సీడ్ క్యాపిటల్‌గా వరదముంపు ప్రాంతం | The seed capital as a flood plain | Sakshi
Sakshi News home page

Nov 3 2016 7:14 AM | Updated on Mar 22 2024 11:05 AM

వరదముంపు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీడ్ క్యాపిటల్‌గా ఎంపిక చేసి నిర్మాణాలు చేపడుతోందని, ఈ విషయాన్ని పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) కమిటీ ధ్రువీకరించిందని రాజధాని నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కూడా విచారించింది. రాజధాని నిర్మాణం ద్వారా చేసే అభివృద్ధి, జరిగే నష్టం, రైతులకు జీవనోపాధి ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఎన్జీటీ కోరిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement