-
కడుపులో కత్తెర పై విచారణ
నెల్లూరు(బారకాసు): రోగి చలపతి కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన ఘటనపై గురువారం జేసీ ఇంతియాజ్ అహ్మద్ నేతృత్వంలోని కమిటీ జీజీహెచ్లో విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై మానవ హక్కుల కమి షన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. హెచ్చార్సీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కమిటీ చైర్మన్గా జేసీ, సభ్యులుగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ సీవీ రమాదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజును నియమించిన విషయం తెలిసిందే. గురువారం జీజీహెచ్లో జరిగిన విచారణకు చలపతికి రెండు స్లారు ఆపరేషన్ చేసిన వైద్యులు, నర్సులు మొత్తం 8 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్ సర్జన్ హెచ్ఓడీ డాక్టర్ పద్మశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ శ్రీలక్ష్మి, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ సాయిసందీప్, మత్తు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ ప్రియాంక, స్టాఫ్ నర్సులు పార్వతి, అనిత ఉన్నారు. మూడు గంటలపాటు విచారణ ఆపరేషన్లో పాల్గొన్న వైద్యులు, నర్సులను మూడు గంటల పాటు కమిటీ విచారించింది. ఒక్కొక్కరిని పిలిచి ఆపరేషన్ జరిగిన సమయంలో ఏం జరిగింది? ఆ సమయంలో చేసిన పని ఏమిటని పూర్తిస్థాయిలో విచారించారు. ఈ మేరకు వైద్యులు, నర్సుల వాగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. పేషెంట్కు సంబంధించిన కేస్షీట్ను కూడా జేసీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు తాము పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. దీనిపై మరింత లోతుగా సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం జేసీ ఇంతియాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చలపతిని పరామర్శించారు. ఆయన భార్య జానకమ్మతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కళారాణి, ఇన్చార్జి ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ ఉన్నారు. బాధ్యులపై చర్యలెప్పుడో? ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఇంత వరకు కనీసం ప్రాథమిక చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు లేవు. బాధ్యులకు మెమోలు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైతే చివరికి విషయం బయటకు పొక్కడం, మానవ హక్కుల కమిషన్ స్పందించడంతో గురువారం అధికారులు విచారణ చేపట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే విచారణ నివేదికలను ఉన్నతాధికారులు పరిశీలించేదెప్పుడు..బాధ్యులపై చర్యలు తీసుకునేదెప్పుడు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
దత్తత గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మండలంలోని మహిమలూరు, ఏఎస్పేట మండలంలోని చిరమన గ్రామాలను కేంద్ర రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డీఆర్డీఏ డైరెక్టర్ గుండ్రా సతీష్రెడ్డి, గ్లోబెల్ ఆస్పత్రి నిర్వాహకులు రవీంద్రనాయుడులు దత్తత తీసుకున్నారని, వారి సహకారంతో గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలనిఽ జేసీ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులను గుర్తించి జాబితాను ఉన్నతాధికారులకు అందచేయాలన్నారు. మహిమలూరు గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, శ్మశానవాటిక అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రాథమిక పాఠశాల, దళిత కాలనీలోని మరో పాఠశాలకు ప్రహరీగోడల నిర్మాణం, నూతన పశువైద్యశాల భవనం, రైతులు ధాన్యం దాచుకునేందుకు గోదాముల నిర్మాణం తదితర పనులకు రూ.2.48 కోట్లు అంచనాలు తయారుచేశారని, వాటిని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మహిమలూరులో జరిగిన పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ ఎం.వెంకటరమణ, ముఖ్య ప్రణాళికాధికారి వెంకయ్య, ఆర్డబ్ల్యూఽఎస్ ఈఈ ఆర్వీ రామిరెడ్డి, డీఈ సీహెచ్ శ్రీనివాసరావు, ఏపీడీ మృదుల, పంచాయతీరాజ్ డీఈ, ఏఈలు, గ్రామ నాయకులు చిట్టమూరు రవీంద్రారెడ్డి, నిజమాల నరసింహులు, ఉప మండలాధ్యక్షుడు తోట కృష్ణయ్య, సర్పంచ్ రఘురామిరెడ్డి తదితరులున్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా
జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అల్లూరు : మండలంలోని సింగపేట గిరిజన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలసి గిరిజనుల ఇండ్లను పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గిరిజనులు విద్యావంతులు కావాలన్నారు. ఈ ప్రాంత గిరిజనులు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నందున తహసీల్దార్, ఎంపీడీవో వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారని, ఆ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇండ్ల మరమ్మతులు, లెవలింగ్, అంతర్గత రోడ్లు, సోలార్ సెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ కాలనీల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డ్వామా పీడీ హరిత, ఐటీడీఏ పీవో కమలకుమారి, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, హౌసింగ్ డీఈ వెంకటస్వామి, తహసీల్దార్ పూర్ణచంద్రరావు, ఎంపీడీవో కనకదుర్గాభవాని, హౌసింగ్ ఏఈ వెంకటయ్య, స్థానిక టీడీపీ నాయకులు బండి అమర్రెడ్డి, రమణయ్య, బండి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలు పెంపొందించాలి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): జిల్లాలో నగదు రహిత లావాదేవీలను పెంపొందించేలా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ బ్యాంక్ కరస్పాండెంట్లకు సూచించారు. గురువారం స్థానిక గోల్డన్ జూబ్లీహాల్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంక్ కరస్పాండెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 35 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. వాటిలో 4.50 లక్షల జనధన్ ఖాతాలు ఉన్నాయన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వలన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రెడిట్, డెబిట్, రూపే, జనధన్ కార్డులను ప్రజలు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాపారులు రూ.50 వేలకు మించి లావాదేవీలు చేయవచ్చునని తెలిపారు. జిల్లాలోని 1890 చౌకదుకాణాల్లో నగదు రహిత పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాలు లేని పింఛన్దారులు, ఉపాధి కూలీలను గుర్తించాలన్నారు. వారందరికీ డిసెంబర్ 1వ తేదీలోపు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జేసీ వ్యవసాయం, కార్మిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుపై సమీక్షించారు. సమావేశంలో ఏపీజీబీ ఆర్ఎం బీవీ శివయ్య, సీనియర్ మేనేజర్ ఎంఎస్ రామ్ పాల్గొన్నారు. -
స్వైపింగ్ మిషన్లతో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్
రేషన్ డీలర్లు కరెంట్ అకౌంట్లు ప్రారంభించాలి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు జేసీ ఆదేశం నెల్లూరు(పొగతోట): కూరగాయల మార్కెట్లు, పచారిషాపులు, షాపింగ్మాల్స్, పెట్రోలు బంకులు, మెడికల్ షాపులు తదితర వాటిల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఏ. మహమ్మద్ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక గోల్డన్జూబ్లీహాలులో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, వ్యాపారులు, చౌకదుకాణాల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులుపడకుండా బ్యాంకు అకౌంట్లు, జనధన్ అకౌంట్లు ఉన్నా వారందరికి రూపే కార్డులు పంపిణి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బ్యాంకు సేవలకు ఇబ్బందులు పడకుండా చౌకదుకాణాల డీలర్లను బ్యాంకింగ్ కరాస్పాండెంట్లుగా నియమించడం జరిగిందన్నారు. డీలర్లందరు బ్యాంకు కరెంట్ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో 430 ఏటీఎంలు ఉన్నాయన్నారు. వాటిలో 200ఏటీఎంలను కొత్త రూ.2000లు, రూ,500ల నోట్లు తీసుకునేలా సిద్దం చేశామన్నారు. కూరగాయల మార్కెట్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మిని ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి చౌకదుకాణాల్లో నగదు లేకుండా రేషన్ పంపిణి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 418 బ్యాంకులు ఉన్నాయన్నారు. ప్రతి నిత్యం రూ.220 కోట్లు అ ప్రస్తుతం రూ.80 కోట్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు. పరిశ్రమలకు అనుకులమైన భూములను గుర్తించండి. పరిశ్రమలకు అనుకులంగా ఉండే భూములను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ.మహమ్మద్ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలికసదుపాయాలు ఉండే భూములను గుర్తించాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement