేసు వేయడం నిర్ధేశిత లిమిటే షన్ సమయానికి విరుద్ధమని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు ధర్మాసనానికి నివేదించారు. అయితే పిటిషనర్.. ప్రాజెక్టును సవాలు చేయడం లేదని, పర్యావరణ ఉల్లంఘనలపై కేసు దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ విచారణ చేపడతా మని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ, మహబూబ్నగర్ జిల్లా అసి స్టెంట్ డైరెక్టర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసిం ది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు జరి గాయో.. లేవో.. తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఆగస్టు 27 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. -
పుట్టినగడ్డకూ బాబు 'వెన్నుపోటు'
సాక్షి, అమరావతి: తాను జన్మించిన ప్రాంతమంటే సహజంగానే ఎవరికైనా కాస్తంత ప్రేమ ఉంటుంది. ఎంతదూరంలో ఉన్నా ఆ మమకారం పోదు. వీలైతే సొంతగడ్డకు సేవ చేసి రుణం తీర్చుకోవాలి. పోనీ అది కుదరలేదనుకుంటే కనీసం అపకారం తలపెట్టకూడదు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధినే అడ్డుకుంటున్నారు. తాను చేయకపోగా ఇతరులు సంకల్పిస్తే సహించలేకపోతున్నారు. లక్ష ఎకరాలకుపైగా సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తాజాగా ఎన్జీటీలో ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషనే ఇందుకు నిదర్శనం. ప్రాజెక్టును ఆపాలంటూ టీడీపీ పిటిషన్.. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రిజర్వాయర్లతో కూడిన ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్నాయుడుతోపాటు ఆ పార్టీకే చెందిన 13 మంది నేతలతో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ), చెన్నై బెంచ్లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టును నిలుపుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్జీటీని అభ్యర్థించారు. కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల్ శక్తి శాఖకూ ఫిర్యాదులు చేశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తోందని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశించాలని ఎన్జీటీలో గత నెల 27న రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు జిల్లాలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో 1.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. దుర్భిక్ష పశ్చిమ మండలాల రూపురేఖలను సమూలంగా మార్చేసే ఈ ప్రాజెక్టును అడ్డుకునే యత్నం చేయడం ద్వారా చివరకు సొంత జిల్లా ప్రజలకూ చంద్రబాబు అన్యాయం చేశారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అనుసంధానంతో... హంద్రీ– నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీళ్లు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేయడం ద్వారా ఎనిమిది టీఎంసీలను తరలించి చిత్తూరు జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కండలేరు నుంచి నీటిని తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు. తద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సొంత ప్రాంతం అభివృద్ధినే అడ్డుకుంటూ కేసులు దాఖలు చేయిస్తున్నారు. ఇది పూర్తిగా దిగజారుడుతనానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ ప్రాజెక్టు.. ►వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలుగా వ్యవహరిస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు. మిగతా 1,550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. ►అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 2 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ►పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ►పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఈ పనులకు ఆగస్టులో టెండర్లు నిర్వహించిన ప్రభుత్వం మూడేళ్లలోగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆది నుంచి అదే నైజం.. 1995 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటక అక్రమంగా ఆల్మట్టి ప్రాజెక్టును నిర్మిస్తుంటే నోరు మెదపకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కర్ణాటక ప్రభుత్వం చిత్రావతిపై పరగోడు.. పెన్నాపై నాగలమడక బ్యారేజీలను నిర్మిస్తూ దుర్భిక్ష అనంతపురం జిల్లా ప్రజల నోళ్లు కొడుతుంటే నిర్లిప్తంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ఎత్తిపోతల సహా ఎనిమిది అక్రమ ప్రాజెక్టులను చేపట్టి 178.93 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా తరలిస్తుంటే ఓటుకు కోట్లు కేసుల భయంతో నోరు విప్పలేదు. ఇప్పుడు సొంత జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టును స్వాగతించకుండా అడ్డుపుల్లలు వేయడం ద్వారా తన వైఖరిని మరోసారి రుజువు చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పోలవరంలో ఎన్జీటీ బృందం
పోలవరం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మూలలంక ప్రాంతంలోని డంపింగ్ యార్డు మట్టి జారిపోకుండా తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బృందం మంగళవారం పరిశీలించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నాయకత్వంలో బృంద సభ్యులు కోట శ్రీహర్ష, టి.శశిధర్, ఎస్.మన్నివరం, హెచ్డీ వరలక్ష్మి, డి.సురేష్ పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డులు, ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తిల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బీసీ కాలనీ సమీపంలో ఉన్న 203 ఎకరాల డంపింగ్ యార్డు ఏమైనా జారిపోయిందా, మొక్కలు నాటారా.. కాలువ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు. 902 హిల్ ప్రాంతంలోని స్పిల్ చానల్ మట్టిని పోస్తున్న రెండు ప్రదేశాలను కూడా చూశారు. హిల్ వ్యూ పై నుంచి స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక, ఎగువ కాఫర్డ్యామ్, ట్విన్టన్నెల్స్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బృందం సభ్యులు మూలలంక డంపింగ్యార్డు కోసం తీసుకున్న 203 ఎకరాల భూములకు పరిహారం చెల్లించారా లేదా అనే విషయాలను ఆరా తీశారు. 30 మంది రైతులు పరిహారం తీసుకోలేదని, వారికి సంబంధించిన సొమ్ము కోర్టులో జమచేశామని అధికారులు తెలిపారు. ఈ బృందం బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆ ప్రాంత వాసుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుంది. ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్ బి.సుమతి, ఈఈ మల్లికార్జునరావు, మేఘ జీఎం ఎ.సతీష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలవరంలో పర్యావరణ పర్యవేక్షణకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ పర్యవేక్షణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తి ఎవరనేది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో డంపింగ్ యార్డ్పై పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. 2015 నుంచి పలు దఫాలుగా పర్యావరణ ఉల్లంఘనలపై కేసులు వేసినా సమస్య పరిష్కారం కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ తెలిపారు. 2016లో అదనపు భూసేకరణ జరిపి పర్యావరణ అనుమతులు లేకుండా, డంపింగ్ వల్ల తలెత్తే ప్రభావాల్ని అధ్యయనం చేయకుండా ప్రాజెక్టు వ్యర్థాలను డంపింగ్ చేయడం ప్రారంభించారని తెలిపారు. అనాలోచిత డంపింగ్ వల్ల 2018, 2019 ఫిబ్రవరిలో భూప్రకంపనలు రావడంతోపాటు ప్రాజెక్టు సమీపంలో రహదారులు పగుళ్లు వచ్చాయని తెలిపారు. కాఫర్ డ్యాం నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎగువ ప్రాంతాలు భారీగా మునిగి ప్రజలు నష్టపోయారని తెలిపారు. కమిటీలు పలు సూచనలు చేసినా అమలు చేయలేదన్నారు. పర్యావరణ ఉల్లంఘనలపై కేసు వేసినందుకు పిటిషనర్, కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. పర్యావరణ ప్రభావంపై ప్రాజెక్టు నిర్మాణ తొలి దశ నుంచే అంచనా చేయాలి కానీ సమస్యలు ఉత్పన్నమయ్యాక కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్కు పరిహారం అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తర్వాత బాధ్యత ఇతరులపై వేయడం సరికాదని విషయ నిపుణుడు నాగిన్నందా వ్యాఖ్యానించారు. పర్యావరణ పర్యవేక్షణ కమిటీలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ రీసెర్చ్ సహా పలువురు నిపుణులు ఉంటారని ధర్మాసనం పేర్కొంది. కమిటీకి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. పూర్తి లిఖిత పూర్వక ఆదేశాలు బుధవారం వెలువడనున్నాయి. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 3 టీఎంసీల నీటిని పంప్లైన్ సిస్టమ్ ద్వారా తరలించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఇంజనీర్ ఫోరమ్ కన్వినర్ దొంతుల లక్ష్మినారాయణ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు గురువారం ఈ పిల్పై విచారణ చేపట్టింది. 3 టీఎంసీల పద్దతి ద్వారా నీటి తరలింపు చేస్తే రూ.8 వేల కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు 2 టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియను కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారని పిటిషనర్ హైకోర్టుకు వివరించారు. ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయల మెయింటనెన్స్ ఖర్చు అవుతుంది. 3 టీఎంసీ పైప్లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయి. (భారత్కు రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్) తెలంగాణ రాష్ట్రంలో సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మించొద్దని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే పనులు జరగాయి' అని పిటిషనర్ హైకోర్టుకు వివరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇరిగేషన్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్, ఎన్విరారమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని ప్రతివాదులను హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
టపాసులు కాల్చేందుకు 2 గంటలే
సాక్షి, అమరావతి: దీపావళి రోజున టపాసులు కాల్చే వారికి కేవలం రెండు గంటల సమయమే ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వ పధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల కోవిడ్ ప్రభావం ఎక్కువయ్యే అవకాశాలున్నాయని, దీన్ని నియంత్రించేందుకే కేవలం రెండు గంటల సమయం ఇచ్చినట్టు ఈనెల 5న నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు రెండు గంటల సమయం ఇచ్చామని, టపాసులు అమ్మే షాపులు కూడా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. షాపుల ముందు క్యూలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్లు, పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. -
దేశ రాజధానిలో టపాసులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలను కూడా నిషేధిస్తున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనే హక్కు ఉంది’’ అని పేర్కొన్న ఎన్జీటీ దేశ రాజధానితోపాటు గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్న నగరాల్లోనూ నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొంది. ఈ నిబంధనలు సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపింది. గాలి నాణ్యత మోడరేట్ నుంచి కింది స్థాయి ఉన్న నగరాల్లో హరిత క్రాకర్స్కు అనుమతిచ్చింది. టపాసులు కాల్చడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో వచ్చే కాలుష్యంపై నివారణ చర్యలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ముఖ్యాంశాలు ► దేశరాజధాని పరిధిలో ఈనెల 9 అర్ధరాత్రి నుంచి 30 అర్ధరాత్రి వరకు అన్ని రకాల క్రాకర్స్ అమ్మకం, కాల్చడంపై నిషేధం విధించడం. ► గతేడాది నవంబర్లో గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గాలి నాణ్యత పూర్ ఆపై స్థాయి ఉన్న అన్ని నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ► గాలి నాణ్యత మోడరేట్ అంతకన్నా తక్కువస్థాయి ఉన్న నగరాల్లో దీపావళి, ఛట్, క్రిస్మస్, న్యూఈయర్ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ నిబంధనల ప్రకారం కేవలం 2 గంటలపాటు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు. టపాసులు నో.. చిచ్చుబుడ్లు ఓకే టపాసుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు శివసేన నాయకత్వంలోని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. తక్కువ కాలుష్యం విడుదల చేసే టపాకాయలను, చిచ్చుబుడ్లను ఇళ్ళవద్ద కాల్చవచ్చునని బీఎంసీ తెలిపింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బీఎంసీ తెలిపింది. -
నవంబర్ 30 వరకు బాణాసంచాపై పూర్తి నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 9(సోమవారం) అర్థరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) పూర్తి నిషేధం విధించింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఉత్తర్వు నేషనల్ క్యాపిటర్ రీజియన్(ఎన్సీఆర్)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. అలానే గాలి నాణ్యత మోడరేట్గా ఉన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్ క్రాకర్స్ని మాత్రమే అనుమతించింది. అది కూడా పరిమిత సమయం వరకు మాత్రమే. "సంబంధిత రాష్ట్రం పేర్కొన్న విధంగా పర్వదినాల్లో బాణాసంచా కాల్చే సమయం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయబడింది. దీపావళి, గురుపూర్లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది.(చదవండి: బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్) ఇక గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ఇతర ప్రాంతాల్లో ట్రిబ్యూనల్ క్రాకర్స్ నిషేధాన్ని ఐచ్చికం చేసింది. "కోవిడ్ -19 తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గాలి కాలుష్యానికి కారణం అయ్యే చర్యలని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి" అని ఎన్జీటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో.. గాలి నాణ్యత అధ్వన్నంగా ఉన్న తరుణంలో.. కాలుష్యాన్ని మరింత పెంచే బాణాసంచా వాడకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ని విచారించిన ఎన్జీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ కాలంలో వాయు కాలుష్యం కారణంగా రోజుకు 15,000 కేసులు నమోదవుతాయని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలు చేసిన హెచ్చరికలను గుర్తు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 7,745 కేసులు నమోదయ్యాయి. (అలర్ట్ : కరోనాకు కాలుష్యం తోడైతే.. ) ఏటా, ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. శీతాకాలంలో విషపూరితంగా మారుతుంది, అక్టోబర్ నుండి రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గత మూడు రోజులుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలని ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుంచి ఢిల్లీలోని వాయు కాలుష్యం 17.5 శాతం కోవిడ్ కేసుల పెరుగుదలకిదారితీసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధం వెల్లడించింది. -
ఆ అవసరాలకు సీమ ఎత్తిపోతల అవసరమే
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఆవశ్యకమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన ఈ ప్రాజెక్టు స్కీంను పరిశీలిస్తే ప్రధానంగా రాయలసీమ కరువు తీర్చేందుకు తాగు, సాగునీటి అవసరాల కోసం రోజూ 8 టీఎంసీల వరద నీటిని మళ్లించి, వీలైనంత తక్కువ వరద జలాలు సముద్రంలో కలిసేందుకు ఉద్దేశించిన పథకమని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులో సాగునీటి అంశం కూడా ముడిపడి ఉన్నందున నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతి అవసరమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.(చదవండి: సాఫీగానే ‘సీమ ఎత్తిపోతల’) ఈ ఎత్తిపోతలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ)కు సమర్పించకుండా ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని హరిత ట్రిబ్యునల్ గుర్తు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేఆర్ఎంబీ నుంచి ముందస్తు అనుమతి అవసరమా? లేదా? అన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీ దక్షిణ ప్రాంత బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తాలతో కూడిన ధర్మాసనం 134 పేజీల తీర్పు వెలువరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, ఈ పథకం వల్ల తెలంగాణలోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు హైదరాబాద్కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించిన సంగతి విదితమే.(చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స) -
కాళేశ్వరంపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యల తీసుకోవాల్సిన బాధ్యత ఉందిని తెలిపింది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలకు.. జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పింది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్లో చెప్పినట్లు డీపీఆర్లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. -
నవంబరు 9లోగా నివేదిక అందించాలి
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్కాస్ట్ మైన్ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను నవంబర్ 9లోగా అందించాలని ఆదేశించించింది. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ పర్యావరణ శాఖ, తెలంగాణ గనుల శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పప్లోసివ్స్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. కమిటీ సమన్వయ బాధ్యతను కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ అధికారికి అప్పగించింది. కాగా సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యంపై స్థానిక ఎన్టిఆర్ కాలనీవాసి బానోతు నందు నాయక్ పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. (చదవండి: ఎన్జీటీ ఆదేశాల అమలు నిలిపివేత ) ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. నందు నాయక్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గత ఏడాది జూన్లో విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల్లో పేలుళ్ల వల్ల ఎన్టిఆర్ కాలనీ లో 700 ఇళ్లు దెబ్బతిన్నాయని.. వాయు, శబ్దం కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ లో కొంత భాగం బొగ్గు ఉత్పత్తి ఆపివేసినా.. మైన్ క్లోజింగ్ ప్లాన్ అమలు చేయలేదని వివరించారు. ఇందుకు స్పందించిన బెంచ్.. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసు జారీ చేసింది. -
రాయలసీమ ఎత్తిపోతల పథకం: ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసుకు సంబంధించి చెన్నైలోని జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ)లో ఇరువైపుల వాదనలు ముగిశాయి. మంగళవారం జరిగిన కోర్టు విచారణలో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే తమకు వాటాగా రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇది పాత పథకమేనని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలపాలని కోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. (కరువు సీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదమెందుకు?) కాగా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 20న విచారణ చేపట్టిన ఎన్జీటీ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని స్టే ఇచ్చింది. అయితే తన వాటా జలాలను వినియోగించుకునేందుకు ఈ పథకం చేపట్టామని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నివేదించింది. దీనిపై జూలై13న విచారించిన ఎన్జీటీ ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. (పర్యావరణ అనుమతి అక్కర్లేదు) -
కాళేశ్వరం విస్తరణపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై వేముల్గాట్ భూనిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్ను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భారీ విస్తరణ పనులు చేపట్టారని పిటిషనర్లు ధర్మాసనానికి నివేదించారు. కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా పనులు జరపరాదని ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్ ఢిల్లీ బెంచ్లో పెండింగ్లో ఉన్న విషయంపై చెన్నై బెంచ్ ఆరాతీసింది. ఒకే ప్రాజెక్టుపై 2 బెంచ్ల్లో విచా రణ సాధ్యమేనా అని చెన్నై బెంచ్ న్యాయ విభాగం సభ్యుడు జస్టిస్ రామకృష్ణన్ ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో పెండింగ్ కేసుకు, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని, తెలంగాణ చెన్నై బెంచ్ పరిధి లో ఉన్నందువల్ల సౌత్ జోన్ బెంచ్లో కేసు వేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ నివేదించారు. కేసును చెన్నై బెంచ్ విచారిం చినా, ఢిల్లీ ప్రధాన బెంచ్కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని విన్నవించారు. ఢిల్లీ బెంచ్లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పెండింగ్లో ఉన్నందు వల్ల చెన్నైలో విచారణ సరికాదని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై దాఖలైన పిటిషన్ చెన్నై బెంచ్ విచారించవచ్చా లేదా అనేదానిపై ఆదేశాలివ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్ను కోరుతూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. -
ఎన్జీటీ ఆదేశాల అమలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లాలో జీవో 111ను ఉల్లంఘించి ఫాంహౌజ్ నిర్మాణం చేశారనే ఆరోపణలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ నెల 5న ఎన్జీటీ ఇచ్చిన నోటీసులను, కమిటీ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. రిట్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పి.నవీన్రావుల ధర్మాసనం బుధవారం స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతివాదులైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే ఎన్జీటీ నోటీసులివ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదించారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని, దీంతో రేవంత్ తన ఉనికి కోసం పిటిషనర్కు సంబంధం లేని నిర్మాణంపై ఎన్జీటీలో కేసు వేశారని చెప్పారు. జీవో 111ను ఉల్లంఘించి నిర్మాణం జరిగి ఉంటే ఆరు నెలల్లోగా ఎన్జీటీని ఆశ్రయించాలన్న చట్ట నిబంధనకు వ్యతిరేకంగా రేవంత్ కేసు వేశారని, ఈ విషయాలను ఎన్జీటీ పట్టించుకోకుండానే పిటిషనర్కు నోటీసు జారీ చేసి కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చిందన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, బెయిల్పై ఆయన విడుదలయ్యారని తెలిపారు. ఏనాడో జరిగిన నిర్మాణాలపై రేవంత్ తప్పుడు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై గూగుల్ మ్యాప్లను కూడా సమర్పించారని, వీటిని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోకుండానే ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. పిటిషనరే నిర్మాణం చేసినట్లుగా ఆధారాలు లేకుండా రేవంత్ ఫిర్యాదు చేస్తే దానిపై ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇదిలాఉండగా తనను ప్రతివాదిగా చేయకుండా ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం చెల్ల దని, వాటిని కొట్టేయాలని ఫాంహౌజ్ యజమాని బి.ప్రదీప్రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఫాంహౌజ్ ప్రదీప్రెడ్డిదని, ఆయనకు తెలియకుండానే ఎన్టీటీ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని సీనియర్ న్యాయవాది శ్రీరాం రఘురాం వాదించారు. వాదనల తర్వాత ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది. -
కేటీఆర్కు ఊరట.. రేవంత్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. జీవో 111కు విరుద్ధంగా హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దాఖలు చేయడంతో కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (రేవంత్రెడ్డికి పోసాని హితవు) అయితే ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఆ వివాదస్పద ఫాంహౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రేవంత్ పిటిషన్పై ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఇక అంతకుముందు ఎన్జీటీ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ ఆసహనం వ్యక్తం చేశారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకందని, ఇందులో రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని ఆరోపించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వులు జారీచేసిందని, దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. (పదవికి దూరంగా ఉండి నిరూపించుకోలేరా?) ఇక జీవో 111కు విరుద్దంగా నగర శివార్లలో కేటీఆర్ ఫాంహౌస్ కట్టారని రేవంత్ రెడ్డి ఎన్టీటీని ఆశ్రయించారు. జస్టిస్ రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్ గుప్తాతో కూడిన చెన్నై బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది. పిటిషనర్ న్యాయవాది కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. జీవోలు, చట్టాలు అమలు చేయాల్సిన మంత్రే వాటిని ఉల్లంఘించారని, జీవో 111 ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని నివేదించారు. నాలాను కబ్జా చేసి రోడ్డు నిర్మించారని చెప్పారు. దీనిపై ఎన్జీటీ స్పందిస్తూ.. అక్రమ నిర్మాణం, జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. (వివాదాస్పద ఫాంహౌస్పై నిజ నిర్ధారణ కమిటీ) కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2018లో జీవో 111 ఉల్లంఘనలపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల అమలు నివేదికను కూడా ఇవ్వాలని ఎన్జీటీ పేర్కొంది. -
దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటిని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) అలాగే ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ చౌటుప్పల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్ను చేర్చింది. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తూ కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) -
జీవో 111 ఉల్లంఘనలపై నిజ నిర్ధారణ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: జీవో 111కు విరుద్ధంగా హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ప్రతివాదులైన మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ మేనేజ్మెంట్ సర్కిల్కు నోటీసులు జారీచేసింది. జస్టిస్ రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్ గుప్తాతో కూడిన చెన్నై బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్ను విచారించింది. పిటిషనర్ న్యాయవాది కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. జీవోలు, చట్టాలు అమలు చేయాల్సిన మంత్రే వాటిని ఉల్లంఘించారని, జీవో 111 ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని నివేదించారు. నాలాను కబ్జా చేసి రోడ్డు నిర్మించారని చెప్పారు. దీనిపై ఎన్జీటీ స్పందిస్తూ.. అక్రమ నిర్మాణం, జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2018లో జీవో 111 ఉల్లంఘనలపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల అమలు నివేదికను కూడా ఇవ్వాలని ఎన్జీటీ పేర్కొంది. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన: ఎన్జీటీ తీర్పు
న్యూఢిల్లీ: విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు, బాధితులకు పంచాలని ఆదేశించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు రెండు నెలల్లో ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది. ఇందుకోసం కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయాలన్న ఎన్జీటీ.. రెండు నెలల్లో నివేదిక అందజేయాల్సిందిగా కమిటీని ఆదేశించింది. అదే విధంగా తుది నష్టపరిహారాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ.. కాలుష్య నియంత్రణ మండలి కలిసి అధ్యయనం చేయాలని సూచించింది. (‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు) ఇక కంపెనీకి అనుమతుల విషయంలో చట్ట ప్రకారంగా నడుచుకోని అధికారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. అదే విధంగా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ కంపెనీకి అనుమతులు ఇస్తే వాటి వివరాలు ట్రిబ్యునల్కు తెలియజేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ పర్యవేక్షణ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని.. అదే విధంగా రసాయన పరిశ్రమల పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది.(నివేదిక వచ్చాక నిర్ణయం: సీఎం జగన్) కాగా గ్యాస్ లీకేజీ ఘటనపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. కోటి రూపాయిల ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పదిరోజుల్లోనే పరిహారం అందించారు. అదే విధంగా విషాదానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను ప్రభుత్వం నియమించింది. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయని వెల్లడించింది. -
రూ.50 కోట్లు జమ చేయండి, ఎల్జీ పాలిమర్స్కు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్లో విషవాయువు లీకైన సంఘటనను జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా, వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక నష్టపరిహారం కింద రూ.50 కోట్లను జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఎల్జీ పాలిమర్స్ను ఎన్జీటీ ఆదేశించింది. అలాగే ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ పీసీబీ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. (ఏం జరిగింది పెద్దాయనా?) ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘటనకు దారి తీసిన కారణాలపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ వి.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పులిపాటి కింగ్, సీపీసీబీ సభ్య కార్యదర్శి, నీరి హెడ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. (గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు) పర్యావరణ నిబంధనలు, ప్రమాదకర రసాయనాలు నిబంధనలు లేదని స్పష్టమవుతోందని, భారీ మొత్తంలో విషవాయువులు వెలువడడానికి ఖచ్చితంగా ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని ఎన్టీటీ స్పష్టం చేసింది. ఫ్యాక్టరీని నియంత్రించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే వారు కూడా బాధ్యులేనని, ఈ ఘటనకు దారితీసిన కారణాలు, లోపాలు, నష్టం, తదుపరి చర్యలపై దృష్టి పెట్టామని పేర్కొంది. తదుపరి కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) గ్యాస్ లీక్ ఘటనల క్రమం, వైఫల్యాలకు గల కారణాలు, బాధ్యులు, ప్రజలు, జీవాల ప్రాణాలకు కలిగిన నష్టం, గాలి నీరు భూమికి జరిగిన నష్టం అంచనా బాధితులు, పర్యావరణానికి నష్టపరిహారం చెల్లింపు కు తీసుకున్న చర్యలు మళ్లీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఐదు అంశాలపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశం -
ముంపు ప్రాంతాల నివేదిక ఇవ్వండి
సాక్షి, ఢిల్లీ: పోలవరం ముంపు ప్రాంతాల నివేదికలను తమకి కూడా అందజేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పీపీఏ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆ నివేదికలను ఎన్జీటీతో పాటూ, కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డుకు అందించాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి ఎన్జీటీ ధర్మాసనం వాయిదా వేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై కమిటీ ఏపీలోని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులపై దాఖలైన పిటిషన్లపైనా ఎన్జీటీలో విచారణ కొనసాగింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమో లేదో స్పష్టత లేదని ఎన్జీటీ పేర్కొంది. ఒకవైపు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ మరోవైపు ఏపీ ప్రభుత్వానికి షోకాజు నోటీసులు ఎందుకు ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. పోలవరం మౌలిక సదుపాయాలు వినియోగించుకుంటే అనుమతులు అవసరం అని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో సమావేశం కావాలని కమిటీని ఆదేశించింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమో కాదో నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు, తాత్కాలిక ప్రాజెక్టులను ఎన్జీటీ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా తాత్కాలికంగా నిర్మించామని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను మే 4కి వాయిదా వేసింది. -
గొంతు కోస్తోంది!
సాక్షి, గుంటూరు: సంప్రదాయ క్రీడలకు ప్రతీక అయిన సంక్రాంతి సమయంలో ఏటా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. గతంలో గాలిపటాలను ఎగురవేసేందుకు నూలుతో తయారైన దారం (మాంజా) ఉపయోగించేవారు. దీనివల్ల ఎవరికీ.. ఎలాంటి గాయాలయ్యేవి కావు. ఇప్పుడు వీటి స్థానంలో రసాయనాలతో కూడిన చైనా మాంజా వాడకంతో తీవ్ర గాయాల పాలవుతున్న పాదచారులు, వాహన చోదకుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాజు పిండి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే చైనా మాంజాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించినా మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. కౌశిక్ మృతదేహం (ఫైల్) యథేచ్ఛగా విక్రయాలు చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తోంది. ఇతర గాలిపటాలను చైనా మాంజాతో సులువుగా తెంపవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది దీనిపట్ల మొగ్గు చూపుతున్నారు. గాలి పటాలు ఎగిరే సమయంలో ఈ మాంజా విద్యుత్ తీగలు, వృక్షాలకు చిక్కుకుని పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వీటి మనుగడకు పెనుముప్పుగా మారిన చైనా మాంజా వినియోగాన్ని పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాలిపటాలను నియంత్రించే క్రమంలో ఒక్కోసారి ఎగురవేసే వ్యక్తులు కూడా గాయాల పాలవుతున్నారు. - గుంటూరులో సోమవారం తండ్రితో కలసి బైక్పై వెళ్తున్న మూడేళ్ల చిన్నారి కౌశిక్ మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. - గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో చైనా మాంజా గొంతుకు చుట్టుకుని మానవ్ శర్మ (28) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. - 2018లో చైనా మాంజా కారణంగా గుజరాత్లో 16 మంది మరణించడంతో కైట్ ఫెస్టివల్తో పాటు ఈ మాంజా వాడకాన్ని నిషేధించారు. చట్టం ఏం చెబుతోందంటే.. రసాయనాలు పూసిన చైనా మాంజాతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. 2016 మార్చి 4న ఏపీ ప్రభుత్వం, 2016 జనవరిæ 13న తెలంగాణ సర్కారు వీటి విక్రయాలను నిషేధించాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను అమ్మటం, కొనుగోలు చేయడం నేరం. దీన్ని ఉల్లంఘించే వారికి ఐదేళ్లు, అంతకుమించి జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. చైనా మాంజా తయారీ ఇలా.. దారానికి గాజు పిండి, సగ్గు బియ్యం, గంధకం, రంగులు అద్ది ఉడికించి చైనా మాంజా తయారు చేస్తారు. తమిళనాడులోని ఆరంబాకం, చెన్నైలోని ప్యారిస్, మౌంట్రోడ్డు మొదలైన ప్రాంతాల్లో చైనా మాంజా ఎక్కువగా తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి ఏపీలోని పలు జిల్లాలకు సరఫరా అవుతుంది. తమిళనాడు సరిహద్దులో ఉన్న నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట, గుంటూరు నగరంలోని పట్నంబజార్, లాలాపేటలో కూడా చైనా మంజా తయారు చేస్తారు. రాష్ట్రంలోని కర్నూలు చిత్తూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో కుటీర పరిశ్రమగా చైనా మాంజా తయారీ నడుస్తోంది. మనుగడకు ముప్పు చైనా మాంజాతో గాలిపటాలను ఎగురవేయడం వల్ల పక్షులు, జంతువులకే కాకుండా మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతోంది. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నూలు దారంతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగవు –తేజోవంత్, కార్యదర్శి, హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ ప్రజల్లో చైతన్యం రావాలి ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజాను ఎవరూ వినియోగించకూడదు. జీవోలకే పరిమితం అయిన నిషే«ధాన్ని ప్రభుత్వాలు అమలు చేసి చూపించాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. చైనా మాంజాను స్వచ్ఛందంగా నిరాకరించాలి – గోపాల్ సూరాబత్తుల, వ్యవస్థాపక కార్యదర్శి, యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ఇక కఠిన చర్యలు చైనా మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై ఎవరైనా దీన్ని కొనుగోలు చేసినా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులను సైతం అప్రమత్తం చేస్తాం. చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం – ఐ.శామ్యూల్ ఆనంద్కుమార్, కలెక్టర్, గుంటూరు -
ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) గురువారం విచారణ చేపట్టింది. ఇసుక తవ్వకాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం 20 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది. కాగా తెలంగాణలో అక్రమ ఇసుక తవ్వకాల జరుగుతున్నాయని.. రేలా సంస్థ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్జీటీ విచారణ చేపట్టింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ జరిపింది. నెల రోజుల్లో ఇసుక తవ్వకాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. లేదంటే రూ.100 కోట్లు జరిమానాను సీపీసీబీ ఖాతాలో వేయాల్సి ఉంటుందని ఏపీకి ఎన్జీటీ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 14కు వాయిదా వేస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) పేర్కొంది. -
ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!
ఢిల్లీ: తెలంగాణలోని గోదావరినదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగినట్లు నివేదికల్లో స్పష్టంమవుతోదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి నివేదికలను పరిశీలించింది. అయితే సుమారు నాలుగు కోట్ల పది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా.. ఎలా తవ్వుతారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల్లో పూడికతీతలో భాగంగా ఇసుకను తీశామని తెలిపింది. కాగా అన్నారం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు పూరైనప్పటికీ.. వాటిలో పూడికతీత ఎలా సాధ్యమైందని నిలదీసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి చట్టం ఏర్పాటు చేయలేదా అని ఎన్జీటీ మండిపడింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. -
మేఘాలయ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: అక్రమ బొగ్గు తవ్వకాలను అరికట్టడంలో విఫలమైనందున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ .100 కోట్ల జరిమానాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)లో జమ చేయాలని మేఘాలయ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అక్రమంగా సేకరించిన మొత్తం బొగ్గును కోల్ ఇండియాకు అప్పగించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంబంధిత అధికారుల అనుమతులకు లోబడి ప్రైవేటు, కమ్యూనిటీ యాజమాన్యంలోని భూముల్లో మైనింగ్ ఆపరేషన్ రాష్ట్రంలో కొనసాగడానికి ధర్మాసనం అనుమతించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జనవరి 4న మేఘాలయ ప్రభుత్వానికి జరిమానా విధించింది. మేఘాలయలో పెద్ద సంఖ్యలో గనులు అక్రమంగా పనిచేస్తున్నాయని మేఘాలయ అంగీకరించింది. గౌహతి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కకోటి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రకారం, మేఘాలయలో 24 వేల గనులుండగా, ఎక్కువ భాగం అనుమతులు లేనివేనని పేర్కొంది. -
పర్యావరణ కలుషితం హత్య లాంటిదే..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితం పేరుతో నదీ పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేసినట్టు ఇసుక తవ్వకాలు జరిగితే ఎలా అని ప్రశ్నించింది. పర్యావరణాన్ని కలుషితం చేయడం హత్య లాంటిదేనని అభిప్రాయపడింది. పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, భారీ జరిమానాలు విధించాలని, అది చూసి తప్పు చేయాలనుకొనే వారు భయపడాలని సూచించింది. నూతన రాజధాని రూపుదిద్దుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వాయు, జల కాలుష్య నివారణకు గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై ఎన్జీటీ శుక్రవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఢిల్లీ పిలిపించుకొని చర్చించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ కె.రామకృష్ణన్, జస్టిస్ డా. ఎన్.నందలతో కూడిన బెంచ్ ముందు సీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణకు పలు సూచనలు చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల విషయమై ఈ నెల 4న జరిమానా విధించామని గుర్తు చేసింది. నష్ట పరిహారం వసూలు జరగడం లేదు.. పర్యావరణాన్ని కలుషితం చేయడం కూడా నేరమేనని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ‘ఒక హత్య వల్ల ఒక మనిషి చనిపోతాడు. పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల అనేక మంది చనిపోతున్నారు. ఇది కూడా మర్డర్ లాంటిదే’ అని పేర్కొంది. కానీ పర్యావరణానికి జరుతున్న నష్టానికి సమానంగా నష్టపరిహారం వసూలు జరగడం లేదంది. అసలు పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చలేమని వ్యాఖ్యానించింది. నదులను ఇష్టానుసారం తవ్వేయడం వల్ల ప్రవాహ దిశలు మారిపోవడం, వరదలు రావడం, నీటి ఎద్దడి, భూగర్భ జలాలు అడుగంటడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. తద్వారా ప్రజలు తమ హక్కులను కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సరైన ప్రణాళికతో వెళ్లడం లేదని, వారి వద్ద ఉన్న నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకపోవడం వల్ల వందల కోట్లు మిగిలిపోతున్నాయని తెలిపింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఈ రోజుల్లో సరిగ్గా అంచనా కూడా వేయలేకపోతున్నామని, కొన్ని విషయాల్లో ఎలాంటి పర్యావరణ నష్టం జరగలేదని రాష్ట్ర స్థాయి కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇస్తే.. తద్భిన్నంగా తాము పంపే కమిటీలు నివేదికలు ఇస్తున్నాయని వివరించింది. సీఎస్ వచ్చినా హాజరుకాని ఏజీ, ప్రభుత్వ న్యాయవాది.. ఎన్జీటీలో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరైనా అడ్వకేట్ జనరల్ (ఏజీ) మాత్రం హాజరు కాలేదు. కనీసం ఢిల్లీలో నియమించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కూడా ట్రిబ్యునల్తో సమావేశానికి వెళ్లకపోవడం గమనార్హం. మీరే దగ్గరుండి పర్యవేక్షించండి.. పర్యావరణ పరిరక్షణ అన్నది తమ ప్రధాన ఎజెండా అని, అది దేశంలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక్కటే అని బెంచ్ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనే చర్చించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించి పిలిపించినట్టు తెలిపింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా ఉందని, విశాఖలో వ్యర్థాలన్ని సముద్రంలో కలుస్తున్నాయని, కొల్లేరు 14 రకాల హానికారక క్రిములతో నిండి ఉందని, తూర్పుగోదావరి, శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉందని వివరించింది. దీనిపై దృష్టి సారించాలని, పర్యావరణ పరిరక్షణను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎస్కు సూచించిన ట్రిబ్యునల్.. దీని కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలంది. సీఎస్ స్పందిస్తూ తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానని, నిబంధనల మేరకు అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక క్లçస్టర్లు ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి మరో ఆరు నెలల తరువాత సమావేశమవుదామని తెలిపింది. -
ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎస్ సమీక్షలపై అధికార పక్షం విమర్శలు సంధిస్తున్న సమయంలో ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు?.ఎవరిని కలవబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఎన్టీటి (జాతీయ హరిత ట్రిబ్యునల్) విచారణ కోసమే సీఎస్ ఢిల్లీ వెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పర్యటనపై అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై రేపు (శుక్రవారం మధ్యాహ్నం) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో జరిగే విచారణకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవడంపై ఎన్జీటీలో విచారణ జరుగుతోంది. ప్రధానంగా పురపాలక సంఘాలు, అటవీ శాఖలు విఫలమవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం, అటవీ చట్టాల ఉల్లంఘనపై ఎన్జీటీ రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్జీటీలో జరిగే విచారణకు సీఎస్తో పాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఢిల్లీ వెళ్లారు. మరోవైపు కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి 100కోట్ల రుపాయలు నెల రోజుల్లోగా డిపాజిట్ చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏప్రిల్ 4న ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. దీనిపై గడువు దాటితే 12.5శాతం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ బృందం వాదనలు వినిపించనుంది. మరోవైపు హస్తిన పర్యటనలో ప్రధాన కార్యదర్శి ఎవరెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎన్జీటీ విచారణకు పరిమితమవుతారా, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర ఢిల్లీ పెద్దలను కలుస్తారనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సీఎస్ టార్గెట్గా టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. -
పోలవరంలో ఎన్జీటీ సభ్యుల పర్యటన
సాక్షి, పశ్చిమ గోదావరి: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కమిటీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మట్టి డంపింగ్ ప్రదేశాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులు, అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలను, తవ్విన మట్టిని ఎక్కడబడితే అక్కడ డంపింగ్ చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఎన్జీటీకి ఫిర్యాదు వెళ్లింది. మే 10వ తేదీన ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఎన్జీటీ కమిటీ సభ్యులు పోలవరం డంపింగ్ ప్రాంతంలో పర్యటించారు. -
బ్లాక్ మార్కెట్లోకి ఉచిత ఇసుక
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనులు పొందిన పలు బడా నిర్మాణ సంస్థలు చిల్లర పనులు చేస్తున్నాయి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పుతో ఏర్పడిన ఇసుక కొరతను ఇవి సొమ్ము చేసుకుంటున్నాయి. రాజధాని పనులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందిన ఇసుకను ఈ సంస్థలు ప్రస్తుత కొరతను ఆసరాగా చేసుకుని తమ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న ఇసుకను ఇతర సంస్థలకు అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయి. ట్రాక్టరు ఇసుక విజయవాడ, గుంటూరులో రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, ఇతర ప్రాంతాలకు లారీ ఇసుకను రూ.20 నుంచి రూ.25 వేలకు (రవాణా చార్జీలతో కలిపి) అమ్ముకుంటున్నాయి. పదిరోజులుగా ఈ నిర్మాణ సంస్థల్లో కొన్ని తమ ప్రధాన పనులను నిలిపివేసి ఇతర నిర్మాణ సంస్థలకు ఇసుక అమ్ముకునే పనిలో పడ్డాయి. దీంతో పదిహేను రోజుల క్రితం వరకు 60–70 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక నిల్వలు ఏ పనులు చేయకుండానే రోజురోజుకీ తరుగుతున్నాయి. దీనిపై అధికారులెవరూ ప్రశ్నించకపోవడంతో విచ్చలవిడిగా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా తవ్వకాలు నిజానికి రాజధాని పరిధిలో నిర్మాణ పనులు పొందిన పలు సంస్థలకు కృష్ణా, గుంటూరు పరిధిలోని నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉచితంగా ఇసుక తవ్వుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సంస్థలన్నీ దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన పనులు పొందాయి. వాస్తవంగా ఆ పనులకు అంచనాలు వేసిన సమయంలో ఇసుక ఎంత మేరకు అవసరం అవుతుందో అంతే ఇసుకను ఆ సంస్థలు తీసుకోవాలి. అయితే, ఇవన్నీ ప్రభుత్వ అనుకూల సంస్థలు కావడంతో అవి ఎంత ఇసుక తవ్వుతున్నాయి.. పనులకు ఎంత వాడుతున్నాయి.. ఇతర సంస్థలకు ఎంత అమ్ముకుంటున్నాయి అనే విషయాలను అధికారులు పట్టించుకోలేదు. గతంలోనూ ఇసుక కొరత ఏర్పడినప్పుడు కొన్ని సంస్థలు రెడీమిక్స్ ప్లాంట్లకు అమ్ముకున్నాయి. ఇప్పుడు అనేక సంస్థలు ఇసుకను ఇష్టారీతిన అమ్ముకుంటున్నాయి. ఆ సంస్థలకు ప్రభుత్వం పెద్దఎత్తున బిల్లులు బకాయి పడటంతో కొన్ని సంస్థలు నామమాత్రంగా పనులు చేస్తుంటే మరికొన్ని పూర్తిగా పనులు నిలిపివేసి, బ్లాక్లో ఇసుక అమ్ముకునే పనిలో పడ్డాయి. ఫ్రీగా పొంది అధిక రేట్లకు అమ్మకాలు ఇదిలా ఉంటే.. కృష్ణా నదిలో విచ్చలవిడిగా ఇసుక తోడేయడం వలన పర్యావరణం దెబ్బతింటుందని ఈ ప్రాంతానికి చెందిన కొందరు పర్యావరణ ప్రేమికులు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. దీంతో నెల రోజుల క్రితం నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లాలోని 37 రీచ్లను, కృష్ణా జిల్లాలోని సూరాయిపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం రీచ్లలో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. మరోవైపు.. ఇసుక కొరత ఉన్నప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు రాజధాని పనులు పొందిన పలు నిర్మాణ సంస్థల నుంచి అధిక ధరకు ఇసుకను కొని పనులను కొనసాగిస్తున్నాయి. కాగా, ఇసుక అక్రమ అమ్మకాలు తమ ద్టృష్టికి రాలేదని కృష్ణా, గుంటూరు జిల్లాల మైనింగ్ అధికారులు చెప్పారు. రాజధాని పనులను పొందిన సంస్థలపై పర్యవేక్షణ తమ పరిధిలోని అంశం కాదన్నారు. -
వ్యర్థాల నియమావళి బాధ్యత పీసీబీదే
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్, బయో మెడికల్ వేస్ట్ నియమాల అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి అప్పగించి, ప్రత్యేక అధికారులను బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ఆదేశించారు. భవన నిర్మాణ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీ సైక్లింగ్ చేసేందుకు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాల అమలుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంబంధిత శాఖల అధికారులతో శనివారం సచివాలయంలో సమీక్షించారు. ఎన్జీటీకి సమర్పించాల్సిన నివేదికలకు చెందిన సమాచారాన్ని ఈ నెల 23వ తేదీలోగా పీసీబీకి సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గృహాల నుంచి 8,450 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, 8,273 మెట్రిక్ టన్నులు గడప గడపకూ వెళ్లి సేకరిస్తున్నట్లు సీఎస్ ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యర్థాల సేకరణ కోసం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016’కు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు వివరించారు. పురపాలక సంఘాల్లో డంపింగ్ యార్డులకు అవసరమైన స్థల సేకరణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలను తగుల బెట్టడంపై ప్రజలకు అవగాహన తదితర అంశాలను జోషి సమీక్షించారు. 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజూ 15వేల కిలోల బయో మెడికల్ వేస్ట్ను సేకరిస్తున్నట్లు అధికారులు వివరించారు. 50 మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించి, నిబంధనలు అతిక్రమిం చిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనంపై ప్రణాళిక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా నదీ కాలుష్యాన్ని నివారించేందుకు నిర్దిష్ట కాల పరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. నదుల పునరుజ్జీవనం ప్రణాళికపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించామన్నారు. మొదటి, రెండో ప్రాధాన్యతలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర కాలు ష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి నివేదిక సమర్పించినట్లు అధికారులు వివరించారు. జూన్ 30 నాటికి తర్వాతి ప్రాధాన్యతా క్రమంలో నదుల్లో కాలుష్య నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికపై నివేదిక సమర్పిస్తామన్నారు. వాయు, పారిశ్రామిక కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపైనా ఈ సమావేశంలో జోషి సమీక్ష జరిపారు. కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు (ఈటీపీ), ఉమ్మడి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు (సీఈటీపీ), మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల (ఎస్టీపీ) పనితీరుపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1979 పరిశ్రమల్లో ఈటీపీలు పనిచేస్తున్నాయని, పనిచేయని చోట సం బంధిత పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మూసివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. వీటితో పాటు మరో 372 ఎస్టీపీలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. నెల రోజుల్లో పటాన్చెరు ఎస్టీపీ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఖాజిపల్లి, ఇస్నాపూర్, కిష్టారెడ్డిపేట, గండిగూడెం, ఆ సానికుంట చెరువుల్లో కాలుష్య నివారణకు ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ ఎస్టీపీల ఏర్పాటుకు వీలుగా సవివర ప్రణాళిక నివేదిక (డీపీఆర్) తయారు చేయడంతో పాటు నిధుల సేకరణ వ్యూహాన్ని కూడా నెల రోజుల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ ఏర్పాటు విషయంలో చెన్నై ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలపై ఆరోగ్య, నీటిపారుదల, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో ప్రత్యేకంగా చర్చించారు. కాగా, ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, పీసీబీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, మున్సిపల్ డైరెక్టర్, కమిషనర్ టి.కె.శ్రీదేవిలతో పాటు గనులు, ఆరోగ్య, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల వేళ చంద్రబాబు సర్కార్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణానది వద్ద ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100కోట్లు జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకూ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అక్రమంగా ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. చదవండి....(ప్రకాశం బ్యారేజీకి ముప్పు!) కాగా నిబంధనల ప్రకారం పది టైర్ల లారీకి 21 టన్నులు లోడ్ చేయాల్సి ఉండగా, 30 నుంచి 40 టన్నులు లోడ్ చేస్తూ పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటితే చాలు 60, 70 కిలోమీటర్ల స్పీడ్తో బాడీ లారీలు కాబిన్ లెవల్ ఇసుక లోడ్ వేసుకొని పరుగులు తీస్తున్నాయి. పోలీసులు ఎక్కడైనా గస్తీ కాస్తుంటే ముందస్తుగానే లారీ డ్రైవర్లకు సమాచారం ఇచ్చేందుకు మూడు కార్లను ఉపయోగించి, కొంతమంది తిరుగుతూ లారీ డ్రైవర్లకు సమాచారం ఇస్తున్నారు. ఎవరైనా అధికారులు కానీ, పోలీసులుకానీ ఉన్నారని తెలిస్తే రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం చెరువు, మందడం, మందడం బైపాస్రోడ్డులో లారీలను గప్చుప్గా పక్కనపెట్టి అధికారులు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి వారి గమ్య స్థానాలకు బయల్దేరుతున్నారు. ప్రతిరోజూ కనకదుర్గ వారధి మీద నుంచి కృష్ణాజిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిపోతుంది. చదవండి...(ఇసుకతో కోట్లు కొల్లగొట్టిన పచ్చనేతలు) నిద్రావస్థలో అధికారులు... రాజధాని పరిధిలోని ఇసుక రీచ్ల్లో పట్టపగలే లోడింగ్ చేయించుకొని, అర్ధరాత్రి దాటే వరకు లారీలను ఎక్కడో ఒక చోట దాచి పెట్టి, అర్ధరాత్రి దాటిన తరువాత వాటిని రోడ్డెక్కించి జనాలను భయభ్రాంతులను చేస్తూ, అధిక వేగంతో వెళ్తున్న ఇసుక లారీలను పట్టించుకోవడం లేదు. రాజధాని పరిధిలో అధిక లోడ్తో తరలివెళ్లే ఇసుక లారీకి మంగళగిరి ఆర్టీఓ పరిధిలో నెలకు రూ.30వేలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఫోక్స్వ్యాగన్పై 500 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్వ్యాగన్కు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.500 కోట్ల జరిమానా వడ్డించింది. ఫోక్స్వ్యాగన్ కంపెనీ తన డీజిల్ కార్లలో చీట్ డివైస్ను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించిందని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ పరీక్షలను తప్పుదోవ పట్టించే సాఫ్ట్వేర్ను ఫోక్స్వ్యాగన్ తన కార్లలో వినియోగించిందని, ఈ కార్ల అమ్మకాలను భారత్లో నిషేధించాలంటూ ఐలావాడి అనే స్కూల్ టీచర్, మరికొందరు ఫిర్యాదు చేశారు. రెండు నెలల్లో జరిమానా డిపాజిట్ చేయండి రూ.500 కోట్ల జరిమానాను రెండు నెలల్లో డిపాజిట్ చేయాలని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ అధ్యక్షతన గల ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నేషనల్ క్యాపిటల్ రీజియన్తో పాటు అధికంగా కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. కాగా తాము బీఎస్ ఫోర్ నిబంధనలను ఉల్లంఘించలేదని ఫోక్స్వ్యాగన్ పేర్కొంది. రహదారి పరీక్షలు ఆధారంగా తనిఖీలు జరిపారని, ఈ రహదారి పరీక్షలకు నిర్దేశిత ప్రమాణాలు లేవని వివరించింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ పున: ప్రారంభంపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత అలాగే కొనసాగుతుందని సోమవారం తీర్పు వెలువరించింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు పరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వేదాంత గ్రూపు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఎన్జీటీకి ఈ కేసుపై విచారణ చేపట్టే అధికార పరిధి లేదని పేర్కొంది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది. ‘స్టెరిలైట్’ రాగి ప్లాంట్ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ గతేడాది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
500 మీటర్లలోపు మైనింగ్ జరపవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భూపాలపల్లి జిల్లా కాకతీయ గని–2లో పర్యావరణ నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు 500 మీటర్లలోపు బ్లాస్టింగ్ ద్వారా ఓపెన్కాస్ట్ మైనింగ్ నిర్వహించ వద్దంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్కాస్ట్ మైనింగ్ను సవాల్ చేస్తూ దాఖలైన కేసును జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఓపెన్కాస్ట్ మైనింగ్లో బ్లాస్టింగ్ వల్ల వెలువడే వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, పర్యావరణానికి హాని కలుగుతోందని, పేలుళ్ల శబ్దానికి నివాసాలు ధ్వంసం అవుతున్నాయని పిటిషనర్ రాజలింగమూర్తి తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ వాదించారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ 500 మీటర్లలోపు మైనింగ్ నిర్వహించుకోవచ్చంటూ గతంలో కేంద్ర పర్యావరణ శాఖ సవరించిన పర్యావరణ నిబంధనలను తోసిపుచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ కార్యకలాపాల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్ర మండలి సంయుక్తంగా తనిఖీ చేసి ఒక నెల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ కూడా తనిఖీ చేపట్టాలని ఆదేశించింది. నివేదిక అందిన అనంతరం తదుపరి విచారణ జరుపుతామన్న బెంచ్ పర్యావరణ నిబంధనలు అమలు చేసేవరకు 500 మీటర్ల పరిధిలో పేలుళ్ల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. సవరించిన పర్యావరణ నిబంధనల అమలుకు కేంద్ర పర్యావరణ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని బెంచ్ అభిప్రాయపడింది. -
గోదావరికి ఊపిరి!
సాక్షి, హైదరాబాద్: కాలుష్య కాసారంగా మారిన గంగానదిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నడుం బిగించినట్లే.. దక్షిణ గంగగా పేరున్న గోదావరిని పవిత్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర పరీవాహకంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న గోదావరికి పునరుజ్జీవం పోసి కొత్త ఊపిరిలూదే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసింది. బాసర మొదలు భద్రాచలం వరకు 500 కిలోమీటర్ల మేర నదిని శుద్ధి చేసి, దాన్ని మున్ముందు పవిత్రంగా ఉంచేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, కేంద్ర సూచనల నేపథ్యంలో గోదావరిని కలుషితం చేస్తున్న మురుగు, పరిశ్రమల కాలుష్యం, ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్పెట్టి పునరుజ్జీవం చేయనుంది. నీటి నాణ్యత దయనీయం.. గోదావరి నది తీరం పొడవు 1,495 కిలోమీటర్లు కాగా, దీని పరీవాహకం 3.12లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో బాసర నుంచి భద్రాచలం వరకు 500 కి.మీ.ల మేర ప్రయాణిస్తున్న గోదావరిలో 4 ఉప నదులు, 54 నాలాలు కలుస్తున్నాయి. నది పరీవాహక ప్రాంతంలో ఉన్న 19 ప్రధాన పట్టణాల నుంచి గోదావరిలో అవ్యవస్థీకృత వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలంలో మురుగునీటి శుద్ధి కేంద్రం లేకపోవడంతో ఆ నీరంతా బూర్గంపహాడ్ వద్ద నదిలో కలుస్తోంది. ఐటీసీ కాగితపరిశ్రమ నుంచీ కలుషిత జలాలు వస్తున్నాయి. మంచిర్యాల పట్టణ మురుగునీరు రాళ్లవాగు ద్వారా గోదావరిలో చేరుతోంది. నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ (డీఓ) పరిమాణం క్రమంగా తగ్గుతోంది. డీఓ పరిణామం లీటర్కు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక నీటిలో బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్కు 3 గ్రా. మించొద్దని నిబంధనలు ఉన్నా.. ప్రస్తుతం నదిలో బీవోడీ స్థాయి 4 నుంచి 9 గ్రాములు/లీ. వరకు ఉంది. దీంతో నదిలోని నీటిని తాగేందుకు కానీ, స్నానాలకు కానీ వాడేందుకు పనికి రావు. డీవో తగ్గేకొద్దీ బీఓడీ పెరుగుతూ వస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే మున్ముందు జలచరాలకు తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తడంతో పాటు సాగు అవసరాలను తీర్చడం గగనంగా మారనుంది. మురుగు ముంచేస్తోంది.. నది పరీవాహకంలోని 54 మురుగు కాల్వల ద్వారా మురుగు గోదావరిలోకి ప్రధానంగా వచ్చి చేరుతోంది. మొత్తం పరీవాహక ప్రాంతంలో 54 ప్రధాన పట్టణాల్లో 22.57 లక్షల మేర జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 249.81 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) మేర నీరు వినియోగిస్తున్నారు. అందులో 199.96 ఎంఎల్డీ మురుగు నదిలో చేరుతోంది. ఇందులో 10 ఎంఎల్డీ కన్నా ఎక్కువగా తుంగిని (34.58 ఎంఎల్డీ), మంచిర్యాల (25.22 ఎంఎల్డీ), సింగారెడ్డిపల్లి (25.02ఎంఎల్డీ), బొర్నాపల్లి(16.83 ఎంఎల్డీ), బూర్గంపాడ్ (16.9 ఎంఎల్డీ), కోటిలింగాల (11.59 ఎంఎల్డీ) వంటి నాలాల ద్వారా నదిలోకి పెద్ద ఎత్తున మురుగునీరు చేరుతోంది. రోజుకు 6,75,586 కేజీల ఘన వ్యర్థాలు నదిలో చేరుతుండటం మరింత సమస్యగా మారుతోంది. దీనికి తోడు పరీవాహకం వెంబడి ఉన్న 244 పరిశ్రమల ద్వారా 8,825 కేఎల్డీల వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. మార్గం చూపిన కేంద్రం.. దేశవ్యాప్తంగా కాలుష్యం బారిన పడుతున్న నదులు 351 వరకు ఉండగా అందులో గోదావరి ఒకటని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుర్తించింది. ఈ నదిలో ప్రమాణాలకు అనుగుణంగా నీటి నాణ్యత లేదని, ఈ దృష్ట్యా శుద్ధి చేయని వ్యర్ధాలు, ఘన వ్యర్థాలు రాకుండా చూడాలని, పరీవాహకంలో అక్రమాలను నిరోధించి, అక్రమ మైనింగ్ను అడ్డకుని నదికి పునరుజ్జీవం పోయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నీటి పారుదల శాఖ, పర్యావరణ, అటవీ శాఖలు సంయుక్తంగా గోదావరి పునరుజ్జీవనానికి ప్రణాళికలు రూపొందించాయి. బాసర దగ్గరలోని కందుకుర్తి నుంచి భద్రాచలం దగ్గరున్న బూర్గంపహాడ్ వరకు నది తీర ప్రాంతాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మొదటి దశలో నది కాలుష్య కారకాల గుర్తింపు, రెండో దశలో సమస్యకు తగిన పరిష్కారం చూపడం, దాన్ని అమలుచేయాలని, మూడో దశలో నది సంరక్షణ చర్యలు చేపట్టి, దాని అభివృద్ధికి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచించాయి. ప్రస్తుతం పరీవాహక పట్టణాల్లో మొత్తం 73 ఎంఎల్డీ సామర్థ్యమున్న మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) ఉండగా, మరో 19 చోట్ల కొత్తగా ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించాయి. వీటితో పాటు కాలుష్య నియంత్రణకు కొన్ని నిబంధనలను రూపొందించి, వాటిని కచ్చితంగా పాటించేలా మార్గదర్శకాలు తయారుచేశాయి. వీటిని కచ్చితంగా అమలు చేసేలా ఆయా శాఖలు బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించాయి. రూపొందించిన మార్గదర్శకాలు - పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలను నియంత్రించడంతో పాటు, శుద్ధి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - పారిశ్రామిక వ్యర్థాలను తీవ్రత ఆధారంగా వర్గీకరించి, శుద్ధి చేయాలి. - నది పరీవాహక ప్రాంతాలను గుర్తించి గృహ వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేయాలి. బహిరంగ మల విసర్జనతో పాటు,బహిరంగ చెత్త వేయడాన్ని నివారించాలి. - ఎక్కువగా మురుగు ఉత్పత్తికి కారణమవుతున్న పట్టణాలు,గ్రామాలను గుర్తించి ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. - నది వ్యర్థాలు కలిసే చోట ఈటీపీలు ఏర్పాటు చేయాలి. - ఎన్టీపీసీ, టీఎస్జెన్కోలు ఉన్న ప్రాంతాల్లో కర్మాగారాల నుంచి వెలువడే బూడిద నియంత్రణకు సరైన యాంత్రీకరణ ఉండాలి. - ప్రతి ఆస్పత్రిలో తక్కువ వ్యయంతో వారి పరిసరాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. ఇలా శుద్ధి చేసిన నీళ్లను పూల తోటల పెంపకానికి పునర్వినియోగించాలి. - గోదావరి పరీవాహకంలోని పరిశ్రమలన్నీ భూగర్భ జల వనరుల శాఖ అనుమతిలేనిదే యథేచ్ఛగా వ్యర్థాలు విడుదల చేయొద్దు. - పట్టణాలు, గ్రామాల నుంచి ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింVŠ æచేయాలి. లేదంటే సమీపంలోని పవర్ప్లాంట్లకు లేదా బట్టీలకు పంపాలి. - నది పరీవాహకం వెంబడి ఎస్టీపీల పనితీరును, సరస్సుల పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించాలి. ప్రతి విద్యా సంస్థ విద్యార్థులకు నది కాలుష్యంపై బోధించాలి. - వరద జలాలు శుద్ధి జరిగాకే నదుల్లో కలిసేలా చూడాలి. -
పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు జాతీయ హరిత ట్రెబ్యునల్(ఎన్జీటీ) అదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్త పట్నం, చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా? అనే విషయంపై కూడా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్జీటీ కోరింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకొని నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను పిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఏపీలో నదుల అనుసంధానం పేరిట అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఎన్జీటీలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, త్రినాథ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గోదావరి డెల్టాకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నదులు అనుసంధానం చేస్తున్నారని పిటీషనర్లు తమ వాదన వినిపించారు. పిటీషనర్ల వాదనలు విన్న ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా వీటిపై పిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
స్టెరిలైట్ పరిశ్రమపై సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించడాన్ని అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఎన్జీటీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం తిరస్కరించడంతో పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. (స్టెరిలైట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!) -
వందకోట్ల భారీ జరిమానా విధించిన ఎన్జీటీ..!
సిమ్లా: అక్రమ మైనింగ్ను ఆపలేకపోయిన కారణంగా మేఘాలయ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. ప్రభుత్వానికి 100 కోట్లు జరిమాన విధిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఏకే గోయల్ శనివారం తీర్పును వెలువరించారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా మైనింగ్ను నిర్వహిస్తున్న కంపెనీలకు రద్దు చేయాలని 2014లో ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం రాష్ట్రంలోని మైనింగ్ పరిశీలనకు పర్యటించిన కమిటీ ఈఏడాది జనవరి 2న ఎన్జీటీకి నివేదికను అందించింది. రాష్ట్రంలో 24వేలకు పైగా అక్రమ మైనింగ్ కంపెనీలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అక్రమ మైనింగ్ కారణంగా నీరు, గాలి, వాతావరణం కాలుష్యానికి గురువుతోందని తీర్పులో పేర్కొన్నారు. రెండు నెలల్లోగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) వద్ద రూ.100 కోట్లు జమ చేయాలని గోయల్ ఆదేశించారు. మేఘాలయలోని బొగ్గు గనుల్లో ఇటీవల 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దట్టమైన చెట్లు ఉన్న కొండపై ఎలుక బొరియల్లా ఉండే గనుల్లో అక్రమంగా బొగ్గు తవ్వేందుకు కూలీలు లోపలికి వెళ్లారు. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్ నది నీరు గనిలోకి ముంచెత్తడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్మికుల ఆచూకి ఇప్పటివరకు దొరకటేదు. -
14 రోజులుగా బొగ్గు గనిలోనే 15 మంది..
న్యూఢిల్లీ: మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో గత 14 రోజులుగా చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇంకా తెలియరావడం లేదు. గనిలో నీటి ఉధృతి కారణంగా సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. మరోవైపు బొగ్గుగనిలోని నీటిని తోడేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గనిలోని నీటిని బయటకు పంప్ చేయడానికి హైపవర్ సబ్ మెర్సిబుల్ పంపులు కావాలని అధికారులు కోరినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ ఓ నిర్ణయం తీసుకోలేదు. దీంతో గనిలోని కార్మికుల ప్రాణాలపై వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేఘాలయలోని ఈస్ట్ జైంతా హిల్స్ జిల్లా లూమ్థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్ 13న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు. పంపులపై బదులేది? సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కమాండెంట్ ఎస్కే శాస్త్రి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..‘గనిలోని నీటిని తోడేసేందుకు కనీసం వంద హార్స్పవర్ ఉన్న 10 మోటార్ పంపులు కావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మేం కేంద్రానికి లేఖ రాసినా ఇంతవరకూ జవాబు రాలేదు. మా దగ్గర ప్రస్తుతం 25 హార్స్పవర్ సామర్థ్యం ఉన్న రెండు పంపులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 370 అడుగులు ఉన్న ఈ గని మధ్యలో 70 అడుగుల మేర నీరు చేరుకుంది. ఈ నీటిని తొలగిస్తేనే జాతీయ విపత్తు సహాయక బృందం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది లోపలకు పోగలరు. మేం గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి కారణంగా కుదరలేదు’ అని తెలిపారు. గని కార్మికుడొకరు బొగ్గును వెలికితీసే క్రమంలో గోడపై బలంగా కొట్టడంతో గనిలోకి లైటైన్ నది నీరు పోటెత్తి ఉంటుందని శాస్త్రి చెప్పారు. ‘ర్యాట్ హోల్’ తవ్వకం తాజాగా కార్మికులు చిక్కుకున్న బొగ్గు గనిని ర్యాట్ హోల్ పద్ధతిలో తవ్వారు. ఈ విధానంలో తొలుత చిన్న పరిమాణంలో గుంతలను నిట్టనిలువుగా బొగ్గు కనిపించేవరకూ తవ్వుతారు. అనంతరం సన్నటి దారుల ద్వారా బొగ్గును పైకి తీసుకొస్తారు. అయితే ఈ విధానంలో పర్యావరణానికి నష్టం జరుగుతుండటం, కార్మికుల ప్రాణానికి ముప్పు ఉండటంతో మేఘాలయలో 2014లో ఈ ర్యాట్ హోల్ పద్ధతిని నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈస్ట్ జైంతా హిల్స్లో గని ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రడ్.కె.సంగ్మా స్పందిస్తూ..‘కాలం వేగంగా కరిగిపోతోంది. పదిహేను మంది కార్మికులను రక్షించడానికి హైపవర్ సబ్మెర్సిబుల్ పంపులను ఇవ్వాలని కోల్ ఇండియాను కోరాం. వాళ్లు వీలైనంత త్వరగా సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ఈ గనిలోకి కార్మికులను పనికి దింపిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న యజమాని కోసం గాలింపు జరుపుతున్నారు. ఫొటోలకు పోజులా? గని కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 15 మంది కార్మికులు బొగ్గుగనిలో చిక్కుకుంటే ప్రధాని మోదీ మాత్రం అస్సాంలోని బోగీబీల్ వంతెనపై ఫొటోలకు పోజులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఓవైపు మేఘాలయలో 15 మంది కార్మికులు వరద నీటితో నిండిపోయిన గనిలో చిక్కుకుని శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రధాని మాత్రం బోగీబీల్ వంతెనపై కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం హై ప్రెజరైజ్డ్ మోటార్ పంపులను అందించేం దుకు నిరాకరిస్తోంది. మోదీజీ.. దయచేసి ఈ కార్మికులను కాపాడండి’ అని ట్వీట్ చేశారు. -
ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 2016లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు తోడుగా నదీపరీవాహక ప్రాంతాల్లో తవ్వకాలకు సంబంధించి మహారాష్ట్ర కేసులో తాము ఇచ్చిన ఆదేశాలే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ రాఘవేంద్ర రాథోర్ బెంచ్ పేర్కొంది. ‘నదీ పరీవాహక ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరి. మైనింగ్ విలువను బట్టి 25 శాతం వ్యయాన్ని ఆ ప్రాంతంలో జీవావరణాన్ని పెంచడానికి వసూలు చేసేలా నిబంధనలు ఉండాలి. అక్రమ తవ్వకాలు జరిపితే దాని వ్యయం సహా పర్యావరణానికి ఎంతమేర నష్టం కలిగిందో అంచనా వేసి నష్టపరిహారాన్ని వసూలు చేయాలి. ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్ అనుమతులకు హద్దులు ధ్రువీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తవ్వకాలకు సంబంధించి ఏటా ఒక థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయించి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి’అని ఎన్జీటీ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మైనింగ్లను నిరంతరం పర్యవేక్షించేందుకు శాశ్వతవ్యవస్థను రూపొందించుకోవాలని సూచించింది. పూడికతీతపేరుతో తెలుగు రాష్ట్రాల్లో అక్ర మ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ గతంలోనే ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏర్పాటైన కమిటీ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించిందని చెప్పారు. ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ కేసు విచారణను ట్రిబ్యునల్ ముగించింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని వివాదాస్పద స్టెరిలైట్ కర్మాగారాన్ని మళ్లీ తెరవాలంటూ జాతీయ గ్రీన్ ట్రిబునల్ శనివారం ఆదేశాలు ఇచ్చింది. తుత్తుకుడిలోని వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్టెరిలైట్ ప్యాక్టరీని మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జాతీయ గ్రీన్ ట్రిబునల్ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించండి
సాక్షి, హైదరాబాద్: ఘనవ్యర్ధాల నిర్వహణకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలను, పట్టణాభివృద్ధి సంస్థలను దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి కార్యచరణ ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఘనవ్యర్థాల నిర్వహణ 2018 నిబంధనల అమలుపై సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనవ్యర్థాల నిర్వహణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ఆదేశాల మేరకు డంపింగ్ యార్డులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలన్నారు. నిర్ణీత కాల వ్యవధి ప్రణాళికలు ఉండాలని, జిల్లాల్లో అవసరమైన డంపింగ్ సైట్లను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో 72 మున్సిపాలిటీలకు డీపీఆర్లు తయారుచేశామని, నూతనంగా ఏర్పడిన మరో 68 మున్సిపాలిటీల డీపీఆర్లు తయారు చేయాలని ఆదేశించారు. ఘనవ్యర్థాల నిర్వహణకు రూల్స్ 2016 అమలుకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎన్జీటీ ఆదేశాల ప్రకారం గత నెల 28న చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పర్యవేక్షణ కమిటీ సమావేశం చైర్మన్ జ్యోతిమణి అధ్యక్షతన జరిగిందని, మన రాష్ట్రంలో ఘనవ్యర్థాల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించామని సీఎస్కు తెలిపారు. ఎన్జీటీ ఆదేశాల అమలుకై స్వచ్ఛ ఆటోలు, ఈ–ఆటోలు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులను చేపట్టినట్లు వివరించారు. పీసీబీ, మున్సిపల్ శాఖ సమన్వయంతో ఎన్జీటీ ఆదేశాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎస్కు చెప్పారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీబీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, సీడీఎంఏ టి.కె.శ్రీదేవి, ఈపీటీఆర్ఐ, డీజీ కల్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. -
త్వరలో ఎన్జీటీలో ఈ–మెయిల్ పిటిషన్
గాంధీనగర్: ఆన్లైన్ ద్వారా పిటిషన్ను దాఖలు చేసేందుకు త్వరలో కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ తెలిపారు. గాంధీనగర్లో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్దిపాటి కోర్టు ఫీజు చెల్లింపుతో దేశంలో ఎక్కడి నుంచైనా ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పిటిషర్ ముందుగా పర్యావరణ ఉల్లంఘన వివరాలు, అందుకు తగ్గ ఆధారాలు, ఉల్లంఘించిన వ్యక్తి లేదా సంస్థ వివరాలు తదితర అంశాలను పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం దరఖాస్తు రిజిస్టర్ అవ్వటంతోపాటు నంబర్ను కేటాయిస్తామన్నారు. -
కాళేశ్వరానికి ఎన్జీటీ లైన్క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్ను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టేసింది. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని రకాల కీలక అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్లో విచారించడానికి ఇంకేం లేదని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, ఇటీవల వచ్చిన అనుమతులు చెల్లవని పేర్కొంటూ హయాతుద్దీన్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారని, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని వాదించారు. తాగునీటి అవసరాల కోసం అని చెప్పి సాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టారన్నారు. అందుకే గతంలో ఇదే ఎన్జీటీ పనులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే న్యాయ విచారణ పరిధి తదితర అంశాలను ప్రస్తావిస్తూ పనులు నిలుపుదల ఉత్తర్వులను హైకోర్టు కొట్టేస్తూ కొన్ని షరతులు విధించిందని చెప్పారు. అన్ని రకాల అనుమతులు వచ్చాకే సాగునీటి అవసరాలకు పనులు ప్రారంభించాలని, అటవీ అనుమతులు లేనిదే అటవీ భూముల్లో పనులు చేపట్టరాదని చెప్పిందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే పిటిషనర్లు తిరిగి ఎన్జీటీని ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చిందన్నారు. దీని ప్రకారం ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, కావాలంటే ఒక కమిషన్ను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని వాదించారు. కమిషన్ అవసరం ఏముంది? సంజయ్ ఉపాధ్యాయ వాదనలపై స్పందించిన ట్రిబ్యునల్.. ప్రాజెక్టుకు ఇప్పుడు అన్ని రకాల అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అయితే అనుమతులు రాక ముందు ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని సంజయ్ అన్నారు. మరి అలా అయితే ఎన్జీటీ స్టే ఇచ్చిన తరువాత రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీం కోర్టులే ఈ కేసులను కొట్టేశాయిగా అని బెంచ్ వ్యాఖ్యానించింది. అనుమతులన్నీ వచ్చిన నేపథ్యంలో కమిషన్ అవసరం ఏముందని ప్రశ్నించింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అనుమతులు చెల్లవంటూ దాఖలైన పిటిషన్కు జత చేయాలని బెంచ్ సూచించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా స్పందిస్తూ.. ఇక ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేయాలని కోరారు. దీంతో ఏకీభవించిన బెంచ్ అనుమతులు లేవన్న పిటిషన్ను కొట్టేసింది. వచ్చిన అనుమతులు చెల్లవంటూ దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 18న విచారిస్తామని తెలిపింది. తీర్పుపై మంత్రి హరీశ్ హర్షం.. ఈ తీర్పుపై మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్న శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కోసం అన్ని పక్షాలు ఒక్కతాటిపై నిలిస్తే ఇక్కడ మాత్రం ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అనుమతులు చెల్లవంటూ దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. ట్రిబ్యునల్ తీరుపై కాళేశ్వరం ప్రాజెక్టు ఈసీ హరిరాం, న్యాయవాది సంజీవ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
‘సిగరెట్’ తరహాలో గంగ హెచ్చరికలు
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాలో గంగా నది కాలుష్యంపై పరీవాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నది తీవ్రస్థాయిలో కలుషితం కావడంపై ఎన్జీటీ ఆవేదన వ్యక్తం చేసింది. హరిద్వార్ నుంచి ఉన్నావ్ మధ్య గంగా నది నీరు కనీసం స్నానానికి పనికిరావని వ్యాఖ్యానించింది. ‘ ప్రజలు గంగా నీటిని భక్తి భావంతో సేవిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. కేవలం సిగరెట్ ప్యాకెట్ల మీదే ‘పొగతాగడం మీ ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తున్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ఎందుకు చెప్పకూడదు?’’ అని ఎన్జీటీ బెంచ్ ప్రశ్నించింది. గంగా నదీ తీరంలో ప్రతి 100 కి.మీ ఓ చోట నీటి స్వచ్ఛతపై బోర్డులను ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ(ఎన్ఎంసీజీ)ను ఎన్జీటీ ఆదేశించింది. అక్కడి నీటిని తాగటానికి, స్నానం చేయటానికి వాడొచ్చా? లేదా? అన్న విషయాన్ని బోర్డుల్లో స్పష్టంగా పేర్కొనాలంది. -
పొగతాగడం హానికరం..మరి ఆ నీటి సంగతి..?
సాక్షి, న్యూఢిల్లీ : గంగా నది కాలుష్యంపై గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమైతే కాలుష్య జలాల్లో మునిగితే వచ్చే ప్రతికూల పర్యవసానాలపై ప్రజలను ఎందుకు హెచ్చరించరని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రశ్నించింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి యూపీలోని ఉన్నావ్ వరకూ నదీ జలాలు తాగేందుకు, స్నానం చేసేందుకు ఎంతమాత్రం పనికిరావని ఎన్జీటీ చైర్పర్సన్ ఏకే గోయల్ నేతృత్వంలోని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. కలుషిత గంగా నీరు ఆరోగ్యంపై చూపే దుష్ర్పభావాల గురించి తెలియని ప్రజలు వాటిని తాగడం, స్నానం చేయడం చేస్తున్నారని పేర్కొంది. గంగా జలాలను పవిత్రంగా భావించే ప్రజలు కలుషిత నీటిని సేవించకుండా వారికి అవగాహన కల్పించాల్సి ఉందని గోయల్ అన్నారు. ప్రతి వంద కిలోమీటర్లకు గంగా నదీ జలాలు ప్రజలు సేవించేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది తెలుపుతూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నదీ జలాలు ఎక్కడెక్కడ తాగేందుకు, స్నానం చేసేందుకు అనువుగా ఉన్నాయో తెలుపుతూ తమ వెబ్సైట్లో రెండు వారాల్లోగా మ్యాప్ను ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ ఎన్ఎంసీజీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని కోరింది. -
ఎన్జీటీ చైర్మన్గా జస్టిస్ గోయల్
న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్ పదవిలో గోయల్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ పదవీవిరమణ చేయగానే ఆయన్ను ప్రభుత్వం ఎన్జీటీ చైర్మన్గా నియమించింది. ట్రిపుల్ తలాక్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్జేఏసీ) ఏర్పాటు సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ చరిత్రాత్మక తీర్పులిచ్చారు. గతేడాది డిసెంబర్లో జస్టిస్ స్వతంతర్ కుమార్ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ఎన్జీటీకి పూర్తిస్థాయి చైర్మన్ను నియమించలేదు. పర్యావరణంతో పాటు అడవులు, సహజవనరుల పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ద్వారా 2010, అక్టోబర్ 18న ఎన్జీటీని ఏర్పాటుచేశారు. ఎన్జీటీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మదిలో ఎమర్జెన్సీ కదలాడింది! పదవీవిరమణ అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సభలో జస్టిస్ గోయల్ మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ సందర్భంగా ప్రాథమిక హక్కుల్ని రద్దుచేశారు. దీంతో పోలీసులు, అధికారులకు ఎలాంటి సమీక్ష లేకుండా అపరిమిత అధికారాలు లభించాయి. కానీ అలాంటి వాతావరణంలో కూడా కోర్టులు ప్రజలకు న్యాయం అందించేందుకు కట్టుబడ్డాయి. ఎమర్జెన్సీ కారణంగానే ఓ అమాయకుడ్ని అరెస్ట్ చేసిన సందర్భాల్లో కోర్టులు వెంటనే బాధితులకు బెయిల్ను మంజూరు చేశాయి. ఎస్సీ,ఎస్టీ చట్టం దుర్వినియోగం కేసులో తీర్పు రాసేటప్పుడు ఇవన్నీ నా మదిలో కదలాడాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఏపీలో ఇసుక దోచేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో భారీస్థాయిలో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ రోజూ రూ.కోట్లు దోచుకుతింటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రాజ్యవర్థన్రాథోర్ బెంచ్ సోమవారం విచారించింది. ఏపీలో యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశాలు ఇచ్చిందని,అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో రోజూ రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ వాదించారు. ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే గతంలో ఈ కేసును ఎన్జీటీ చైర్మన్ నేతృత్వంలోని బెంచ్ విచారించడంతో ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడంపై ఆ బెంచ్కే ఈ కేసును రిఫర్ చేస్తున్నామని జస్టిస్ రాజ్యవర్థన్ తెలిపారు. వారికి పరిహారమివ్వండి.. పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం, డయా ఫ్రం వాల్ నిర్మాణంవల్ల తమ జీవనోపాధికి గండి ఏర్పడిందని బాధిత మత్స్యకారులు ఎన్జీటీని ఆశ్రయించారు. కేజీ బేసిన్లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అక్కడి మత్స్యకారులకు నెలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందించారని, పోలవరం విషయంలోనూ అదే పరిహారాన్ని అందించాలని పిటిషనర్లు కోరారు. కేసు విచారణకు స్వీకరించిన జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ పోలవరం అథారిటీ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. ‘పురుషోత్తపట్నం’ పోలవరంలో భాగమేనా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. నిర్వాసితులు సత్యనారాయణ, రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ పోలవరం ప్రాజెక్టులో పురుషోత్తపట్నం ప్రాజెక్టు భాగమా? కాదా?, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా?లేవా? అన్న విషయాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ, పోలవరం అథారిటీలకు నోటీసులు జారీ చేసింది. -
పోలవరం ముంపుపై రీ సర్వే!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుతో సరిహద్దు రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ముంపుపై కేంద్రం కొత్తగా సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ రాష్ట్రాల్లో ముంపుపై అధ్యయనం చేయాలంటూ తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్లు ఓ వైపు కేంద్రం వద్ద, మరోవైపు సుప్రీంకోర్టులో కొట్లాడుతున్న దృష్ట్యా ముంపుపై రీసర్వే చేసే యోచనలో ఉన్నట్లు కేంద్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహం ఆధారంగా 2005లో పలు రకాల క్లియరెన్స్లు రాగా, తదనంతరం గరిష్ట వరద ప్రవాహ అంచనాను 50లక్షల క్యూసెక్కులకు పెంచడంతో సర్వే అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 1980లో ఇచ్చిన అవార్డును ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేసిందని, దీంతో తాము ముంపునకు గురవుతున్నామని ఒడిశా ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఇదే అంశమై రేలా అనే స్వచ్చంధ సంస్థ తెలంగాణ ముంపు ప్రాంతాలపై సైతం పిటిషన్లు వేయగా, దీనిపైనా తెలంగాణ తన అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా అటు సుప్రీంకు, ఇటు ఎన్జీటీకి సమర్పించింది. ఇందులో ప్రాజెక్టు నిర్మాణంతో ఏర్పడుతున్న ముంపుపై పర్యావరణ నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని, తాజాఅంచనాలు తయారు చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని కేంద్ర పర్యావరణ శాఖ 2011 ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో సూచించినా, ఏపీ ప్రభుత్వం తదుపరి అధ్యయనం చేయకపోవడం తమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలంగాణ తెలిపింది. అయితే ఈ వినతులపై అటు కేంద్రం కానీ, ఇటు ఏపీ కానీ ఎలాంటి నిర్ణయం చేయలేదు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో బ్యాక్వాటర్ స్టడీస్ చేయాలని, తద్వారా ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపును అధ్యయనం చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. -
గంటలు కొట్టినా.. భంభం భోలే.. అన్నా నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బుధవారం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఎన్జీటీ ఆదేశాలు అశనిపాతం లాంటివే. అమర్నాథ్ యాత్రలోనూ, అమర్నాథ్ గుహలోని భక్తులు భంభం బోలే అంటూ నినదించడం, బిగ్గరగా మంత్రాలు పఠించడం, పరమేశ్వరుడి దగ్గర గంట కొట్టడాన్ని ఎన్జీటీ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక యాత్ర చివరి చెక్పాయింట్ నుంచి అమర్నాథ్ గుహ వరకూ భక్తులను గుంపులుగా కాకుండా.. ఒకే వరుసలో పంపాలని అమర్నాథ్ బోర్డుకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ కొండ ప్రాంతాన్ని ‘సైలెన్స్ జోన్’గా ఎన్జీటీ ప్రకటించింది. అమర్నాథ్ గుహ ఉన్న ప్రాంతం.. మంచుతో కూడుకుని సహజ ప్రకృతితో ఉండే ఈ ప్రాంతాన్ని పరిరక్షించేదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ బోర్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, మంచు లింగాన్నిదర్శించుకునే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. భక్తులను వ్యాపారాత్మక దృష్టితో చూడడం అమర్నాథ్ బోర్డుకు మంచిది కాదని ఎన్జీటీ తెలిపింది. -
ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అంశాలపై దాఖలైన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం విచారించింది. జనవరి 17 న తుది వాదనలు విని తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ జవీద్ రహీంతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఏపీ, తెలంగాణల్లో యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారంటూ రెలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది. యంత్రాలతో తవ్వకాలు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనపై తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్కు ఎన్జీటీ సూచించింది. -
నైతిక విజయానికి వక్రభాష్యం
చంద్రబాబుకి మొదటినుంచీ ఆశీర్వాదాలందిస్తున్న వరల్డ్బ్యాంకు వారికి ఎందుకు అనుమానం వచ్చిందోగానీ, వందలాదిగా రాజధాని ప్రాంత రైతులు, కార్మికులు, వృత్తిదారులు మూడేళ్లుగా విన్పిస్తున్న గోడుకు కారణాలు తెలుసుకునేందుకు ఆ గ్రామాలలో బ్యాంక్ తనిఖీ సంఘం విచారణ ప్రారంభించింది. ఒక సర్వే నివేదికను బ్యాంక్కు అందజేసింది. కానీ బ్యాంక్ని నమ్ముకున్న మిత్రుడు చంద్రబాబు ఎందుకు భీతిల్లారో తెలియదుగానీ బ్యాంకు మాత్రం తన అధికారిక వెబ్సైట్ నుంచి ఈ వివరాలను తొలగించివేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి చట్టంలో కాలపరిమితి ఉంది. అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ మధ్య అవినాభావ సంబంధం ఉన్నందున, ఆ సమతౌల్యాన్ని విధిగా పాటించడం ద్వారానే రాజధాని ప్రాంత అభివృద్ధి సాధ్యం. అయితే ఇందుకు విరుద్ధంగా ఇప్పటికే నిర్మాణం పనులు చేపట్టినందున రాజధాని నిర్మాణాన్ని కొనసాగించక తప్పని స్థితి తలెత్తింది. ఇక్కడి నుంచి వెనక్కి మళ్లాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాలి. కనుకనే న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్ల అనుమతితో సంబంధం లేకుండా ఏకపక్షంగా ముందుకు సాగిపోయే ప్రభుత్వాల విషయంలో పర్యావరణ రక్షణ కోసం తగిన చర్యలకు విధిగా ఆదేశించవలసి వస్తున్నది. అందుకు అదనంగా పాటించవలసిన తొమ్మిది షరతులు అమలు జరుగుతున్నాయో లేదో తనిఖీ చేసేందుకు రెండు కమిటీలను (పర్యవేక్షణ సంఘం, షరతుల అమలు కమిటీ) కేంద్రస్థాయి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నియమిస్తున్నది.’ – ట్రిబ్యునల్ తీర్పు (17–11–17) ‘ట్రిబ్యునల్ తీర్పు నా నైతిక విజయం’ – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిందపడినా నాదే గెలుపు అనేవాళ్లు, ప్రజలూ కోర్టులూ నిలదీసే పరిస్థితి ఏర్పడినా తుడుచుకుని పోయే పాలకులు కొందరు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిపుణులతో, న్యాయమూర్తులతో జాతీయ స్థాయిలో వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. నిర్దిష్టమైన నియమావళి ప్రకారం భౌగోళిక, నదీ పరీవాహక ప్రాంతాల ఆనుపానులనూ, వరద ముప్పు ఉన్న ప్రాంతాలనూ గమనించి, అక్కడ కట్టడాలు నిర్మిస్తే కలిగే నష్టాల గురించి దఫదఫాలుగా ఆ వ్యవస్థలు సూచిస్తున్నాయి. ఉల్లంఘనలు ఉన్నచోట హెచ్చరిస్తున్నాయి. ఈ హెచ్చరికలను పాటించకుంటే, పలుమార్లు మందలించిన తరువాత కార్యాచరణకు దిగుతున్నాయి. ఉల్లంఘనలే అన్నిటా...! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇదే జరుగుతోంది. కొత్త రాజధాని వ్యవహారంలో భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు, పర్యావరణ పరిస్థితులు రాజధాని నిర్మాణానికి అనువుగా లేవని భావించిన నిపుణులు న్యాయస్థానాలను, జాతీయ ట్రిబ్యునళ్లను ఆశ్రయించవలసి వచ్చిందని మరచిపోరాదు. విభజన చట్టంలోని ఆరో సెక్షన్ మేరకు ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఎంపిక బాధ్యతను నిర్వర్తించేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించారు. అన్ని నిబంధనలను, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. పర్యావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావించిన ప్రాంతాలలో నూజివీడు, దొనకొండలు ఉన్నాయని సూచిం చింది. అమరావతి ప్రాంతాన్ని కూడా పరిశీలించినప్పటికీ కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిత్తడి నేలల వల్ల పదిహేను అడుగుల లోతుననే నీరు ఉబకడం వంటి పరిస్థితులతో రాజధానికి సానుకూలం కాదని ఆ కమిటీ అభిప్రాయపడింది. తరచూ వరద తాకిడికి గురయ్యే ప్రాంతంగా కూడా భావించింది. ఇంకా అక్కడ కొండవీటి వాగు సహా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని 29 గ్రామాలలో 20 నిరంతరం వరదలకు గురవుతాయని రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఎన్నెన్నో గ్రామాలు నిరంతరం ముంపు ప్రమాదం ఉన్నవే. ఈ సత్యాన్ని వెల్లడించిన వారు ఎవరో కాదు, రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థే (సీఆర్డీ) అంగీకరించింది. ఈలోగానే శివరామకృష్ణన్ కమిటీ సంగతి పట్టించుకోకుండానే, అసెంబ్లీలో ఆ అంశం గురించి చర్చించకుండానే ఏకపక్షంగా చంద్రబాబు ప్రభుత్వం ఒక కమిటీని నియమించుకుంది. రాజధాని నిర్మాణానికి పూనుకుని తేరుకోలేని రీతిలో ఇబ్బందులలో కూరుకుపోయింది. ఈ బుర్ర తిరుగుడులోనే ఆయన రాజధాని నిర్మాణం పేరిట ‘నమూనాల’ కోసం దేశీయ, రాష్ట్రీయ వాస్తుశిల్ప శాస్త్రంలో, భౌగోళికశాస్త్రంలో, ఇంజనీరింగ్లో నిపుణులైన వారి తోడ్పాటు తీసుకోడానికి ప్రయత్నించకుండానే– ప్రపంచ యాత్రలు తలపెట్టారు. ముందు సింగపూర్, మలేసియా, జపాన్, చైనాలు వెళ్లారు. ఈ మధ్యన ఇంగ్లండ్, అమెరికాలకు వెళ్లిన పర్యాటక బృందాలకు నాయకత్వం వహించారు, డావోస్ ప్రపంచ కుబేర వర్గాల పెట్టుబడి మంతనాలలో పాల్గొని వచ్చారు. ‘స్విస్ చాలెంజ్’(మూడో పార్టీ లాభాల వేటకు అనుకూలమైంది) వైపు మనసు మళ్లింది. చివరికి ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళిని రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలని, రూపకల్పన చేసిపెట్టాలని ప్రాధేయపడాల్సిన స్థితి వచ్చింది. లొసుగుల మయం ఈలోగా చంద్రబాబుకి మొదటినుంచీ ఆశీర్వాదాలందిస్తున్న వరల్డ్బ్యాంకు వారికి ఎందుకు అనుమానం వచ్చిందోగానీ, వందలాదిగా రాజధాని ప్రాంత రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు మూడేళ్లుగా విన్పిస్తున్న గోడుకు కారణాలు తెలుసుకునేందుకు ఆ గ్రామాలలో బ్యాంక్ తనిఖీ సంఘం విచారణ ప్రారంభించింది. ఒక సర్వే నివేదికను బ్యాంక్కు అందజేసింది. కానీ బ్యాంక్ని నమ్ముకున్న మిత్రుడు చంద్రబాబు ఎందుకు భీతిల్లారో తెలియదుగానీ బ్యాంకు మాత్రం తన అధికారిక వెబ్సైట్ నుంచి ఈ వివరాలను తొలగించివేసింది. లండన్ యాత్రకు వెళ్లిన (14.10.17) బాబు బృందం వాస్తు శిల్ప నమూనాల డిజైనర్ సంస్థ ‘నార్మక్ఫాస్టర్–పార్టనర్స్’తో జరిపిన చర్చల వివరాలను సూచనమాత్రంగా కూడా ఇంతవరకు బయటపెట్టలేదు. అన్నింటికన్నా ప్రధానం– లెక్కకుమించి బడా నిర్మాణ సంస్థలు వచ్చినట్టే వచ్చి ఎందుకు వెనక్కి వెళ్లిపోతున్నాయి? ఎన్నో ప్రపంచ దేశాల రాజ ధాని నగరాలు పరిమిత వైశాల్యంలోనే సరిపెట్టుకోగా లేనిది అమరావతి రాజధాని నిర్మాణం పేరిట, భూసేకరణ/భూసమీకరణల పేరుతో అన్ని వేల ఎకరాలను ఎందుకు సమీకరించవలసి వచ్చిందో ప్రజలకు ఇంతవరకూ వివరించిన పాపాన పోలేదు. ‘ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయనీ’ సి.ఆర్.డి.ఎ. ప్రాధికార సంస్థ స్వతంత్రంగా పనిచేయడంలేదనీ, ఏపీలో ‘చెత్త పాలన’ కొనసాగుతోందనీ అమరావతి రాజధాని నిర్మాణానికి చీఫ్ ఆర్కిటెక్ట్గా నియమితుడైన మకి అండ్ అసోసియేట్స్ సంస్థ చైర్మన్ పుమిహికో (జపాన్)వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రముఖులతో ఈ సంస్థను ఎంపిక చేసిన తర్వాత కూడా జ్యూరీ నివేదిక మాయం కావడం గురించి ‘మకి’ చైర్మన్ ప్రశ్నించాల్సి వచ్చింది. చివరికి, రైతాంగం నుంచి అంతకుముందుగానే జరిగిన ఈ సేకరణవల్ల సామాజికంగా పడే ప్రభావం గురించి∙సాధికారికంగా ప్రజలనుంచి అభిప్రాయ సేకరణ జరగాలని చెప్పే 2013 నాటి కేంద్ర నూతన చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. 2015 జనవరిలో భూసమీకరణ (పూలింగ్) ప్రారంభమై కొనసాగగా, 2016లో ఈ సమీకరణవల్ల సామాజికులపై పడే ప్రభావాన్ని అంచనా వేయాలని నిర్ణయించారంటే అది ఎంత మోసపూరిత నిర్ణయమో అర్థమవుతుంది. అంతేగాదు, అమరావతి ప్రాంతంలో భారీ స్థాయి రాజధాని నిర్మాణం పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా ఆటంకమో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈవీఎస్. శర్మ (2015లో), రైతు శ్రేయోభిలాషులు శ్రీమన్నారాయణ, సత్యనారాయణ ప్రభృతులు (2016లో) గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ‘రిట్’ పిటిషన్లు దాఖలు చేశారు. దేనికీ సమాధానం లేదు 44,000 ఎకరాల అటవీ భూములను ఖాళీ చేయించడానికి అనుమతివ్వాల్సిందిగా బాబు ప్రభుత్వం కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖకు పెట్టుకున్న దరఖాస్తును ఆ శాఖ పెక్కు అభ్యంతరాలతో తిరస్కరించాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో ఇంతవరకు ప్రజలకు గానీ, న్యాయస్థానాలకుగానీ చంద్రబాబు సమాధానం చెప్పలేదు. నదీ పరీవాహక ప్రాంతాలను, వరద ప్రాంత భూములను పరిరక్షించి తీరాలని కర్ణాటక, ఢిల్లీ ప్రాధికార సంస్థలను హెచ్చరిస్తూ హైకోర్టులు, సుప్రీంకోర్టు పెక్కు తీర్పులు వెలువరించాయని మరువరాదు. అమరావతి ప్రాంత ప్రజలకు, పర్యావరణ రక్షణకు కల్గిన నష్టాన్ని మాత్రం గ్రహించింది కాబట్టే పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేసే ప్రాధికార సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా తొమ్మిది షరతులను విధించాల్సి వచ్చింది. పనుల నిర్మాణంలో ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన పర్యావరణ వ్యతిరేక విధానాన్ని సమీక్షించిన తర్వాతనే ట్రిబ్యునల్ తాజా షరతులు ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణరెడ్డి, జస్టిస్ గోపాలరావు, నేను (వ్యాసకర్త), సదాశివరెడ్డి అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం రాజ్యాంగ విరుద్ధమని 2015లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాం. ఈ రిట్పై సమాధానం కోరుతూ కోర్టు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రెండేళ్లు గడిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందీ లేనిదీ తెలీదు. ఇదీ పాలనా వ్యవస్థల నిర్వాకం. అలాగే కృష్ణా జిల్లా బందరు మండలంలోని అరిసెపల్లి, చిరాగిపాలెం, హుస్సేన్పాలెం, కాకర్లమూడి గ్రామాల ప్రజలు కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటున్నారు. పోర్టు నిర్మాణం పేరిట వీటిని కూడా సమీకరణ సూత్రంతో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. డీప్వాటర్ పోర్టుకు అనుబంధంగా పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో ఈ భూసేకరణకు పాలకులు దిగారు. ఈ బలవంతపు సేకరణ ప్రకారం ప్రజలు దాదాపు 30 వేల ఎకరాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు సాగకుండా నిలిపివేయాలని గ్రామస్తుల తరఫున సీహెచ్ పద్మావతి హైకోర్టుకు మొరపెట్టుకోవలసి వచ్చింది. ప్రభుత్వ ప్రహసనాన్ని కోర్టులు, ట్రిబ్యునళ్లు గమనిస్తున్నా సరే, పర్యావరణ పరిరక్షణకు అదనపు షరతులను విధిగా పాటించాలని గ్రీన్ ట్రిబ్యునల్ తాజా తీర్పులో హెచ్చరించినా సరే చంద్రబాబు మాత్రం ఇదంతా తన నైతిక విజ యమని ప్రకటించుకుంటున్నారు. ఆయన ఆడిన తాజా డ్రామా– బలవంతంగా భూములిచ్చిన రైతుల తృప్తికోసం కొద్దిమంది రైతులను సింగాపురం (సింగపూర్) చూసిరమ్మని పంపించారు. వ్యాపారవేత్తలుగా ఎదగమని సలహా కూడా ఇచ్చారు. 1995లో చంద్రబాబు చూపిస్తానన్న విజన్ 2020 అనే జంతర్మంతర్ పెట్టె దర్శనం ఈ రెండు దశాబ్దాలలోనూ జరగలేదు. రాజధాని నిర్మాణానికి కనీసం యాభై సంవత్సరాలు పడుతుందని అంటున్నారు కాబట్టి, ఇప్పటి నుంచి కనీసం 20 ఏళ్ల తరువాత గాని ఆ పెట్టె తలుపులు తెరుచుకోవు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నీళ్లే ఉండవు.. ప్రవాహాలెక్కడివి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు నిరంతరం ఉండేలా చూడాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన మార్గదర్శకాలు కొత్త చిచ్చు రేపేలా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా విద్యుత్ కేంద్రాల దిగువన కనీసం 15 నుంచి 20 శాతం ప్రవాహాలు కొనసాగించాలని ట్రిబ్యునల్ చేసిన సూచనను తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా జీవ నదులు లేవని, వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో ప్రవాహాలు ఉండవని, అలాంటి సమయంలో నిరంతర ప్రవాహాల కొనసాగింపు ఏమాత్రం సాధ్యమయ్యేది కాదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. జల విద్యుత్ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పుష్పాసేన్ అనే సామాజిక కార్యకర్త కేసు వేశారు. ఈ కేసులో అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్, జలవిద్యుత్ కేంద్రాల దిగువన కనీసం 15 నుంచి 20 శాతం నిరంతర ప్రవాహం కచ్చితంగా ఉండాలనే నిబంధన పెట్టింది. తమ మార్గదర్శకాలపై రాష్ట్రాలు అభిప్రాయాలు చెబితే దీనిపై తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ.. మార్గదర్శకాల ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. వర్షాకాలం మినహా ప్రవాహాలెక్కడ? రాష్ట్రంలో ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల కింద మొత్తం 9 జల విద్యుత్ కేంద్రాలున్నాయి. ఇందులో 6 కృష్ణా నది పరిధిలో, 3 గోదావరి మీద ఉన్నాయి. ట్రిబ్యునల్ మార్గదర్శకాలను అమలు చేస్తే రాష్ట్రంలోని ఎస్ఎల్బీసీ, జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, పులిచింతల వంటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇందులో పులిచింతల మినహా మిగతావి దశాబ్ద కాలానికి పైగా నడుస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సంబంధించిన చర్యలను ఏ విభాగం కూడా ఇప్పటివరకు నీటి పారుదల శాఖ దృష్టికి తేలేదు. వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో అక్కడ ప్రవాహాలు ఉండే పరిస్థితి లేదు. గోదావరిలో 3 విద్యుత్ ప్రాజెక్టుల కింద మైళ్ల దూరం వరకు నది ఎండిపోయి ఉంటుంది. రాష్ట్రంలో నీటి లభ్యత చాలా తక్కువ. ఈ నేపథ్యంలో 15 నుంచి 20% కనీస ప్రవాహాలు కొనసాగించడం సాధ్యమయ్యేది కాదన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఒకవేళ కనీస ప్రవాహంకోసం 15 శాతం నీరు వదిలితే అవి ఇంకిపోతాయి తప్ప నిరంతర ప్రవాహం కొనసాగదని రాష్ట్రం అంటోంది. దీంతో పాటే కరువు రోజుల్లో రిజర్వాయర్లే నిండుకుంటున్నాయి. అలాంటప్పుడు ప్రవాహాల కొనసాగింపు సాధ్యమయ్యేదే కాదని రాష్ట్రం చెబుతోంది. స్థానిక పరిస్థితులనూ చూడాలి.. జల విద్యుత్ కేంద్రాల కింద సాగు, తాగు అవసరాలకే నీటిని విడుదల చేయాలి తప్పితే, కనీస ప్రవాహాల కోసం నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండదని, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా ప్రవాహాలు ఉండాలన్న నిబంధన సరికాదని చెబుతోంది. అదీగాక కృష్ణా నదీ పరీవాహకంలో కనీస ప్రవాహాలు ఎలా ఉండాలో కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 వివరణ ఇచ్చింది. కృష్ణా ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు పంచిన నీటిలో 16 టీఎంసీలను సహజ ప్రవాహాల కింద లెక్కించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రిబ్యునల్ చెప్పిన రీతిలోనే సహజ ప్రవాహాలను కొనసాగించే వీలు లేదు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఇలాంటప్పుడు కొత్తగా మళ్లీ 15–20 శాతం సహజ ప్రవాహాలకు వీలెక్కడుంటుందని రాష్ట్రం వాదన. ఇదిలా ఉండగా ఈ వాదనను గ్రీన్ ట్రిబ్యునల్ ఎంతమేర పరిగణనలోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని తొలగిస్తాం’
సాక్షి, అమరావతి: పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన నిన్న (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు కదా, ప్రస్తుతమున్న నిర్మాణాల పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బదులిస్తూ నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనన్నారు. ఏ నిర్మాణాలు ఈ పరిధిలో ఉన్నాయో చూస్తామని, సీఎం నివాసం కూడా ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతూ రాజధాని నిర్మాణం చేపడతామని ఒక సవివర నివేదిక(డీపీఆర్)ను సంబంధిత మంత్రిత్వశాఖకు ఇచ్చిందని, దాన్ని తూచా తప్పక పాటించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్ కంపెనీలకిస్తాం..: రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో చర్చించామని చెప్పారు. సింగపూర్ది కేంద్ర ప్రభుత్వం, తమది రాష్ట్రప్రభుత్వం కావడంతో ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాలని, ఈ చిక్కుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్ కంపెనీలకు ఇస్తామని, వారు లేఅవుట్లు వేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వాటిని విక్రయిస్తాయన్నారు. -
‘గ్రీన్’ కండిషన్
సాక్షి, న్యూఢిల్లీ: నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పలు షరతులు విధించింది. సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగమనే విషయం గుర్తించాలని పేర్కొంది. నదుల సహజ ప్రవాహ దిశను మార్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేయాలని తెలిపింది. పర్యావరణ అనుమతి (ఈసీ)కి అదనంగా పలు షరతులు విధించింది. తమ ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. ఈమేరకు 145 పేజీల తీర్పును వెలువరించింది. ప్రతిపాదిత రాజధాని నగర నిర్మాణానికి వరద ముప్పు ఉందని, బహుళ పంటలు పండే భూములు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటూ పి.శ్రీమన్నారాయణ, అంతటి కమలాకర్, బొలిశెట్టి సత్యనారాయణ 2015లో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతి (ఈసీ) లోపభూయిష్టంగా ఉందని, దానిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కూడా పిటిషన్ వేశారు. గతంలోనే జస్టిస్ స్వతంతర్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను పూర్తి చేసినా.. తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం వెల్లడించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఒకే తీర్పును వెల్లడిస్తున్నట్టు జస్టిస్ స్వతంతర్ కుమార్ తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సంజయ్ పారిఖ్, పారుల్, కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరపున ఏకే గంగూలీ, గుంటూరు ప్రభాకర్, ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు తమ వాదనలు వినిపించారు. అయితే ఎన్జీటీ షరతులు రాజధాని నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీర్పులో సహజ నీటి ప్రవాహాల దిశలను మార్చరాదని ట్రిబ్యునల్ పేర్కొనడం ప్రధానమని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాలున్న చిత్తడి నేలల్లో కట్టడాలకు ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉండటం, కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో దాదాపు 15 వేల ఎకరాలు ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్పు ఇబ్బంది కలిగిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ 25 వేల ఎకరాలు మినహాయిస్తే మాస్టర్ప్లాన్ పూర్తిగా మార్చాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అప్పుడు మళ్లీ అనుమతులన్నీ మొదటికి వస్తాయని చెబుతున్నారు. ఈసీకి షరతులు.. స్టేట్ లెవల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) 2015 అక్టోబర్9న జారీ చేసిన ఈసీని పక్కకు పెట్టాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని, అయితే ఈసీ షరతులకు అదనంగా మరికొన్ని షరతులు విధించడం అవసరమని ఎన్జీటీ తీర్పులో పేర్కొంది. వీటిని ఈసీలోని షరతులుగా పరిగణించాలని పేర్కొంది. పదేళ్లలోగా రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంతో పాటు ఇప్పటివరకు జరిగిన పనిని కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని తీర్పులో పేర్కొంది. అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సంతులన విధానాన్ని పాటించడం ద్వారా ఆర్థికవృద్ధి సాధ్యమని పేర్కొంది. ‘‘ అమరావతి నిర్మాణానికి చట్టంలో కాలపరిమితి ఉంది. ఇప్పటికే పలు పనులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ‘ఫెయిట్ అకంప్లి’ (కొనసాగించక తప్పని పరిస్థితి) సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఉన్న దశ నుంచి వెనక్కి రావాలంటే భారీ మూల్యం చెల్లించడం ద్వారానే సాధ్యమవుతుంది. అది కేవలం ఆర్థికంగానే కాదు. ఇప్పటికే ఏర్పాటైన మౌలిక వసతులను కూల్చాలంటే పర్యావరణం, ప్రజలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఆయా ప్రాజెక్టుల తదుపరి పనులను పూర్తిచేసేందుకు అనుమతించేలా సంతులన విధానం పాటిస్తున్నాయి. అలాగే అవి పర్యావరణ పరిరక్షణకు తగిన రక్షణ చర్యలను ఆదేశిస్తున్నాయి’’ అని తన తీర్పులో ఎన్జీటీ పేర్కొంది. ఈసీకి అదనంగా విధించిన 9 షరతులు ఇవీ - సమర్థవంతమైన నీటి సంరక్షణ ప్రణాళిక రూపొందించుకునేందుకు రాజధాని ప్రాంతం లో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర హైడ్రోజియోమా ర్ఫాలజీ అధ్యయనం చేయించాలి. చెరువులు, జలాశయాలు, వరద నీటి కాలువలు, అంతర్గత అనుసంధానంతో కూడిన నీటి నిర్వహణ ప్రణాళిక ఉంటే నీటి సంరక్షణ చర్యలను మెరుగ్గా చేపట్టవచ్చు. - వరద నీటి కాలువలు, నీటి నిలువ కోసం నిర్మించే చెరువులు, సంబంధిత అభివృద్ధి పనుల కోసం ఫ్లడ్ ప్లెయిన్స్ (వరద ప్రాంతాలు)లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేసిన తరువాతే చేపట్టాలి. - నది గానీ, సహజ వరద నీటి ప్రవాహ పద్ధతిని గానీ, ప్రవాహ దిశను గానీ మార్చేందుకు అనుమతి లేదు. ప్రవాహ దిశను స్ట్రెయిట్గా చేయడానికి అనుమతించడం లేదు. అలాంటి మార్పుల వల్ల నేల కోతకు గురవుతుంది. భూగర్భ నీరు తగ్గుతుంది. - ప్రతిపాదిత రాజధాని నగరంలో వరద రక్షణ చర్యలకు మినహాయించి మరే ఇతర సందర్భాల్లోనూ ఇంతకు ముందే ఉన్న కట్టడాల్లో మార్పు చేయరాదు. వరద ప్రవాహ నమూనాపై సమగ్రమైన అధ్యయనం చేసిన తరువాతే పనులు చేపట్టాలి. - ప్రతిపాదిత నగరంలో నివాస, నివాసేతర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను ఎక్కడికక్కడ కంపోస్టింగ్ లేదా బయోమెథనేషన్ పద్ధతుల ద్వారా నిర్మూలించాలి. - వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు, సౌర శక్తి వినియోగం, నీటి పొదుపు పరికరాల బిగింపు, వినియోగించిన నీటిని శుద్ధి చేసి ఇతర అవసరాలకు వినియోగించడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాల నిబంధనలను నోటిఫై చేయాలి. - వాతావరణ మార్పుల ప్రభావ తగ్గింపునకు ఒక సమగ్రమైన సిటీ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. వచ్చే 6 నెలల్లో రంగాల వారీగా రోడ్ మ్యాప్ తయారు చేయాలి. - కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి. ఉపరితలంపై ప్రవాహ వేగం తగ్గించేందుకు, భూగర్భ నీటి నిల్వ పెంచేందుకు అటవీకరణ చేపట్టాలి. - రాజధాని నగరంలో ఉన్న 251 ఎకరాల అటవీ స్థలాన్ని సంరక్షించాలి. అటవీయేతర అవసరాలకు వినియోగించరాదు. కనీసం పార్కులు, వినోద కార్యక్రమాలకు ఆ భూమిని వినియోగించరాదు. రెండు కమిటీలు.. వాటి పాత్ర.. తీర్పులో ఇచ్చిన ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ప్రాజెక్టు నియంత్రణ, పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. అందులో ఒకటి సూపర్వైజరీ కమిటీ. ఇందులో చైర్మన్, నోడల్ అధికారి సహా ఆరుగురు సభ్యులు ఉంటారు. దీనికి కేంద్ర పర్యావరణ విభాగం అదనపు కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. ఏపీ పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ నోడల్ అధికారిగా ఉంటారు. ఇందులో సభ్యులుగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సంస్థ డైరెక్టర్ నామినేట్ చేసే సీనియర్ సైంటిస్ట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ డైరెక్టర్ నామినేట్ చేసే సీనియర్ సైంటిస్ట్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పుణే వర్సిటీలోని జియాలజీ విభాగ ప్రొఫెసర్ ఎన్జే పవార్ సభ్యులుగా ఉంటారు. రెండో కమిటీ ఇంప్లిమెంటేషన్ కమిటీ. ఇందులో రాష్ట్ర పర్యావరణ విభాగం అదనపు చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా.. పర్యావరణ మంత్రిత్వ శాఖ నామినీ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ నామినేట్ చేసే సీనియర్ సైంటిస్ట్, అనంతపురం ఎస్కేయూ మైక్రోబ యాలజీ విభాగం పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారు. కమిటీలు ఏం చేయాలి? - సూపర్ వైజరీ కమిటీ కనీసం మూడు నెలలకోసారి సమావేశమై విధాన మార్గదర్శకాలకు తుదిరూపు ఇవ్వాలి. పర్యావరణ అనుమతుల(ఈసీ)లో ఉన్న షరతులు, ప్రస్తుత తీర్పులో ఉన్న షరతులను రాష్ట్రప్రభుత్వం అమలు చేసేలా మార్గదర్శకాలు ఉండాలి. - ఇంప్లిమెంటేషన్ కమిటీ ప్రతి నెలలో సమావేÔశమై ఈ తీర్పులో ఉన్న ఆదేశాలను, సూపర్వైజరీ కమిటీ ఇచ్చే మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా చూడాలి. - షరతుల అమలుకు కమిటీ ఒక కాలపరిమితి విధించాలి. ప్రాజెక్టు పురోగతికి ఈ కాలపరిమితితో సంబంధం ఉండాలి. - ఈ కమిటీ సమగ్రమైన తనిఖీ నిర్వహించాలి. నీళ్లు, అడవులు, ప్రవాహాలు, చిత్తడి నేలలు, పర్యావరణ, జీవావరణ ప్రభావాలు, కాలుష్య నియంత్రణ వ్యవస్థలాంటివన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు కమిటీ అదనంగా కాలపరిమితితో కూడిన షరతులు లేదా మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవచ్చు. వీటిని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి. - కమిటీ ప్రతి 6 నెలలకోసారి గ్రీన్ ట్రిబ్యునల్కు నివేదిక సమర్పించాలి. అయితే తొలి నివేదిక మాత్రం ఈ తీర్పు వెలువరించిన తేదీ నుంచి మూడు నెలలకు సమర్పించాలి. ఈ నివేదిక రాగానే తగిన మార్గదర్శకాలు ఇస్తుంది. - వర్షపు నీటి సంరక్షణ, పునర్వినియోగానికి శుద్ధి చేసిన నీరు, భవన నిర్మాణాలకు ఫ్లైయాష్ ఇటుకలు వినియోగించడం వంటి అంశాలకు సానుకూలంగా భవన నిర్మాణ నిబంధనలను ఈసీలో సవరించాలి. కమిటీ ఈ నిబంధనలను కూడా అమలు చేయించాలి. - రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల బ్యాంకు గ్యారంటీని కమిటీకి సమర్పించాలి. ఈ తీర్పులోగానీ, ఈసీలో ఉన్న షరతులు గానీ ఉల్లంఘించినప్పుడు షోకాజ్ నోటీస్ జారీ చేసి కమిటీ ఆ బ్యాంకు గ్యారంటీని జప్తు చేసుకుంటుంది. -
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. నేడు ఎన్జీటీలో ప్రాజెక్టు అంశం విచారణకొచ్చింది. జస్టిస్ జావెద్ బెంచ్కు కేసును బదిలీ చేయాలని పిటిషనర్ తరఫు లాయర్ విజ్ఞప్తి చేయగా.. అందుకు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులే చేస్తున్నామని చెప్పారు. ఎన్జీటీ నుంచి అనుమతులు వచ్చాకే మిగతా పనులు చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మరోవైపు కేసు విచారణను వేగవంతం చేయాలని పిటిషనర్ కోరారు. ఈ క్రమంలో కేసు మరోసారి వాయిదా వేశారు. -
రోజుకు 50 వేల మందికే దర్శనం
న్యూఢిల్లీ: కశ్మీర్లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. అలాగే బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని ఈ నెల 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఆలయానికి చేరుకునే మార్గంలో 19 చోట్ల అగ్ని మాపక పరికరాలను ఏర్పాటుచేశారు. -
ఢిల్లీలో సరి–బేసి వాయిదా
న్యూఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధానిలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ‘సరి–బేసి’ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, ద్విచక్ర వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మహిళల భద్రతపై రాజీపడబోమన్న కేజ్రీ సర్కారు.. సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ మినహాయింపులకు ఎన్జీటీ అంగీకరించిన తర్వాత ‘సరి–బేసి’ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ వెల్లడించారు. ‘మహిళల భద్రతపై రాజీపడబోం. పీఎం 2.5, పీఎం 10 అనే కాలుష్య స్థాయిలూ కాస్తంత తగ్గాయి. కానీ ఎన్జీటీ నిర్ణయాలను గౌరవిస్తున్నాం. అయితే, సోమవారం మళ్లీ ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ వేస్తాం’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాల తర్వాత సీఎం కేజ్రీవాల్, పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సర్వీసులు ఓకే.. కానీ! ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన నేపథ్యంలో నవంబర్ 13 నుంచి 17 వరకు ఐదురోజుల పాటు సరి–బేసి విధానాన్ని అమలుచేయాలని తొలుత కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్రమైన స్మాగ్ (పొగమంచు+కాలుష్యం) కారణంగా పాఠశాలలకు కూడా ఆదివారం వరకు సెలవులిచ్చింది. దీంతో సోమవారం నుంచి స్కూలు బస్సులు, ఇతర వాహనాలతో మళ్లీ కాలుష్యం పెరగొచ్చని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇందులో మహిళల వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటుగా అంబులెన్సు, చెత్త తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ మినహాయింపులపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. అంబులెన్సు, చెత్త వాహనాలు, ఫైరింజన్లకు మినహాయింపును సమర్థించిన ఎన్జీటీ.. మహిళలు, ద్విచక్ర వాహనాలకు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ సర్కారు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. చలికాలంలో వాహనాల ద్వారానే పెద్దమొత్తంలో పీఎం2.5, పీఎం10లు మామూలు సమయం కన్నా 20–25 శాతం ఎక్కువగా వెలువడతాయని ఐఐటీ కాన్పూర్ గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. ఢిల్లీ ట్రాన్స్పోర్టుపై ఎన్జీటీ ఆగ్రహం ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ బస్సులను సరిగా నిర్వహించటం లేదని.. దీని కారణంగా ఈ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఎన్జీటీ మండిపడింది. ‘మీ బస్సులు రోడ్లపై పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. చాలావరకు బస్సుల్లో కనీసం హ్యాంగర్లు ఉండవు. బస్సులను నిర్వహించటంలో బాధ్యతగా వ్యవహరించరెందుకు?. కొన్ని సార్లు ఖాళీగా వెళ్తున్నాయి. మరికొన్ని సార్లు రద్దీగా ఉంటున్నాయి’ అని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ మండిపడ్డారు. తక్కువ ట్రాఫిక్ ఉన్న సమయాల్లో మినీ బస్సులు నడపాలని గతంలో ఎన్జీటీ సూచించింది. వీటిని పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం దేశరాజధానిలో గాలిలో విషపదార్థాలు, కాలుష్యకారకాల స్థాయి ఇంకా ప్రమాదకరస్థితిలోనే ఉంది. వరుసగా ఐదోరోజూ అదే స్థాయిలో పొల్యూషన్ కనిపించింది. కాస్త కుదురుకుంటుందనుకున్న తరుణంలో.. శనివారం సాయంత్రం పరిస్థితుల్లో మార్పు నగరాన్ని ‘కాలుష్య అత్యవసర’ దిశగా తీసుకెళ్లింది. పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే.. పరిస్థితి భిన్నంగా మారింది. వేగంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడటమే ఇందుకు కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) అధికారులు తెలిపారు. దీనివల్ల అనారోగ్య పరిస్థితులు తీవ్రమవుతాయని హెచ్చరించారు. సీపీసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వాయు నాణ్యత సూచీ 423 (మొత్తం 500) యూనిట్లుగా నమోదవగా.. పీఎం2.5 స్థాయి 422కు చేరుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో యూపీలోని ఘజియాబాద్ అత్యంత కాలుష్య ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ వాయు నాణ్యత సూచీ 484 యూనిట్లుండగా.. పీఎం 2.5 స్థాయి 869 యూనిట్లకు చేరింది. సాధారణ స్థాయికన్నా ఇది 34 రెట్లు ఎక్కువ. -
‘సరి–బేసి’కి ఎన్జీటీ అంగీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అంగీకరించింది. సరి సంఖ్య నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావచ్చని జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ద్విచక్రవాహనదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు కూడా ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరింది. చెత్తను తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్లకు మాత్రమే ఈ నిబంధన నుంచి ఎన్జీటీ మినహాయింపు ఇచ్చింది. కాలుష్యం లెవల్ 300 దాటితే తప్పనిసరిగా సరి- బేసి విధానం తీసుకురావాలని ఆదేశించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. కాగా సరి, బేసి విధాన అమలులో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని గ్రీన్ ట్రిబ్యునల్ తలంటింది. 15 ఏళ్లు నిండిన పాత కాలం నాటి వాహనాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాలని సూచించింది. నగరాన్ని మింగేస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఈ విధానాన్ని పాటించాల్సిందేనని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. -
పోలవరం ప్రాజెక్టు పరిధి పెంచారా?
-
పోలవరం ప్రాజెక్టు పరిధి పెంచారా?
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం విషయంలో దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం పర్యావరణ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధి పెంచారా? అని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. దీనికి బదులుగా 36 లక్షల క్యూసెక్కుల వరద నుంచి 50 క్యూసెక్కులకు మార్పు చేశామన్న సమాధానం వినిపించింది. ఆపై అదనంగా ముంపు ఎంత పెరిగిందని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని న్యాయవాది బదులిచ్చారు. కాగా, ఈ వాదనతో పిటిషనర్ విభేదించారు. ముంపుతో విపత్తు ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొనటంతో.. సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా ఉన్న పిటిషన్ల కాపీలన్నీ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 2019 కల్లా పోలవరం అసాధ్యం పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వమంతా గోల్ మాల్ వ్యవహారం నడుపుతోందని మసుద్ హుస్సేన్ కమిటీ ఇచ్చిన నివేదికతో స్పష్టమౌతోంది. 2019 కల్లా ప్రాజెక్టు పూర్తవటం అసాధ్యమని కమిటీ చెప్పటంతో చంద్రబాబు ప్రభుత్వం చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయిందన్నది వెల్లడైంది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 50 వేల కోట్లకు పెంచటం విస్మయం కలిగిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టకుండా ఆయకట్లు పనులు ఎలా చేపడతారోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. పునరావాసం పరివాసం కూడా రూ. 2,394 కోట్ల నుంచి 32 వేల కోట్లకు అంచనాల పెంపుపై కమిటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపిక చేసిన పునులే చూపిస్తూ.. కుడి, ఎడమ కాలువల్లో ఇప్పటికీ కొన్ని నిర్మాణాలు పూర్తి కాలేదని కమిటీ నివేదిక వెల్లడించింది. జల విద్యుత్ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. కాపర్ డ్యామ్ ద్వారా 2018 కల్లా గ్రావిటీ నీళ్లు మళ్లీస్తామని చంద్రబాబు ప్రకటించారని.. కానీ, డ్యామ్ కోసం ఇంకా భూసేకరణే పూర్తి చేపట్టలేదని.. అలాంటప్పుడు చంద్రబాబు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందన్నది స్పష్టమౌతోంది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా.. ప్రాజెక్టు నిర్వాణంలో భారీ అవినీతి జరగుతుందోంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మసుద్ కమిటీ డొల్లతనం మొత్తం బయటపెట్టగా.. బల్రాజ్ జోషి కమిటీ నేడో, రేపో పోలవరం పనులను పరిశీలించనుంది. -
కారణాలు తెలియకుండా విచారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కారణాలు వెల్లడించకుండానే కాళేశ్వరం పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు.. మరి ఆ కారణాలు తెలియకుండా దాఖలు చేసిన పిటిషన్పై ఎలా విచారణ జరుపుతాం’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పనులూ కొనసాగించొద్దని, పనులన్నీ వెంటనే నిలిపేయాలని ఈ నెల 5న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వుతో రోజుకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతోందంటూ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యం విషయమై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం ముందు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి సోమవారం ఉదయం ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులు నిలిపేయాలని హడావుడిగా ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనంలో ఓ సభ్యుడు పదవీ విరమణ చేస్తున్నప్పుడే మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాము చేపడుతున్నది తాగునీటి ప్రాజెక్టు పనులేనని, ఇందుకు అటవీ అనుమతులు అవసరంలేదని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సెలవులు వచ్చినప్పుడు ఉత్తర్వుల కాపీ అందకపోవడం సహజమేనని.. ప్రాజెక్టు పనులను ఏ కారణాలతో ఎన్జీటీ నిలిపేసిందో తెలుసుకోకుండా విచారణ చేపట్టడం కష్ట సాధ్యమని పేర్కొంది. తీర్పు పూర్తి పాఠం కోసం ప్రయత్నిస్తున్నామని ఏజీ చెప్పగా, మధ్యాహ్నం విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తామంది. కానీ మిగిలిన కేసుల విచారణతోనే కోర్టు సమయం ముగియడంతో వ్యాజ్యం విచారణ జరగలేదు. -
జంతర్ మంతర్ ఇక ఛూ... మంతర్
సాక్షి, న్యూఢిల్లీ : అనేక ప్రజా పోరాటాలకు, ప్రదర్శనలకు, ధర్నాలకు వేదికగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్ మైదానం మూగబోతోంది. ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు కూత వేటు దూరంలో ఉండి ప్రజా గళాన్ని ప్రతిధ్వనించిన జంతర్ మంతర్ మసకబారుతోంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, వ్యక్తులకు పోరాట స్ఫూర్తినిచ్చిన ఈ వేదిక తన పోరాట పంథాను మార్చుకోబోతోంది. ఈ వేదికను మూసివేయాలని, ప్రజా నిరసనలకు ఇక్కడ ఇక ఏ మాత్రం అనుమతులు ఇవ్వరాదని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడమే అందుకు కారణం. వారం రోజుల్లోగా ఈ వేదికను ఖాళీ చేయించాల్సిందిగా నగర పోలీసులకు కూడా ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ఆందోళనలకు రామ్లీలా మైదాన్ను అనుమతించండని కూడా పేర్కొంది. ఢిల్లీ నగరంలో ప్రజా పోరాటాలు లేదా ఆందోళనలు నిర్వహించేందుకు ప్రధానంగా మూడు వేదికలు ఉన్నాయి. వాటిలో పార్లమెంట్, పాలక భవనాలున్న రైసినా హిల్స్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో జంతర్ మంతర్ మైదానం ఉంది. ఎక్కువ మంది కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ మార్గం గుండానే వెళతారు. ఐదువేల మందికి లోపల వచ్చే ప్రజాందోళనలకు ఇక్కడ అనుమతిస్తారు. ఐదు వేల మందికి మించితే రైసినా హిల్స్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్లీలా మైదాన్లో అనుమతిస్తారు. (సాక్షి)యాభైవేలకు పైగా జనం తరలి వచ్చేదుంటే నగరంలో బురారీ గ్రౌండ్ను అనుమతిస్తారు. 1988లో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ భారీ ర్యాలీ తర్వాత నుంచి జంతర్ మంతర్ శాంతియుత ప్రజా పోరాటాలకు వేదికగా గుర్తింపు పొందింది. నాడు భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ నాయకత్వాన భారీ రైతులు ర్యాలీ జరిగింది. అప్పుడు లక్షలాదిగా తరలి వచ్చిన రైతులతో బోట్క్లబ్, ఇండియా గేట్ మైదానాలు, రాజ్పథ్ రోడ్లు కిక్కిర్సి పోయాయి. అంతటి మహార్యాలీకి స్పందించిన అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రైతుల డిమాండ్లన్నింటిని నెరవేర్చింది. అప్పట్లో పార్లమెంట్ వీధిలోకి ప్రజా ప్రదర్శనలు(సాక్షి) అనుమతించే వారు. మంత్రులు లేదా పార్లమెంట్ సభ్యులు ప్రజా ప్రదర్శనల వద్దకు వచ్చి వారి విజ్ఞప్తులు స్వీకరించే వారు. వారి సమస్యల పరిష్కారానికి హామీలిచ్చే వారు. 2003లో తీసుకొచ్చిన పోలీసుల స్టాండింగ్ ఉత్తర్వులతో పరిస్థితి మారిపోయింది. నిత్యం 144 సెక్షన్ అమలు అప్పటి నుంచి పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం తదితర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నలుగురికి మించి గుమికూడరాదంటూ నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. రెండు నెలలకు మించి ఈ ఉత్తర్వులను పొడిగించరాదు. రాజకీయ వ్యవస్థకు లోబడి చట్టం స్ఫూర్తిని పట్టించుకోని పోలీసు విభాగం ప్రతి రెండు నెలలకోసారి ఈ నిషేధ ఉత్తర్వులను పొడిగిస్తూనే వస్తోంది. గుడ్డిగా ఈ 144వ సెక్షన్ కింద నిషేధ ఉత్తర్వులను అమలు చేయడం తగదని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇతర చట్టాలను ఉపయోగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో(సాక్షి) మాత్రమే ఈ సెక్షన్ను ఉపయోగించాల్సి ఉంటుందని ఆచార్య జగదీశారానాంద అవధూత కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. కోర్టు ఉత్తర్వులను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని ప్రజా సంఘాలు కూడా ఈ నిషేధ ఉత్తర్వులను సవాల్ చేయడం లేదు. 2003 నుంచే ముందస్తు అనుమతి 2003 సంవత్సరం నుంచి ప్రజాందోళనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్టాండింగ్ ఉత్తర్వులు తెలియజేస్తుండడంతో అప్పటి నుంచి ప్రజాందోళనలకు జంతర్ మంతర్ ప్ర«ధాన వేదికైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ పురుడు పోసుకుంది ఈ వేదికపైనే. ఈ వేదికలో రోజుకు ఎనిమిది నుంచి పది ఆందోళనలు జరుగుతుంటాయి. వాటిలో సమూహాలు ఉంటాయి. వ్యక్తుల ఒంటరి పోరాటాలు ఉంటాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే ఈ మైదానంలో 2,283 ప్రజాందోళనలు కొనసాగాయి. గతేడాది ఇంతకన్నా తక్కువ అంటే, 1,921 ఆందోళనలు కొనసాగాయి. అప్పటి నుంచి ఎవరూ కూడా పార్లమెంట్ వైపు దూసుకుపోయి ఆందోళన చేయాలనుకోవడం లేదు. అలాంటి ప్రయత్నాలు జరిగినా పోలసులు మధ్యలోనే అడ్డుకుంటున్నారు. 2012, డిసెంబర్ 22వ తేదీన మాత్రం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వీధి, ఇండియా గేట్ వరకు ప్రజాందోళన పెల్లుబికింది. నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపేసినందుకు అంతటి ఆందోళన చెలరేగింది. ముంబై నగరంలోకూడా... ఢిల్లీ తరహాలోనే ప్రజాందోళనలకు ముంబై నగరంలో కూడా ఆజాద్ మైదాన్ ఉంది. రాష్ట్ర సచివాలయం (మంత్రాలయ)కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. 1992–93లో ముంబైలో పెద్ద ఎత్తున హిందూ, ముస్లిం మధ్యన అల్లర్లు జరగడంతో ముంబై సెంట్రల్ బిజినెస్ జిల్లాలో కూడా నిరంతరంగా 144వ సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాందోళనలను క్రమబద్దీరించాలని, వాటికొక ఓ వేదిక కల్పించాలని ముంబై హైకోర్టు ఆదేశించడంతో ఆజాద్ మైదాన్ అందుకు వేదికయింది. అప్పటి నుంచి ఈ మైదాన్లో ఎన్నో ర్యాలీలు జరిగాయి. మరాఠీ క్రాంతి మోర్చా ఈ మైదాన్లో నిర్వహించిన ర్యాలీకి ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు ప్రజలు హాజరయ్యారు. ఆందోళన చేయడం హక్కేనా? ఆందోళన చేయడం ప్రజల హక్కు కింద అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం గుర్తించడం లేదు. అయితే పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలోని 21వ అధికరణం ప్రజల శాంతియుత ఆందోళనను ఓ హక్కుగా అనుమతిస్తోంది. అయితే ఈ హక్కు వల్ల ఇతరుల స్వేచ్ఛ, భద్రత, ఆరోగ్యానికి భంగం కలగరాదు. ఈ అంతర్జాతీయ అధికరణం గురించి తెలుసో, తెలియదోగానీ జంతర్ మంతర్ చుట్టుపక్కల(సాక్షి) నివసిస్తున్న ప్రజలు తమకు ధ్వనికాలుష్యం వల్ల, మైదానం చుట్టూ ఆందోళనకారులు చెత్తా చెదారం పడేయం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులే అవడం వల్ల వారి మాటను దృష్టిలో పెట్టుకొని ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
గ్రీన్ ట్రిబ్యునల్ స్టే తాత్కాలికమే
సాక్షి, యాదాద్రి/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టే తాత్కాలిక అడ్డంకి మాత్రమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఆయన నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీటీ స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ పైశాచిక ఆనందం అనుభవిస్తోందని విమర్శించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్న దశలో కాంగ్రెస్ కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్లు ఇవ్వాలని మిషన్ భగీరథ చేపట్టామని, ఇందులో కాళేశ్వరం అత్యంత ప్రాధాన్యత కలిగిందన్నారు. కుళ్లు రాజకీయాలతో కాంగ్రెస్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టునూ కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేరుగా నష్టపరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ.. రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జనవరిలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులోకి నీళ్లు వదులుతామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో మార్కెట్ నిర్మాణం నల్లగొండ జిల్లాలో చేపట్టిన బత్తాయి మార్కెట్ నిర్మాణాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని హరీశ్రావు హామీ ఇచ్చారు. అలాగే దొండ, నిమ్మ మార్కెట్ల నిర్మాణాన్ని రెండు, మూడు మాసాల్లో పూర్తి చేస్తామన్నారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం... ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటోందని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో తెలంగాణలో సీపీఎంకు స్థానం లేదన్నారు. రాష్ట్రంలో సీపీఎంకు ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ఉందని, అది కూడా త్వరలోనే ఖాళీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి జగదీశ్రెడ్డి, నల్లగొండ, భువనగిరి ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 24 గంటలు వద్దు.. 12 గంటలు ముద్దు నల్లగొండలో 24 గంటల విద్యుత్పై హరీశ్రావు ప్రసంగిస్తున్న సమయంలో కట్టంగూరు మండలం ఈదులూరుకు చెందిన రాములు అనే రైతు లేచి 24 గంటల విద్యుత్ వద్దని 9 గంటలు చాలని అన్నాడు. దీంతో మంత్రి జోక్యం చేసుకుని 24 గంటల విద్యుత్ ఎందుకు వద్దుంటున్నావ్..? అని అడిగారు. నీళ్లు సరిపోవడం లేదని, బోర్లులో నీళ్లు ఉండటం లేదని 9 గంటలు ఇస్తే చాలని రాములు చెప్పాడు. రాములు వ్యక్తం చేసిన అభిప్రాయం పైన మంత్రి అభిప్రాయ సేకరణ చేశారు. రాములుకు మద్ధతుగా చేతులు ఎత్తాలని మంత్రి కోరారు. దీంతో సభకు హాజరైన వారిలో కొందరు 9 గంటలు కావాలని, మరికొందరు 12 గంటలు ఇవ్వాలని కోరారు. మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. -
కాళేశ్వరంపై ఎన్జీటీ స్టే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) బ్రేకులు వేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు లేవని, పనులను ఆపాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన హయాతుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని నెలలుగా విచారణ జరిపిన ట్రిబ్యునల్ గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అనుమతులు అవసరం లేదు కేసు సందర్భంగా పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన కాళేశ్వరం పథకాన్ని సాగునీటి అవసరాలకే కాకుండా తాగునీటి అవసరాల కోసం చేపట్టినట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని వివరించారు. పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చాక అప్పుడు సాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం స్టేజ్–1 అనుమతులు లభించాయని, త్వరలోనే పూర్తిస్థాయి పర్యావరణ, అటవీ అనుమతులు లభిస్తాయని ట్రిబ్యునల్కు నివేదించారు. ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తోంది ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఏడో లింక్లో 21, 22, 27 ప్యాకేజీల్లో 319 హెక్టార్ల అటవీ భూమిని ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగిస్తోందని తెలిపారు. మొత్తంగా ప్రాజెక్టు పరిధిలో 672.60 హెక్టార్ల అటవీ భూములను వినియోగిస్తోందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని తెలిపారు. దీనికి అటవీ అనుమతులు లేవన్నారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందిస్తూ... ప్రాజెక్టు పరిధిలో వచ్చే అటవీ భూముల వివరాలను తమకు అందించాలని గతంలోనే ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో అటవీ భూములపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో ప్రభుత్వం ప్రాజెక్టు లక్ష్యాలను వివరించింది. ప్రాజెక్టు నిర్మాణంలోని కాంట్రాక్టర్లకు సరిహద్దులు తెలియక అటవీ ప్రాంతంలో కొంతమేర ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది. అయితే వాటిని వెంటనే గుర్తించి తొలగించడంతోపాటు అటవీశాఖకు జరిమానా కూడా చెల్లించినట్టు తెలిపింది. వాటితో నిర్మాణాలు చేపట్టలేరు ప్రభుత్వం చెబుతున్నట్టుగా స్టేజ్–1 అనుమతులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టలేరని, ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఈ అనుమతులు సరిపోవని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ చెప్పారు. అటవీ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి దీనికి పూర్తి పర్యావరణ, అటవీ అనుమతులు అవసరమని వాదించారు. అటవీ భూముల వివరాల విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. దీనిపై ట్రిబ్యునల్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దశాబ్దకాలం నుంచి ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని చెబుతున్న తరుణంలో ప్రాజెక్టు వివరాలను వేళ్ల మీద చెప్పాల్సింది పోయి.. అటవీ భూముల వివరాల్లో స్పష్టత లేదంటే ఎలా అని ప్రశ్నించింది. ఇది ఉల్లంఘనే.. వాదనలు విన్న ట్రిబ్యునల్ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగిస్తున్నారంటూ ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించింది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, చెట్లు నరకరాదని, బ్లాస్టింగ్ లాంటి పనులు చేపట్టరాదని ఆదేశించింది. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత ప్రభుత్వం తమను ఆశ్రయించవచ్చని, అప్పటి వరకు ప్రాజెక్టును ఆపాలని స్పష్టం చేసింది. అనుమతులు వచ్చాక సంప్రదిస్తే తాము జారీ చేసిన ఉత్తర్వులను సవరించడానికి సిద్ధంగా ఉన్నామని సూచించింది. జస్టిస్ జావేద్ రహీమ్ ఆదేశాల ప్రతులను చదివే సమయంలో ప్రభుత్వం కల్పించుకొని... మధ్యంతర ఉత్తర్వుల అమలును మూడ్రోజులపాటు నిలుపుదల చేయాల్సిందిగా కోరింది. అయితే అందుకు తిరస్కరించిన బెంచ్ తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై స్టే
న్యూఢిల్లీ : తెలంగాణ సర్కార్కు జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఎదురు దెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలంటూ ఎన్జీటీ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తిస్థాయిలో పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు వచ్చేవరకూ ప్రాజెక్ట్ నిర్మాణపు పనులు నిలుపుదల చేయాలని ఆదేశించింది. కాగా అనుమతులు లేకుండా అటవీ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని హయత్ ఉద్దీన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాగునీటి ప్రాజెక్ట్ అని తెలంగాణ సర్కార్ ఎన్జీటీ ఎదుట వాదనలు వినిపించింది. నీటి పారుదల ప్రాజెక్ట్గా మార్చేనాటికల్లా అన్ని అనుమతులు సాధిస్తామని తెలిపింది. అయితే పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చేంతవరకూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్టీజీ ఆదేశాలు ఇచ్చింది. -
బెంగళూరు చెరువు వింత కథ
ఒకసారి నిప్పులు, మరోసారి నురగలు పరిష్కారంపై కర్ణాటక ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు సాక్షి, బెంగళూరు: ఐటీ నగరి బెంగళూరులోని ఒక చెరువు వింతపోకడ కర్ణాటక ప్రభుత్వానికి చిక్కులు తెస్తోంది. ఆ చెరువు ఒకసారి భారీఎత్తున మంటలు, పొగతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోసారి నురగలు కక్కుతూ ముచ్చెమటలు పట్టిస్తోంది. బెంగళూరులోని బెల్లందూరు చెరువు నుంచి తరచూ వస్తున్న నురగపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు సైతం జారీ చేసింది. ఇటీవల వర్షాలతో బెల్లందూరు చెరువు మళ్లీ భారీ ఎత్తున నురగలు కక్కుతోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఫిబ్రవరిలో చెరువులో వారంరోజులకు పైగా భారీస్థాయిలో పొగ, మంటలు లేచాయి. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. సమీప నివాసాలు, వాణిజ్య ప్రాంతాలు, ఫ్యాక్టరీల నుంచి టన్నుల కొద్దీ వస్తున్న చెత్త, మురుగువల్ల చెరువు కలుషితమవుతోంది. అదే దీనికి కారణమని చెబుతున్నారు. నురగపై ఎన్జీటీ తాఖీదులు తాజాగా నురగ సమస్యపై ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ‘బెల్లందూరు చెరువు సమస్యకు గతంలో కొన్ని పరిష్కార మార్గాలను సూచించాం. చెరువులో ఉన్న వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేయాలని చెప్పాం. అయినా చర్యలు లేవు. ఈ నురగ సమస్యకు మీరు చూపే పరిష్కారం ఏమిటి?’ అని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఒకటి, రెండేళ్లలో పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని కనుగొంటామన్నారు. -
బెంగళూరు చెరువు వింత కథ
-
‘పాలమూరు’పై స్వతంత్ర కమిషన్
జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) ప్రాజె క్టుకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ చట్ట ఉల్లంఘనలు, ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుతెన్నులు, అటవీ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు తదితర విషయాల్లో నిజా నిజాలను తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్ను నియమించింది. ఎన్జీటీ విశ్రాంత సభ్యులు ప్రొఫెసర్ యూసెఫ్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిషన్లో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు, పిటిషనర్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఎస్.నంబియార్, పి.ఎస్.రావులతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహా రంలో అంతిమ నిర్ణయానికి రావడానికి కమిషన్ సహాయం తమకు అవసరమని, అందువల్లే పిటిషనర్ అభ్యర్థనను ఆమోదిస్తు న్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. -
ప్రభుత్వం నిబంధనలు పాటించడంలేదు
ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి నివేదించిన సీపీసీబీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూడికతీత పనుల పేరుతో చేపడుతున్న ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పాటించడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక సమర్పించింది. సీపీసీబీ గతంలో సమర్పించిన నివేదిక పూర్తిగా అసమగ్రంగా ఉండడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అదనపు నివేదికను మంగళవారం సమర్పించిన సీపీసీబీ ప్రభుత్వ ఉల్లంఘనలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చింది. పూడికతీతకు వివిధ సంస్థలకు కేటాయించిన ఇసుక క్వారీల్లో.. ఏ ప్రాంతంలో పూడికతీయాలి, ఎంత పరిమాణంలో తీయాలి అన్న విషయంలో ప్రభుత్వం ఎక్కడా మార్గదర్శకాలు విడుదల చేయలేదని, దీంతో ఆయా సంస్థలకు క్వారీలో ఎక్కడైనా సరే ఎంతైనా తవ్వుకొనే స్వేచ్ఛ ఇచ్చారని ఆరోపించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ కేసును మంగళవారం విచారించిన జస్టిస్ జావేద్ రహీం నేతృత్వంలోని ట్రిబ్యునల్ సీపీసీబీ నివేదికపై అభిప్రాయాలను తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. -
అమరావతిపై విచారణ నేటికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతిపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపిస్తూ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పైగా రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం హక్కు అని పేర్కొందని సంజయ్ పారిఖ్ వాదించారు. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
ఎందుకు దెబ్బతీస్తున్నారు?
కొండవీటి వాగు స్వరూపంపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: కొండవీటి వాగు సహజ స్వరూపాన్ని ఎందుకు దెబ్బ తీస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతికి వరద ముప్పు ఉండగానే పర్యావరణ అనుమతులు దక్కడంపై దాఖలైన పలు పిటిషన్లను ఎన్జీటీ మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ, గుంటూరు ప్రమోద్కుమార్ వాదనలు వినిపిస్తూ రాజధాని ప్రాంతం వరద ప్రభావ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ.. ఈ వరద ప్రభావ ప్రాంతం క్రియాశీలకంగా లేదని, వరదలు వచ్చిన చరిత్ర లేదని పేర్కొన్నారు. కొండవీటి వాగు ప్రవాహం వర్షాకాలానికే పరిమితమై ఉంటుందని, ఎలాంటి వరద ముప్పు లేకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెపుతూ.. వాగుకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులను చూపించారు. వాగు సహజ ప్రవాహ దిశను మళ్లించే యత్నం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఫారిఖ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్జీటీ ఛైర్మన్ స్పందిస్తూ... అంత చక్కగా సహజ ప్రవాహ దిశను కలిగి ఉన్న కొండవీటి వాగును ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం ఆక్రమణలను తొలగిస్తున్నామని గంగూలీ వివరించారు. విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా పడింది. -
'పూడికతీత పనులపై వివరణ ఇవ్వండి'
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలోని బ్యారేజీల్లో పూడికతీత పేరుతో జరుపుతున్న ఇసుక తవ్వకాలపై వివరణ ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం గురువారం విచారించింది. ప్రకాశం బ్యారేజీలో, తెలంగాణలోని మేడిగడ్డ–అన్నారంలో, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో పూడికతీత పనుల పేరుతో బ్యారేజీల్లో పెద్ద ఎత్తున యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయండని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
పూలింగ్లో కుంభకోణం
⇒ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ⇒ సీఆర్డీఏ అధికారులు చట్టాలు,రాజ్యాంగం చదవాలి సాక్షి, అమరావతి : సీఆర్డీఏ అధికారులకు ఇంగిత జ్ఞానం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. వారు చట్టాలు.. రాజ్యాంగాన్ని చదవాలని హితవు పలికారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన సూచనలు, ఆదేశాలపై వారు చెబుతున్న మాటలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట విరుద్ధంగా పనిచేస్తే ఇప్పుడు కాకపోయినా నాలుగేళ్ల తర్వాతైనా అధికారులు ఇబ్బంది పడక తప్పదన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూ సమీకరణలో కుంభకోణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. విశాఖపట్నం పరవాడ భూ సమీకరణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, ఇక్కడా అలాంటి పరిస్థితి నెలకొందన్నారు. అమరావతిలో డి ఫారం పట్టా భూములు కొనుగోలు చేసిన వారికి పరిహారం ఇవ్వవచ్చని ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చిందని, అది చెల్లదని దానిపై ప్రభు త్వ సీఎస్కు లేఖ రాసినట్లు చెప్పారు. అవసరం లేకున్నా వేలాది ఎకరా లు సేకరి స్తూ ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తోందని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని మారిస్తే హైకోర్టులో సవాలు చేస్తామన్నారు. మంచినీళ్లు తాగినట్లు..: మంచినీళ్లు తాగినంత తేలిగ్గా రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం – అమరావతి రహదారికి 26,800 ఎకరాలు, అమరావతి అవుటర్ రింగు రోడ్డుకు 8,500 ఎకరాలను నెలల వ్యవధిలో సేకరించాలని ముఖ్య మంత్రి ఆదేశించడం దారుణమన్నారు. -
జీవో 111ను ఎత్తేయాలా... వద్దా!
కుదరని ఏకాభిప్రాయం తొలిసారి భేటీ అయిన సాధికారత కమిటీ సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111ను పునస్సమీక్షించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్టు సాధికారత కమిటీ మంగళవారం తొలి సారి భేటీ అయింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల మేరకు మంగళవారం సచివాల యంలో ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. కె.జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ఎలాంటి నిర్ణయానికీ రాకుండా ముగిసింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దానకిశోర్, కమిటీ సభ్యులు కౌశిక్రెడ్డి, నరేంద్రనాథ్రెడ్డి, రాజ్కుమార్ ఠాగూర్, డాక్టర్ వీరన్న, ప్రొఫెసర్ జయరామ్, కార్తీక్రెడ్డి, ఎన్జీఆర్ఐ, టెరీ సంస్థల నిపుణులు పాల్గొన్నారు. త్వరలో మరోసారి సమావేశం... సమావేశంలో కమిటీ సభ్యుడు కార్తీక్రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా 84 గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలకు జీవో 111ను ఎత్తి వేయడం ద్వారా చరమగీతం పాడాలని కమి టీని కోరారు. ఈ జీవో నుంచి పూర్తి మినహా యింపునిచ్చిన పక్షంలో ఆయా గ్రామాల ప్రజ లకు పలు ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు చేకూ రుతాయన్నారు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు జలాశయాల నుంచి గ్రేటర్ హైదరా బాద్కు నిత్యం 500 మిలియన్ గ్యాలన్ల తాగు నీటిని సేకరిస్తున్నందున నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాలపై ఆధారపడాల్సిన ఆవశ్యకత లేదన్నారు. మరో సభ్యుడు నరేంద్ర నాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఈ జీవో వల్ల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతిం టున్నాయన్నారు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని డాక్టర్ వీరన్న, ప్రొ. జయరామ్ చెప్పారు. జంట జలా శయాల పరిరక్షణకు ఇచ్చిన జీవో 111కు ఎలాంటి మార్పు, చేర్పులు చేయరాదని మరో సభ్యుడు రాజ్కుమార్ఠాగూర్ అభిప్రాయ పడ్డారు. సమావేశంలో ఏకాభిప్రాయం రానందున మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. జీవో నేపథ్యమిదీ: హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల మనుగడకు ప్రమాదం ఏర్పడ కుండా... రాజేంద్రనగర్, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలా ల్లోని 84 గ్రామాల పరిధిని జీవసంరక్షణ మండలిగా పరిగణిస్తూ 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. ఈ జీవో కారణంగా తమ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికీ నోచుకో వడంలేదని 84 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయు డు కౌశిక్రెడ్డి జీవో 111ను పునస్సమీక్షించాలని కోరుతూ హైకోర్టుతో పాటు చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. జీవ సంరక్షణ మండలి పరిధి నిర్ధారణలో శాస్త్రీయత లేదని, దిగువ ప్రాంతాలను సైతం ఆంక్షల పరిధిలో చేర్చడం సహేతుకం కాదన్నారు. పిటిషనర్ అభ్యర్థన మేరకు జీవో సవరణ, జలాశయాల పరిరక్షణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సాధికారత కమిటీ ఏర్పాటు చేయా లని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. -
ప్రజల్లోకి వెళదాం :కేసీఆర్
-
ప్రజల్లోకి వెళదాం!
► అధికార టీఆర్ఎస్ కసరత్తు ►ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాలను ఎండగట్టే వ్యూహం ►రైతు సంఘాలు, భూ నిర్వాసితులతో సమావేశాలు ► ప్రాజెక్టులు, భూసేకరణపై వాస్తవాలు చెప్పాలని నిర్ణయం ►సంక్రాంతి తర్వాత సీఎం ‘జనహిత’ కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతి రాజకీయ పార్టీకి ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేయాలని ఉంటుంది. మేమైనా అంతే. ఒక్కటన్నా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలను కుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం మా కాళ్లలో కట్టెలు పెడుతున్నాయి. భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భూసేకరణ జరగకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తాం?’’అని అధికార టీఆర్ఎస్లోని సీనియర్ నేత, మంత్రి ఇటీవల ప్రశ్నించారు. ఆ నేత మాటలకు తగినట్లుగానే ప్రతిపక్షా లను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. భూసేకరణను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం నేరుగా 12 కేసులు, పరోక్షంగా మరో 20 కేసులు వెరసి 32 కేసులను వేసిందని మంత్రి హరీశ్రావు అసెం బ్లీలో ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్, టీడీపీ, మరోవైపు రాజకీయ జేఏసీ ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపుతున్నాయి. భూసేక రణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 123 జీఓను హైకోర్టు కూడా ఇటీవల తప్పుబట్టింది. మరోవైపు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవంటూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు దాఖలైంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ ఎస్ నాయకత్వం... ప్రజలకు వాస్తవాలు వివరించాలన్న నిర్ణయానికి వచ్చింది. నిర్వాసితులతో సమావేశాలు.. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై వాస్తవాలను వివరించడం, ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేయడం లక్ష్యంగా రైతు సంఘాలు, భూ నిర్వాసితులతో ఎక్కడికక్కడ సమావేశాలు జరిపేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ సమస్యగా మారడం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సాధ్యం కాదని భావించి తెచ్చిన 123 జీవోను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కోర్టుకెక్కడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో భూసేకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు ప్రజల్లోనే బుద్ధి చెప్పేలా నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రాజెక్టుల కోసం భూమి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తరఫున చేకూరే లబ్ధి గురించి వివరించనున్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కలిగించాలన్న యోచనలో అధికార పార్టీ ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులతోపాటు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాంతాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రగతి భవన్ లో జనహిత... సీఎం కేసీఆర్ సంక్రాంతి తర్వాత నేరుగా ప్రజలను కలుసుకునే కార్యక్రమం మొదలు కానుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కొత్తగా నిర్మించిన సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనే ‘జనహిత’పేర కార్యక్రమం మొదలవుతుందని, దీనికి సంబంధించి అధినాయకత్వం కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి. -
ఎన్జీటీ ఉత్తర్వులు ఏకపక్షం
♦ కొట్టేయాలంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ♦ మా వాదనలు వినకుండానే ‘పాలమూరు’పై ఉత్తర్వులిచ్చింది ♦ రాజకీయ ప్రయోజనాలను ఆశించే కొందరు పిటిషన్ వేశారు సాక్షి, హైదరాబాద్: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐసీ) పనులను నిలిపేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యం గురించి ప్రస్తావించారు. మంగళవారం పిటిషన్పై విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరిం చింది. అటవీ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసు కోవాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన బి.హర్షవర్ధన్ ఎన్జీటీని ఆశ్రయించారు. వాదనలు విన్న ఎన్జీటీ.. పీఆర్ఎల్ఐఎస్ పనులను నిలిపేయాలంటూ గత నెల 13న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా హైకోర్టులో సవాలు చేశారు. హరిత ట్రిబ్యునల్ తమ వాదనలు వినకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసిందని వారు వివరించారు. ట్రిబ్యునల్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింద న్నారు. సంక్షేమ ప్రాజెక్టు విషయంలో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని తెలి పారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఈ వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపారు. ఇప్పటికే పనుల అప్ప గింత కూడా పూర్తయిందని, ట్రిబ్యునల్ ఉత్తర్వుల వల్ల ప్రాజెక్టు వ్యయాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గత కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు ప్రయత్ని స్తున్నారని, ఈ న్యాయ స్థానం కూడా ఇప్పటి వరకు వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వ లేదని వివరించారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి హైకోర్టులో నాగం జనార్దన్రెడ్డి వివిధ సందర్భాల్లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల గురించి ప్రస్తావించారు. వన్యప్రాణులకు ఎక్కడా ముప్పు లేదు గత ఏడు నెలలుగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, ఈ విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ‘‘అటవీ ప్రాంతంలో పనులు జరుగుతున్నాయని అటవీ అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాతే తెలిసింది. దీంతో అనవసర వివాదాలకు తావు లేకుండా అటవీ భూమిలో కాకుండా మరో చోట పంప్ హౌస్ నిర్మాణానికి నిర్ణయించాం. అంతేకాక అండర్ గ్రౌండ్ నిర్మాణాలు చేపడుతున్నాం. ఈ విషయాలన్నింటినీ సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పీఆర్ఎల్ఐఎస్ నిర్మాణ పనులు ఎక్కడా కూడా అటవీ భూముల్లో జరగడం లేదు. ప్యాకేజీ 1, 2 పనులు ఎక్కడా కూడా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో గానీ, ప్రస్తుతం ప్రతిపాదించిన ఎకో సెన్సిటివ్ జోన్లో గానీ జరగడం లేదు. ఈ ప్రాజెక్టు వల్ల వ్యన్యప్రాణులకు ఎక్కడా ఎలాంటి ముప్పు వాటిల్లడం లేదు. అటవీ ప్రాంతానికి వెలుపల పనులు చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ చట్టం కింద ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి న అవసరం లేదు’’ అని పిటిషన్లో వివరించారు. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన వ్యక్తి అవాస్త వాలతోనే నిలిపివేత ఉత్తర్వులు పొందారని పేర్కొన్నారు. చట్టపరమైన అనుమ తులు లేవన్న ఉద్దేశంతో ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చిం దని వివరించారు. కేసులో ఉత్తర్వులు ఇచ్చే ముందు ట్రిబ్యునల్ కనీసం తమ వాదనలు వినడం గానీ, తమ హాజరుకు ఆదేశాలు ఇవ్వడం గానీ చేయలేదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుతో 1,131 గ్రామాలకు, 50 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. ట్రిబ్యునల్ ఏకపక్ష ఉత్తర్వులను కొట్టేయాలని పేర్కొన్నారు. -
అసలే నిధుల మంట.. ఆపై కేసుల తంటా!
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు బాలారిష్టాలు రెండు ప్రాజెక్టులపై కోర్టుల్లో ఏకంగా 30 పిటిషన్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఆగిన పాలమూరు పనులు సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఉంది ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు ఎత్తి పోతల పథకాల పరిస్థితి! ఈ 2 ప్రాజెక్టులకు బాలారిష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ ప్రాజెక్టుల పరిధిలో ముప్పుతిప్పలు పెట్టిన భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చి, పనులు ఆరంభమైన కొద్దిరోజులకే పెద్ద నోట్ల రద్దు పిడుగు పడింది. ఈ సమస్యతో ఇప్పటికే పనులు నెమ్మదించగా.. ఇప్పుడు కోర్టులు, ట్రిబ్యునల్ కేసులతో మొత్తంగా పనులన్నీ ఆగిపోయే పరి స్థితి ఏర్పడింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదే శాలతో ఇప్పటికే పాలమూరు పనులను పూర్తిగా నిలిపేశారు. కాళేశ్వరం పనులు నిలిపివేయాలని, సామాజిక ప్రభావ మదింపు జరగకుండానే ప్రాజెక్టు చేపడుతున్నారంటూ కొందరు గ్రీన్ ట్రిబ్యునల్ గడప తొక్కేందుకు సిద్ధమయ్యారు. పనులు ఎంత వరకు? పాలమూరు, కాళే«శ్వరం ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో ఒక్కో దానికి రూ.6,500 కోట్ల మేర నిధులు కేటాయించారు. పాలమూరు పరిధిలో 21,780 ఎకరాల మేర భూసేకరణ అవసరం ఉండగా.. కేవలం 13 వేల ఎకరాలే పూర్తవడంతో బడ్జెట్ను రూ.1,650 కోట్లకు కుదించారు. ఇందులోనూ ఈ ఏడాది ఇప్పటివరకు రూ.700 కోట్లే ఖర్చు చేశా రు. అందులో దాదాపు రూ.600 కోట్లు భూసేకర ణకే చెల్లించారు. మరో రూ.100 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇక కాళేశ్వరం పరిధిలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా మూడు నెలల నుంచి నిధులు విడుదల కాక రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పనులకు ‘పిటిషన్ల’ బ్రేకులు రెండు ప్రాజెక్టుల పరిధిలో చేపడుతున్న భూసేక రణ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏకంగా 30 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో పాలమూరుపై 5 పిల్లు, 9 రిట్ పిటిషన్లు కాగా.. కాళేశ్వరంపై 16 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల అనుమతు ల్లేకుండా పాలమూరు పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు. దీంతో ట్రిబ్యు నల్ ప్రాజెక్టు పనుల నిలిపివేతకు ఆదేశాలి వ్వడంతో ఆదివారం నుంచి దాదాపు రూ.30 వేల కోట్ల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కాళేశ్వరం పరిధిలోని మల్లన్నసాగర్కు సంబం ధించి హైకోర్టుకు 10 కేసుల వరకు వచ్చాయి. ఎప్పుడో పూర్తి కావాల్సిన భూసేకరణ ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ 13 వేల ఎకరాలకు గానూ 10 వేల ఎకరాల భూసేకరణ పూర్తయిం ది. భూసేకరణ పూర్తయిన రిజర్వాయర్లకు అనుమతులు ఇచ్చి టెండర్ల ప్రక్రియ మొదలవు తున్న సమయంలో కొందరు దీనిపైనా గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలను ప్రాజెక్టులను అడ్డుకునేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రగానే ప్రభుత్వం చూస్తోంది. -
బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా
-
బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్ ప్రదేశాల్లోసహా ఎక్కడ చెత్తను దగ్ధంచేసినా వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధిస్తామని ఎన్ జీటీ స్పష్టంచేసింది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5,000 జరిమానా విధిస్తామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. తమ మార్గదర్శకాలను పాటించాలంటూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. మరోవైపు, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ జెండాలు, బ్యానర్ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించాలని కేంద్రాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖకు నోటీసులిచ్చింది. -
పోలవరం నిర్వాసితుల ఫిర్యాదులు నిజమే
విజయసాయిరెడ్డి ప్రశ్నకు గిరిజన శాఖ సహాయ మంత్రి సమాధానం సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులైన వారికి పునరావాస సహాయక చర్యల అమలులో లోపాలున్నాయని వారి తరఫున ‘రేలా’ సంస్థ నుంచి ఢిల్లీలోని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనని కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి జశ్వంత్ భాభోర్ తెలిపారు. వీటిపై ఆఫిడవిట్ను కూడా దాఖలు చేశామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఎఫ్ఆర్ఏ-2006 చట్టం ప్రకారం పునరావాస సహాయక చర్యలు చూడాల్సింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలేనన్నారు. -
ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా?
-
కాలుష్యానికి కళ్లెం ఎక్కడ?
కేంద్రంతోపాటు ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలపై ఎన్జీటీ ఆగ్రహం న్యూఢిల్లీ: దేశ రాజధాని, చుట్టుపక్కల రాష్ట్రాల్లో నెలకొన్న కాలుష్యంతో కూడిన పొగమంచు నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే ఎలా? అని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మండిపడింది. వాతావరణ కాలుష్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నించింది. ఢిల్లీని విషపు పొగమంచు చుట్టుముట్టి 5 రోజులవుతున్నా దాని నివారణకు కేంద్రం ఏ చర్యలూ తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. అసలు కాలుష్య నివారణకు తామిచ్చిన ఆదేశాలనే ఎవరూ చదవలేదంది. బుధవారం నాటికి వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ పంట దహనంపై తామిచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ పర్యావరణ, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులను తప్పుబట్టింది. తామిచ్చిన తీర్పులన్నింటినీ చదివి, విశ్లేషించి వాటిని అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని వారిని ఆదేశించింది. ‘దీపావళి, పంటల దహనం వల్ల కాలుష్యం పెరుగుతుందని తెలుసు కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్లలో ఏమైనా సమావేశాలు నిర్వహించారా? ధూళిని తగ్గించేందుకు హెలికాప్టర్ల ద్వారా కాకుండా క్రేన్లతో ఎందుకు నీళ్లు చల్లుతున్నారు?’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంటల దహనంపై చర్యలు తీసుకోనందుకు ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలపై విరుచుకుపడింది. కాగా, కాలుష్య నివారణకు తాత్కాలిక చర్యగా ఢిల్లీ, రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో నిర్మాణపు పనులపై ఎన్జీటీ వారం పాటు నిషేధం విధించింది. 48 గంటల్లో చెప్పండి: సుప్రీం ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో 48 గంటల్లో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎకే సిక్రి, జస్టిస్ ఎస్ఏ బోడేల బెంచ్ ఢిల్లీలో నెలకొన్న కాలుష్యంపై దాఖలైన పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టింది. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని 48 గంటల్లో తమకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా?
- రాష్ట్ర పర్యావరణ అనుమతులు చెల్లవన్న పిటిషనర్ల న్యాయవాది - ఎన్జీటీలో ‘అమరావతి’పై విచారణ సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మిస్తున్నారా? అని జాతీయ హరిత ట్రిబ్యునల్లో ‘అమరావతి’పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది రిత్విక్దత్తా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. కేవలం రాష్ట్ర స్థారుు పర్యావరణ అంచనా అథారిటీ ఇచ్చిన అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని దత్తా తెలిపారు. ‘ఏ’ క్యాటగిరీ కింద ఉన్న నిర్మాణాలు చేపట్టేటప్పుడు రాష్ట్ర స్థారుు పర్యావరణ అనుమతులు చెల్లవని, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకే రోజు 70 రకాల పర్యావరణ అనుమతులను రాష్ట్ర స్థారుులోనే మంజూరు చేశారని, సమగ్ర అధ్యయనం లేకుండా ఒకేరోజు అన్ని అనుమతులు ఇచ్చారని ఆయన వివరించారు. పైగా ఈ కమిటీలో నిపుణులు ఎవరూ లేరన్నారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతం కాలుష్యం బారిన పడిందని, ఈ విషయాన్ని ఈఐఏ తన నివేదికలో పేర్కొందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో వెరుు్య హెక్టార్లకుపైబడి పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీనికి సంబంధించిన అనుమతులను కూడా రాష్ట్ర స్థారుులోనే పొందారని చెప్పారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఢిల్లీని నిర్మించనున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం ధర్మాసనం విచారణను బుధవారానికి వారుుదా వేసింది. -
ఇంత దారుణంగా ఉంటే మీరేం చేస్తున్నారు?
-
ఇంత దారుణంగా ఉంటే మీరేం చేస్తున్నారు?
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. పీఎం2.5 రేణువులు అత్యధికంగా ఉన్నాయి. దాంతో కళ్ల ముందు ఏముందో కూడా కనపడని పరిస్థితి. ఈ కారణంగా పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై మండిపడింది. ఢిల్లీ కాలుష్యం అంశంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు ఢిల్లీ కాలుష్యానికి కారణమని ఎన్జీటీ విమర్శించింది. ఇప్పటివరకు కాలుష్య నియంత్రణకు మీరేం చేశారని కేంద్రంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్జీటీ ప్రశ్నించింది. రోడ్ల మీద దుమ్మును తగ్గించడానికి నీళ్లు చల్లడం మొదలుపెట్టారా లేదా అని, హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లాలన్న ప్రతిపాదన ఏమైందని ప్రశ్నలు సంధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోడానికి ఏం చేశారని నిలదీసింది. పంజాబ్లో 70% భూముల్లో పంటలు కాల్చేస్తుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా.. కార్పొరేషన్లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ఇంతకుముందు రోడ్లను శుభ్రం చేయడానికి మిషన్లు వాడాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేసి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెలిపింది. ఢిల్లీలో కాలుష్యానికి ప్రధాన కారణం దుమ్మేనని, రాష్ట్రాల వారీగా పర్యావరణ పరిరక్షణ క్యాలెండర్లను రూపొందించాల్సి ఉందిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే వరకు ఏ సమస్య అయినా పరిష్కారం కాదని, ఎప్పటికప్పుడు రోడ్లపై నీళ్లు చల్లించడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పారు. ఈ విషయంలో ఒకరిపై ఒకరు తప్పులు తోసుకోవడం సరికాదని, ప్రజలు ఊపిరి పీల్పచుకునేందుకు వీలుగా గాలి కాలుష్యం లేకుండా చూడాలని దవే తెలిపారు. ఢిల్లీ కాలుష్యంలో 80 శాతం వరకు ఇక్కడే తయారవుతోందని, మిగిలిన 20 శాతం మాత్రమే పొరుగు రాష్ట్రాలలో పంటలు కాల్చడం వల్ల వస్తోందని స్పష్టం చేశారు. -
సీడ్ క్యాపిటల్గా వరదముంపు ప్రాంతం
-
సీడ్ క్యాపిటల్గా వరదముంపు ప్రాంతం
రాజధాని నిర్మాణంపై ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది సాక్షి, న్యూఢిల్లీ: వరదముంపు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీడ్ క్యాపిటల్గా ఎంపిక చేసి నిర్మాణాలు చేపడుతోందని, ఈ విషయాన్ని పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) కమిటీ ధ్రువీకరించిందని రాజధాని నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కూడా విచారించింది. రాజధాని నిర్మాణం ద్వారా చేసే అభివృద్ధి, జరిగే నష్టం, రైతులకు జీవనోపాధి ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఎన్జీటీ కోరిన విషయం తెలిసిందే. ఆ వివరాలేవీ అని ధర్మాసనం బుధవారం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా.. ఇంకా నివేదిక సిద్ధం కాలేదని ఆయన సమాధానం ఇచ్చారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంకా నివేదిక ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించింది. అభివృద్ధి కార్యక్రమాలు, నష్టంపై వివరాలు అందించాల్సిందిగా సంబంధిత రాష్ట్ర అధికారులను కోరామని, వాటిని త్వరలోనే సమర్పిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. -
అమరావతిపై విచారణ అక్టోబర్ 31కి వాయిదా
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ అక్టోబరు 31కి వాయిదా వేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఫారిఖ్ క్షేత్రస్థాయిలో తాను పర్యటించి వచ్చానని, వరద ప్రవాహ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేస్తున్నారని, సంబంధిత వివరాలతో కూడిన అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం అంగీకారం తెలిపింది. పర్యావరణానికి హాని కలిగించేలా నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేయగా తాము గతంలోనే చెప్పినట్టుగా ఏ నిర్మాణమైనా తమ తుదితీర్పునకు లోబడి ఉంటుందని జస్టిస్ స్వతంత్రకుమార్ స్పష్టం చేశారు. -
అమరావతి కేసు విచారణ 30కి వాయిదా
న్యూఢిల్లీ : సుదీర్ఘ వాదనలు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విచారణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అమరావతిలో పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలఐన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తున్నారని, కృష్ణానది వరద, కొండవీటి వాగుతో రాజధానికి ముప్పు ఉందని, లంక గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి, బహుళ పంటలు పండే భూములు నాశనం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్ పరేఖ్ వాదనలు వినిపించారు. రాజధాని ఎంపికకు ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా అమరావతిని ఎంపిక చేసిందన్నారు. 13,500 ఎకరాల్లో వరద ముంపు ఉంటుందని ఈఐఏ నివేదిక చెబుతోందని, అందులో 10 వేల ఎకరాల్లో రాజధాని ప్రాంతం ఉందన్నారు. 2.17 మీటర్ల ఎత్తులో ఉన్న లోతట్టు ప్రాంతాన్ని, 25 మీటర్ల ఎత్తు వరకూ పెంచుతామంటున్నారంటూ రాజధాని ప్రాంత మ్యాపులను చూపించి లోతట్టు ప్రాంతాల గురించి న్యాయవాది సంజయ్ వివరించారు. సారవంతమైన పంట భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారని, ఇవన్నీ వేల సంవత్సరాల ప్రవాహాల కారణంగా సారవంతమైన నేలలుగా ఏర్పడ్డాయన్నారు. చాలా విలువైన ప్రకృతి సంపదలు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. అనేక షరతులతో పర్యావరణ అనుమతులు ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో రాజధాని తగదని తేల్చిందని, నదీ ప్రవాహ గతిని రాజధాని నిర్మాణాలు దెబ్బతీస్తాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే మానవాళికి ఇది తిరిగి పూడ్చలేనంత నష్టాన్ని కలిగిస్తుందని, లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. 13 లంకల్లో ఏడు గ్రామాలున్నాయని, జనం కూడా నివాసం ఉంటున్నారన్నారు. కృష్ణానదికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుంటారని, రాజధాని ప్రాంతం భూకంప ముప్పు జోన్లో ఉందన్నారు. అలాగే రాజధాని ప్రాంతానికి రెండువైపుల నుంచి వరద ముప్పు పొంచి ఉందన్నారు. కాగా రాజధాని ఎత్తును పెంచుతున్నారా అన్న ట్రిబ్యునల్ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏకే గంగూలీ అటువంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. లంక గ్రామాలన్నీ ప్రభుత్వ భూములేనని ఆయన వాదించారు. అంతేకాకుండా లంక గ్రామాల్లో ప్రజలు అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణకు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు. అయితే రాజధాని ప్రాంత ఎత్తు పెంపు విషయం తనకు తెలియదని ఆయన చెప్పడం గమనార్హం. -
ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేదా?
ఆరు జిల్లాల్లో ప్రజలకు రక్షిత మంచినీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జల నిగమ్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. ప్రజల ప్రాణాలంటే వీసమెత్తు గౌరవం కూడా లేదా అని ప్రశ్నించింది. ముజఫర్నగర్, షామ్లి, మీరట్, బాఘ్పత్, ఘజియాబాద్, సహారన్పూర్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ప్రజలకు నీళ్లు గానీ, కనీస ప్రాథమిక వైద్య సదుపాయాలు గానీ లేవని.. అయినా ఈ విషయంపై అదికారులు ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో గుర్తించేందుకు ఎలాంటి వైద్యపరీక్షలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. పరీక్షలు ఏమీ చేయకుండా వాళ్ల అనారోగ్యాన్ని ఎలా నిర్ధారిస్తారని నిలదీసింది. ప్రజల ప్రాణాలంటే.. మీ టేబుల్ మీద ఉన్న ఫైళ్లలా చాలా సులభంగా తీసుకుంటున్నారని మండిపడింది. సరిగా ప్రవర్తించడం నేర్చుకోవాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంత్రకుమార్ వ్యాఖ్యానించారు. బాఘ్పత్ జిల్లా ప్రధాన వైద్యాధికారిపై కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. కలుషిత నీళ్లు తాగడం వల్ల ఆయా జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో పరీక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ''స్థానికుల రక్తనమూనాలు తీసుకుని వాటిని విశ్లేషించారా? ఎందుకు చేయలేదు? వాళ్లు మీ ఇంటికి వచ్చి రక్తనమూనాలు ఇవ్వరు. వారి వద్దకు వెళ్లాల్సిన బాధ్యత మీకుంది. అసలు ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర జలవనరుల మండలిని సంప్రదించి, ఆరు జిల్లాల్లో శాస్త్రీయ విశ్లేషణ సాగించాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. ఈ మొత్తం విషయంపై అక్టోబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కలుషిత భూగర్భజలాలున్న బోర్లను వెంటనే తీసేయాలని తెలిపింది. బాఘ్పత్ జిల్లాలోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉండాల్సిన దానికంటే 4వేల రెట్లు ఎక్కువగా ఉందని పిటిషన్ దాఖలు చేసిన శాస్త్రవేత్త సీవీ సింగ్ తరఫు న్యాయవాది గౌరవ్ బన్సల్ తెలిపారు. దీనిపై యూపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఆయన బెంచి ముందు ఉంచారు. -
కృష్ణా, కొండవీటికి వరదొస్తే అమరావతికి ముప్పు
ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దాఖలై న పిటిషన్లపై విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. ఈ కేసులో తుది వాదనలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కేసును జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది సంజయ్ పరేఖ్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణా నది, కొండవీటి వాగుకు వరదలొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందన్నారు. రాజధాని ఎంపికకు ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా అమరావతిని ఎంపిక చేసిందని సంజయ్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.కాగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని చేపడుతోందని సామాజికవేత్త మేథాపాట్కర్ విమర్శించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ సందర్భంగా మంగళవారం ఆమె కోర్టుకు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
‘అమరావతి’ కేసు విచారణ 9కి వాయిదా
న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కేసు విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా పడింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్ పరేఖ్ తన వాదనలు వినిపించారు. రాజధాని కోసం ఎంపిక చేసిన భూములు వ్యవసాయ యోగ్యమైనవని, ఆ భూముల్లో రాజధాని వద్దని జస్టిస్ శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందని, నిపుణుల అభిప్రాయాలను కూడా చంద్రబాబు సర్కార్ పట్టించుకోకుండా అదే ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసిందని సంజయ్ పరేఖ్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కొండవీటి వాగుతో అమరావతికి భారీ ప్రమాదం పొంచి ఉందని, కృష్ణానదికి ఏ వరదలు వచ్చినా అమరావతికి ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చే నెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. కాగా ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరణతో పాటు పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. -
మిగతా రూ. 4.75 కోట్లు కట్టండి
న్యూఢిల్లీ: యమునా నదిని కలుషితం చేసిందుకు విధించిన జరిమానా చెల్లించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఫౌండేషన్ ను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. మార్చిలో ఏఓఎల్ నిర్వహించిన ప్రపంచ సాంసృత్కిక ఉత్సవం సందర్భంగా ఎన్జీటీ రూ. 5 కోట్లు జరిమానా విధించింది. అయితే ఏఓఎల్ రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తం రూ. 4.75 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ మంగళవారం ఆదేశించింది. యమునా నది తీరంలో శ్రీశ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ నిర్వహించింది. ఈ ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. -
పదేళ్లు దాటితే.. కారు షెడ్డుకే!
మీకు డీజిల్ కారు ఉందా.. అది కూడా తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే ఇక దాన్ని షెడ్డుకు పరిమితం చేయాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఇది ఢిల్లీ, కేరళలలో మాత్రమే అమలవుతోంది. అచ్చం దేశ రాజధాని ఢిల్లీలోలాగే పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎర్నాకులం బెంచి ఆదేశిచింది. లాయర్స్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఫోరమ్ (లీఫ్) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అనంతరం జస్టిస్ జె.స్వతంత్రకుమార్ నేతృత్వంలోని బెంచి ఈ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. పదేళ్లు దాటిన నెల రోజుల తర్వాత కూడా అలాంటి వాహనాలను నడిపిస్తుంటే రూ. 10 వేల జరిమానా విధించాలని కూడా ఆదేశించారు. కొచ్చి నగరం అత్యంత కలుషిత నగరంగా ముద్ర పడిందని, కేరళలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల పరిస్థితి కూడా ఇంతేనని పిటిషన్లో పేర్కొన్నారు. పాత కాలం నాటి లారీలు, బస్సుల నుంచి వెలువడుతున్న విషవాయువులను వెంటనే అరికట్టాలని కోరారు. -
ఉల్లంఘనలెన్ని?
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జీఓ 111 అమలులో ఉన్న ప్రాం తంలో 83 గ్రామాలున్నాయి. అయితే ఈ జీఓను కాలరాస్తూ కొందరు భారీ కట్టడాలు, నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించారు. దీంతో జలాశయాలు కుంచించుకుపోతుండగా.. వాటి మనుగడ క్రమంగా ప్రశ్నార్థకమవుతోం ది. ఈక్రమంలో కొందరు పర్యావరణ కార్యకర్తలు జీఓ 111 ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్)ను ఆశ్రయిం చారు. దీంతో స్పందించిన ఎన్జీటీ అక్ర మ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా యం త్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలు చేపట్టిన అధికారులు 83 గ్రామాల్లో ప్ర త్యేక బృందాలను నియమించారు. ప్రతి బృందంలో గ్రామ రెవె న్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ సహాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ బృందాలను మం డల తహసీల్దార్, ఉప తహసీల్దార్, విస్తరణ అధికారి (ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ) సమన్వయపరుస్తారు. మొత్తం గా ఈ బృందాలు ఈనెల 12లోపు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలికి నివేదిక సమర్పిం చాల్సి ఉంటుంది. మూడు నమూనాల్లో వివరాల సేకరణ.. నిబంధనల ఉల్లంఘనలను క్షేత్రస్థాయిలో సమీక్షించి వివరాలను ఎన్జీటీకి అందించేందుకు జిల్లా యంత్రాంగం మూడు ప్రొఫార్మాలను రూపొం దించింది. మొదటి నమూనాలో నిర్మాణాల తీరు, రెండో నమూనాలో అక్రమ, అనధికారిక లేఅవుట్లు, మూడో నమూనాలో అక్రమ, అనధికారిక నిర్మాణాలున్న లేఅవుట్ల వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రతి నమూనాలో ఎనిమిది కాలాలకు సంబంధించి సమాచారం తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో జీఓ 111 పరిధిలోకి వచ్చే మండలాల తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ఈఓ పీఆర్డీలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం సమాచారాన్ని సేకరించి ఈనెల 12లోగా సమర్పించాలని ఆయన సూచించారు. -
గుర్తింపు వేరు.. శాస్త్రీయ నిర్ధారణ వేరు
అమరావతిలో వరద ముంపు ప్రాంతాలపై ఎన్జీటీ సాక్షి, న్యూఢిల్లీ: వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం వేరు... శాస్త్రీయ నిర్ధారణ వేరు అని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. రాష్ట్ర రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో దాఖలైన పిటిషన్పై ఎన్జీటీలో సోమవారం విచారణ జరిగింది. వరద ముంపు ప్రాంతాలపై నివేదిక ఇవ్వాలని గత విచారణ సందర్భంగా ఎన్జీటీ ఆదేశించగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వరద ముంపు ప్రాంతాలతో కూడిన పటాన్ని నివేదించారు. అయితే, తాను సంబంధిత పటాన్ని చూడలేదని, పైగా ప్రతివాది తరపు న్యాయవాది ఈ పటం కేవలం ఏపీ గుర్తించిన ప్రాంతాలేనని చెబుతున్నారని, వరద ముంపు ప్రాంతాలుగా నిర్ధారించినట్లుగా చెప్పడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ పారిఖ్ ఎన్జీటీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్జీటీ చైర్మన్ స్వతంత్రకుమార్ జోక్యం చేసుకుంటూ.. వరద ముప్పు ప్రాంతాలను గుర్తించడం, వాటిని శాస్త్రీయంగా నిర్ధారించడం వేర్వేరని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పటాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదికి అందజేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అవసరమైతే జైలుకెళ్తా.. పైసా కట్టేది లేదు!
న్యూఢిల్లీ: జైలుకైనా వెళ్తాగానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.5 కోట్ల పరిహారం చెల్లించనని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ‘మేం ఏ తప్పూ చేయలేదు, నిర్దోషులం. పైసా కూడా చెల్లించం. అవసరమైతే జైలుకెళ్తాం’ అని గురువారం ట్వీట్ చేశారు. ట్రిబ్యునల్ తీర్పును కోర్టులో సవాల్ చేస్తామన్నారు. ప్రాంగణం వద్ద ఒక్క చెట్టును కూడా నరకలేదని, మైదాన ప్రాంతాన్ని మాత్రం చదును చేశామన్నారు. ప్రధాని సభకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సాంస్కృతిక ఒలింపిక్స్ అని, 37 వేల మంది కళాకారులు ఒకే వేదికపై పాలుపంచుకుంటారని చెప్పారు. పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభను ఆపేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారతీయ కిసాన్ మజ్దూర్ సమితి పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్.. గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని సూచించింది. సభ ఏర్పాట్లు ఎప్పటి నుంచో జరుగుతుంటే ఇప్పుడెందుకొచ్చారని... ట్రిబ్యునల్ను ఎందుకు ఆశ్రయించలేదని కోర్టు ప్రశ్నించింది. ప్రచారం కోసమే చేశారా అంటూ పిటిషనర్ను తప్పుపట్టింది. ప్రపంచ సాంస్కృతిక పండుగకు తాము ఎలాంటి ఆర్థికసాయం చేయలేదని కేంద్రప్రభుత్వం తెలిపింది. -
'జైలుకైనా వెళ్తా కానీ.. ఫైన్ మాత్రం కట్టను'
న్యూఢిల్లీ: యమునా నది ఒడ్డున శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' నిర్వహణ విషయంలో ఇంకా వివాదాలు సద్దుమణగడం లేదు. రూ. 5 కోట్లు ప్రాథమిక జరిమానా కట్టి.. షరతులతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరిమానా కట్టబోమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. 'మేము ఏ తప్పూ చేయలేదు. మేం జైలుకైనా వెళ్తాంగానీ ఒక్కపైసా కట్టబోం' అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు ఈ విషయాన్ని హరిత ట్రిబ్యునల్కు తెలిపారు. ఇప్పటివరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ జరిమానా కట్టలేదని వెల్లడించారు. భారీ నిర్మాణాలతో అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తవచ్చునని, యమునా నది పర్యావరణపరంగా దెబ్బతినవచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ 'ఇది సాంస్కృతిక ఒలింపిక్స్ లాంటిందని, దీనిని ప్రతిఒక్కరూ స్వాగతించాలని కోరారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం వెయ్యి ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపడుతున్నామని, వాటిని తొందరగా తొలగించే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. శుక్రవారం ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశముంది. కానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యక్రమానికి రావొద్దని నిర్ణయించుకున్నారు. -
'జైలుకైనా వెళ్తాం కానీ రూపాయి కూడా చెల్లించం'
ఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహణ కోసం యమునా నదీ పరిసర ప్రాంతాల్లో పర్యావవరణానికి హాని కలిగించారన్న కారణంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థకు 5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కార్యక్రమ ప్రారంభానికి ముందుగానే ఈ జరిమానాను డిపాజిట్ చేయాలని గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలలో పేర్కొంది. అయితే దీనిపై శ్రీశ్రీ రవిశంకర్ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించబోం అని స్పష్టం చేశారు. యమునా నదీ పరిసరాల్లో చేసిన ఏర్పాట్లన్ని తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసినవే అని, కార్యక్రమం ముగిసిన అనంతరం వాటిని తొలగిస్తామని ఆయన వెల్లడించారు. ప్రపంచ సాస్కృతిక సమ్మేళనం ప్రైవేటు కార్యక్రమం కాదని, లక్షలాది మంది హాజరౌతున్న ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత కార్యక్రమంగా చూడొద్దని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. -
'మా సహనంతో ఆటలు ఆడకండి'
న్యూఢిల్లీ: యమునా నది తీరంలో 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ నిర్వహించ తలపెట్టిన 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తీరుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా విరుచుకుపడింది. సమ్మేళనం కోసం నిర్మిస్తున్న నిర్మాణాలు తాత్కాలికమేనన్న పర్యావరణ శాఖ వ్యాఖ్యలపై మండిపడింది. 'ఇవి తాత్కాలిక నిర్మాణాలు అని మీరు ఎలా అనుకుంటారు? మా సహనాన్నీ పరీక్షించకండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మేళనం నిర్వహణకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని మీరు ఎందుకు అడుగలేదని పర్యావరణ శాఖను ఎన్జీటీ నిలదీసింది. ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు మీ అనుమతులు అవసరం లేదా? ఈ కార్యక్రమంపై ఎవరైనా సమీక్ష జరిపారా? అని మండిపడింది. అలాగే ఈ వ్యవహారంలో క్రియారహితంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని కూడా ఎన్జీటీ తీవ్రంగా దుయ్యబట్టింది. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. మీరెందుకు జాతీయ ప్రాజెక్టులు చేపట్టరు? ఇక కేవలం రూ. 15.63 కోట్ల రూపాయల బడ్జెట్తోనే ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని 'ఆర్ ఆఫ్ లివింగ్' చేసిన వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. కేవలం రూ. 15 కోట్లలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే.. జాతీయ ప్రాజెక్టులను కూడా మీరే చేపట్టాలం'టూ పేర్కొంది. మరోవైపు ఈ సాంస్కృతిక సమ్మేళనం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయరాదని, సంస్కృతి, మతాలు, భావజాలాల ఐక్యత కోసం కృషి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని 'ఆర్ ఆఫ్ లివింగ్' స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కోరారు. -
జల ‘ప్రవాహాల’ పేచీ!
♦ జల విద్యుత్ కేంద్రాల దిగువన కనీస ప్రవాహాలుండాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ♦ పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశం ♦ కనీస ప్రవాహాలు ఎల్లప్పుడూ సాధ్యం కాదన్న తెలంగాణ.. ♦ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోకుండా ఈ నిబంధనలు సరికాదన్న రాష్ట్రం.. ట్రిబ్యునల్లో అఫిడవిట్ దాఖలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న జల విద్యుత్ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు నిరంతరం ఉండేలా చూడాలంటూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు కొత్త చిచ్చును రేపేలా ఉన్నాయి. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ కేంద్రాల దిగువన కనీసం 15 శాతం ప్రవాహాలు కొనసాగించాలని చేసిన సూచనను తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులు జీవ నదులు కావని, వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో అక్కడ ప్రవాహాలు ఉండవని, అలాంటి సమయంలో నిరంతర ప్రవాహాల కొనసాగింపు సాధ్యం కాదని రాష్ట్రం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర వాదనపై గ్రీన్ ట్రిబ్యునల్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జల విద్యుత్ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించాలంటూ ట్రిబ్యునల్లో పుష్పాసేన్ అనే సామాజిక కార్యకర్త కేసు వేశారు. ఇందులో అన్ని రాష్ట్రాలనూ ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్, 2005లో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను, అందులోని కనీస ప్రవాహాల మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. నదీ ప్రవాహంలో కనీసం 10 శాతం నీళ్లు నిరంతర ప్రవాహంగా ఉండాలని ఈ మార్గదర్శకాల్లో ఉంది. దాన్ని 15 శాతానికి పెంచుతూ గత జూలైలో సవరణ చేసింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాల అమలు రాష్ట్రంలోని ఎస్ఎల్బీసీ, జూరాల, నాగార్జునసాగర్, పోచంపాడు, నిజాంసాగర్, సింగూరు వంటి ప్రాజెక్టులపై పడనుంది. ఈ ప్రాజెక్టుల కింద ట్రిబ్యునల్ సూచనల అమలుపై ప్రభుత్వం ట్రిబ్యునల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర అభిప్రాయాలను చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసింది. నీటి లభ్యతే లేనప్పుడు ప్రవాహాలు ఎలా.. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్న అంశాల మేరకు.. ‘గోదావరి, కృష్ణా నదుల కింద మొత్తం 9 జల విద్యుత్ కేంద్రాలున్నాయి. ఇందులో 6 కృష్ణా పరిధిలో, 3 గోదావరి మీద ఉన్నాయి. ఇందులో పులిచింతల మినహా మిగతావి దశాబ్ద కాలానికి పైగా నడుస్తున్నాయి. అయితే పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సంబంధించిన చర్చల గురించి ఇప్పటివరకు ఏ విభాగం కూడా నీటిపారుదల శాఖ దృష్టికి తేలేదు’ అని తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడా జీవ నదులు లేవని, వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో ప్రవాహాలు ఉండవంది. ‘గోదావరిలో 3 విద్యుత్ ప్రాజెక్టుల కింద మైళ్ల దూరం నది ఎండిపోయి ఉంటుంది. రాష్ట్రంలో నీటి లభ్యత చాలా తక్కువ. 15 శాతం కనీస ప్రవాహాలు కొనసాగించడం సాధ్యం కాదు. ఒకవేళ కనీస ప్రవాహానికి 15 శాతం నీరిచ్చినా అవి ఇంకిపోతాయి తప్ప నిరంతర ప్రవాహం ఉండదు. అందువల్ల కనీస ప్రవాహాల కొనసాగింపు కష్టతరం’ అని పేర్కొంది. దీంతోపాటే కరువు రోజుల్లో రిజర్వాయర్లే నిండుకుంటున్నాయని, అలాంటప్పుడు ప్రవాహాల కొనసాగింపు సాధ్యమయ్యేదే కాదని తెలిపింది. పైగా జల విద్యుత్ కేంద్రాల కింద సాగు, తాగు అవసరాలకే నీటిని విడుదల చేయాలి తప్పితే, కనీస ప్రవాహాల కోసం నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండదని, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా ప్రవాహాలు ఉండాలన్న నిబంధన సరికాదని వివరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నాకే గ్రీన్ ట్రిబ్యునల్ ఓ నిర్ణయం చేసే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ చీఫ్ సెక్రటరీపై అరెస్టు వారెంట్ జారీ అయింది. చందానగర్లోని రాజేంద్రరెడ్డి పార్క్ స్థలాన్ని కొందరు మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్నారని కసిరెడ్డి బాస్కర్రెడ్డి గతంలో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు చీఫ్ సెక్రటరీ హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది. విచారణకు రాకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని భావించిన చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
విషయం అడిగితే విషం చిమ్మడమా?
విశ్లేషణ నెలరోజుల్లో జవాబివ్వండి అని చట్టం ద్వారా ఆదేశించినా వినరు. పోనీ మొదటి అప్పీలు అధికారిగా ఉన్న తమ సీనియర్ అధికారి ఆదేశించినా పాటించకపోతే ఏమిటన్నట్లు? చెత్త ప్రశ్నలు అడుగుతున్నా రంటూ అడిగే వారిని నిందిం చడం అలవాటయింది. కాని చెత్త జవాబులు ఇచ్చే ప్రభుత్వాధికారుల సంగతేమిటి? సమాచార హక్కును దుర్వినియోగం చేస్తున్న మాట నిజమే కానీ జనం కన్నా ఎక్కువగా అధికారులు కూడా ఈ చట్టం ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా వినియోగించ కుండా, అడిగిన వాడిని ఏడిపించేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. అడగడం హక్కైతే చెప్పడం బాధ్యత. సమాధాన సమాచారాలు ఇవ్వడం జరగకపోతే సమా చార హక్కు చట్టం దుర్వినియోగమైనట్టే. అడిగినవన్నీ ఇవ్వాల్సిందే అని ఎవ్వరూ అనడం లేదు. అమ్మ కూడా అడిగిందంతా పెట్టదు. కానీ ఎందుకు ఇవ్వరో చెప్పడం అనే బాధ్యతను నిర్వర్తించకుండా వదిలేస్తే వారికేమిటి శిక్ష? విషయం చెప్పమని అడిగితే విషం చిమ్మే పరిస్థితు లను ఎందుకు కల్పిస్తారు? ఎవరు బాధ్యులు? అడిగిన సమాచారం ఇవ్వకపోవడమే కాదు, ఇవ్వకుండా ఉండేం దుకు ప్రజలసొమ్మును విరివిగా ఖర్చు చేయడం దుర్మార్గం. ఏ స్పందనా లేకుండా సమాచార అభ్యర్థనను వదిలేసే ప్రభుత్వ సంస్థకు మొదటి అప్పీలు ఆదేశం పాటించడం తప్ప మరో బాధ్యత లేదు. ఆ పనిచేయక పోగా మొదటి అప్పీలులో, రెండో అప్పీలులో కూడా లాయర్లను నియమించి జనం డబ్బు తగలేసి జవాబు ఇవ్వరేమిటి? జాతీయ పర్యావరణ న్యాయస్థానం (ఎన్జీటీ - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)కి వచ్చిన కొన్ని సమాచార దరఖాస్తుల ప్రతులు, వాటిపై చర్యల దస్త్రం, తొలి అప్పీళ్లు, మూడో వ్యక్తికి ఇచ్చిన నోటీసుల కాపీలు ఇవ్వా లని ఆర్కె జైన్ కోరారు. నెలరోజుల్లో ఇవ్వలేదు. మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. సమాధానం లేదు. ఈ నిరాకరణ వెనుక దురుద్దేశముందని జైన్ ఆరోపించారు. జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని కారణ వివరణ లేఖ జారీ చేశారు. దానికీ జవాబు లేదు. నోటీసు విచారణకు నియమితమైన తేదీ నాడు కూడా రాలేదు. హఠాత్తుగా ఒక లాయర్ గారిని కమిషన్ వద్దకు వెళ్లమని చెప్పారు కానీ ఎందుకు వెళ్లాలో ఏం చేయాలో చెప్పలేదు. సి.పి.ఐ.ఒ. (కేంద్ర ప్రజా సమాచార అధికారి) వారం పైగా సెలవులో ఉంటే ఆ బాధ్యతలను నిర్వహించడానికి మరొకరిని నియమించ కపోవడం మంచి పాలనా? అధికారి ఇచ్చిన వివరణ తప్పుల తడక అని జైన్ వాదించారు. 20 పేజీల సమాచారం ఇవ్వడానికి తనను 40 రూపాయలు అడిగారని, సమాచారం ఇమ్మని ప్రథమ అప్పీలు అధికారి ఆదేశించినా వేల రూపా యలు ఖర్చు చేస్తూ మొదటి రెండో అప్పీళ్లలో లాయర్లను నియ మిస్తూ సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నారని జైన్ ఆరోపించారు. ఎన్జీటీ ఒక్కొక్క లాయర్కు 31 వేల రూపాయల భత్యం, 700 రూపా యల రవాణా ఖర్చు నెలకు ఇస్తూ ప్రతి లాయర్కు మొదటి అప్పీలుకు 11 వేలు, రెండో అప్పీలుకు 21 వేలు ఇవ్వాలని ప్రతిపాదిం చిందని వివరించే నోట్ను జైన్ మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సంపాదించారు. మొదటి అప్పీలులోనూ, రెండో అప్పీలులోనూ లాయర్ను నియమించి తనకు సమాచారం ఇవ్వ కుండా పోరాడుతున్నారని విమర్శించారు. సెక్షన్ 20 ప్రకారం సమంజసమైన కారణం లేకుండా సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించనందుకు మరే కారణమూ అవసరం లేకుండానే జరిమానా విధించే వీలుంది. ఆదేశించిన అధికారి సి.పి.ఐ.ఓ. కంటే పై అధికారి. ఆయనకు ఎక్కువ అనుభవం, శాఖాపరమైన పరిచయం ఉంటుంది. ఆయన ఉత్తర్వును పాటించకపోవడం క్రమశిక్షణ అనిపించు కోదు. ఒకవేళ పై అధికారి ఉత్తర్వులో ఏదైనా లోప ముంటే సీపీఐఓ కూడా అప్పీలుకు వెళ్లవచ్చు. లేని పక్షంలో ఆ ఆదేశాన్ని పాటించడం తప్ప మరో మార్గం లేదు. కాని ఆ ఆదేశాల పాలనకోసం పౌరుడు రెండో అప్పీలుకు వెళ్లే పరిస్థితి కల్పించడం అన్యాయం, అస మంజసం. దాన్ని చట్టం ఒప్పుకోదు. ఈ కేసులో మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకపోవడం, వారికి ఇస్తానన్న సమాచారాన్ని అంగీకరించిన తేదీలోగా ఇవ్వకపోవడం, ఆ తరువాత కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజా సమాచార అధికా రిపైన 25 వేల రూపాయల జరిమానా విధించక తప్ప దని కమిషన్ నిర్ణయించింది. చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారాన్ని ఇవ్వ కుండా ఏవేవో కుంటిసాకులు చూపుతూ పౌరుడిని అప్పీళ్ల చుట్టూ తిప్పడం సమాచార చట్టాన్ని భంగ పరచడమే అవుతుంది. రెండు అప్పీళ్లలో లాయర్లు హాజరయ్యారు కనుక ఎన్జీటీ కనీసం 32 వేల రూపాయలు ఖర్చు చేసినట్టే భావించాలి. ఇటువంటి వృథా ఖర్చులను ఎందుకు పెడుతున్నారు? ఒక పౌరు డికి చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారం ఇవ్వ కుండా ఉండేందుకు ప్రజల ధనాన్ని ఈ విధంగా వెచ్చించవచ్చా? ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో పరిశీలించి, ఆ అధికారి బాధ్యుడైతే, అతని నుంచి ఈ కేసుల మీద ఖర్చు చేసిన మొత్తం సొమ్మును ఎన్జీటీ వద్ద డిపాజిట్ చేయించాలని కమిషన్ సూచిం చింది. ఎన్జీటీ అధ్యక్షులు మాజీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి కనుక ఈ అన్యాయ ఖర్చులు నివారించేందుకు ఈ సమస్యను వారి ముందుంచాలని కమిషన్ సూచించింది. (ఇఐఇ/అ/ఇ/2014/000461 జైన్ వర్సెస్ ఎన్జీటీ కేసులో తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
అమరావతిపై ఎన్జీటీలో పిటిషన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త ఈఏఎస్ శర్మ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఆయన మంగళవారం ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో యూనియన్ ఆఫ్ ఇండియా, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్ర అటవీశాఖ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ప్రతివాదులుగా చేర్చారు. శర్మ తన పిటిషన్లో బహుళ పంటలు పండే ప్రాంతంతో పాటు సున్నితమైన పర్యావరణ ప్రాంతంలో విమానాలకు అనుమతికి రాష్ట్ర అథారిటీ లేదని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్కు ముప్పు పొంచివుందని, అంతే కాకుండా అమరావతి నిర్మాణ అనుమతులు ...నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కాగా గతంలో కూడా పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఏపీ వాదనను తోసిపుచ్చిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై దాఖలైన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బుధవారం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయన్న ఏపీ వాదనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఎన్జీటీ ఈ కేసు విచారణను చేపట్టింది. ఏపీ, పిటిషనర్ తరపు వాదనలు విన్న అనంతరం కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. -
అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సీరియస్
-
అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సీరియస్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఆదాయమే ధ్యేయంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి అని మండిపడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. ఇసుక తవ్వకాల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, భవిష్యత్ తరాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని పేర్కొంది. అక్రమ ఇసుక తవ్వకాల వలన భూ గర్భ జాలాలు అడుగంటుతాయని తెలిపిన ఎన్జీటీ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక తవ్వకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలని సూచించింది. కాగా ఇసుక దోపిడిని అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా పిటీషనర్ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. -
ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడిన కోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ కోర్టు మండిపడింది. వాయు కాలుష్యం ఇంత తీవ్రస్థాయిలో ఉన్నాఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. విషవాయువులు వెదజల్లుతున్న కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నగరంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వారం రోజుల్లోగా నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల నగరాన్ని కప్పేస్తున్న కాలుష్యంతో వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం వంద అడుగుల ముందు ఏముందో కూడా కనపడని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు సీరియస్గా స్పందించింది. డీజిల్, పెట్రోల్తో నడిచే కాలం చెల్లిన వాహనాలు దేశ రాజధాని ఢిల్లీ నగర రోడ్లపై తిరగడానికి వీల్లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రశ్నించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నగరంలోని వాయు కాలుష్య నివారణ చర్యల మాటేంటి? కాలుష్యం లేదని చెప్పగలరా.. ఢిల్లీలో కాలుష్య గాఢతతో జనం ఇబ్బందులు పడుతున్నారంటూ ధ్వజమెత్తింది. పర్యావరణాన్ని తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ వ్యవహారాన్ని ఉపేక్షించబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు, జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ, అటవీశాఖ, ఆరోగ్య శాఖ, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వాయునాణ్యత, కాలుష్యం, వాతావరణ కాలుష్య నివారణ చర్యలు, తదితర వివరాలతో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది. -
పర్యావరణ రక్షణా, దేశ భద్రతా?
విశ్లేషణ పర్యావరణ రక్షణ, అమృత్ మహల్కవాల్స్భూముల్లో ఆదివాసులు, పక్షుల జీవజాతుల రక్షణకు సంబంధించిన సమాచారం అడిగితే అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం అని ఎలా చెప్పగలరు? కర్ణాటకలో అమృత్ మహల్ కవాల్స్ ప్రాంతంలో వేలాది ఎకరాలను పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చేశారు. అందువల్ల అక్కడి ఆదివాసులకు మంచినీటి ప్రాంతాలకు వెళ్లే దారులు మూసేసే విధంగా గోడలు కట్టుకున్నారు. వలస పక్షులు భయపడి అక్కడ వాలడం లేదు. జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) నేలను, నీటిని, పక్షులను, జీవజాతిని, మనుషుల హక్కులను కాపాడే చర్యలు తీసుకోవాలని వివరమైన ఆదేశాలు జారీ చేసింది. కాని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కర్ణాటక పర్యావరణ ప్రేమికులు సమాచార హక్కు కింద ఏ చర్య తీసుకున్నారో చెప్పమని అడిగారు. భారతదేశ భద్రత సమస్య అని జవాబు. అందుకని సమాచారం ఇవ్వ లేదు. సౌర విద్యుత్త్తు పర్యావరణ భద్రత విషయంలో ఇంకా అనుమానాలు ఉన్నాయనీ కనుక ఆ పరిశ్రమలకు విచ్చలవిడిగా భూములు, ముఖ్యంగా హరిత క్షేత్రాలు ఇవ్వడం గురించి పునరాలోచించాలని ఎన్జీటీ సూచించింది. కర్ణాటక పరిశ్రమల సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ వారికి భూములు కేటాయించారు. ఆ భూముల్లో గుడులకు వెళ్లేందుకు అక్కడి ప్రజలను అనుమతించాలని, పూజలు చేసుకోనివ్వాలని ఎన్ జీటీ ఆదేశించింది. కలువెహళ్లి అనే గ్రామంలో ఉన్న పొలాలకు చేరుకునేందుకు గ్రామప్రజలకు అడ్డుగా ఉన్న కంచెను మరో చోటికి తరలించాలని ఆదేశించింది. ఖుదాపురా నుంచి తమ గొర్రెల ఫారంను చేరుకోవడానికి ప్రజలకు వెసులుబాటు కలిగించాలని బాబా అణు విద్యుత్కేంద్రం ఐఐఎస్సీని ఆదేశించింది. ఉల్లార్తి అనే గ్రామస్తులకు నీటి సమస్య ఏర్పడడానికి ఇస్రో నిర్మాణాలు కారణమైనందున వారికి నీటిని సరఫరా చేయాలని ఇస్రోను ఎన్జీటీ ఆదేశించింది. హరిత క్షేత్రం పర్యావరణ వ్యవస్థలో బస్టర్డ్ జాతి పక్షులకు ఇతర జీవజాతులకు జీవించే పరిసరాలు ఉంటాయి. వాటిని రక్షించకపోతే ఆ పక్షులు రావు. ఉన్న జీవరాశి కూడా బతకజాలదు. వీటన్నిటినీ బలిపెట్టి సాధించే అభివృద్ధి అభివృద్ధేనా? ‘ప్రాజెక్టు బస్టర్డ్’ వంటి ప్రాజెక్టులు ప్రారంభించాలని కూడా ఎన్జీటీ సూచించింది. అమృత్ మహల్ కవాల్స్లో మిగిలిన భూములనైనా రక్షించండి అని కూడా ఎన్జీటీ కోరింది. కర్ణాటక ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టాలన్నది. తుది చర్యలు ఏమిటో చెప్పాలని, పర్యావరణ సమృద్ధిని పునర్ వ్యవస్థీకరించడానికి చర్యలు తీసుకున్నారా? అని అడిగింది. ఇవి కాకుండా బాబా కేంద్రం, ఇస్రో పర్యావరణ కాలుష్య నివారణ మండలి అనుమతులను ఎందుకు తీసుకోలేదని కూడా అడిగింది. వారి అనుమతి ఇచ్చే సమయంలో పర్యావరణ రక్షణ షరతులను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా కాలుష్య నియంత్రణ మండలిని, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పూజల కోసం గుడులకు వెళ్లేందుకు ప్రజలను అనుమతించే నోటిఫికేషన్లు స్థానిక కన్నడ భాషలో ప్రచురించారా అని అడిగింది. సంప్రదాయ వేడుకలలో ఆ ప్రజలు పాల్గ్గొనేందుకు వెసులు బాటు కలిగించిన దాఖలాలు చూపాలని కూడా ఆదేశించింది. మరి ఏ చర్యలు తీసుకున్నారు అని సమాచార హక్కు కింద డేవిస్ జార్జి థామస్ అడిగారు. కొన్ని సంస్థలు జాతీయ భద్రతకు చెందిన పనులను నిర్వహిస్తున్న విషయం నిజమే కాని ఈ చర్యలు తీసుకున్నారా లేదా అనే చర్యానివేదికను కోరినప్పుడు ఆ సమాచారం వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు అనే వాదాన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ లేవనెత్తింది. పర్యావరణ రక్షణ, అమృత్ మహల్ కవాల్స్ భూముల్లో ఆదివాసులు, పక్షుల జీవజాతుల రక్షణకు సంబంధించి అడిగితే అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం అని ఏ విధంగా చెప్పగలరు? పర్యావరణ పరిరక్షణకు హరిత న్యాయస్థానం ఆదేశాలను పాటించడానికి వీల్లేదని, ఆ ఆదేశాలను పాటిస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నిజంగానే భావిస్తే ఆ విషయం హరిత న్యాయస్థానానికి నివేదించి వారి ఆదేశాలు సవరించాలని కోరాల్సింది. అదేమీ చేయన ప్పుడు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ ఆదేశాలను పాటించిందో లేదో తెలపాలని, అందుకు సంబంధిం చిన చర్యానివేదిక ఇవ్వాలని అడిగితే దేశభద్రతకు ముప్పు అని ఎలా చెబుతారంటూ కమిషన్ ప్రశ్నిం చింది. కేవలం సమాచార నిరాకరణకే నియమాలను నిరాధారంగా వాడుకోవడం సమంజసం కాదు. అయినా ఇస్రో, బార్క్ వంటి జాతీయ సంస్థల విధి నిర్వహణలో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలుంటే వాటిని బయట పెట్టకుండానే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎన్జీటీ జారీ చేసిన ఆదేశా లను ఎంతవరకు పాటించాలో తెలియ జేయాలని కమి షన్ రెండో అప్పీలు విచారణ తరువాత ఆదేశించింది. ఏ సమాచారం వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది? అమృత్ మహల్ కవాల్స్ భూముల్లో నివసించే వారి సౌకర్యాలను రక్షించారో లేదో చెప్పడానికి దేశ భద్రతకు సంబంధం ఏమిటి అని వివరించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భం ఉంటే ఆ సమాచారం ఇవ్వకుండానే మిగిలిన చర్యల వివరాలు చెప్పే వీలుందా అని పరిశీలించాలి. ఇదేమీ లేకుండా కేవలం ఒక సాకుగా వాడి ఇంత కీలకమైన సమాచారం ఇవ్వకుండా నిరాకరించినందుకు పది వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించారంటూ దాఖలైన పిటిషన్ పై.. సంస్థ గురువారం విచారణ జరిపింది. పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల లోగా.. నోటీసులకు సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. -
పోలవరంపై ట్రిబ్యునల్ విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించరాదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలైన పిటిషన్పై విచారణ నవంబర్ 6కి వాయిదాపడింది. సోమవారం పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు కేంద్రం, ఒడిశాకు మరికొంత సమయం ఇస్తూ.. ట్రిబ్యునల్ విచారణను వాయిదా వేసింది. -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం
-
ఏపీ సర్కార్ పై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలుపుకోలేదని ఆరోపించింది. రాజధాని ప్రాంతంలో భూమి చదును కార్యక్రమాలు నిలిపి వేయాలని ఆదేశించింది.పర్యావరణ అనుమతి వచ్చే వరకు సదరు కార్యక్రమాలు ఆపాలని సూచించింది. అలాగే రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో తోటలను తొలగించవద్దని సూచించింది. రాజధాని భూముల్లో తోటలను తొలగిస్తున్న వైనాన్ని పిటిషనర్ సాక్ష్యాధారాలతో సహా గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఉంచారు. దీంతో రాజధాని భూముల్లో ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిని ఎన్జీటీ తప్పు పట్టింది. ముంపు, మెట్ట ప్రాంతాలను గుర్తించి నివేదకి ఇవ్వాలని ఏపీ సర్కార్ను ఎన్జీటీ ఆదేశించింది.