breaking news
Kerala State
-
నిన్న మొన్నటి గృహిణి.. నేటి ఉత్తమ నటి
వివాహమయ్యాక స్త్రీలు తమ ఆకాంక్షలు విడిచి పెట్టాలనే ధోరణి సమాజంలో ఉన్నా కొందరు తమ కలలను అన్వేషిస్తుంటారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఉండి, నిన్న మొన్నటి వరకూ సాధారణ గృహిణిగా ఉన్న షామ్లా హంజా తన రెండవ సినిమా ‘ఫెమినిచి ఫాతిమా’తో కేరళ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా ఎంపికైన మమ్ముట్టితో సమానంగా షామ్లా ప్రతిభ చూపిందంటే కళారంగాల్లో రాణించాలనుకునే స్త్రీలకు అది కచ్చితంగా స్ఫూర్తే...కేరళలో ‘ఫెమినిస్ట్’ అనే మాటను కొందరు వ్యంగ్యంగా ‘ఫెమినిచి’ అంటుంటారు. స్త్రీలెవరైనా గొంతెత్తినా, ప్రశ్నించినా, హక్కుల కోసం మాట్లాడినా వారిని ‘ఫెమినిచి’ అని ఎత్తి పొడవడం అక్కడ కొందరి అలవాటు. అదే మాటను టైటిల్లో తీసుకుని ప్రతి గృహిణిలో అంతర్గతంగా ఫెమినిస్ట్ ఉంటుందని స్టేట్మెంట్ ఇస్తూ దర్శకుడు ఫాజిల్ ముహమ్మద్ తీసిన సినిమా ‘ఫెమినిచి ఫాతిమా’.ఇది నేరుగా థియేటర్లలో రిలీజ్ కాకపోయినా, ఓటీటీలలో రాకపోయినా ఇప్పటికి అనేక ఫెస్టివల్స్లో బహుమతులు సాధించి, అనేక అవార్డులు గెలుచుకుంది. తాజాగా ఇటీవల ప్రకటించిన కేరళ ప్రభుత్వ పురస్కారాలలో ‘ఉత్తమ నటి’ అవార్డును సాధించింది. సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన షామ్లా హంజా ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇది ఆమెకు కేవలం రెండో సినిమా. ఇంతకు ముందు 2022లో వచ్చిన ‘1001 నూనకల్’ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది. గృహిణిగా ఉంటూ ఇటీవల సినిమాలలోకి వచ్చిన షామ్లా ఏకంగా మమ్ముట్టితో సమాంతరంగా ఉత్తమనటి అవార్డు సాధించడం సామాన్యం కాదు.ఫెమినిచి ఫాతిమా కథేంటి?మలప్పురం జిల్లాలోని పొన్నాని అనే చిన్న ఊళ్లో ఉండే ముస్లిం కమ్యూనిటీలో జరిగే కథ ఇది. ఫాతిమా అనే గృహిణి ఇంట్లో సగటు పురుషాహంకార భర్త అజమాయిషీలో కాపురం చేస్తుంటుంది. అతగాడు ఫ్యాను వేసుకోవాలన్నా, చెప్పులు తొడుక్కోవాలనుకున్నా భార్యను పిలుస్తుంటాడు. పైగా ఇంటిని స్వర్గంగా ఉంచానని భావిస్తుంటాడు.ఇంటి చాకిరి చేసి నడుము నొప్పి తెచ్చుకున్న ఫాతిమా ఒక మంచి పరుపును కలిగి ఉండాలని భావించడంతో కథలో ముఖ్యభాగం మొదలవుతుంది. ఆమె కోరుకున్న చిన్న కోరిక ఎన్ని అభి్రపాయాలకు తావిస్తుందో, భర్త... ఇతరులు ఎన్ని వ్యాఖ్యానాలు చేస్తారో వీటన్నింటికీ ఫాతిమా ఎలా బదులు చెప్తుందో ఈ సినిమాలో ఉంటుంది. హాస్యం, వ్యంగ్యం మిళితం చేసి ఉపన్యాసాలు లేకుండా స్త్రీల దృష్టికోణంలో ఈ కథ చెప్పడంతో అన్ని విధాలా ప్రశంసలు, అవార్డులు దక్కుతున్నాయి. ఫాతిమా పాత్ర పోషించిన షామ్లాకు ప్రశంసలు దక్కుతున్నాయి.ఇద్దరు పిల్లలు పుట్టాకపాలక్కాడ్లో పుట్టి పెరిగిన షామ్లా వివాహమయ్యాక 12 సంవత్సరాలు దుబాయ్లో ఉండి కేరళలోనే తన కెరీర్ను వెతుక్కోవడానికి భర్తతో తిరిగి వచ్చింది. కొన్నాళ్లు రేడియో జాకీగా పని చేసిన ఆమె 2022లో మొదటి అవకాశం పొందింది. ఆ విధంగా దృష్టిలో పడటంతో దర్శకుడు ఫాజిల్ ఆమెకు ‘ఫెమినిచి ఫాతిమా’లో లీడ్ రోల్ ఇచ్చాడు. ‘షూటింగ్ మొదలైనప్పుడు నా రెండో బిడ్డకు ఆరు నెలల వయసు.ఇంటిని, సినిమా కెరీర్ను సమన్వయం చేసుకోవడం అంత సులభం కాలేదు. కాని యూనిట్ సహకారం వల్ల నేను మనసు లగ్నం చేసి పని చేయగలిగాను’ అందామె. ‘నేను రేడియో జాకీగా ఉన్నప్పుడు కూడా స్త్రీల సవాళ్లను, వాటిని ఎదుర్కొనడానికి వారు ప్రదర్శించే సామర్థ్యాన్ని చర్చించేదాన్ని. అలాంటిది ఫాతిమా లాంటి పాత్ర వస్తే ఎలా కాదంటాను’ అందామె. అతి తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమాలో దర్శకుడు తనకు తెలిసినవారిని, ఊరి వారిని తారాగణంగా తీసుకున్నాడు. త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. -
ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్.. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. ఫుల్ లిస్ట్ ఇదే!
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన 55వ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ నిలిచింది. ఉత్తమ నటుడిగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నిలిచారు. భ్రమయుగం చిత్రానికి గానూ ఈ ఘనత దక్కించుకున్నారు. ఉత్తమ నటిగా శామ్లా హంజా అవార్డ్ను సొంతం చేసుకుంది. ఫెమినిచి ఫాతిమా మూవీకి గానూ ఈ అవార్డ్ వరించింది. 2024 ఏడాదికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. మంజుమ్మెల్ బాయ్స్ ఏకంగా 9 విభాగాల్లో సత్తా చాటింది.కేరళ ఫిల్మ్ అవార్డ్స్ వీళ్లే..ఉత్తమ చిత్రం - మంజుమ్మెల్ బాయ్స్ (దర్శకుడు - చిదంబరం)ఉత్తమ నటుడు - మమ్ముట్టి (భ్రమ యుగం)ఉత్తమ నటి – శామ్లా హంజా (చిత్రం - ఫెమినిచి ఫాతిమా)ఉత్తమ దర్శకుడు - చిదంబరం ( మంజుమ్మెల్ బాయ్స్)రెండో ఉత్తమ చిత్రం - ఫెమినిచి ఫాతిమా (దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్)ప్రత్యేక జ్యూరీ (చిత్రం) - ప్యారడైజ్ (దర్శకుడు: ప్రసన్న వితానగే)ప్రత్యేక జ్యూరీ(ఫీమేల్) - జ్యోతిర్మయి (బౌగెన్విల్లా), దర్శన రాజేంద్రన్ (స్వర్గం)ప్రత్యేక జ్యూరీ (మేల్) - టోవినో థామస్ (ఏఆర్ఎం), ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం)ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం - ప్రేమలు (దర్శకుడు: గిరీష్ ఎ.డి.)ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్(మేల్) – సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్), సిద్ధార్థ్ భరతన్ (భ్రమయుగం)ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)ఉత్తమ తొలి దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్ (ఫెమినిచి ఫాతిమా)ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) - చిదంబరం (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెండ్) - లాజో జోస్, అమల్ నీరద్ (బౌగిన్ విల్లా)ఉత్తమ ఎడిటర్ - సూరజ్ ఇ.ఎస్. (కిష్కింధ కాండం)ఉత్తమ సినిమాటోగ్రఫీ - షైజు ఖలీద్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉమెన్ స్పెషల్ కేటగిరీ అవార్డ్- పాయల్ కపాడియా (ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్)ఉత్తమ కథ - ప్రసన్న వితనగే (స్వర్గం)ఉత్తమ స్వరకర్త - సుషిన్ శ్యామ్ (బౌగిన్విల్లా)ఉత్తమ నేపథ్య సంగీతం - క్రిస్టో జేవియర్ (భ్రమయుగం)ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్) - కె.ఎస్. హరిశంకర్ (చిత్రం - ARM)ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) - సెబా టామీ (చిత్రం - ఆమ్ ఆ)ఉత్తమ లిరిక్స్ - మంజుమ్మెల్ బాయ్స్ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ - అజయన్ చలిస్సేరి (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ సింక్ సౌండ్ - అజయన్ అడాత్ (పాణి)ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ఫజల్ ఎ.బ్యాకర్, షిజిన్ మెల్విన్ హట్టన్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ సౌండ్ డిజైనింగ్ - షిజిన్ మెల్విన్ హట్టన్, అభిషేక్ నాయర్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్) - భాసి వైకోమ్, రాజేష్ (బరోజ్ 3డీ)ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - సయనోరా ఫిలిప్ (బరోజ్ 3డీ)ఉత్తమ కొరియోగ్రఫీ - సుమేష్ సుందర్, జిష్ణుదాస్ ఎం.వి. (బౌగెన్విల్లా )ఉత్తమ మేకప్ - రోనెక్స్ జేవియర్ (బౌగెన్విల్లా, భ్రమయుగం)ఉత్తమ కాస్ట్యూమ్ - సమీరా సనీష్ (రేఖాచిత్రం, బౌగెన్విల్లా)ఉత్తమ వీఎఫ్ఎక్స్- జితిన్ లాల్, ఆల్బర్ట్ థామస్, అనిరుద్ధ ముఖర్జీ (ఏఆర్ఎం)ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్/కలరిస్ట్ - శ్రీక్ వేరియర్ (మంజుమ్మెల్ బాయ్స్, బౌగెన్విల్లా) -
మృత్యు ఘోష!
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధితుల మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో మన రాష్ట్రంలో 37,199 మంది మృతి చెందారు. అంటే సగటున రోజుకు 34 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితి మరే రాష్ట్రంలో లేదు. ఇదేదో సర్వే చేసి ఇచ్చిన నివేదిక కూడా కాదు. లోక్సభలో ఓ సభ్యుడి ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానమిది. గత ఐదేళ్లలో ఏపీశాక్స్ (ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి) జబ్బు నియంత్రణకు, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏపీశాక్స్ నిర్వహణ దారుణంగా ఉంది. దీని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి లేకపోవడం, మందుల సరఫరా సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో ఎక్కువ మంది బాధితులు మృతి చెందుతున్నారు. కౌన్సెలింగ్, స్క్రీనింగ్, టెస్టింగ్ పద్ధతులు పూర్తిగా గాలికొదిలేశారు. కొన్నిసార్లు ఏఆర్టీ (యాంటీ రిట్రో వైరల్) సెంటర్లలో బాధితులకు మందులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేని దారుణ పరిస్థితి ఉంటోందని బాధితులు వాపోతున్నారు. నియంత్రణలో దక్షిణాదిలో కేరళ భేష్ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. హెచ్ఐవీ వ్యాధిపై అద్భుతంగా అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన వైద్యమందించడంలో సఫలీకృతమయ్యారు. అందుకే కేరళలో తక్కువ మృతులు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల మంది పైనే హెచ్ఐవీ బాధితులున్నట్టు అంచనా. అయితే రికార్డుల్లో 3.50 లక్షల మందే ఉన్నారు. వీరిలో ఏఆర్టీ సెంటర్లలో కేవలం 1.70 లక్షల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. చాలా మంది తమపై వివక్ష చూపుతున్నారన్న కారణంగా మందులకు రాలేకపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలికి ఉద్యోగులే బలం. ఈ శాఖలో 1200 మందిపైనే పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు వీరే చూస్తారు. అయితే గడిచిన ఐదేళ్లలో తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, 15 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసం కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదని వాపోతున్నారు. ఇలా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం పథకం అమలుపై ప్రభావం పడుతున్నట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. -
చేయి చేయి కలుపుదాం
కోసిగి (కర్నూలు): చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులను ఆదుకుందామని బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు రాముడు, నయకులు హొలగుంద కోసిగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోసిగిలో వరద బాధితుల సహాయార్థం వ్యాపార దుకాణాలు, ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించారు. వారు మాట్లాడుతూ కేరళలో వరద ముంచుకొచ్చి ప్రజలు సర్వ కోల్పోయి నిరాశ్రులయ్యారు. విరాళాలు సేకరించిన వారిలో పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి లోకారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: కేరళలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తరుపున విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మండల నాయకులు విశ్వనాథ్, నవీన్ నేతృత్వంలో మండల కేంద్రంలో పర్యటించి రూ.39వేలు సేకరించారు. ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో రఘు, జయలక్ష్మి, ఎల్లప్ప, అంజి, ప్రభుత్వ, రాఘవేంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కౌతాళం: మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య, మండల పార్టీ కార్యదర్శి లింగన్న తెలిపారు. వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వరదలతో నష్టపోయిన బాధితులకు విరాళాలు సేకరించామన్నారు. అలాగే కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్ కరస్పాండెంట్ దూద్బాషా కుటుంబం కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రూ.12వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు దూద్ బాషా తెలిపారు. -
ముల్లైపెరియార్ 152 అడుగులు
సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై సర్వ హక్కుల్ని తమిళనాడు కల్గి ఉన్న విష యం తెలిసిందే. ఈ హక్కుల్ని కాలరాయడం లక్ష్యంగా కేరళ తరచూ ఏదో ఒక కుట్ర చేస్తూ వస్తున్నది. ఈ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం వాస్తవానికి 152 అడుగులు. 36 ఏళ్ల క్రితం ఈ డ్యాం నీటి మట్టం 142 అడుగులకు తదుపరి, కేరళ కుట్ర పుణ్యమా నీటి మట్టం 136 అడుగులకు తగ్గింది. ఏళ్ల తరబడి రాష్ట్రంలో ని పాలకులు నీటి మట్టం పెంపు లక్ష్యం గా న్యాయ స్థానంలో పోరాడుతూనే వ చ్చారు. ఎట్టకేలకు 2014లో సుప్రీం కో ర్టు తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ను వెలువరించింది. ఆ డ్యాం నీటి మ ట్టం 142 అడుగులకు పెంచుకునేందుకు ఆదేశాలు ఇచ్చింది. అందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనూ కేరళ కుట్రలకు హద్దే లేదు. 152 అడుగులు : సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో, కేరళ కుట్రల్ని భగ్నం చేస్తూ నెలల తరబడి ఈ డ్యాం నీటి మట్టం పెంపు ప్రక్రియ సాగుతూ వచ్చింది. ఎట్టకేలకు 2014 నవంబర్ 14న డ్యాం నీటి మట్టం 142 అడుగులకు చేరడంతో ఆ డ్యాం నీటి ఆధారిత అన్నదాతల్లో ఆనందం తాండవం చేసింది. తమిళుల కల సాకారం కావడంతో, ఎక్కడ 152 అడుగులకు నీటి మట్టం పెంచాలన్న డిమాండ్ తెర మీదకు తెస్తారోనన్న బెంగతో మళ్లీ కుట్రల బాటలో కేరళ ప్రభుత్వం పయనించింది. అదే సమయంలో నీటి మట్టం 152 అడుగులకు చేరాల్సిందేనని ఆ డ్యాం నీటి ఆధారిత తేని, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, మదురై జిల్లాల్లోని అన్నదాతలు నినాదాన్ని అందుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయింది. డ్యాం నీటి మట్టం పూర్తి స్థాయిలోకి చేర్చే దిశగా 152 అడుగుల నినాదంతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సైతం తీసుకొచ్చారు. అలాగే, కోర్టు ద్వారా ఓ వైపు నీటి మట్టం పెంపు ప్రయత్నాలు చేపడుతూనే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఇందుకు కేంద్ర నీటి పారుదల శాఖ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆ మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కూడిన ఐదుగురి బృందం మంగళవారం ముల్లై పెరియార్ డ్యాం పరిసరాల్లో పరిశీలన చేపట్టింది. ప్రధాన డ్యాం గేట్లను, బేబి డ్యాం, ప్రధాన డ్యాంలోకి నీళ్లు వచ్చే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా డ్యాం సామర్థ్యం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ బృందం కేంద్ర నీటి పారుదల శాఖ కు నివేదికను సమర్పించనుంది. తదుపరి చర్యల మేరకు నీటి మట్టం పెంపునకు కసరత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, నీటి మట్టం పెంపు లక్ష్యంగా వచ్చిన ప్రతిపాదనలో భాగంగా తమ పరిశీలన సాగిందని, ఇది తొలి విడత పర్యటన అని, మరో మారు ఇక్కడ పరిశీలనకు అవకాశాలు ఉన్నట్టు ఆ బృందం వర్గాలు పేర్కొన్నాయి. -
కల సాకారం
సాక్షి, చెన్నై: కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లైపెరియార్ డ్యామ్పై సర్వ హక్కుల్ని తమిళనాడు ప్రభుత్వం కలిగి ఉంది. ఈ నీటి మీద రాష్ట్రంలోని తేని, శివగంగై, రామనాథపురం, మదురై, విరుదునగర్ జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. ఆ హక్కుల్ని కాలరాయడమే లక్ష్యంగా కేరళ సర్కారు కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో తరచూ రెండు రాష్ట్రాల సరిహద్దులో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన డ్యామ్ బలహీనంగా ఉందన్న కుంటి సాకుతో నీటి మట్టాన్ని క్రమంగా తగ్గించే పనిలో కేరళ సర్కారు పడింది. ఆ డ్యామ్ నీటి సామర్థ్యం తొలినాళ్లలో 152 అడుగులు. కేరళ కుట్రలతో 1979లో నీటి మట్టం 136 అడుగులకు తగ్గించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో ఆందోళనలు, ఎన్నో పోరాటాలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ డ్యామ్ నీటి మట్టాన్ని 142 అడుగులకు పెంచుకునేలా ఆదేశించడం శుభ పరిణామం.రంగంలోకి కమిటీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ ఎల్ఏవీ నాథన్, తమిళనాడు ప్రభుత్వ ప్రజా పనుల శాఖ కార్యదర్శి సాయికుమార్, కేరళ నీటి పారుదల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కురియన్ నేతృత్వంలోని కమిటీని కేంద్రం రంగంలోకి దించింది. ఈ కమిటీ నీటి మట్టం పెంపుపై దృష్టి కేంద్రీకరించింది. డ్యామ్ సామర్థ్యం, పటిష్టతను పూర్తిగా పరిశీలించిన ముల్లైపెరియార్ డ్యామ్ పర్యవేక్షణ కమిటీ కేరళ వేదికగా రెండుసార్లు సమావేశమైంది. చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ డ్యామ్ను పరిశీలించేందుకు కమిటీ చైర్మన్ ఎల్ఏవీ నాథన్ నిర్ణయించారు. ఆ మేరకు గురువారం ఉదయం ఇడిక్కి నుంచి బోటులో ముల్లై పెరియార్ డ్యామ్ను పూర్తిగా పరిశీలించారు. నీటి నిల్వ, గేట్ల పటిష్టత, డ్యామ్ పరిసరాల్లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఇక మీదట చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. ఆ డ్యామ్ గేట్లను కిందకు పైకు దించుతూ, నీటి ఉద్ధృతిని పరిశీలించారు. చివరకు గేట్లను 136 అడుగుల నుంచి 146 అడుగులకు పెంచడం తమిళుల్లో ఆనందాన్ని రెకెత్తించింది. 36 ఏళ్లుగా సాగిన పోరాటానికి ఫలితం దక్కనుందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ గేట్లను 146 అడుగులకు చేర్చిన దృష్ట్యా నీటి నిల్వ ఆ మట్టానికి చేర్చే ఉత్తర్వులు ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. డ్యామ్ను పరిశీలించిన అనంతరం కుములి వేదికగా ఈ కమిటీ రాత్రి సమావేశం కాబోతోంది. ఈ సమావేశానంతరం నీటి పెంపుపై ఉత్తర్వులు వెలువడొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. అలాగే డ్యామ్ నీటి మట్టం పెంపు ఉత్తర్వులు వెలువడగానే అందుకు తగ్గ పనుల్ని రాష్ర్ట ప్రజా పనుల శాఖ సిద్ధం చేయడం విశేషం.


