breaking news
Mari Selvaraj
-
కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్.. భారీ సాయం
తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. భారత U-18 మహిళల కబడ్డీ జట్టు వైస్-కెప్టెన్ కార్తీకకు రూ. 5 లక్షలు ప్రోత్సాహకంగా అందించారు. తమిళనాడుకు చెందిన కార్తీక రీసెంట్గా బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో భారత్ తరపున స్వర్ణం సాధించింది. ఇప్పటికే కార్తీక జట్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ. 20 లక్షలు అందించారు. భారత్తో పాటు తమిళనాడు కీర్తిని ఆమె పెంచిందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న కార్తీక చాలా పేదరికంతో ఉన్న కుటుంబంలో జన్మించింది. అమె తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో భారత్ మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఇరాన్పై భారత్ భారీ విజయం సాధించింది. ఈ గెలుపులో కార్తీకది కీలక పాత్ర ఉంది. దేశ కీర్తిని పెంచిన ఆ జట్టుకు మారి సెల్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఆమె ఇంటికి వెళ్లి రూ. 5 లక్షల చెక్ను బహుమతికి ఇచ్చారు. కన్నగి నగర్ కార్తీక మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు.కబడ్డీ నేపథ్యంతో బైసన్మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్. నటి అనుపమపరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, దర్శకుడు అమీర్, లాల్, మదన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్న్స్ పతాకంపై దర్శకుడు రంజిత్ నిర్మించారు. కబడ్డీ నేపథ్యంతో విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో సంచలన విజయం సాధించింది. బైసన్ చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల తిలకించారు. ఆపై చిత్ర యూనిట్ను వారు మెచ్చుకున్నారు.சமீபத்தில் பஹ்ரைனில் நடந்த ஆசிய இளைஞர் விளையாட்டுப் போட்டியில் தங்கம் வென்ற இந்திய U-18 பெண்கள் கபடி அணியின் துணைத் தலைவராக விளையாடிய கார்த்திகா இந்தியாவிற்கும் தமிழ்நாட்டிற்கும் பெருமை தேடித்தந்து இறுதிப் போட்டியில் ஈரான் அணிக்கு எதிரான ஆட்டத்தில் பெற்ற வெற்றியில் அவர் முக்கிய… pic.twitter.com/nzTwkf1Aia— Mari Selvaraj (@mari_selvaraj) October 30, 2025 -
బైసన్ కలెక్షన్స్.. బిగ్ మార్క్ అందుకున్న ధ్రువ్
విక్రమ్ కుమారుడు ధ్రువ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison). మొదట తమిళ్లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగులో కూడా రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మించాయి. ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా బైసన్ రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ చిత్రం కేవలం పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. రెండో వారంలో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్స్ పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అత్యధికంగా థియేటర్స్ పెరగడం విశేషం. అయితే, తెలుగులో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించేలా బైసన్ ఉంది.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. Ecstatic beyond measure and thankful beyond words!! #BisonKaalamaadan is unstoppable as he's breaking those barriers right away!!💥🦬55 Crores Worldwide in 10 days!! #Blockbuster Raid in the Theatres Near You! 💥💥💥@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal… pic.twitter.com/ozbbqRLl7S— Mari Selvaraj (@mari_selvaraj) October 27, 2025 -
'కాంతార' హిట్.. మమ్నల్నే అంటారెందుకు?: 'కబాలి' డైరెక్టర్
రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజులో 'కాంతార 1' సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. అయితే ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురు దర్శకుల్నే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ అసహనం వ్యక్తం చేశాడు. 'బైసన్' సక్సెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఇంతకీ అసలేమైంది?''కాంతార' లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు.. కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మేమే తమిళ ఇండస్ట్రీని చెడగొట్టామని విమర్శిస్తుంటారు. గత రెండేళ్లలో కోలీవుడ్లో 600కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వీళ్లలో ఎంతమంది తమిళ సినిమా స్థాయిని పెంచగలిగారు?' అని పా. రంజిత్ ఫైర్ అయిపోయాడు.తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్, రూటెడ్ సినిమాలు వస్తున్నాయి. వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. తమిళంలో మాత్రం ఏ దర్శకులు కూడా ఆ ఫీట్ సాధించలేకపోతున్నారు. దీంతో రీసెంట్ టైంలో కొందరు తమిళ నెటిజన్లు, రివ్యూయర్స్.. డైరెక్టర్స్ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్పై పడ్డారు. కులం, అణిచివేత సబ్జెక్ట్స్తో మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారని, అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనమైపోతుందని విమర్శించారు. ఆ కామెంట్స్కి హర్ట్ అయిన పా.రంజిత్.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.ఇదే ఈవెంట్లో పా.రంజిత్ మాట్లాడుతూ.. 'సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకోకుండా వాటిపై కులం అనే ముద్ర వేయొద్దు. ప్రేక్షకులు ప్రేమతో సినిమాల్ని చూస్తారు. కానీ ట్రోల్స్.. ఓ మూవీని చూడకముందే చాలామందికి ఓ అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.పా.రంజిత్ విషయానికొస్తే.. రజినీకాంత్తో కబాలి, కాలా లాంటి మూవీస్ తీశాడు. తమిళంలో వీటికి ఓ మాదిరి ఆదరణ వచ్చింది. తెలుగులో మాత్రం రెండు ఫ్లాప్ అయ్యాయి. గతేడాది 'తంగలాన్' అనే మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?) -
ధ్రువ్ విక్రమ్ సినిమా.. భారీగా 'బైసన్' కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్ 17న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన బైసన్ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్లో మాత్రమే బైసన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్ 24న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ధ్రువ్ మార్కెట్ పెరగనుంది. ఫైనల్గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్ కలెక్షన్స్ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు. Extremely grateful for all your love! #BisonKaalamaadan grows over a hundred percent over day one and is roaring at the box office. Just Tamil version collects 35cr gross collections worldwide New Raid #Bison ready for Telugu release 🦬#BisonKaalamaadan 🦬 #DiwaliWinner 💥… pic.twitter.com/FqeV8unvls— Mari Selvaraj (@mari_selvaraj) October 22, 2025 -
హిట్ కొట్టిన విక్రమ్ వారసుడు.. తెలుగులో కూడా విడుదల
చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్కు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తండ్రి విక్రమ్ నటనను చూసి ఎదిగిన వారసుడు. తొలి చిత్రం వర్మతోనే నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయితే ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం, ఆ తరువాత తన తండ్రి విక్రమ్తో కలిసి నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ధ్రువ్విక్రమ్ ఇప్పటివరకు విజయానికి దూరంగా ఉన్నారు. సరైన కథ, దర్శకుడి చేతిలో పడితే తన సత్తా చాటగలనని ఈ యువ నటుడు బైసన్ చిత్రంతో నిరూపించుకున్నారు. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ కథానాయకుడిగా నటించిన బైసన్ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్న్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఇదే టైటిల్తో అక్టోబర్ 24న విడుదల కానుంది. దర్శకుడు మారీ సెల్వరాజ్ గతంలో తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్, వాజై చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బైసన్ మూవీ కూడా మంచి విజయం సాధించింది. -
విక్రమ్ వారసుడి మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఫుట్బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx 4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025 -
అనుపమ పరమేశ్వరణ్ కొత్త సినిమా.. లవ్ సాంగ్ చూశారా?
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా బైసన్.. ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి తీరేనా.. వేదన అనే మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుండగా.. తెలుగులో ఇదే నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలా ఈ చిత్రం వుండనుంది. -
కోలీవుడ్ టార్చ్ బేరర్స్
కొంతకాలంగా నడక మార్చుకుంటోంది తమిళ సినిమా. వెండితెర నిర్వచనాన్ని మార్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు కోలీవుడ్ కొత్త కథనాయకులు. ఇక్కడ కథానాయకులు అంటే తెరపై కనిపించే హీరోలు కారు. సిల్వర్ స్క్రీన్ను రీ డిఫైన్ చేస్తూ ఇండస్ట్రీకే టార్చ్ బేరర్స్గా మారిన దర్శకులు. హీరోల ఇమేజ్ చుట్టూ తిరిగే కథలకు ఎండ్ కార్డ్ వేసి రొటీన్ ఫార్ములా సినిమాలకు మంగళంపాడేశారు ఈతరం దర్శకులు.సమాజం పెద్దగా పట్టించుకోని అంశాలనే ముడి సరుకుగా తీసుకుని ఈ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు తమిళ సినిమాను కొత్త పంథాలోకి తీసుకెళ్తున్నాయి. అట్టడుగు ప్రజల జీవితాలే ఆ చిత్రాల కథా వస్తువులు. ప్రతి ఫ్రేమ్లోనూ సామాజిక స్పృహ ఉట్టిపడేలా సోషల్ కమిట్మెంట్తో సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఆ ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.సామాజిక వివక్షే కథగా...అణిచివేతకు గురైన వాడికే వివక్ష వికృత రూపం తెలుస్తుంది. తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మారి సెల్వరాజ్ తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షనే సినిమా కథలుగా మార్చుకున్నారు. అట్టడుగు ప్రజల గళంగా మారారు ఈ దర్శకుడు. తమిళ సంస్కృతి నేపథ్యంలో వాస్తవ జీవిత గాథలను ఆవిష్కరిస్తున్నారు.2018లో తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ నుంచి ‘కర్ణన్, మామన్నన్’, మొన్నటి ‘వాళై’ వరకు ప్రతి చిత్రంలోనూ కులం కట్టుబాట్లు, ప్రజల హక్కులు, గౌరవప్రదమైన జీవితం... మారి సెల్వరాజ్ చర్చకు పెట్టే అంశాలు ఇవే. మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోనిపాత్రలకు వాయిస్ ఇస్తూ తన సినిమా ద్వారా సామాజికపోరాటం చేస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాల్లో కల్చరల్ రిప్రజంటేషన్ తప్పక ఉంటుంది. బడుగు బలహీన వర్గాల గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా కళ్లకు పట్టే ప్రయత్నంలో ఈయన ప్రతి సందర్భంలోనూ సక్సెస్ అవుతున్నారు.పోరాట యోధులుగా...సినిమా అంటే ఏదో ఒక కథ చెప్పడం కాదు. వివక్ష కారణంగా పూడుకుపోయిన గొంతులకు వాయిస్ ఇవ్వాలి. శతాబ్దాల నుంచి వివక్షను అనుభవిస్తున్న కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి స్వరం సినిమాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఘాటుగానే ఉంటుంది.పా. రంజిత్ సినిమాలు కూడా అంతే. అంబేద్కర్ ఆలోచనా విధానానికి తగ్గట్టు దళిత్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చిత్ర పరిశ్రమలో రాజీలేనిపోరాటమే చేస్తున్నారాయన.కబాలి (2016), కాలా (2018)... ఈ రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్కి సామాజిక న్యాయం కోసంపోరాడే యోధుడిపాత్రను మేళవించిపా. రంజిత్ చిత్రించిన విధానం తరాలుగా అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. రంజిత్ సినిమాలకు రజనీకాంత్ కూడా ఫిదా అయిపోయారు. సామాజిక అంశాలు... వాటిని ప్రభావితం చేసే ΄పొలిటికల్ డైనమిక్స్ రంజిత్ సినిమాలో నిండి ఉంటాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి దళితుల సంఘర్షణలను, వారి ఆత్మగౌరవపోరాటాలను వెలికి తీసి ఈ ఏడాది ‘తంగలాన్’ రూపంలోపా. రంజిత్ సృష్టించిన సునామీ సినీ విమర్శకుల మెప్పు ΄పొందింది.దర్శకుడిగా దృశ్య రూపం ఇవ్వడంతో సరిపెట్టకుండా నిర్మాతగా మారి ఈ తరహా చిత్రాలెన్నింటికో బ్యాక్బోన్గా నిలిచారు. మారి సెల్వరాజ్ తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ అందులో ఒకటి. దళిత జీవితాలను తెరకెక్కించే క్రమంలో వారిని బాధితులుగా కాకుండాపోరాట యోధులుగా చూపిస్తూ అవసరమైన చోట కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా జోడించి సాగిస్తున్న మూవీ జర్నీ తమిళ ఇండస్ట్రీలోపా. రంజిత్కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.కఠినమైన వాస్తవాలతో...తమిళనాడులోని సామాజిక–రాజకీయ వాతావరణాన్ని నిజ జీవితాలకు దగ్గరగా చూపించడంలో వెట్రిమారన్ది ప్రత్యేక శైలి. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో వెట్రిమారన్ సినిమాలు కూడా అంతే. విభిన్న వర్గాల జీవితాలను సజీవంగా చూపించడంలో వెట్రిమారన్ ముందుంటారు. ఈయన సినిమాల్లో కనిపించే సామాజిక సమస్యల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘ఆడుగళం, విశారణై, అసురన్’... ఏ సినిమా తీసుకున్నా వాటి నేపథ్యంలో కనిపించేది ప్రజలపోరాటాలే. కళను వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా మార్చుకున్న దర్శకులుగా మారి సెల్వరాజ్,పా. రంజిత్, వెట్రిమారన్ కనిపిస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించినా సరే ఈ ముగ్గురి సినిమాలో పీడిత ప్రజలే ప్రధానపాత్రలుగా ఉంటారు. వాళ్లే హీరోలుగా సినిమాను నడిపిస్తారు. భిన్న చిత్రాల ద్వారా వీళ్లు సంధిస్తున్న ప్రశ్నలు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ వీళ్ల ముద్ర కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వినోద సాధనంగా మారి, నేల విడిచి సాము చేస్తున్న సందర్భంలో వాస్తవికత, సామాజిక చైతన్యాన్ని నమ్ముకుని స్టోరీ టెల్లింగ్కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు. దర్శకులుగా వీరిది బాధ్యతాయుతమైన ప్రయాణం. – ఫణి కుమార్ అనంతోజు -
హిట్ డైరెక్టర్తో రజనీకాంత్ కొత్త సినిమా
కోలివుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జైలర్ హిట్ తర్వాత ఆ రేంజ్లో తన తర్వాతి సినిమా ఉండాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ దసరా పండక్కి 'వేట్టైయాన్' సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్పై సుభాస్కరన్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్తో పాటు కూలీ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లతో పాటు జైలర్ సీక్వెల్ కూడా ఉంది. అయితే, ఇప్పుడు రజనీకాంత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.కోలీవుడ్ టాప్, టాలెంట్ డైరెక్టర్స్తో సినిమాలు తీసేందుకు రజనీకాంత్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వేట్టైయాన్ సినిమాతో టీజే జ్ఞానవేల్, కూలీ ప్రాజెక్ట్తో లోకేశ్ కనగరాజ్ , జైలర్తో నెల్సన్ దిలీప్కుమార్ ఇలా వరుస బిగ్ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న రజనీకాంత్.. తాజాగా డైరెక్టర్ మారి సెల్వరాజ్తో ఒక సినిమా చేయనున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. కర్ణన్, మామన్నన్ చిత్రాలతో సౌత్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన మారి సెల్వరాజ్కు రజనీ ఛాన్స్ ఇచ్చారని తెలిసిన అభిమానులు సంబరపడుతున్నారు.తాజాగా ఓ ఇంటర్వయూలో పాల్గొన్న మారి సెల్వరాజ్ ఈ విషయం గురించి ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రజనీకాంత్ గారికి నేను అంటే చాలా ఇష్టం. నేను డైరెక్ట్ చేసిన కర్ణన్, మామన్నన్ చిత్రాలను ఆయన చూసి అభినందించారు. ఆ సమయంలోనే ఒక సినిమా చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పటికైతే కథ రెడీ అయింది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.' అని మారి సెల్వరాజ్ తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్నాయి. -
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
'టిల్లు స్క్వేర్' సినిమాతో హిట్ కొట్టిన అనుపమ.. మళ్లీ బిజీ అయిపోతోంది. తెలుగులో 'పరదా' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా అలాంటిదే ఒకటి అనుపమ ఖాతాలో చేరింది. తమిళంలో డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్.. తన కొత్త మూవీలో అనుపమకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అతడి మూడో చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో ఆకట్టుకున్న ధ్రువ్.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుని కొత్త మూవీకి రెడీ అయిపోయాడు. సక్సెస్పుల్ దర్శకుడు మారి సెల్వరాజ్ తీయబోయే మూవీలో మెయిన్ లీడ్గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బైసన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.ఇదే సినిమాలో లాల్, పశుపతి, కలైయ రసన్, రజిష విజయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. ప్రశాంతమైన మార్గాన్ని అన్వేషించే ఒక వీరుడి ఇతివృత్తమే 'బైసన్' సినిమా అని దర్శకుడు మారి సెల్వరాజ్ చెప్పారు. 'మామన్నన్' లాంటి అద్భుతమైన హిట్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: విడాకులపై సలహా అడిగిన యువతి.. మెగా డాటర్ శ్రీజ పోస్ట్ వైరల్)As powerful and fierce as it could get! Unleashing #Bison 🦬#BisonKaalamaadan All the best @mari_selvaraj #DhruvVikram @anupamahere @nivaskprasanna and team 💥💥💥@Tisaditi @ApplauseSocial @NeelamStudios_ pic.twitter.com/0D9pLnw2AD— pa.ranjith (@beemji) May 6, 2024 -
ధ్రువ్కు జోడీగా..?
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్ను తీసుకున్నారట. అనుపమాకి ఇటీవల మారి సెల్వరాజ్ ఈ కథను వినిపించగా, ఈ బ్యూటీ ఆల్మోస్ట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మరి.. ధ్రువ్ విక్రమ్కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 15న తమిళనాడులోని తూత్తుకూడిలో ప్రారంభం కానుందని సమాచారం. -
Vaazhai In OTT: ఆ హిట్ డైరెక్టర్ మూవీ.. నేరుగా ఓటీటీకేనా!
మామన్నన్ మూవీతో హిట్ అందుకు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వాజై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మూడు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్ తెరకెక్కించిన నాలుగో చిత్రం వాజై ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామన్నన్ కంటే ముందే వచ్చిన పెరియారుమ్ పెరుమాల్, కర్ణన్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకున్నారు మారి సెల్వరాజ్. దీంతో వాజై మూవీని కూడా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని కోలీవుడ్ ఫ్యాన్స్ భావించారు. అదే తరహాలోనే వాజై చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అసలు కారణమిదేనా? అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందువల్లే ఈ మూవీని థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రకటించింది. కాగా.. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. நீளும் நீச்சலில் என் நா கேட்கும் ஒரு சொட்டுத் தேன் . —வாழை 🌴 This year belongs to #Vaazhai Team Vaazhai welcomes 2024 with warm hands!! Hitting theatres soon!! 🌴@disneyplusHSTam @navvistudios @mari_selvaraj @Music_Santhosh @thenieswar @KalaiActor @Nikhilavimal1… pic.twitter.com/CKrQNimnt7 — Mari Selvaraj (@mari_selvaraj) January 1, 2024 -
అనుమానస్పదంగా 'మామన్నన్' అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న యువ డైరెక్టర్ మృతి చెందాడు. పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి తమిళ చిత్రసీమలోని ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు మరి సెల్వరాజ్. ఈ సినిమాల అన్నింటికి ఆయన వద్ద మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఈ సినిమాల విజయాల వెనుక మారిముత్తు పాత్ర చాలా ఎక్కువగానే ఉందని బహిరంగంగానే మరి సెల్వరాజ్ అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం. (ఇదీ చదవండి: ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి ఫిక్స్..!) ఊపిరాడకనే మరిముత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుండం సమీపంలోని తిరుపుళియంగుడి అనే మారు మూల గ్రామానికి చెందిన మారిముత్తుకు సినిమాల్లో దర్శకుడవ్వాలనే కోరికతో చెన్నైకి వచ్చాడు. మూడు హిట్ సినిమాలకు మరి సెల్వరాజ్ వద్ద ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవంతో తనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించేందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మారిముత్తుకు శామ్యూల్ అనే 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మారిముత్తుకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. భోజనం తర్వాత సిగరెట్ తాగుతుండగా ఒక్కసారిగా దగ్గు రావడం ఆపై ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మారిముత్తు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మామన్నన్ విజయంతో స్టాలిన్ చేతుల మీదుగా మరిముత్తు అవార్డును ఉదయనిధి అందుకోవడం గమనార్హం. -
నా చివరి సినిమాని బలమైన కథతో చేయాలనుకున్నా!
‘‘నాయకుడు’ చాలా మంచి కథ, పొలిటికల్ డ్రామా, సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఈ మూవీలో చర్చించాం. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి, నిర్మించారు. కీర్తీ సురేష్ హీరోయిన్. జూన్ 29న ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి. నేడు ఈ మూవీ రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ–‘‘తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. అయితే తమిళంలో మంచి వసూళ్లను సాధించడంతో ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నేను సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక నా చివరి సినిమాని బలమైన కథతో మారి సెల్వరాజ్తో చేయాలనుకున్నాను’’ అన్నారు. -
చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన కోలీవుడ్ చిత్రం మామన్నన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మరి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం థియేట్రికల్గా సక్సెస్ కావడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రమే ఉదయనిధి స్టాలిన్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడికి హీరో సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..!) చివరి చిత్రం సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మరి సెల్వరాజ్కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ కారు విలువు దాదాపు రూ.40 నుంచి 45 లక్షల ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ తన ట్వీట్లో రాస్తూ..'ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు. అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువ తరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా భారీ విజయం సాధించింది. మరి సెల్వరాజ్ సార్కి మినీ కూపర్ కారును అందించడం ఆనందంగా ఉంది. మామన్నన్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినందుకు సెల్వరాజ్కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! ) ஒவ்வொருவரும் ஒவ்வொரு விதமாக விவாதிக்கிறார்கள். தங்களுடைய எண்ணங்களை கதையுடனும் களத்துடனும் தொடர்புபடுத்தி கருத்துகளை பகிர்கிறார்கள். உலகத் தமிழர்களிடையே விவாதத்துக்குரிய கருப்பொருளாக மாறியிருக்கிறது. அம்பேத்கர், பெரியார், அண்ணா, கலைஞர் போன்ற நம் தலைவர்கள் ஊட்டிய சுயமரியாதை உணர்வை,… pic.twitter.com/ro4j7epjAI — Udhay (@Udhaystalin) July 2, 2023 -
సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?
ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది? 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) టాక్ ఏంటి? మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ ఎంత? గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
పాట పాడటమే కాదు డ్యాన్స్ కూడా చేసిన ఏఆర్ రెహమాన్!
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతానికి సినీ ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. అలాంటిది ఆయన వెండితెరపై ఆడి పాడారంటే ఇంకెంతగా విస్మయంతో చూస్తారో ఆలోచించండి. ఏ ఆర్ రెహమాన్ ఏంటి? డాన్స్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఆయన డాన్స్ చేశారన్నది మాత్రం కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఈ అరుదైన దృశ్యాన్ని మామన్నన్ చిత్రంలో చూడబోతున్నారు. ఉదయ నిధి స్టాలిన్, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. రెడ్జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మారిసెల్వరాజ్ దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 29న విడుదలైంది. వడివేలు ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాదు చాలా గ్యాప్ తరువాత ఆయన ఈ చిత్రంలో ఒక పాట పాడడం విశేషం. రెహమాన్ స్పందిస్తూ తాను చిన్నతనం నుంచి కీబోర్డుతో గడిపానని ఆ తరువాత ఎన్నో స్టేజీలపై పాటలు పాడానని, ఇక ఇలాగే తన జీవితం గడచిపోతుంది అనుకుంటున్న సమయంలో మారిసెల్వరాజ్ మామన్నన్ చిత్రంలో తనను ఒక పాటలో మెరిసేలా చేశారని పేర్కొన్నారు. అయితే తనతో డాన్స్ చేయించిన ఘనత డ్యాన్స్ మాస్టర్ శాండీకే దక్కుతుందని అన్నారు. ఈ పాటను ఉదయనిధి స్టాలిన్కు చూపించగా ఆయన ఆశ్చర్యపోయారని దర్శకుడు మారిసెల్వరాజ్ పేర్కొన్నారు. చదవండి: అతడిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? -
మరోసారి ఆ డైరెక్టర్తో జతకట్టనున్న ధనుష్
‘కర్ణన్’ మూవీతో తనకు సూపర్హిట్ అందించిన దర్శకుడు మారి సెల్వరాజ్తో హీరో ధనుష్ మరోసారి జతట్టనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధనుష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. శుక్రవారం ఆయన ట్వీట్ చేశాడు. ‘మారి సెల్వరాజ్తో మరో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాం’ అంటు రాసుకొచ్చాడు. ‘కర్ణన్’ సినిమా కోలీవుడ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. థియేటర్ సీటింగ్ సామర్థ్యం కేవలం యాభై శాతం అయినప్పటికీ ఈ చిత్రం మెరుగైన వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ నిమిత్తం ధనుష్ క్యాలిఫోర్నియాలో ఉన్న సంగతి తెలిసిందే. -
స్పీడ్ పెంచారు
‘అర్జున్ రెడ్డి’ రీమేక్తో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తొలి సినిమాకే నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే సినిమాలు అంగీకరించడంలో స్పీడ్ పెంచాడు ధ్రువ్. రెండో సినిమాను తండ్రి విక్రమ్తో కలసి చేస్తున్నట్టు ప్రకటించాడు. ధ్రువ్, విక్రమ్ ముఖ్య పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ధ్రువ్ విక్రమ్ సోలో హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘పరియేరు పెరుమాళ్, కర్ణన్’ చిత్రాలను తెరకెక్కించిన మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తండ్రితో చేస్తున్న సినిమా, తాజాగా ఒప్పుకున్న ఈ సినిమాను ఏకకాలంలో పూర్తి చేస్తాడట ధ్రువ్. -
చిత్ర నిర్మాణరంగంలోకి కబాలి దర్శకుడు
దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది కొత్తేమీ కాదు. స్టార్ దర్శకుడు శంకర్ లాంటి వారు చిత్ర నిర్మాణం చేపట్టి విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో అట్టకత్తి అంటూ దర్శకుడిగా పరిచయం అయిన పా.రంజిత్ తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తరువాత మద్రాస్ అంటూ ఉత్తర చెన్నై యువత జీవన విధానాన్ని సహజత్వంతో తెరపై ఆవిష్కరించి మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మూడో చిత్రంతోనే సూపర్స్టార్ రజనీకాంత్ను గ్యాంగ్స్టర్గా చూపించి కబాలి చిత్రంతో స్టార్ దర్శకుల పట్టికలో చేరారు. తాజాగా మళ్లీ రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయిన పా.రంజిత్ ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో పక్క నీలం ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నవ దర్శకుడు మారి సెల్వరాజ్ను పరిచయం చేస్తూ చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి పరియేరుం పెరిమాళ్ అనే పేరును నిర్ణయించారు. క్రిమి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కధీర్ హీరోగానూ, నటి ఆనంది హీరోయిన్ గా నటించనున్నారు. ఈ నెల చివర్లో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది తిరునెల్వెలి పరిసర ప్రాంతానికి చెందిన ఒక యువకుడి ఇతివృత్తంగా ఉంటుందట. ప్రేమ, యాక్షన్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలతో జనరంజకంగా చిత్రం ఉంటుందట. ఈ విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. ఇక మారి సెల్వరాజ్ గురించి చెప్పాలంటే ఈయన దర్శకుడు రామ్ వద్ద కట్రదు తమిళ్, తంగమీన్ గళ్, తరమణి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారు. పరియేరుం పెరుమాళ్ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం, శ్రీధర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.


