-
ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని దేశీయంగా పెంచేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలను (పీఎల్ఐ) ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు ఎల్రక్టానిక్ విడిభాగాల స్థానిక తయారీని సైతం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ ఎస్.కృష్ణన్ వెల్లడించారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో 99% స్థానికంగానే తయారవుతున్నట్టు చెప్పారు. ‘‘అసెంబ్లీ యూనిట్లకు అదనంగా 10–15 శాతం విలువ జోడింపుపైనే ఆధారపడకూడదు. మనం ఇంకా ఏమి చేయగలమో, విలువ ఆధారిత సరఫరాలో మరింత ముందుకు ఎలా వెళ్లగలమో ఆలోచించాలి’’అని సూచించారు. ఏ దేశం కూడా మొత్తం వ్యాల్యూచైన్లో ఆధిపత్యం చూపించలేదన్నారు. చైనా విషయానికొస్తే వ్యాల్యూచైన్లో 40–45% వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు. భారత్ 35–40% సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఎల్రక్టానిక్ ఉత్పత్తుల విడిభాగాలకు సంబంధించి రెండో విడత పీఎల్ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. -
విజేత శశికిరణ్
చెన్నై: ఫాగర్నెస్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. నార్వేలో ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ఆర్యన్ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్ స్కోరుతో శశికిరణ్కు టైటిల్ దక్కింది. ఆర్యన్ చోప్రాకు రెండో ర్యాంక్ లభించింది. తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో 5వ ర్యాంక్లో నిలిచాడు. -
వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత
చెన్నై : కర్ణాటక సంగీత ప్రపంచంలో వయోలిన్ త్రిమూర్తుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు టీఎన్ కృష్ణన్. వయోలిన్ త్రిమూర్తుల్లో మిగిలిన ఇద్దరూ లాల్గుడి జీ జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్. వారిద్దరూ ఏడేళ్ల కిందటే కొద్ది నెలల వ్యవధిలో గతించారు. వారిలో ఒకరైన టీఎన్ కృష్ణన్ సోమవారం రాత్రి చెన్నైలో కన్ను మూశారు. కేరళలోని తిరుపణిత్తూర్లో నారాయణ అయ్యర్, అమ్మణి అమ్మాళ్ దంపతులకు 1928 అక్టోబర్ 6న జన్మించిన తిరుపణిత్తూర్ నారాయణ అయ్యర్ కృష్ణన్ బాల విద్వాంసుడిగా పదకొండేళ్ల పసితనం నుంచే కచేరీలు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి వద్ద సరిగమలు నేర్చుకుని, సాధన ప్రారంభించారు. తండ్రి నారాయణన్ అయ్యర్ కొచ్చిన్ సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. ఆయన గాత్ర విద్వాంసుడే కాకుండా, బహువాద్య నిపుణుడు. తన తండ్రి తొంభై తొమ్మిదో ఏట కన్నుమూసేంత వరకు తనకు సంగీత పాఠాలు చెబుతూనే వచ్చారని కృష్ణన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. చదవండి: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్ బాల్యంలోనే ఆయన ఆనాటి సంగీత దిగ్గజాలు అరైకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ఎం.డి.రామనాథన్, అళత్తూర్ సోదరులు వంటి వారి గాత్ర కచేరీల్లో వారి పక్కన వయొలిన్ వాయించేవారు. సంగీతంలో మరింతగా రాణించాలనే ఉద్దేశంతో 1942లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత విద్వాంసుడు శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ను కలుసుకుంటే, ఆయన కృష్ణన్ బాధ్యతను పారిశ్రామికవేత్త అయ్యదురైకి అప్పగించారు. అయ్యదురై దంపతులు కృష్ణన్ను తమ ఇంట్లోనే ఉంచుకుని, సొంత బిడ్డలా చూసుకున్నారు. అరైకుడి రామానుజ అయ్యంగార్, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ల శిక్షణలో టి.ఎన్.కృష్ణన్ తన సంగీత ప్రజ్ఞకు మరింతగా మెరుగులు దిద్దుకున్నారు. చదవండి: కరోనా: తమిళనాడు మంత్రి కన్నుమూత సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండానే, ఆధునిక పోకడలను అందిపుచ్చుకున్న టి.ఎన్.కృష్ణన్ సంగీత ఆచార్యుడిగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. మద్రాసు సంగీత కళాశాలలో ప్రొఫెసర్గా, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ డీన్గా సేవలందించారు. కేవలం లిపిబద్ధంగా మాత్రమే అందుబాటులో ఉన్న పూర్వ విద్వాంసుల స్వరకల్పనలను యథాతథంగా శ్రోతలకు వినిపించే అరుదైన విద్వాంసుల్లో ఒకరిగా టి.ఎన్.కృష్ణన్ తన సమకాలికుల మన్ననలు చూరగొన్నారు. జాంగ్రీ, బాదం హల్వాలను అమితంగా ఇష్టపడే కృష్ణన్, తన స్వరాలకు బహుశ వాటి మాధుర్యాన్ని అద్దారేమోననిపిస్తుంది ఆయన కచేరీలు వినేవాళ్లకు. దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన కచేరీలు చేశారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, జాకిర్ హుస్సేన్ వంటి హిందుస్తానీ విద్వాంసులతో కలసి చేసిన జుగల్బందీ కచేరీలు ఆయనను ఉత్తరాది శ్రోతలకూ దగ్గర చేశాయి. టి.ఎన్.కృష్ణన్ సోదరి ఎన్.రాజం కూడా వయోలిన్ విద్వాంసురాలే. అయితే, ఆమె హిందుస్తానీ విద్వాంసురాలు. ఆమెతో కలసి కూడా జుగల్బందీలు చేశారు. ఆయన కుమార్తె విజి కృష్ణన్ నటరాజన్, కుమారుడు శ్రీరామ్ కృష్ణన్ సహా ఎందరో శిష్యులు కర్ణాటక సంగీత విద్వాంసులుగా రాణిస్తున్నారు. టి.ఎన్.కృష్ణన్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో ఆయనను ‘పద్మశ్రీ’తో, 1992లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డు (1974), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2006) పొందారు. చెన్నైలోని ది ఇండియన్ ఫైనార్ట్స్ సొసైటీ 1999లో ఆయనను ‘సంగీత కళాశిఖామణి’ బిరుదుతో సత్కరించింది. ఇవే కాకుండా, తన ఎనభయ్యేళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆయన ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు టి.ఎన్.కృష్ణన్ సంగీత రంగానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
బలహీనవర్గాల సంక్షేమమే ఊపిరిగా జీవించారు
సాక్షి, న్యూఢిల్లీ: తుదిశ్వాస వరకు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి దివంగత కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పీఎస్ కృష్ణన్ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. కేరళకు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పీఎస్ కృష్ణన్ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన సంస్మరణ సభ శనివారం ఢిల్లీలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా కృష్ణన్ సమర్థవంతంగా పూర్తి చేశారన్నారు. ‘వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల ఉన్నతి కోసం కృష్ణన్ నిరంతరం కృషి చేశారు. రాజ్యాంగ పరంగా సంక్రమించే హక్కులు, ప్రజాకేంద్రిత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రజా సంక్షేమం జరిగేలా చొరవ తీసుకున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత ద్వారానే సమాజం ముందడుగు వేస్తుందని ఆయన బలంగా విశ్వసించేవారు. పీఎస్ కృష్ణన్ ఒక అసాధారణ వ్యక్తి, మేధావి. తను నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీపడే వారు కాదు’అని ఉపరాష్ట్రపతి అన్నారు. కార్యక్రమంలో పీఎస్ కృష్ణన్ సతీమణి శాంత, కుమార్తె శుభా, అల్లుడు చంద్రశేఖర్ సహా సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయపోరాట యోధుడు
భారతదేశంలో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన అరుదైన వ్యక్తి పి.ఎస్. కృష్ణన్. ఐఏఎస్ అధికారి అయిన క్షణం నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దళిత వాడల్లోనే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. ఎస్సీలకు స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, అత్యాచారాల నిరోధక చట్టం, మండల్ కమిషన్ సిఫారసుల అమలు వంటి అనేక పథకాల అమలుకు అహరహం కృషి చేసిన పి.ఎస్. కృష్ణన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం జీవితాన్ని వెచ్చిం చిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు. అంబేడ్కర్ మరణించినరోజే ఏపీలో ఐఏఎస్గా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ ఆయన భారాన్ని తన భుజాలపై మోశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే దానిని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళైతే, రాజ్యాంగం నిష్ప్రయోజనకరంగా మారుతుంది. అలాగే రాజ్యాంగం ప్రగతినిరోధకమైనప్పుడు కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు ప్రగతిశీలురవుతే రాజ్యాంగం గొప్పగా మారుతుంది. ఎప్పటికప్పుడు రాజ్యాంగమనే అతిపెద్ద కొలమానంలో ప్రతిపనిని తరచి చూసుకున్న పాలకులు ప్రజల హృదయాల్లోనే కాదు, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాధినేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మలుచుకుంటున్నారంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1949 నవంబర్, 25వ తేదీన రాజ్యాంగ సభ చివరి రోజుకు ఒక రోజు ముందు వ్యాఖ్యానించారు. ఏడు దశాబ్దాల క్రితం అంబేడ్కర్ నోట వెలువడిన వాక్కులు ఈ రోజు అక్షరసత్యాలుగా మనముందు ఆవిష్కృతమౌతున్నాయి. రాజ్యాంగాన్ని సైతం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్న పార్టీలూ, రాజకీయ నాయకులూ నేడు కోకొల్లలు. నిజం చెప్పాలంటే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన చేయడానికి సైతం వెనుకాడడం లేదు. అన్ని ప్రభుత్వాలలో ఈ తరహా ధోరణి కొనసాగుతూనే వచ్చింది. అయితే కొంతమంది ప్రభుత్వాధికారులు తమకున్న మానవీయ దృక్పథంతో రాజ్యాం గాన్ని ఒక ఆయుధంగా వాడుకొని దేశ సామాజిక సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు. అలాంటి వారిలో ఇటీవల మన నుంచి భౌతి కంగా దూరమైన పి.ఎస్. కృష్ణన్ ఒకరు. భారత్లో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన పీఎస్ కృష్ణన్ నవంబర్ పదవ తేదీన మరణించినప్పటికీ, ఆయన చేసిన కృషి తనను సామాజిక న్యాయపోరాటాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. భారత రాజ్యాంగం వెలుగులో ఆయన ప్రారంభించిన ఎన్నో కార్యక్రమాలు, రూపొందించిన ఎన్నో చట్టాలు భారత సమాజాన్ని సమానత్వం వైపు, సామాజిక న్యాయంవైపు నడిపిస్తాయనడానికి సందేహం అక్కర్లేదు. కేరళలోని తిరువనంతపురంలో 1932, డిసెంబర్ 30 వ తేదీన పి.ఎల్.సుబ్రహ్మణ్యన్, అన్నపూర్ణమ్మలకు పి.ఎస్.కృష్ణన్ జన్మించారు. తిరువనంతపురంలో హైస్కూల్ వరకు చదువుసాగించిన కృష్ణన్ ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో డిగ్రీ పొందారు. మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో ఇంగ్లిష్లో మాస్టర్ డిగ్రీ చేసి, కాంచీ పురం సచియప్ప కళాశాలలో ఇంగ్లిష్ అ«ధ్యాపకునిగా పనిచేశారు. ఆయన హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే కేరళలో సామాజిక ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. నారాయణ గురు, అయ్యంకాళిల ప్రభావం పి.ఎస్.కృష్ణన్పైన పనిచేసింది. అదే సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగిస్తున్న పోరాటాలను కూడా ఆయన పత్రికల్లో చదివి ఆకర్షితులయ్యారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ, సామాజిక ప్రభావం, తండ్రి చెప్పిన సత్యాలు ఆయనను చిన్నతనంలోనే సామాజిక వివక్షను, అంటరానితనాన్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ విషయాలతో పాటు తాను ప్రత్యక్షంగా చూసిన అసమానతలూ, వివక్ష ఆయన హృదయాన్ని ఎంతగానో రగిల్చాయి. పి.ఎస్.కృష్ణన్ ఐఏఎస్ అధికారి అయిన మరునాటి నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1956 మే 2న ఐఏఎస్ శిక్షణ ప్రారంభమైన రెండు నెలల్లోనే ఢిల్లీ సమీపాన ఉన్న అలీపూర్ పంచాయతీ పరిధిలోని బడ్లీ గ్రామానికి అధ్యయనం కోసం వెళ్ళారు. అధ్యయనంకోసం వెళ్ళిన మిగిలిన బృందంతో విడిపోయి ఎస్సీలు నివసించే బస్తీవైపుకి తనకి తెలియకుండానే అడుగులు వేసేవారు. అదే సందర్భంలో ఈశ్వర్ దాస్ అనే దళితుడు శరీరం నిండా పొక్కులు ఉన్న శిశువును ఎత్తుకొని ఉండడం చూసి కృష్ణన్ చలించిపోయాడు. మరుసటిరోజు ఐఏఎస్ ట్రైనింగ్ స్కూల్డాక్టర్ను తీసుకెళ్ళి, ఆ శిశువుకు చికిత్స చేయించారు. ఇది ఆయన ఆలోచనను మరింత పదునెక్కించింది. ఢిల్లీ పరిసరాల్లోనే ఇలా ఉంటే, మారుమూల పల్లెల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆరోజే ఆలోచించారు పి.ఎస్. కృష్ణన్ శిక్షణను ముగించుకున్న కృష్ణన్ 1956లోనే ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. 1956వ సంవత్సరం భారతదేశం ఒక గొప్ప మేరు పర్వతాన్ని కోల్పోయింది. 1956 డిసెంబర్ 6వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ మహాపరినిర్వాణం పొందారు. అదే సంవత్సరం పీఎస్ కృష్ణన్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టడం కాకతాళీయమే కావచ్చు, కానీ ఆ తరువాత ఆ హోదాలో పి.ఎస్. కృష్ణన్ సాధించిన విజయాలను చూస్తే, అంబేడ్కర్ తన బాధ్యతలను పి.ఎస్. కృష్ణన్ భుజస్కంధాలపై ఉంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రోజు బలహీన వర్గాల కోసం, ప్రత్యేకించి ఎస్సీల కోసం ఆయన రూపొందించిన పథకాలు, రూపొందించిన చట్టాలను పరిశీలిస్తే మనం ఎవ్వరం కాదనలేం. ఆయన ప్రారంభించిన పథకాలన్నీ, కూడా అనుభవం నుంచి రూపొందినవే. ఊరు బయట ఉన్న దళిత వాడల గాలికూడా తమ మేనుకి సోకనివ్వని అధికారులు అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ రోజు అది ఊహించడానికి కూడా వీలు లేనిది. కానీ పి.ఎస్. కృష్ణన్ ఒక గ్రామం వెళితే ముందుగా అంటరాని కులాలు నివసించే చోటకు వెళ్ళేవారు. వాళ్ళు ఏం తింటే అదే తినడం ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారు. అక్కడే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. అప్పటివరకు భారత ప్రభుత్వంలో మూడే మూడు పథకాలు ఉండేవి. ఆ పథకాలు కూడా 1949కి ముందు బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టారు. అవి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, విదేశీ చదువుకు ఉపకారవేతనాలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు. అవి మినహా ప్రభుత్వాలు ఎటువంటి నూతన పథకాలనూ అమలు చేయడం ప్రారంభించలేదు. ఆ విషయాలను గమనించిన పి.ఎస్. కృష్ణన్ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తించారు. ‘‘అణగారిన వర్గాలు ప్రత్యేకించి, షెడ్యూల్డ్ కులాలు, తెగలను విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని, అన్ని రకాల సామాజిక వివక్షల నుంచి, దోపిడీ, పీడనల నుంచి విముక్తి కలిగించాలి’’ అని ఆదేశిక సూత్రం పిఎస్. కృష్ణన్ చేతిలో ఒక బలమైన ఆయుధంగా మారింది. ఒకవైపు దళితుల దయనీయ స్థితి, రెండోవైపు రాజ్యాంగం అండదండలు పి.ఎస్. కృష్ణన్ను ప్రభుత్వాధినేతలపై పోరాడే స్థైర్యాన్నిచ్చాయి. అందుకే వారి సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు రూపొం దిస్తున్న బడ్జెట్లలో ఈ వర్గాలకు తగిన వాటా లభించాలని వాదిం చారు. వారి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు లేకపోతే, సామాజిక వివక్ష నుంచి వాళ్ళు విముక్తి కాలేరని భావిం చారు. అందుకోసమే మొదటగా ఎస్సీలకోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ను రూపొందించి కేంద్ర ప్రభుత్వం చేత ఒప్పించారు. 1978 లోనే దీనికి అంకురార్పణ జరిగింది. 1980లో ఇందిరాగాంధీ పాలనలో దీనికి బలమైన పునాదులు పడ్డాయి. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమాంతరంగా అమలు జరగాలని, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న పథకాలలో ఏవైనా బడ్జెట్ లోటు ఏర్పడితే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్(ఎస్సిఏ)ను అందించాలని సూచించారు. అదే విధంగా అత్యాచారాల నిరోధక చట్టం. మండల్ కమిషన్ సిఫారసుల అమలు, బౌద్ధం తీసుకున్న ఎస్సీలకూ, ఎస్టీలకూ అందేవిధంగా జీవోలు అన్నీ ఈయన చేతి నుంచి వచ్చిన సంక్షేమ ఫలాలేనన్న విషయం చాలామందికి తెలియదు. ఎస్సీ, ఎస్టీలలో అభివృద్ధి చెందిన కొన్ని కులాలు మిగతా వారిని తమతో పాటు తీసుకెళ్ళాలనీ, వారికి నాయకత్వం వహించాలని సూచించారు. రిటైరై ఇప్పటికి ఇరవైఏళ్ళు గడిచిపోయింది. కానీ ఆయన తన సంక్షేమ సాధన, సామాజిక న్యాయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదు. తనకున్న గౌరవాన్ని తనకోసం కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం వెచ్చించిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు ఆయన. బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టు ఇటువంటి వ్యక్తుల చేతుల్లోనే రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరుగుతుంది. ఈ కాలం అధికారులు పీఎస్. కృష్ణన్, ఎస్.ఆర్. శంకరన్ల నుంచి అందిపుచ్చుకోవాల్సింది సరిగ్గా ఇదే మరి. అదేమిటంటే అంకితభావం, నిరంతర దీక్ష అణగారిన వర్గాల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో పనిచేయడం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement