-
పొట్టకూటి కోసం రోడ్ల మీద టికెట్లు అమ్ముతున్న నటి
కరోనా వల్ల ఎంతోమంది నటీనటులు ఇబ్బందిపడ్డారు. కొందరు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో మలయాళ నటి మేరీ ఒకరు. 2016లో వచ్చిన యాక్షన్ హీరో బిజు మూవీతో గుర్తింపు పొందింది మేరీ. సినిమాల్లోనే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. కానీ కోవిడ్ సమయంలో ఆమె జీవితం అతలాకుతలమైంది. సినిమా ఛాన్సులు లేక జీవనోపాధి భారమైంది. పూట గడవటం కూడా కష్టంగా మారడంతో గత్యంతరం లేక రోడ్ల మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది. ఉదయం ఆరున్నర గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి ఏ సాయంత్రానికో ఇల్లు చేరుకుంటోంది. లాటరీ టికెట్ల అమ్మకం ద్వారా రోజుకి రూ300 సంపాదిస్తోంది. కాగా మేరీ సుమారు 35 సినిమాల్లో నటించింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి చేసింది. పనిలో పనిగా ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంది. లోను తీసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించింది. కానీ ఇంతలో కరోనా వైరస్ విజృంభించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ వైపరీత్యం తర్వాత ఆమెకు ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. అసలే మేరీ తనయుడి ఆరోగ్యం అంతంత మాత్రమే! అతడి వైద్య ఖర్చులు భరించాలన్నా, కుటుంబానికి తిండి పెట్టాలన్నా, తీసుకున్న అప్పు తీర్చాలన్నా ఏదో ఒక పని చేయక తప్పదనుకుంది. అందుకోసం లాటరీ టికెట్లు అమ్ముతూ వచ్చిన కొద్దిపాటితో పూట గడుపుతోంది. చదవండి: నా పెళ్లిలో పెద్ద గొడవ, చెప్పులతో కొట్టుకున్నారు: కత్రినా బుల్లితెర నటి ప్రెగ్నెంటా? అదేంటి పెళ్లైంది, కానీ భర్త లేడుగా! -
133 కోట్ల డాలర్ల.. ‘మెగా’ జాక్పాట్!
షికాగో: అమెరికాలో ఇద్దరు అదృష్టవంతులు మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్పాట్ గెలుచుకున్నారు. జూలై చివర్లో ఓ పెట్రోల్బంక్లో కొన్న టికెట్ను ఈ అదృష్టం వరించిందని లాటరీ సంస్థ పేర్కొంది. ఏకమొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్పాట్. గత ఏప్రిల్ నుంచి వరుసగా 29 డ్రాల్లో ఒక్కరు కూడా గెలుచుకోకపోవడంతో అది ఇంత భారీగా పెరిగిందట. ఇదీ చదవండి: రూ.2.3 లక్షల టిప్ ఇచ్చాడు.. తీసుకున్నాక సీన్ రివర్స్.. ఆమె ఆనందం ఆవిరి.. -
లాటరీ టికెట్ల దందా : టీడీపీ నాయకుడు అరెస్ట్
చిత్తూరు, పుంగనూరు: పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చంద్రశేఖర్ చట్టవిరుద్ధంగా లాటరీ టికెట్ల వ్యాపారంలో అరెస్ట్ అయ్యాడు. గురువారం సీఐ గంగిరెడ్డి విలేకరులకు తెలిపిన మేరకు.. పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్ భర్త చంద్రశేఖర్ తన అనుచరులైన రియాజ్బాషా, రషీద్బాషాతో కలసి లాటరీ టికెట్లు విక్రయిస్తుండగా ఈనెల 2వ తేదీన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు చేసి ఉదయం 9 గంటలకు బస్టాండులో ఉండగా చంద్రశేఖర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 12 లాటరీ టికెట్లను, రూ.4,790 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు తరలించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వందల కోట్ల లాటరీ..
ఏదైనా వస్తువు కనబడకుండా పోయి.. తిరిగి దొరికితే మనంత అదృష్టవంతులు లేరనుకుంటాం. అదే వందల కోట్ల లాటరీ తగిలి.. ఆ టికెట్ పోయి.. తర్వాత దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కదా.. అలాంటి అద్భుతమే జరిగింది స్కాట్లాండ్లో. అబెర్డీన్ షైర్కు చెందిన దంపతులైన 57 ఏళ్ల ఫ్రెడ్, 67 ఏళ్ల లెస్లీ హిగిన్స్లు ‘లైఫ్ చేంజింగ్’ లాటరీ టికెట్ను కొనుక్కున్నారు. డ్రాలో తమ నంబర్ వచ్చిందో లేదోనని కనుక్కునేందుకు స్థానికంగా ఉండే లాటరీ కార్యాలయా నికి వెళ్లారు. అయితే లాటరీ వారికి రాలేదని ఆ టికెట్ను అక్కడి సిబ్బందిలో ఒకరు చించి చెత్త బుట్టలో వేశాడు. సిబ్బంది సరిగా చూడకుండానే ఆ లాటరీ టికెట్ చించిపడేశారనీ ఆరోపిస్తూ సహాయ కేంద్రంలో విచారణ కోరారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అతడి నంబర్ను ఎలాగోలా కనుక్కొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే తీసిన డ్రాలో హిగిన్స్ నంబర్ ఉందని తేలింది. దీంతో చెత్తబుట్టను మొత్తం వెతికించి అతడి టికెట్ను తిరిగిచ్చేశారు. ఇంతకీ ఆ టికెట్కు తగిలిన లాటరీ మొత్తం ఎంతో తెలుసా..! అక్షరాలా రూ.461 కోట్లు. జీవితంలో చూడనంత మొత్తాన్ని గెలుచుకోవడంతో ఆ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. -
రూ కోటి చేతికి అందినట్టే అంది..
సాక్షి, ముంబై : కష్టాన్ని నమ్ముకుని బతికే సుహాస్ కదమ్ లాటరీలో రూ కోటికి పైగా గెలుచుకున్నాడని తెలియగానే ఇక తన కష్టాలు తీరాయనుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన 44 ఏళ్ల సుహాస్ కదమ్ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన బతుకు మారుతుందనే ఆశతో గత ఐదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఉన్నట్టుండి లాటరీలో రూ కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందడంతో కదమ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. నలసపరకు చెదిన కదం తాను లాటరీలో గెలుచుకున్న బహుమతి మొత్తం వసూలు చేసుకునేందుకు లాటరీ విభాగానికి వెళ్లగా ఒకే ప్రైజ్ను ముగ్గురు వ్యక్తులు తామే గెలుచుకున్నామని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. సరైన టికెట్తో వచ్చిన వ్యక్తికి లాటరీ బహుమతిని అప్పగించామని వారు కదమ్తో చెప్పారు. తాను కొన్న టికెట్ నకిలీదని లాటరీ డిపార్ట్మెంట్ తేల్చిచెప్పడంతో నిరుత్సాహానికి లోనైన కదమ్ నగరంలోని మహాత్మా ఫూలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తింపు కలిగిన కేంద్రాల్లోనే నకిలీ టికెట్లు ఎలా అమ్ముతున్నారో బట్టబయలు చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. తన బంధువులు సైతం లాటరీలో తాను గెలుపొందినందుకు అభినందనలు తెలిపిన క్రమంలో జరిగిన పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నకిలీ లాటరీ టికెట్ల ముద్రణ, పంపిణీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement