-
BJP Manifesto: అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్ రద్దు
బెంగళూరు: యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, తయారీ రంగంలో పది లక్షల ఉద్యోగాలు, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్.. ఇలా కీలకమైన 16 హామీలతో బీజేపీ కర్ణాటక ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం.. ‘బీజేపీ ప్రజా ప్రణాళిక’ పేరిట బెంగళూరులో ఇవాళ(సోమవారం) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ బీఎస్ యడ్యూరప్ప సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎవరికీ బుజ్జగింపుల్లేవ్.. అందరికీ న్యాయం పేరిట విజన్తో బీజేపీ ముందుకు సాగుతోందని జేపీ నడ్డా మీడియాకు తెలిపారు. అంతేకాదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు అవుతున్న ముస్లింల రిజర్వేషన్ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించారాయన. అంతేకాదు.. ప్రతీ వర్గానికి సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ముస్లిం రిజర్వేషన్ కోటా నుంచి 4 శాతం వెనక్కి తీసుకున్న బొమ్మై కేబినెట్.. కన్నడనాట రాజకీయంగా ప్రభావం చూపే రెండు వర్గాలకు లింగాయత్లకు, వొక్కలిగాస్కు సమానంగా పంచాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలకు దిగగా.. తాము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని జేడీఎస్ ప్రకటించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో.. రైతుల కోసం 30 వేల కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించింది. మైక్రో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు, ప్రతీ గ్రామ పంచాయితీలో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కమిటీలను ఆధునీకరించడం లాంటి హామీలు ఇచ్చింది. ► టూరిజం సెక్టార్ కోసం.. 1,500 కోట్ల ఫండ్ ప్రకటించింది. దేశంలోనే టాప్ టూరిజం హబ్గా కర్ణాటకకు తీర్చిదిద్దేందుకు ఈ ఫండ్ను ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. ► పేదలకు 10 లక్షల ఇళ్ల పట్టాలను అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవాళ్లకు.. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేత. ► పేదలకు ఉచితంగా పాలు, ఐదు కేజీల బియ్యం. ► నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతి వార్డులో 'అటల్ ఆహార కేంద్రం’ ఏర్పాటు. ► మైసూర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్కుమార్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ► విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తామని వెల్లడించింది. ► వచ్చే ఐదేళ్లలో 200 చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇదీ చదవండి: బీజేపీ మహిళా కార్యకర్త అత్యుత్సాహం.. ప్రధాని మోదీపైకి.. -
అమిత్ షాకు వరుసగా కౌంటర్లు
-
వైఎస్ హయాంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి అభ్యున్నతికి బాటలు వేశారని ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి అన్నారు. మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని వైఎస్ భావించారని, అయితే సాంకేతిక కారణాల వల్ల 4% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. తద్వారా విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు లభించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రిజర్వేషన్లను 12% పెంచాలనుకున్నా, కేంద్రం నుంచి సహకారం లేదని, ఈ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల్లో ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. చిన్నవాడైనా ఏపీ సీఎం జగన్ సమర్థవంతుడు.. ఉర్దూ టీచర్ల నియామకంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టి.జీవన్రెడ్డి సూచించారు. ఉర్దూ టీచర్ల రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను అమలు చేయడానికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘డీ–నోటిఫై’చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉర్దూ చదువుకున్న వారు ఉండరనే ఉద్దేశంతో ఉర్దూ టీచర్ పోస్టులను జగన్ ఓపెన్ కేటగిరీలో పెట్టారని కొనియాడారు. ‘చిన్నవాడైనా సీఎంగా సమర్థవంతంగా ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ జనరల్ కేటగిరీలోకి ఉర్దూ పోస్టులు తీసుకురావాలి’ అని సూచించారు. అందుకు స్పందించిన కేటీఆర్ ‘నేను ఆ శాఖ మంత్రిని కాదు’అని చెప్పగా, కాకపోయినా చేయవచ్చని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట.. మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏడేళ్లలో మైనారిటీల కోసం రూ. 6,644.26 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. సంక్షేమంతో పాటు పాతబస్తీ అభివృద్ధికి కూడా నిధులు వెచ్చించిందని చెప్పారు. ఈ అంశంపై ఎమ్మెల్సీలు ఎం.ఎస్,ప్రభాకర్ రావు, వాణీదేవి, సయ్యద్ అమీనుల్ జాఫ్రి, మీర్జా రియాజ్ అఫెండీ, డి.రాజేశ్వర్రావు పలు ప్రశ్నలు సంధించారు. -
ప్రతి ముస్లిం గుండెలో వైఎస్సార్
ప్రొద్దుటూరు క్రైం : దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ల వల్లనే ముస్లిం కుటుంబాల్లో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ‘హర్ దిల్ మే వైఎస్సార్ ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుందరాచార్యుల వీధిలోని రాయల్ ఫంక్షన్ హాల్ నుంచి కేహెచ్ఎం స్ట్రీట్ మీదుగా భారీ జనసందోహం మధ్యన ఈ కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డితో పాటు పార్టీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ఖాదర్తో, పలువురు మైనారిటీ నాయకులు వీధుల్లో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు ముస్లింలకు చేసిన మోసాలను వివరించారు. అనంతరం వన్టౌన్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి గుండెలో వైఎస్సార్ ఉన్నారు అనే నినాదంతో ముస్లిం పెద్దలు మీ ముందుకు వచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అనేక మోసాలకుపాల్పడిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మైనా రిటీల సభలో విస్మరించిన హామీలపై నంద్యాల యువకులు ప్ల కార్డులు ప్రదర్శిస్తే వారిని పోలీసులతో చంద్రబాబు కొట్టించారన్నారు.చంద్రబాబుకు మైనారిటీల పట్ల ప్రేమ లేదన్నారు. మైనా రిటీలపై అభిమానంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 4 శాతం రిజర్వేషన్ అమలు చేశారని, వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయంటే అది కేవలం వైఎస్ వల్లనే అని అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వమని ఆ పార్టీ పెద్దలు వైఎస్ జగన్ను అడుగగా.. ముస్లింల అభిమానాన్ని పోగొట్టుకోలేనని చెప్పారన్నారు. బెదిరించినా, జైల్లో పెట్టినా ఫరవాలేదని, ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న మీ పార్టీకి మద్దతు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పిన నాయకుడు జగన్ అని అన్నారు. ముస్లింల పట్ల తండ్రీ కొడుకులకు ఉన్న అపారమైన ప్రేమ ఇది అని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం టీడీపీ ఎన్నికల డ్రామా అని ఎమ్మె ల్యే చెప్పారు. నాలుగున్నరేళ్లు బీజేపీ ప్రభుత్వంలో కొనసాగి ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో కాంగ్రెస్తో బాబు జతకట్టారన్నారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మైనారిటీల అభిమానంతోనే వైఎస్సార్సీపీకి ఎక్కువ స్థానాలు రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారంటే అం దుకు ముస్లింల అభిమానమే కారణమని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రొద్దుటూరులోని ప్రతి వార్డులో ముస్లింలు తనను ఆదరించారన్నారు. అల్లా దయవల్ల వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని ముస్లిం కుటుం బాల్లో ఉన్న పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని టీటీపీ నాయకులు ఇతరులకు కేటాయిస్తే తాను మాత్రం ముస్లిం అయిన ముక్తియార్ను ప్రతిపాదించామన్నారు. ఇందు కోసం రూ. 4–5 కోట్లు ఖర్చు కూడా చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయినా ముక్తియార్ మమ్మల్ని కాదని టీడీపీలోకి వెళ్లారన్నారు. ఇది న్యాయమా అని ఎమ్మెల్యే ప్రజలను అడిగారు. మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్బాషా, కార్యదర్శి గౌస్లాజం ఎమ్మెల్యే రాచమల్లుకు మెమొంటోను అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ లాజం, పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మైనారిటీ నాయకులు ఆయిల్మిల్లు ఖాజా, పులివెందుల రఫి, పెన్నానగర్ అక్బర్,మార్కెట్ దాదాపీర్, షెక్షావల్లి, అబ్దుల్లా, టైలర్ నజీర్, జహింగీర్, అల్లాబకాష్, జమాల్వల్లి, రఫిక్, అన్సర్, షాపీర్, వైఎస్సార్సీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, పార్టీ మండల కన్వీనర్లు ఎస్ఏ నారాయణరెడ్డి, దేవీప్రసాద్రెడ్డి, దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, సుబ్రమణ్యం, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం కొర్రీ!
సాక్షి, హైదరాబాద్ : ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు పీటముడి పడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంలోని రెండు శాఖలు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ బిల్లును నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కేంద్ర హోం శాఖకు సూచించింది. మొత్తం రిజ ర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయంటూ డిసెంబర్ 11నే ఆఫీస్ మెమొరాండం పంపించింది. మరోవైపు ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులోని అంశాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 9.08 శాతం ఎస్టీ జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేసే ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్ల తెలిపింది. మొత్తం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎస్టీల రిజర్వేషన్ 9.08 శాతానికి తగ్గకూడదంటూ డిసెంబర్ 18న కేంద్ర హోంశాఖకు ఆఫీస్ మెమోరాండం పంపింది. మొత్తంగా భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్రపతికి పంపకుండా పెండింగ్లో పెట్టింది. పది నెలలుగా నిరీక్షణ ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, 6 శాతమున్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని దాదాపు ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఏప్రిల్ 16న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08 శాతానికి, ముస్లింల జనాభా 12.68 శాతానికి చేరిందని.. ఈ మేరకు రిజర్వేషన్లను పెంచాలని బిల్లులో ప్రతిపాదించింది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 62 శాతానికి చేరినట్లయింది. సందేహాలు లేవనెత్తిన డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులోని ప్రతిపాదనలను కేంద్ర డీవోపీటీ సున్నితంగా తిరస్కరించింది. 1992లో ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4) ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని పేర్కొంది. అసాధారణ పరిస్థితుల్లో దీనికి మినహాయింపు ఇవ్వొచ్చని, అందుకు సహేతుక కారణాలు చూపాలని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం చేసిన సూచనలను ప్రస్తావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో అటువంటి కారణాలు, అసాధారణ పరిస్థితులేమీ చూపలేదని స్పష్టం చేసింది. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఓబీసీలకున్న 27 శాతం రిజర్వేషన్లలో.. మైనారిటీలకు ఉప కోటా కింద 4.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement