-
ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి
సాక్షి, మర్రిపాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మండలంలోని నందవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లి అక్కడ ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందాడు. వివరాలు.. నందవరం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి – జానీబేగం దంపతుల 3వ కుమారుడు షేక్ ఖాజాగరీబ్ నవాజ్(22) కువైట్లోని ఫెర్దోస్ పట్టణంలో ఉన్న గ్రేన్ కోసుర్ ఏరియాలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి) రెండేళ్ల క్రితం కువైట్కు వెళ్లిన నవాజ్ అక్కడ ఇళ్లలో పూల మొక్కల పెంపకం పనులు చేసుకుంటూ సంపాదించిన నగదును ఇంటికి పంపుతూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే తల్లిదండ్రులకు అండగా ఉండేవాడు. తరచూ ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడే నవాజ్ మంగళవారం కూడా వారితో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం ఉదయం అతను ఉంటున్న ఇంటి సమీపంలో రేకుల షెడ్లో నవాజ్ ఉరేసుకుని మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. నవాజ్తోపాటు అక్కడ పనుల కోసం వెళ్లిన మరికొంతమంది ఈ విషయం తెలియజేశారు. అందరూ నిద్రపోయిన తరువాత నవాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాస్పదంగా ఉందంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవాజ్ మృతదేహానికి అక్కడే గురువారం పోస్టుమార్టం నిర్వహించారని, శనివారానికి మృతదేహం స్వగ్రామానికి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నవాజ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం మండలం హాలహర్వి బస్టాప్ వద్ద నిలిచి ఉన్న అయిల్ ట్యాంకర్ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. బాధితులు కర్ణాటక రాయచూర్ జిల్లాలోని ఎరిగేరి దర్గా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పడంతో ఈ ప్రమదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
కర్నూలు(లీగల్): మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఎమ్మిగనూరు తాలూకా సర్కిల్ పరిధిలోని నందవరం పోలీస్స్టేషన్లో నమోదైన కేసు వివరాలివీ. నందవరంలో పదవ తరగతి చదువుతున్న బాలిక 2014 జనవరి 17న పాఠశాలకు వెళ్లి తిరిగిరాకపోవడం తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో 18న ఫిర్యాదు చేశారు. 23వ తేదీన బాలిక తన తల్లిదండ్రులతో వచ్చి తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ‘‘మా ఇంటి ఎదురుగా ఉంటున్న హరిజన శవాల శాంతిరాజు నీవంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానన్నాడు. 17వ తేదీ పాఠశాల ప్రహరీ వద్ద నిల్చున్న నన్ను ఎమ్మిగనూరు జాతరలో కొత్త బట్టలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సోదరుడైన హరిజన శవాల ఆదాం ఆటోలో తీసుకెళ్లాడు. ఎమ్మిగనూరు బస్టాండ్లో నన్ను బెదిరించి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్కు.. అక్కడి నుంచి గుర్తు తెలియని గ్రామం సమీపంలోని ప్రభుత్వ భవనంలోకి తీసుకెళ్లి హరిజన శవాల శాంతిరాజు 22వ తేదీ వరకు గదిలో నిర్బంధించి అత్యాచారం చేశారు. 22వ తేదీ సాయంత్రం ఎమ్మిగనూరు బస్టాండ్లో వదిలి నందవరానికి వెళ్లిపొమ్మని చెప్పారు.’’ అని ఫిర్యాదులో పేర్కొంది. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా మరుసటి రోజు తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై కిడ్నాప్, నిర్భయ చట్టం, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హరిజన శవాల శాంతిరాజు, హరిజన శవాల ఆదాంపై నందవరం పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.వి.శేషుబాబు తీర్పు చెప్పారు. -
నడిరోడ్డుపై కారు దగ్ధం
నందవరం: కర్నూలు జిల్లా నందవరం మండలం ఆలహర్వి దగ్గర ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఎండధాటికే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. -
వైభవం.. జ్యోతి మహోత్సవం
నందవరం(బనగానపల్లె రూరల్) : గ్రామంలోని చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, రథ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతి మహోత్సవం ఆలయ ఈఓ రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి భాస్కరయ్య ఆచారి ఆధ్వర్యంలో చౌడేశ్వరిదేవి అమ్మవారికి దిష్టి చుక్కపెట్టు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం గ్రామంలోని చెన్నకేశస్వామి ఆలయ ఆవరణ నుంచి జ్యోతి మహోత్సవం నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన చౌడేశ్వరిదేవి భక్తులు, తొగట వీరక్షత్రియులు అవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం పాకంతో తయారు చేసిన సుమారు 460 జ్యోతులను తలపై పెట్టుకుని చౌడేశ్వరిదేవి భక్తిగీతాలు పాడుతూ, కాళిక నృత్యం చేసుకుంటూ అమ్మవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు. భక్తులు గుండంలో నడిచి తమ మొక్కులు చెల్లించారు. అనంతరం అమ్మవారికి పట్టుచీర, నైవేద్యం సమర్పించారు. పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం బనగానపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం(పోవడం) జరిగింది. గ్రామంలోని ఆలయ ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement