-
పీసీసీ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష పదవి రేసులో తానూ ఉన్నానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సీఎం పదవిని ఆశించకుండా తాను పనిచేస్తానని, ఈ విషయం చెప్పేందుకు ఈనెల 17న ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు కీలక నేతలు రాహుల్, అహ్మద్పటేల్, కె.సి.వేణుగోపాల్తో పాటు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాను కలుస్తానని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని ఢిల్లీ నుంచి వార్తలొస్తున్నాయని, అదే నిజమైతే మున్సిపల్ ఎన్నికల తర్వాత మార్చాలని తాను అధిష్టానాన్ని కోరతానని తెలిపారు. . -
ఎవరిపై కేసు పెట్టాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారని, అదే జ్వరాలతో ప్రజలు చని పోతుంటే ఎవరిపై కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ హాల్ బయట ఆయన మాట్లాడుతూ.. అధికారులను బ్లీచింగ్ పౌడర్ వేయమంటే డబ్బులు లేవంటున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయలేని పరిస్థితుల్లో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఓనర్ల పంచాయితీపై స్పందిస్తూ ఈటల జెండా ఓనర్లం అనడంలో తప్పులేదన్నారు. గతంలో బతుకుదెరువు కోసం తాను కూడా టీఆర్ఎస్లోకి వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చారు. -
పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలకు పీసీసీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం ఉండదని, తనంతట తాను ఉత్తమ్ తప్పుకుంటే తప్ప పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండ దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ తప్పుకుంటే పీసీసీ రేసులో రేవంత్రెడ్డి, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలుంటారని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు గట్టిపోటి ఇచ్చిందని చెప్పిన జగ్గారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలో 20–25 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ గెలు స్తుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే సానుకూలత ఉంటుందని, అయినా కాంగ్రెస్ కూడా తగినన్ని స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రం లో యూపీఏ అధికారంలోకి వస్తుందన్నారు. -
కేసీఆర్కు గుడి కట్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పినట్లు రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధరను రెండేళ్ల కాలపరిమితిలో అమలు చేసి చూపిస్తే సంగారెడ్డిలోనే ఆయనకు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చెప్పారు. గిట్టుబాటు ధర విధానాన్ని అమలు చేస్తానని అధికారులకు కేసీఆర్ ఇచ్చిన సూచనలను తాను స్వాగతిస్తున్నానన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ రైతుల తరఫున ప్రకటన చేయడంపై జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చినందు వల్లే కేసీఆర్కు ఏదైనా చేసే అవకాశం వచ్చిందన్నారు. కేసీఆర్తో పాటు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా, రాహుల్గాంధీలకు కూడా మరో ఆలయం కట్టిస్తానని చెప్పారు. కేసీఆర్ చెప్పిన రైతుకు గిట్టుబాటు ధర విషయం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అలా జరిగితే కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ విషయాన్ని తాను మానవతా దృక్పథంతో చెపుతున్నానని తెలిపారు. దేవుడు దిగొచ్చినా సాధ్యం కాదు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. అవినీతిని నిర్మూలించే శక్తి ఏ రాజకీయ వ్యవస్థకు లేదని, దేవుడే దిగొచ్చినా లంచగొండితనం నిర్మూలన సాధ్యం కాదని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన విషయంలో ఆ శాఖ అధికారుల అభిప్రాయానికి విలువ ఇవ్వాలన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ల, ఖమ్మం స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదని చెప్పారు. -
పార్టీ ఫిరాయింపులపై అఖిలపక్షం’: భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా శనివారం (23న) ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు కోదండరాం (టీజేఎస్), లక్ష్మణ్ (బీజేపీ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్రెడ్డి (సీపీఐ) లను ఆహ్వానించినట్లు గురువారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా జరుగుతున్న ఫిరాయింపులపై ప్రజలందరూ ఆలోచించాలని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చించాలనే ఆలోచనతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం కూడా కాంగ్రెస్ ఖాతాలోకే: జగ్గారెడ్డి సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్రెడ్డి (మల్కాజ్గిరి), ఉత్తమ్కుమార్రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (భువనగిరి), విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల)లు తప్పకుండా విజయం సాధిస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ఖమ్మం లోక్సభలోనూ కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం ఉందని, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉందని అన్నారు. రాహుల్గాంధీ గాలి వీస్తే ఎక్కువ స్థానాలు ఈసారి కాంగ్రెస్కే వస్తాయని అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు ఈసారి కాంగ్రెస్కు గంపగుత్తగా పడే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు కాదు కదా మనం ఓటేసేదని జనం అనుకుంటే టీఆర్ఎస్ ఊహించని ఫలితాలు కూడా వస్తాయని చెప్పారు. పార్టీని వీడి వెళ్లే వారి విషయంలో పార్టీ తప్పేమీ లేదని, వారి బలహీనతల కార ణంగానే పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్లోకి రమ్మని తనను ఇంతవరకు అడగలేదని, అసలు టీఆర్ఎస్లోకి తనను తీసుకోరని చెప్పారు. అయినా పార్టీ మారే విషయంలో తన బిడ్డ నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు. ఎవరు ఉన్నా, వెళ్లిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్ అని, 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తారని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement