breaking news
Kamma community
-
కమ్మవాళ్లు మా పార్టీలో ఉంటే నీకేంటి?: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, పల్నాడు: ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు.ఏం పాపం చేశారని.. వైఎస్సార్సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు. కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని దగ్గుబాటి సురేష్ వైజాగ్ ల్యాండ్ క్యాన్సిల్ చేశారు. ఏం పాపం చేశాడని నంబూరు శంక్రరావును వేధిస్తున్నారు. నా పక్కనే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయననూ వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని.. మంగళగిరికి చెందిన రాజ్కుమార్-కృష్ణవేణిలను వేధించారు. రాజ్కుమార్ను మోకాళ్ల మీద రోడ్డు మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టి వేధించారు. ఏం పాపం చేశాడని.. ఏం పాపం చేశాడని.. బ్రహ్మనాయుడిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని.. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం.సినిమా చూపిస్తాంవైఎస్సార్సీపీ కమ్మ నేతలను వేధించే కుట్రలో ఎల్లో మీడియా మీడియా భాగమైంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక ముఠా. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. పోలీసులూ.. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దు.ఒక విషయం గుర్తుంచుకొండి. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు మీకు సినిమా చూపిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాం. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారు’’ అని వైఎస్ జగన్ రెంటపాళ్ల వేదికగా వ్యాఖ్యలు చేశారు. -
ఈ పతనం ఏ లోతుల్లోకి?
కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్మెంట్ ఇప్పించారు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీసు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.గుంటూరులో పని చేసే ఒక పోలీసు ఇన్స్పెక్టర్కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట! ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే! మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్స్పెక్టర్కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహిం చింది. తక్షణమే పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసాయన లంఘిస్తున్న విజు వల్స్ టీవీల్లో కనిపించాయి.తెనాలి ఘటన తెలిసిందే! ఓ మఫ్టీ కానిస్టేబుల్కూ, ముగ్గురు యువకులకూ ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్ మీద ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందట! ఈ మఫ్టీ బ్యాచ్ సివిల్ డ్రెస్లో ఉంటూనే, లా అండ్ ఆర్డర్ను చక్కబరుస్తూ, పోలీసు సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారట! అటువంటి మఫ్టీ కానిస్టేబుల్ను అనామక యువకులు ప్రశ్నించ డమేమిటి? అందులో దళితులు! ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడిరోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్ళపై బెత్తాలతో చావబాది ఆటవిక న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెర పరిచింది.కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామికార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్ బాసులు ఏం చేసినా, ఏం చెప్పినా చిత్తం అనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు ఆరు మాసా లుగా అత్యాచారం చేస్తున్న పైశాచిక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చో వడం క్షమించరాని నేరం. ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేటందుకు పొలిటికల్ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీలపరీక్ష లాంటిదే! వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరి సెల్యూట్ కొట్టించుకుంటున్నదనే వార్తలు కూడా విన్నాము. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది.ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! గల్లీగల్లీలో గంజాయి, చీప్ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీపడుతున్నది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఛోటామోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్ హెడ్పై సంతకం చేసి ఇచ్చినందుకు పాతిక, ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. చిన్నచిన్న రికమండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టారట! ఆ మధ్య ఓ యెల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోకు తన లెటర్ హెడ్ పుస్తకాన్ని ఇచ్చి, దీని ద్వారా తిరుపతి దర్శనం రికమండేషన్లు అమ్మి తనకు నెలకో లక్ష రూపాయలు జమ కట్టాలని ఆర్డర్ వేశారని ఆ పత్రిక రాసింది. ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికీ, ప్రతి చిన్న రికమండేషన్కూ కూడా వెలకట్టి వసూలు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతున్నది.నాయకుని స్థాయిని బట్టి అవినీతిస్థాయి కూడా పెరుగు తుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కు భుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టు దర్జాగా భూకబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయిజం తాజా ఉదాహరణ. సాక్షాత్తూ పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ పెద్దలు బడిని మింగినా, గుడిని మింగినా చోద్యం చూడటానికే పరిమితమైపోతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తున్నది.ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంలో వెలిగి పోతున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప, వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్ది చెబుతున్నారు. రాజధాని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 వేల ఎకరాలకు తోడు మరో 45 వేల ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఐదు వేల ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట! ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానా శ్రయం సంగతి ఏమిటి? గన్నవరంలో 2024–25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దాని వైశాల్యం 1,265 ఎకరాలు, కోల్కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్ అయిన విమానాల సంఖ్య ఒక లక్షా నలభై ఆరు వేల పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్ ట్రాఫిక్ ఇరవై రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్పోర్ట్ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే!ఎన్ని పాలనా భవనాలను నిర్మించినా, ఎన్ని సంస్థలను రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందు బాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలను నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండి పోరు కదా! ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వేలకోట్ల రూపా యల అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చునేమో గాని కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒకపక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జమ కట్టే పెత్తందారీ పోకడ మరోపక్క... ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగ ణిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాళ్ళుగా భావిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రు లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధు నిక బోధన పద్ధతులను రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. 8 గంటల పని కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలనూ, షికాగో వీధుల్లో చిందిన కార్మిక రుధిరాన్నీ అవహేళన చేసింది.ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేమున్నది! కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట! ఈ సర్వేలన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. దిగజార డానికి ఇంతకంటే లోతుల్లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నదట! నూటికి నూరు శాతం మంది ప్రభు త్వాన్ని భేష్ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇదీ బాబు, లోకేష్లు మనస్తతత్వం: వైఎస్ జగన్
ఎన్టీఆర్, సాక్షి: సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుండడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం. తనకన్నా, లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు(Chandrababu) సహించలేరు. తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. అలాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం.. అక్రమ అరెస్టులు, ట్రోల్ చేయించడం వాళ్లిద్దరి నైజం. ఇందుకు చంద్రబాబు కోసమే పని చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. బాబు మాఫియా రాజ్యం(Babu Mafia) నడుస్తోంది. రేపు దేవినేని అవినాష్ లాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొచ్చు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
టీకాంగ్రెస్లో పాలి‘ట్రిక్స్’.. కమ్మ కులంతో కొత్త రాజకీయం!
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ప్రతినిధిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కమ్మ జేఏసీ నేతలను కొందరిని తీసుకువెళ్లారు. అక్కడ వచ్చే శాసనసభ ఎన్నికలలో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లను కాంగ్రెస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కి ముందు కమ్మ వర్గం కూడా కాంగ్రెస్తోనే ఉందని గణాంకాలు చెబుతాయి. తదుపరి తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తాయి. ఆయా ఎన్నికలలో ఇతర సామాజికవర్గాలను ఎవరు ఆకర్షించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతీ ఎన్నికలోనూ రెండు ప్రాంతాలలో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభై మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే, కమ్మ వర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. రెండు ప్రాంతాలలో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది, ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53, 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం 1985లో అత్యధికంగా ఎనిమిది మంది నెగ్గారు. మిగిలిన ఎన్నికలలో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి ఈ వర్గం యత్నించింది. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుతో మొత్తం పార్టీ ఇక్కడ కకావికలం అయింది. దాంతో కమ్మ వర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతన్నట్లు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికలలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) పాలన పగ్గాలు చేపట్టగా, కమ్మ వర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా టీఆర్ఎస్లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి కొందరు టీఆర్ఎస్లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు. 2018 ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ, పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి దివంగత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం చెందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. టీడీపీ సెంటిమెంట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా చాలా ప్రభావం చూపింది. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కమ్మ అభ్యర్ధి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి, ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. ఆ తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే 2009లో తెలంగాణలో ముగ్గురు గెలవగా వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్సత్తాకు చెందినవారు. 2004లో కూడా ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా, టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు. 1985లో మొత్తం ఎనిమిది మందికి గాను, ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీవారే. ఎన్టీరామారావు ప్రభంజనం వీయడంతో వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు. స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా, ఆ తర్వాత అది నెగిటివ్ గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువ శాతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్ చేయడానికి రేణుకా చౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలం ఉంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్ధం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై, ఆయన జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి. నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్ వర్గాలుగానీ కొంత కాలం క్రితం వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయం ఉంది. కానీ, చంద్రబాబు అరెస్టు ఉదంతం తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు. కానీ, ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది కొందరి వ్యూహం. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు. నలభై నియోజకవర్గాలలో కమ్మ వర్గం గణనీయంగా ఉందని, ముప్పై చోట్ల గెలుపు, ఓటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాలలోనివి కాగా, కొన్ని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలోనివి. జూబ్లిహిల్స్, శేరీలింగంపల్లి, కూకట్పల్లి, కుత్చుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టిక్కెట్లను ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టిక్కెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్ధిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన ఐదుగురికి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా, కాంగ్రెస్ హై కమాండ్ బీసీ వర్గం నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. పైగా ఇతర వర్గాలలో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా, ఆయనను రేణుకా చౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకు వెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. ఏది ఏమైనా గత అరవైఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతో పాటు కమ్మవారు కొందరికి కూడా టిక్కెట్లు ఇస్తాయి. కానీ, అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
రేణుకమ్మల పోలరైజ్ పాలిటిక్స్
కొమ్మినేని శ్రీనివాసరావు : తెలంగాణలో కమ్మ సామాజికవర్గ ప్రతినిధిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి కాంగ్రెస్నేత రేణుకాచౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కొందరు కమ్మ జేఏసీ నేతలను తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీఎన్నికల్లో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కు ముందు కమ్మవర్గం కాంగ్రెస్తోనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. తదుపరి టీడీపీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యంలో ఉన్నట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆయా ఎన్నికల్లో ఇతర సామాజిక వర్గాలను ఎవరు ఆకర్శించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతి ఎన్నికలోనూ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభైమంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే.. కమ్మవర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53 మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది.. ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53 , 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం నుంచి 1985లో అత్యధికంగా ఎనిమిది, మిగతా ఎన్నికల్లో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు. ఎవరు అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి కమ్మ వర్గం యత్నించింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో ఇక్కడ మొత్తం పార్టీ కకావికలమైంది. దీంతో కమ్మవర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) పాలన పగ్గాలు చేపట్టగా... కమ్మవర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా బీఆర్ఎస్లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి కొందరు టీఆర్ఎస్లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు. 2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం పొందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. టీడీపీ సెంటిమెంట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలవడాన్ని చాలామంది జీర్ణిం చుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా ప్రభావం చూపింది. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కమ్మ అభ్యర్థి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి , ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణలో పెద్దగా బలంగా లేకున్నా.. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే... 2009లో తెలంగాణలో ముగ్గురు గెలవగా, వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్సత్తాకు చెందినవారు. 2004లోనూ ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా.. టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు. 1985లో మొత్తం ఎనిమిది మందికిగాను ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీ వారే. ఎన్.టి.రామారావు ప్రభంజనం వీయడంతో వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు. స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా.. తర్వాత అది నెగిటివ్గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పడానికే.. తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్ చేయడానికి రేణుకాచౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలముంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్థం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి. నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్ వర్గాలుగానీ కొంతకాలం క్రితం వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయముంది. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి కొందరు వ్యూహాలు పన్నుతున్నారు. నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వొచ్చు. కానీ ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి, కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది వారి వ్యూహం. రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, తనవారికి టికెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు. నలభై నియోజకవర్గాల్లో కమ్మ వర్గం గణనీయంగా ఉందని.. ముప్పై చోట్ల గెలుపోటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లోనివే కాగా.. కొన్ని నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనివి. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టికెట్లు ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్కు నష్టం చేస్తుందా? ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టికెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్థిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన ఐదుగురికి టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా కాంగ్రెస్ హైకమాండ్ బీసీవర్గం నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. పైగా ఇతర వర్గాల్లో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా.. ఆయనను రేణుకాచౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. ఏది ఏమైనా అరవై ఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతోపాటు కమ్మవారు కొందరికి కూడా టికెట్లు ఇస్తాయి. కానీ అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి. -
కాస్ట్ పాలిటిక్స్తో కాంగ్రెస్లో కంగారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. నేడో రేపో షెడ్యూల్ రానున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కుల రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. ఓవైపు బీసీ నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కాంగ్రెస్పై ఒత్తిడి చేస్తున్న వేళ.. తాజాగా తమ కులం తమకు సీట్లు కావాలని, తామూ పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతల్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందర తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఐక్య వేదికలు ఒక తాటి మీదకు వచ్చాయి. ఎన్నికల్లో తమకూ ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని డిమాండ్ను లెవనెత్తాయి. దీనికి ఆ సామాజిక వర్గం నేతలు బహిరంగంగా మద్దతు ప్రకటించేశారు కూడా. తెలంగాణలో తమ బలం బాగానే ఉందని.. అవకాశం ఇస్తే 40 సీట్ల దాకా తెచ్చి చూపిస్తామని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు సదరు కమ్మ నేతలు. తాజాగా.. తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని కలిసి లేఖ ఇచ్చింది. తమను గుర్తించి.. టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలంటూ లేఖలో కోరింది. సినీ, రాజకీయ పరిశ్రమల్లో సత్తా చాటుతున్న కమ్మ వాళ్లకు ఓటు అధికారంతో పాటు సీటు అధికారం కూడా ఇవ్వాల్సిందేనంటూ ఈ సందర్భంగా అక్కడ ఉన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు శిష్యుడి ద్వారానే.. కాంగ్రెస్లో రేవంత్రెడ్డి తొలి నుంచి ట్రబుల్ మేకర్గా ఉన్నారనే వాదన ఒకటి ఉంది. ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ అయ్యారో.. అప్పటి నుంచి కాంగ్రెస్లో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. తన ఆధిపత్య ధోరణితో ఆయన తమనూ అణగదొక్కుతున్నారంటూ సీనియర్లు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. రేవంత్ సమర్థత కన్నా చంద్రబాబు శిష్యుడిగా ఆయన మీద పార్టీలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ డిమాండ్పైనా రేవంత్ పేరు ప్రస్తావనకు వచ్చింది. తుమ్మల కాంగ్రెస్లో చేరిక వెనుక రేవంత్ ప్రముఖ పాత్ర పోషించారన్న టాక్ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో.. కమ్మ నేతలు వాళ్ల సీట్ల ప్రయత్నాలు రేవంత్ ద్వారానే నెరవేర్చుకోవాలని భావిస్తున్నారట. తమ పాత పరిచయాలతో రేవంత్రెడ్డిని కలుస్తున్న కొందరు.. తమ సీట్లకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే బాధ్యతను అప్పజెప్పినట్లు భోగట్టా. ఇది మిగతా కులాల నుంచి ఏమేర అభ్యంతరాలకు దారి తీస్తుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!. కాంగ్రెస్ టిక్కెట్లు త్వరలోనే ఖరారు చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక మంది ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. అక్కడ స్క్రీనింగ్ కమిటీ పెద్దలతో పాు ఏఐసీసీ నేతలను కలసి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. ఇప్పటికే టికెట్ల ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దశలో కులాలు, వర్గాల వారీగా రోజుకో కొత్త డిమాండ్ కాంగ్రెస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. -
‘అందువల్లే చంద్రబాబుకు ఈనాడు, జ్యోతి భజన చేస్తున్నాయి’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కళ్లు బైర్లు కమ్మే వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్. కేవలం కమ్మ కులంలోనే కొందరు మాత్రమే చంద్రబాబుకు సపోర్టు ఇస్తున్నారని అన్నారు. అలాగే, బాబును భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ కమ్మ కులానికి చెందినవారివేనని, అందుకే వీరంతా చంద్రబాబు ఏం చేసినా మద్దతిస్తూ డప్పులు వాయిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు.. విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. "నేను కమ్మ కులస్థుడినే. మా కులం వారు మిగతా కులం నుంచి దూరమై ఒంటరైపోయారు. చంద్రబాబు అరెస్ట్ జరిగిన తర్వాత ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కేవలం మా కులానికి చెందినవారే. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు. ఇప్పటిదాకా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు ఐటీ ఇండస్ట్రీని తెచ్చాడు అనేది కేవలం మా కమ్మోళ్ల ప్రచారం మాత్రమే. ఇప్పటివరకు ఐటీకి బాబు చేసిందేమీ లేదు. లోకేష్ది పాదయాత్ర కాదు.. డబ్బు యాత్ర.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకువస్తుంటే పట్టించుకున్న వ్యక్తి ఒక్కరు కూడా లేరు. అమరావతిలో రాజధాని ఉద్యమం లేదు.. ఏమీ లేదు. కేవలం మూడు, నాలుగు ఊర్లలోనే కొందరు అల్లరి చేస్తున్నారు. అమరావతిలో పచ్చని భూములను చంద్రబాబు నాశనం చేశాడు. నారా లోకేశ్ యాత్ర అంతా డబ్బులతోనే నడిచింది. టీడీపీకి మద్దతు ఇచ్చే స్థితిలో ప్రజలెవ్వరూ లేరు. ప్రజల మద్దతు సీఎం జగన్కే.. వైఎస్సార్సీపీని ఏ పార్టీ ఏమీ చేయలేదు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసినా వైఎస్సార్సీపీకి ఫుల్ మెజార్టీ వస్తుందని నా దగ్గరున్న సర్వేలు చెబుతున్నాయి. మా కులం వాళ్లు తప్పిస్తే మిగతా కులాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూర్తి మద్దతు ఉంది. సీఎం జగన్ మాట మీద నిలబడతారు. నిజాయతీ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్కిల్’ స్కామ్ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు -
కేసీఆర్కు అండగా నిలుద్దాం: తుమ్మల
గజ్వేల్ (మెదక్): ‘బంగారు తెలంగాణ’ నిర్మాణంలో కమ్మ కులస్తులు కీలక పాత్రను పోషించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన నియోజకవర్గ కమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని సూచించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి కేసీఆర్ తగు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ కాల్ చేస్తే చాలు స్పందించి అండగా నిలబడతానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తుమ్మలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల కమ్మ సంఘం కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు ప్రసాద్, సుభాష్ చంద్రబోస్, పరుచూరి రాజు, వెంకటేశ్వర్రావు, నల్లా భాస్కర్రావు, పాలేటి నర్సింహారావు, నల్లా శ్రీధర్, చేకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.