-
అద్భుతం ఆవిష్కృతమైంది.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ డోస్డ్ కేబుల్ బ్రిడ్జి పనుల్లో శనివారం అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడ 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తున్న సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ల అమరికకు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకు ఒక్కో సెగ్మెంట్ను మాత్రమే అమర్చగా... శనివారం ఏక కాలంలో రెండు సెగ్మెంట్లను ఒకేసారి పైకి తీసుకెళ్లి విజయవంతంగా అమర్చారు. కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే ఈ పని పూర్తి చేసిన ఇంజినీరింగ్ టీమ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేందుకు మొత్తం 53 సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా... ఈ రెండింటితో కలిపి 50 సెగ్మెంట్ల అమరిక పూర్తయిందని ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటరమణ తెలిపారు. మిగిలిన మూడు సెగ్మెంట్ల అమరిక పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్మాల్ వరకు దాదాపు కి.మీ. పొడువున నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్సిటీ, మాదాపూర్ రూట్లో వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకోనుంది. హౌరా– కోల్కత్తాల నడుమ నున్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించేలా ఈ వేలాడే వంతెనను నిర్మించనున్నారు ఆరు లేన్లతో తగిన ఫుట్పాత్లతో నిర్మిస్తున్న ఈబ్రిడ్జిపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ చెరిసగం భరించనున్నాయి. ముంబై, గోవా, కోల్కత్తా, జమ్మూకాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఇలాంటి బ్రిడ్జిలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అందుబాటులో లేవు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. ♦ నగరంలోని ఇతర ప్రాంతాలనుంచి హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు వెళ్లే వారికి సదుపాయంగా ఉంటుంది. ♦ జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 36, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలి వెళ్లేవారికి దాదాపు 2 కి.మీ.ల మేర దూరం తగ్గుతుంది. బ్రిడ్జి ముఖ్యాంశాలు.. ♦ అప్రోచ్లతో సహ బ్రిడ్జి పొడవు: 1048 మీ. ♦ కేబుల్ స్టే బ్రిడ్జి (వేలాడే వంతెన): 366 మీ. ♦ అప్రోచ్ వయడక్ట్, ర్యాంప్: 682 మీ. -
జర భద్రం..!
- ఉగ్రవాదుల హిట్లిస్ట్లో నగరంలోని సాఫ్ట్వేర్ కంపెనీలు, మాల్స్ - అప్రమత్తత ప్రకటించిన కేంద్ర నిఘా సంస్థ - ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు సాక్షి, హైదరాబాద్: ముష్కరమూకలు బెంగ ళూరుతో పాటు హైదరాబాద్ నగరాన్నీ టార్గె ట్ చేశారా? ఔననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశాయి. ఈ నెలాఖరు వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించాయి. ఉగ్రవాదుల హిట్లిస్ట్లో సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ప్రముఖ మాల్స్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ హెచ్చరికల్ని పరిగణన లోకి తీసుకున్న పోలీసులు నిఘా ముమ్మరం చేయడంతో పాటు తనిఖీలు, సోదాలు చేపడుతున్నారు. రషీద్ విచారణలో వెలుగులోకి... గత నెల 7న జమ్మూకశ్మీర్ టాంట ప్రాంతం లోని పోలీసు పికెట్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)... గత నెల 13న కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల మేరకు పనిచేసిన ఈ మాడ్యూల్కు అబ్దుల్ రషీద్ హర్గా నేతృత్వం వహించాడు. రషీద్ విచారణలో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. లష్కరే తోయిబా బెంగళూరు, హైదరాబాద్లను టార్గెట్ చేసిందని, ఐటీ సంస్థలతో పాటు మాల్స్లోనూ విధ్వంసం సృష్టించడా నికి పథక రచన చేసినట్లు అతడు తెలిపాడు. ఈ క్రమంలో కేంద్ర నిఘా సంస్థ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఈ నెలాఖరు వరకు... ప్రధానంగా వారాంతాల్లో నిఘా, తనిఖీలు, సోదాలు ముమ్మరం చేయాలని సూచించింది. ఇనార్బిట్ మాల్లో తనిఖీలు... మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్లో పోలీసు లు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు విస్తృత తనిఖీలు చేశారు. సైబరాబాద్ సెక్యూరిటీ వింగ్, మాదాపూర్ పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ ఈ సోదాలు చేశారు. మాల్ సెక్యూ రిటీ సిబ్బంది మెటల్ డిటెక్టివ్తో తనిఖీలు చేశారు. ఐడీ కార్డులు లేనివారిని లోపలికి అనుమతించలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement