breaking news
Jayden Seales
-
జైస్వాల్తో ఓవరాక్షన్.. విండీస్ ప్లేయర్కు భారీ షాక్
న్యూఢిల్లీ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పట్ల దురుసుగా ప్రవర్తించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్కు (jayden Seales) ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో సీల్స్ ఓవరాక్షన్ చేశాడు. ఫాలో త్రూ చేసే క్రమంలో బంతిని జైస్వాల్పైకి ప్రమాదకరంగా విసిరాడు. బంతి జైస్వాల్ ప్యాడ్స్పై బలంగా తాకింది. దీన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ సీల్స్కు ఓ డీమెరిట్ పాయింట్ అలాట్ చేయడంతో పాటు అతని మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.9 నిబంధన ప్రకారం ఓ ఆటగాడు బంతిని లేదా ఏదైన క్రికెట్ సమాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి కానీ వారి సమీపంలోకి కాని విసరకూడదు. ఇలా చేస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది.సీల్స్ విషయంలోనూ ఇదే జరిగింది. పైగా సీల్స్ తాను చేసిన పనిని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని జైస్వాల్ పైకి విసరలేదని రిఫరీ పైక్రాఫ్ట్కు వివరించాడు. రనౌట్ చేసే ప్రయత్నంలో అలా జరిగిందని అన్నాడు. సీల్స్ వాదనను సైతం పరిగణలోకి తీసుకున్న ఐసీసీ పలుమార్లు సదరు సన్నివేశాన్ని పరిశీలించి, సీల్స్దే తప్పిదమని పేర్కొంది. జైస్వాల్ అప్పటికే క్రీజ్లో ఉన్నా సీల్స్ అనవసరంగా బంతిని విసిరాడని నిర్దారించింది. అందుకే అతనికి ఓ డీమెరిట్ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజ్లో కోత విధించింది. 24 వ్యవధిలో సీల్స్కు ఇది రెండో డీమెరిట్ పాయింట్. ఈ మధ్యలో అతను మరో తప్పు చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదముంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్బెల్ (87), షాయ్ హోప్ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5) చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
IND vs WI 1st Test: పర్వాలేదనిపించిన జైస్వాల్.. నిరాశపరిచిన సాయి
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 68 పరుగుల వద్ద జైస్వాల్ (Yashasvi Jaiswal) (36), 90 పరుగుల వద్ద సాయి సుదర్శన్ (Sai Sudarshan) (7) ఔటయ్యారు. జైస్వాల్ తన సహజ శైలిలో ధాటిగా ఆడి జేడన్ సీల్స్ బౌలింగ్లో షాయ్ హోప్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జైస్వాల్ ఈ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు బాదాడు. సాయి సుదర్శన్ విషయానికొస్తే.. మంచి ఫామ్లో ఉన్న ఇతను కేవలం 7 పరుగులే చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 26 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 92/2గా ఉంది. కేఎల్ రాహుల్ (40), శుభ్మన్ గిల్ (2) క్రీజ్లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 70 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా -
ఒకే ఒక్క మ్యాచ్.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సిరాజ్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇచ్చే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారానికి అతడు నామినేట్ అయ్యాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు.. ఆన్లైన్లో అభిమానులు వేసిన ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.ఇక ఆగష్టు 2025 నెలకు గానూ నామినేట్ అయిన పురుష క్రికెటర్ల పేర్లను ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఇందులో ఈసారి ముగ్గురూ బౌలర్లే ఉండటం విశేషం. టీమిండియా నుంచి సిరాజ్, న్యూజిలాండ్ జట్టుకు చెందిన మ్యాట్ హెన్రీ (Matt Henry), వెస్టిండీస్ పేసర్ జేడన్ సీల్స్ (Jayden Seals) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.ఆగష్టు నెలలో ఒకే ఒక్క మ్యాచ్కాగా ఈ ఏడాది ఆగష్టు నెలలో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా.. ఇంగ్లండ్తో జూలై 31- ఆగష్టు 4 వరకు ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో... ఈ హైదరాబాదీ పేసర్ చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు టెస్టుల సిరీస్ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ను విజయతీరాలకు చేర్చాడు.ఆఖరి రోజు.. చివరి సెషన్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ చేతిలో ఆరు వికెట్లు ఉండి విజయానికి కేవలం 73 పరుగుల దూరంలో ఉన్న వేళ ఈ రైటార్మ్ పేసర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (14), ఓలీ పోప్ (27), జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9) రూపంలో కీలక వికెట్లు కూల్చి సిరాజ్ మియా.. ఆఖరి వికెట్గా గస్ అట్కిన్సన్ (17)ను వెనక్కి పంపాడు.సిరీస్ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్రఇలా వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచేలా చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు కూల్చి.. టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు నెలకుగానూ ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.అదరగొట్టిన హెన్రీ, జేడన్ సీల్స్మరోవైపు.. జింబాబ్వేతో టెస్టు సిరీస్లో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ గొప్పగా రాణించాడు. రెండు మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు కూల్చి.. న్యూజిలాండ్ సిరీస్ను 2-0తో వైట్వాష్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు.ఇక పాకిస్తాన్పై 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడంలో జేడన్ సీల్స్ పాత్ర కీలకం. ఆఖరి వన్డేలో ఏకంగా ఆరు వికెట్లు కూల్చి.. పాక్పై విండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కేవలం 4.10 ఎకానమీ రేటుతో సీల్స్ పది వికెట్లు కూల్చడం గమనార్హం.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
చరిత్ర సృష్టించిన జేడన్ సీల్స్.. ‘తొలి బౌలర్’గా రికార్డు
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ‘పనిభారం’ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంటే.. మరోవైపు.. వెస్టిండీస్ పేస్ సంచలనం జేడన్ సీల్స్ (Jayden Seals) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn)పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.202 పరుగుల తేడాతో పాక్ చిత్తుకాగా వెస్టిండీస్ సొంతగడ్డ మీద మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడింది. తొలుత టీ20 సిరీస్లో పాక్ చేతిలో 2-1తో ఓటమిపాలైనన కరేబియన్లు.. వన్డే సిరీస్ను మాత్రం 2-1తో కైవసం చేసుకున్నారు. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో పర్యాటక పాక్ను ఏకంగా 202 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ మేర సిరీస్ను గెలుచుకుంది.నలుగురిని డకౌట్ చేశాడుఈ విజయంలో జేడన్ సీల్స్ది కీలక పాత్ర. వెస్టిండీస్ విధించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్కు సీల్స్ చుక్కలు చూపించాడు. ఓపెనర్లు సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా షఫీక్లను డకౌట్ చేసిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. బాబర్ ఆజం (9), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (0)లను కూడా వెనక్కి పంపాడు.అదే విధంగా.. టెయిలెండర్లు నసీం షా (6), హసన్ అలీ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 7.2 ఓవర్లు మాత్రమే బౌల్ చేసిన జేడన్ సీల్స్.. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి విండీస్కు ఏకపక్ష విజయం అందించాడు.పాక్తో వన్డేలలో తొలి బౌలర్గా అరుదైన ఘనతఈ క్రమంలోనే డేల్ స్టెయిన్ పేరిట ఉన్న రికార్డును జేడన్ సీల్స్ బద్దలు కొట్టాడు. 2012లో సొంతగడ్డపై పాకిస్తాన్తో వన్డేల్లో స్టెయిన్ 39 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. సీల్స్ ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సీల్స్ ఆరు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటి రెండు, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ పడగొట్టడంతో.. 29.2 ఓవర్లలో కేవలం 92 పరుగులే చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా 202 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా 34 ఏళ్ల తర్వాత విండీస్ చేతిలో పాక్ వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి.ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టుల సిరీస్లో భారత ప్రధాన పేసర్ బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతడిపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. ఇక బుమ్రా తదుపరి ఆసియా కప్-2025 బరిలో దిగాల్సి ఉంది. అనంతరం స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్తో టెస్టుల్లో తలపడనుంది. సూపర్ ఫామ్లో ఉన్న జేడన్ సీల్స్ ఈ సిరీస్లో విండీస్కు కీలకం కానున్నాడు.పాకిస్తాన్పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే..👉జేడన్ సీల్స్- వెస్టిండీస్- 6/18👉డేల్ స్టెయిన్- సౌతాఫ్రికా- 6/39👉తిసారా పెరీరా- శ్రీలంక- 6/44👉కార్ల్ రాకెర్మాన్- ఆస్ట్రేలియా- 5/16👉సౌరవ్ గంగూలీ- ఇండియా- 5/16.చదవండి: IPL 2026: ‘ఈసారి వేలంలో ఖరీదైన ప్లేయర్గా అతడే’ -
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
జేడన్ సీల్స్. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో తరుచూ వినిపిస్తున్న పేరు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాదిలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ ఈ ఏడాదే లైమ్లైట్లోకి వచ్చాడు. సీల్స్ ఈ ఏడాది 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్ల్లో 88 వికెట్లు తీశాడు.తాజాగా పాకిస్తాన్పై సంచలన ప్రదర్శనతో సీల్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సీల్స్ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఫలితంగా పాక్ విండీస్ నిర్దేశించిన 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 92 పరుగులకే కుప్పకూలింది.ఈ ఇన్నింగ్స్లో సీల్స్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడు. సీల్స్ దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. పాక్ ఇన్నింగ్స్లో డకౌటైన ఐదుగురు ఆటగాళ్లలో సీల్స్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. సీల్స్ బౌలింగ్లో పాక్ ఆటగాళ్లు బంతి బంతికి గండాన్ని ఎదుర్కొన్నారు. బంతిని వదిలేసినా సమస్యే, ఆడాలని ప్రయత్నించినా సమస్యే.సీల్స్ ప్రదర్శనలు ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగాయి. పాక్తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్లో 3 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సిరీస్కు ముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో 3 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీశాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సీల్స్ వేసిన స్పెల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పెల్స్లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సంచలన ప్రదర్శనల అనంతరం సీల్స్ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్కు మరో పేసు గుర్రం వచ్చిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విండీస్ జట్టు త్వరలో భారత్లో పర్యటంచనుండగా సీల్స్పై ఫోకస్ మరింత పెరిగింది. వరల్డ్ క్లాస్ భారత బ్యాటర్లను అతను ఏ మేరకు నిలవరించగలడో అని చర్చలు మొదలయ్యాయి. సీల్స్ ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలోనూ హాట్ పిక్ అయ్యే అవకాశం ఉంది. అతడిని కేకేఆర్ తన్నుకుపోవచ్చు. ఎందుకంటే అతను కరీబియన్ లీగ్లో ఇదివరకే వారి సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్బాగో నైట్రైడర్స్కు ఆడుతున్నాడు.రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సీల్స్ విండీస్ తరఫున ఇప్పటివరకు 21 టెస్ట్లు ఆడి మూడు 5 వికెట్ల ప్రదర్శనలతో 88 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 31 వికెట్లు తీశాడు. -
మరీ ఇంత చెత్తగా అవుటవుతారా?.. బిక్కముఖం వేసిన రిజ్వాన్
వెస్టిండీస్తో మూడో వన్డేలో పాకిస్తాన్ (WI vs PAK) ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 202 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా కరేబియన్లు 2-1తో సిరీస్ గెలిచి.. 34 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్పై జయకేతనం ఎగురవేశారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఘోర వైఫల్యంపై అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆఖరి వన్డేలో దారుణంగా అవుటైన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది.షాయీ హోప్ విధ్వంసకర అజేయ శతకంఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. కెప్టెన్ షాయీ హోప్ (94 బంతుల్లో 120 నాటౌట్) విధ్వంసకర అజేయ శతకంతో పాటు.. రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 36), జస్టిన్ గ్రీవ్స్ (24 బంతుల్లో 43 నాటౌట్) మెరుపుల కారణంగా విండీస్కు భారీ స్కోరు సాధ్యమైంది.కుప్పకూలిన టాపార్డర్పాక్ బౌలర్లలో నసీం షా, అబ్రార్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. జేడన్ సీల్స్ ధాటికి ఓపెనర్లు సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా షఫీక్ డకౌట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం 9 పరుగులకే నిష్క్రమించాడు.బిక్కముఖం వేసిన రిజ్వాన్ఆ తర్వాత కూడా జేడన్ సీల్స్ తన వికెట్ల వేట కొనసాగించాడు. అబ్దుల్లా షఫీక్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రిజ్వాన్ ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. జేడన్ సీల్స్ సంధించిన ఇన్-స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన రిజ్వాన్.. బంతిని వదిలేశాడు. దీంతో అది అనూహ్య రీతిలో స్టంప్స్ పైభాగానికి తాకగా.. ఊహించని పరిణామంతో రిజ్వాన్ బిక్కముఖం వేశాడు.మరీ ఇంత చెత్తగా అవుటవుతారా?తన బంతిని అంచనా వేయడంలో విఫలమై డకౌట్గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ ఏడాది మొత్తంలో ఇంత చెత్తగా బాల్ను వదిలేసిన ఆటగాడివి నువ్వే’’ అంటూ రిజ్వాన్పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు.. ‘ఇక రిటైర్ అయిపో’ అంటూ బాబర్ ఆజంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.ఇదిలా ఉంటే.. పాక్ టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్లో సల్మాన్ ఆఘా (30), మహ్మద్ నవాజ్ (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29.2 ఓవర్లలో 92 పరుగులకే పాకిస్తాన్ కుప్పకూలింది.విండీస్ బౌలర్లలో ఆరు వికెట్లతో చెలరేగిన జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. గుడకేశ్ మోటి రెండు, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్కు వెళ్లిన పాకిస్తాన్ జట్టు.. టీ20 సిరీస్ను 2-1తో గెలుచుకుని.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్Maulana Rizwan first ball Duck😭😭😭Imagine getting owned by West Indies and still dreaming about beating India pic.twitter.com/TzV2sp5Cnn— A (@chadniket) August 12, 2025


