breaking news
lorrys seazed
-
నాలుగు సిలికా లారీలు పట్టివేత
చిల్లకూరు : నిబంధనలకు విరుద్ధంగా సిలికాను తరలిస్తున్న నాలుగులారీలను శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు.. తీరప్రాంత గ్రామాల్లోని గనుల నుంచి అధికలోడుతో పాటు సరైన ధ్రువీకరణపత్రాలు సిలికాను తర లిస్తున్న నాలుగు లారీలను విజిలెన్స్ డీఎస్పీ వెంకట్నాథ్రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఏజీ రాములు పట్టుకున్నారు. వాటిలో ఒక లారీని రవాణాశాఖాధికారులకు అప్పగించారు. మరోలారీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేదిగా తెలిసింది. లారీని పట్టుకున్నట్లు తన సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు దానికి ఎలాంటి జరిమానా విధించలేదని సమాచారం. మరో రెండు లారీలను మాత్రం చిల్లకూరు పోలీసులకు అప్పగించి గనులశాఖకు సిపార్సు చేశారు. ఎమ్మెల్యే లారీ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులను వివరణ కోరేందకు ప్రయత్నించగా వారు అందుబాటుకి రాలేదు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
జిల్లాలోని దాచేపల్లిలో రెండు లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పిడుగురాళ్లకు చెందిన షేక్ సుభానీ, బండ్ల బిక్షమయ్య, షేక్ సదీప్ అనే వ్యక్తులు రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ సిబ్బంది ఆదివారం మాటువేసి దాడి చేశారు. దాచేపల్లి మండల కేంద్రంలో బియ్యం లోడ్తో వెళుతున్న ఓ లారీని పట్టుకుని సీజ్ చేశారు. మండలంలోని పొందుగుల వద్ద మరో లారీని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు.