-
గాంధీలో శిశువులను జంబ్లింగ్ చేసిన మహిళ
గాంధీఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయినిగా పేరుగాంచిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఇటీవల సంచలన ఘటనలకు ప్రధాన కేంద్రమైంది. గాంధీ ఆస్పత్రి ఎన్ఐసీయూ వార్డులో శిశువులను తారుమారు చేసిన సంఘటన మంగళవారం కలకలం సృష్టించింది. ఆడశిశువుకు బదులుగా మగశిశువును తీసుకువెళ్లిన మహిళను సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పట్టుకుని కిడ్నాప్ కేసు నమోదు చేశారు. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మాసబ్ట్యాంక్ చాచానెహ్రూనగర్కు చెందిన సఫియాభాను కాన్పు కోసం కోసం గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో చేరింది. ఈ నెల 21న ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. త్వరితగతిన స్వస్థత చేకూరేందుకు శిశువును పిడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూ వార్డులోని ఇంక్యుబేటర్ (వైద్యపరికరం)లో ప్రతిరోజు కొంతసమయం పెడుతున్నారు. వెస్ట్బెంగాల్ న్యూజల్పైగురి జిల్లా కెలావాడీ గ్రామానికి చెందిన ఫూల్మణిమహాలీ, సోనుమహాలీలు భార్యభర్తలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి నాచారం మల్లాపూర్లోని వెంకటాపురం కాలనీలో ఉంటూ కూలిపనులతో జీవనోపాధి పొందుతున్నారు. గర్భిణి అయిన ఫూల్మణి కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును కూడా ఎన్ఐసీయూలోని ఇంక్యూబేటర్లో పెడుతున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఇరువురు శిశువులను ప్రక్కప్రక్కన గల ఇంక్యుబేటర్లో పెట్టారు. ఫూల్మణిని పరామర్శించేందుకు ఆమె సోదరి సరితనాయక్, బావ మంజీత్నాయక్లు మంగళవారం ఉదయం గాంధీఆస్పత్రికి వచ్చారు. సోదరి ఫూల్మణికి ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న సరితనాయక్ మనస్తాపానికి గురైంది. పీఐసీయూ ఇంక్యుబేటర్లో తమకు చెందిన ఆడశిశువు పక్కనే మగశిశువు ఉన్నట్లు గమనించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వైద్యులు, సిబ్బంది కళ్లుగప్పి ఇంక్యుబేటర్లో ఉన్న మగ శిశువును తీసుకుని ఆస్పత్రి బయటకు వెళ్లేందుకు యత్నించింది. పీఐసీయూ వద్ద కాపలాగా ఉన్న సఫియాభాను సోదరి సాదియాభాను కొంతసేపటి తర్వాత ఇంక్యుబేటర్లో మగశిశువు లేని విషయాన్ని గమనించి ఎన్ఐసీయూ వైద్యులు, సిబ్బందికి చెప్పింది. స్పందించిన వైద్యులు సెక్యూరిటీ సిబ్బందిని ఎలర్ట్ చేసి ఆస్పత్రి పాలన యంత్రాంగానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అవుట్పోస్టు పోలీసులు ఎన్ఐసీయూ వద్దకు చేరుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా ఇంక్యుబేటర్లో ఉన్న మగశిశువును సరితనాయక్ తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. సరితానాయక్ను ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డుకున్నారు. పొరపాటు జరిగిందని బుకాయించేందుకు ఆమె ప్రయత్నించింది. సోదరికి ఆడశిశువు పుట్టిందని తెలియడంతో మనస్తాపానికి గురయ్యానని, అందుకే ఇంక్యుబేటర్లో ఉన్న మగశిశువును తీసుకువెళ్లేందుకు ప్రయత్నించానని పోలీసుల విచారణలో వెల్లడించింది. తారుమారైన శిశువులను తల్లుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. బాధితురాలు సఫియాభాను సోదరి సాదియాబానుతోపాటు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ ఫిర్యాదుల మేరకు నిందితురాలు సరితనాయక్పై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లుచిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి స్పష్టం చేశారు. -
జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్
– నేటి నుంచి ప్రారంభం కర్నూలు(సిటీ): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జబ్లింగ్ విధానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన కార్పొరేట్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 22వరకు జిల్లాలో మొత్తం 93 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 20,734 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
‘జంబ్లింగ్’ రద్దు కోసం ధర్నా
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు ప్రాక్టికల్లో అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రాజ్విహార్ సెంటర్ నుంచి పెద్దపార్కు, పాత కంట్రోల్ రూం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శేషిరెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్లు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రాక్టికల్స్లో మొట్ట మొదటి సారిగా అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలన్నీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. అనంతరం ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జంబ్లింగ్లో గ్యాంబ్లింగ్
- జంబ్లింగ్లో ‘కార్పొరేట్’ మాయ - సెంటర్లను మార్చుకున్న కార్పొరేట్ కాలేజీలు? - ఇంటర్ బోర్డులో చక్రం తిప్పిన వైనం - వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కళాశాలలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రెండు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు..పరస్పర అవగాహన..ఫలితం..జంబ్లింగ్ ప్రాక్టికల్ పరీక్షలు అపహాస్యం. ఆ కాలేజీలోని విద్యార్థులు ఈ కాలేజీ...ఈ కాలేజీలోని విద్యార్థులు ఆ కాలేజీలో పరీక్ష రాసే ఒప్పదం.. జంబ్లింగ్ పేరుతో పరీక్ష సెంటర్ల ఏర్పాటులో జరిగిన అక్రమాలు ఇవి. ఇందుకు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరమే సాక్షి. కుడిఎడమైతే పొరపాటులేదోయ్ అనుకున్నారో ఏమో కానీ అధికారులు కూడా జంబ్లింగ్ విధానమని మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంబ్లింగ్ పేరుతో జరుగుతున్న ఈ మొత్తం నాటకం కేవలం రెండు కాలేజీలకే మేలు చేసేందుకే అన్న ఆరోపణలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జంబ్లింగ్ అసలు స్ఫూర్తితో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమను నష్టం చేసేందుకే ఈ జంబ్లింగ్ నాటకం తెరమీదకు వచ్చిందనే ప్రైవేటు కాలేజీలు మండిపడుతున్నాయి. వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కాలేజీలు...! కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకంలో విద్యార్థులతో పాటు సాధారణ ప్రైవేటు కాలేజీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదని వాదిస్తున్నాయి. ఇది కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకం అని మండిపడుతున్నాయి. రెండు కార్పొరేట్ కాలేజీలు సెంటర్లను తమకిష్టం వచ్చినట్టుగా కేటాయించుకుని....తమ విద్యార్థులను సమిధలు చేస్తున్నాయని వాపోతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఈ రెండు కార్పొరేట్ కాలేజీలను కాదని తమ విద్యార్థులకు ర్యాంకులు వస్తుండటంతో ఈ విధంగా కేవలం వారు మాత్రమే లాభపడి... తమ విద్యార్థులను మోసం చేస్తున్నాయనేది సాధారణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల వాదనగా ఉంది. అయితే, అంతిమంగా విద్యార్థులు మాత్రమే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నారు. విద్యార్థులే సమిధలు.. వాస్తవానికి ఇటు జంబ్లింగ్ విధానమైనా... సాధారణ విధానంలోనైనా విద్యార్థులే ఇబ్బందుల పాలవుతున్నారు. అటు కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇటు ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. వాస్తవానికి ప్రాక్టికల్స్ పరీక్షల్లో వచ్చే సబ్జెక్టును ప్రయోగాత్మకంగా చేసి చూస్తే థియరీ పరీక్షలు రాసే సమయంలో వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఎక్కడా కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా తీరా పరీక్ష సమయానికి వచ్చే సరికి విద్యార్థులు తెల్లమొహం వేయాల్సి వస్తోంది. దీంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కాలేజీ యాజమాన్యాలు పరీక్ష పాస్ కావాలంటే సబ్జెక్టుకు ఇంత మొత్తం ఇవ్వాలని వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని పరీక్షను పర్యవేక్షించేందుకు వచ్చే ఇన్విజిలేటర్లకు ఇస్తున్నామని బహిరంగంగానే విద్యార్థులకు చెబుతున్నాయి. మీకు 30కి 30 మార్కులు ఏమీ చేయకపోయినా రావాలంటే సబ్జెక్టుకు కొంత మొత్తం ఇవ్వాలని యాజమాన్యాలు ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అంటే కాలేజీలు చేస్తున్న తప్పునకు విద్యార్థులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నమాట. కాలేజీల కేటాయింపు అధికారం బోర్డుదే: వై. పరమేశ్వరరెడ్డి, ఆర్ఐవో జంబ్లింగ్ విధానంలో పరీక్షా కేంద్రాలను కేటాయించే అధికారం ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంటుంది. ఆ కాలేజీ విద్యార్థులు ఈ కాలేజీలో.. ఈ కాలేజీ విద్యార్థులు ఆ కాలేజీలో పడ్డారన్న సమాచారం లేదు. అయితే, జంబ్లింగ్ విధానంలో ఏ కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో మాత్రం పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు. -
విద్యార్థుల్లో పిరికితనం నూరిపోయకండి
కలెక్టర్ భాస్కర్ ఏలూరు సిటీ: ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాణించేలా భావిభారత పౌరులను తీర్చిదిద్దాలే తప్ప వారిలో పిరికితనం, కష్టపడకుండా జీవించే మనస్తత్వాన్ని ప్రొత్సహించవద్దని కలెక్టరు కాటంనేని భాస్కర్ కళాశాల అధినేతలకు హితవు పలికారు. కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జంబ్లింగ్ సౌకర్యం వద్దని దానివల్ల విద్యార్ధులు ఎంతో కష్టపడాల్సి వస్తుందని, పలు కళాశాలల అధిపతులు విద్యార్ధులకు కలెక్టరకు అందచేసిన వినతిపత్రంపై కలెక్టరు స్పందించారు. పారదర్శకంగా జంబ్లింగ్ విధానాన్ని నిర్వహిస్తుంటే అభ్యంతరం ఏమిటని కలెక్టరు ప్రశ్నించారు. ఇదేనా మన పిల్లలకు పిరికితనం నూరిపోయడం ? కష్టపడవద్దని చెప్పడం మంచిది కాదని ఒక కళాశాలలో చదువుతూ మరొక కళాశాలకు వెళ్ళి పరీక్ష వ్రాయమంటే బాధపడిపోతే ఎలా ? ఉన్నత చదువులు కోసం ఉద్యోగాలు కోసం భవిష్యత్తు కోసం ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి రాణించే స్దాయిలో మన యువతను తీర్చిదిద్దాలే తప్ప ప్రతిదానికి కుంఠిసాకులు చెప్పి యువతలో ఒక విధమైన నైరాస్యతకు చొప్పించడం మంచిది కాదన్నారు. తాను కూడా అనేక పరీక్షలు వ్రాశానని ఆనాడు కష్టపడి చదవబట్టే ఈ రోజు కలెక్టరు హోదాలో ఇక్కడ పనిచేస్తున్నానని చదివేటప్పుడు మరింత కష్టపడి చదివేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రొత్సాహించాలే తప్ప నిరాశ, నిస్పృహలను కల్పించవద్దన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి
అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండొద్దు
రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం..
పోలీస్ ప్రజావాణికి ఐదు అర్జీలు
మోదీ గుండెలో సంజయ్కి ప్రత్యేక స్థానం
బీజేపీని ఓడించడమే లక్ష్యం
పక్కాగా ఈవీఎంల కమిషనింగ్
ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
వానాకాలం సాగు ఖరారు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement