-
‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.న్యాయవాద వృత్తి నుంచి..ఆదిలాబాద్లో టి.మధుసూదన్రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్లో ఉండడంతో మధుసూదన్రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.మొదటిసారి ఎన్నికల్లో..బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. -
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం
షాద్నగర్ (హైదరాబాద్)/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహ బూబ్నగర్లో నిర్వహించిన గౌడ సంఘం సమావేశానికి వెళ్లేందుకు.. ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపో బస్సు ఎక్కిన మంత్రి మహిళా ప్రయా ణికులతో ముచ్చటించారు. డ్రైవర్ ఇయర్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులోని మహిళా కండక్టర్ను ఈ విషయమై అడి గారు. డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని తమాషా చేస్తున్నాడా?.. అలా మాట్లాడితే సస్పెండ్ అవు తాడు తెలుసా?.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు కదా? అన్నారు. ‘కాంగ్రెస్ సర్కార్ ఆయా.. ఏ సబ్ కా సర్కార్ హై’.. అంటూ ఓ ముస్లిం ప్రయాణికురాలితో మంత్రి ముచ్చటించారు. పెన్షన్ వస్తుందా? అని ప్రశ్నించగా.. రావడం లేదని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నావా? అని అడిగారు. లేదని ఆమె చెప్పడంతో వెంటనే దరఖాస్తు చేసుకోమని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని.. అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం..కాదనగలరా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో అంకెలతో సహా చెబుతామని, కాదని టీడీపీ సభ్యులు నిరూపించగలరా అని ఎమ్మెల్యే కొటారు అబ్యయ్య చౌదరి సవాల్ చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం ఏ రంగంలో ఎంత మార్పు వచ్చిందో నిరూపిస్తామన్నారు. టీడీపీకి స్పీకర్పైన, అసెంబ్లీపైన గౌరవం లేదని, కుర్చిలపై వ్యామోహం మాత్రమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్నాక ప్రతి కుర్చీ లాక్కోవాలని చూస్తున్నారన్నారు. తొడలు కొడితే కుర్చిలు రావడానికి ఇది సినిమా కాదని ఎద్దేవా చేశారు. ‘రా కదిలిరా’ అంటే జనం రావడంలేదని చెప్పారు. స్పీకర్పై పేపర్లు విసిరి దాడి చేయడం బాధాకరమని చెప్పారు. అబ్బ య్య చౌదరి మంగళవారం శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గిందని సాక్షాత్తు నీతి ఆయోగ్, యూఎన్డీపీ నివేదికల్లో పేర్కొనడం అభినందనీయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పేదలు – ధనవంతుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారానే పేదరికం పోతుందని నమ్మారని, అందుకే విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దారన్నారు. అందరికీ ఆరోగ్యం అన్నది అమెరికా వంటి దేశాల్లో కూడా లేదని, కానీ ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారన్నారు. సంక్షేమాన్ని పేదల ఇంటికి చేర్చారని అన్నారు. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్నే పేదల వద్దకు తీసుకెళ్లారన్నారు. దాదాపు 550 సేవలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణంతో పాటు 53 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించారని చెప్పారు. టీడీపీ పాలన ఐదేళ్లలో కేవలం 34,108 ఉద్యోగాలిస్తే, సీఎం జగన్ 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కలి్పంచారని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో పేదల పక్షాన నిలబడిన విధానం, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో గవర్నర్ ప్రసంగంలో వివరించారని తెలిపారు. 99 శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ను అభినందించడం నిజంగా గర్వంగా ఉందన్నారు. నిజమైన నాయకుడు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారని అన్నారు. రూ.404 కోట్లతో అంబేడ్కర్ విగ్రహం, కన్వెన్షన్ సెంటర్, నిర్మించామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సామాజికంగా మన రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకంటే చాలా వెనుకబడి ఉన్నట్టుగా సీఎం జగన్ గుర్తించారని, ఆ పరిస్థితిని మార్చి పేదలకు అండగా నిలవాలని నవరత్నాలను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు. బాబు మోసాల రాజకీయంపై పుస్తకమే రాయొచ్చు: బియ్యపు మధుసూదన్ రెడ్డి దేవుడి లాంటి అంబేడ్కర్ గురించి మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు తట్టుకోలేక పోతున్నారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు విజయవాడలో పైన అమ్మవారు.. కింద అంబేడ్కర్ కన్పిస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో సీఎం జగన్ చేసి చూపించారని, రెండోసారి కూడా ఆయనే సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల దీవెనలతో మళ్లీ జగన్ సీఎంగా వస్తున్నారని చెప్పారు. మోసాలతో రాజకీయాలు ఎలా చేయొచ్చో చంద్రబాబుపై ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చని చెప్పారు. చంద్రబాబులా రాజకీయాలు చేయకూడదని పాఠ్యాంశంలో చేర్చవచ్చన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేరన్నారు. సైకిల్ పోవాలి.. జగన్ మళ్లీ రావాలని అన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకున్నారా!?
సాక్షి, అమరావతి : దేశంలో ఎక్కడాలేని విధంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు నైపుణ్య శిక్షణలో కొత్తగా క్యాస్కేడింగ్ స్కిల్ ఎకో సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తే ఈనాడు రామోజీరావు కళ్లకు గంతలు కట్టుకుని నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ సలహాదారు చల్లా మధుసూదన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లల్లో అకడమిక్, నాన్ అకడమిక్ విభాగాల్లో 12,59,451 మందికి శిక్షణనిస్తే రాష్ట్రంలో ‘నైపుణ్యం ఏది.. ఎక్కడా?’.. అంటూ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించడంపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ‘సాక్షి’తో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకురావడమే కాక దానికి అనుగుణంగా స్కిల్ ఎకో సిస్టమ్ను అమలుచేస్తుంటే యువతను భయాందోళనకు గురిచేసే లక్ష్యంతో ఈనాడు విషాన్ని కక్కుతోందంటూ విమర్శించారు. పైగా.. మైక్రోసాఫ్ట్ సంస్థ లక్షా 60వేల మందికి శిక్షణనివ్వడమే కాక వారందరికీ సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేసిన విషయం తెలీదా అని ఆయన ప్రశ్నించారు. 192 స్కిల్ హబ్స్ ఉన్న విషయం తెలీదా? ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం ఉండే విధంగా 192 స్కిల్ హబ్స్ను ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఏర్పాటుచేసిన సంగతి వాస్తవం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే, ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 26 స్కిల్ కాలేజీలు ఏర్పాటుచేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే ఈనాడు రామోజీరావు పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను ప్రజలపైకి వదులుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజీలు ద్వారా 22 రంగాలకు చెందిన 100కి పైగా జాబ్రోల్స్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయిలో మొత్తం నైపుణ్య శిక్షణ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తున్నామని ఇందుకోసం తిరుపతిలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాక పనులు కూడా కొనసాగుతున్నాయని మధుసూదన్రెడ్డి వెల్లడించారు. వీటికి అదనంగా పులివెందులలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, పరిశ్రమల ప్రాంగణంలో స్కిల్ స్పోక్ను ఏర్పాటుచేశామన్నారు. జాబ్మేళాలూ కనిపించడంలేదా? ఇవికాక.. విద్యార్థులకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెలా 52 జాబ్ మేళాలు నిర్వహిస్తున్న విషయం కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పలు సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు వీలుగా 50కుపైగా బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మధుసూదన్రెడ్డి తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే తమ నాయకుడు స్కిల్ స్కాంలో ఇరుక్కోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే లక్ష్యంతో ఈనాడు వికృత రాతలు రాస్తోందన్నారు. -
ప్రజల సంతోషాన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు
► జనసేన నాయకుడు చిలకం మధుసూదన్రెడ్డి సమీప బంధువైన రాజారెడ్డికి, ఈడిగ వినయ్తేజ్ గౌడ్ అనే వ్యక్తికి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలోనే రాజారెడ్డి గాయపడ్డారు. గొడవ విషయం తెలిసిన 2 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్న రూరల్ ఎస్ఐ ప్రదీప్కుమార్ క్షతగాత్రుడిని స్వయంగా పోలీసు వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స చేయించారు. తన ప్రాణాలు కాపాడారని బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జరిగింది ఇదయితే.. చిలకం మధుసూదన్ రెడ్డి మాత్రం కొత్త పల్లవి అందుకున్నాడు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై బురద జల్లేందుకు యత్నించాడు. ధర్మవరం: పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వ లేక నానా యాగీ చేస్తున్నారు. ప్రజల్లో ఉనికి చాటుకునేందుకు వ్యక్తిగత దూషణలకూ పాల్పడుతున్నారు. ‘చిలక’ పలుకులు.. జనం నవ్వులు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ సీటు ఆశిస్తున్న చిలకం మధుసూదన్ రెడ్డి ఎలాగైనా ప్రజలను ఆకర్షించాలని రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో అశాంతి నెలకొల్పేందుకు నానా యాగీ చేస్తున్నారు. ఎక్కడ చిన్న గొడవ జరిగినా ఎమ్మెల్యేకు ఆపాదించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల తన బంధువైన ఓ వ్యక్తి వ్యక్తిగత కారణాలతో మరో వ్యక్తితో గొడవ పడితే దాన్నీ ఎమ్మెల్యేపై రుద్దేందుకు యత్నించాడు. అయితే, వాస్తవాలు బయటకు రావడంతో జనం ఎదుట నవ్వులపాలయ్యాడు. ఇలాగే, కొన్ని రోజుల క్రితం ధర్మవరం పట్టణంలో ఓ పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటైతే.. చిరు వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటాయంటూ రభస చేసే ప్రయత్నం చేశాడు. అయితే, కుట్ర విషయం గ్రహించి వ్యాపారులు సహకరించకపోవడంతో ఆ ప్లాన్ కూడా బెడిసికొట్టింది. అభివృద్ధితోనే సమాధానం.. ప్రతిపక్షాల కుట్రలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతున్నారు. నిత్యం ‘గుడ్మార్నింగ్’ పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలోనే రూ. 2,283 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయించి రికార్డు సృష్టించారు. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా నిధులతో ఆర్ఓబీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, నాడు–నేడు, డబుల్లైన్ రహదారులు, నేషనల్ హైవే, రిజర్వాయర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు ప్రతిపక్షాలు ఎంతలా రెచ్చగొడుతున్నా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత టీడీపీ హయాంతో పోలిస్తే నియోజకవర్గంలో నేడు గణనీయంగా తగ్గిన నేర గణాంకాలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు ధర్మవరం డివిజన్లో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇటీవల పట్టణంలో రాజారెడ్డిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు సత్వరం స్పందించి ప్రాణాలు కాపాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు వినయ్తేజ్గౌడ్, విష్ణు, హరినాథ్తో సహా 10 మందిపై కేసు నమోదు చేశాం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీల నాయకులు పోలీసులు పట్టించుకోలేదని రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు. – టి. శ్రీనివాసులు, డీఎస్పీ, ధర్మవరం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement