-
వర్చువల్ ఐడీలతో ఇక మొబైల్ కనెక్షన్
న్యూఢిల్లీ: కస్టమర్ల ఆధార్ నంబర్ స్థానంలో వర్చువల్ ఐడీల స్వీకరణకు వీలుగా తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం టెలికం కంపెనీలకు సూచించింది. అలాగే, పరిమిత కేవైసీ యంత్రాంగానికి మళ్లాలని కోరింది. జూలై 1 నుంచి నూతన వర్చువల్ ఐడీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ఆధార్ నంబర్కు బదులు ఆధార్కు సంబంధించిన వర్చువల్ ఐడీలను కస్టమర్లు చెబితే సరిపోతుంది. ఓ వ్యక్తి ఆధార్ నంబర్కు 16 అంకెల ర్యాండమ్ నంబర్ను కేటాయిస్తారు. ఆధార్ రూపంలో వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం దీన్ని ఆచరణలోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో టెల్కోలు ఆధార్ ఈకేవైసీ ధ్రువీకరణ స్థానంలో నూతన వర్చువల్ ఐడీ, పరిమిత ఈ–కేవైసీ ఆధారంగా కొత్త కనెక్షన్ల జారీ, చందాదారుల రీవెరిఫికేషన్కు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. -
మీడియాకు చిక్కిన మహేష్ షా డైరీ
కమీషన్ల కోసం కక్కుర్తి పడి కటకటాల పాలైన అహ్మదాబాద్ వ్యాపారి మహేష్ షా డైరీ మీడియాకు చిక్కింది. ఈ డైరీలో ఐడీఎస్ స్కీమ్ కింద మహేష్ షా ప్రకటించిన ఆస్తులు గుజరాత్, మహారాష్ట్ర వ్యాపారులకు చెందినవిగా గుర్తించారు. ఒక శాతం లంచం ఇస్తామనడంతో రూ.13,860 కోట్ల బ్లాక్మనీని కేంద్రప్రభుత్వం ఆదాయ డిక్లరేషన్ పథకం కింద తనదిగా మహేష్ షా ప్రకటించాడు. అయితే ఆ బడాబాబులు చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో రూల్స్ ప్రకారం కట్టాల్సిన 45 శాతం పన్నులో తొలి వాయిదా రూ. 1,560 కోట్లను చెల్లించలేక పారిపోయాడు. దీంతో షాపై అనుమానంతో ఐటీ అధికారులు అతని వెతుకులాట ప్రారంభించారు. ఇటీవలే అతన్ని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ అధికారుల విచారణలో ఆ నగదు అతనిది కాదని గుర్తించారు. ఐడీసీ కింద బయటపెట్టిన బ్లాక్మనీ అంతా తనది కాదని, అది కొందరు రాజకీయనేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలది షా ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అది ఎవరిదో కూడా త్వరలోనే బయటపెడతానని షా పేర్కొన్నాడు. ఈ పరిణామాల అనంతరం షా డైరీ మీడియాకు కంట పడింది. -
బోగస్ ’ఐడీఎస్’ లక్ష్మణరావు మోసపోయాడట!
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో (ఐడీఎస్) రూ.10 వేల కోట్లు నల్లధనం తన వద్ద ఉన్నట్లు డిక్లేర్ చేసి, పన్ను చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల్ని ముప్పతిప్పలు పెట్టిన బాణాపురం లక్ష్మణరావు వెనుక ఉన్న బడాబాబులు’ వెలుగులోకి రానట్లేనా..? ఔననే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తు ఐటీ అధికారులే ఇతడు మోసపోయినట్లు’ నిర్థారించడమే దీనికి కారణం. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు (సీసీఎస్) గురువారం లేఖ రాసిన ఐటీ విభాగం.. లక్ష్మణరావును మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ లేఖను అనధికారంగా తిరస్కరించిన సీసీఎస్ పోలీసులు బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సాక్షి’కి తెలిపారు. (ఆ 10 వేల కోట్లు బోగస్!) ఐడీఎస్ పథకం కింద సెప్టెంబర్ ఆఖరు వరకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన భారీ మొత్తాల్లో నగరం నుంచి డిక్లేర్ చేసిన రూ.10 వేల కోట్లు కూడా ఉంది. దీనిపై అప్పట్లో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాయి. అయినప్పటికీ రెండు నెలల వరకు రూ.10 వేల కోట్లు డిక్లేర్ చేసింది ఎవరనేది ఐటీ అధికారులు బయటకు చెప్పలేదు. సెప్టెంబర్ 30 వరకు డిక్లేర్ చేసిన మొత్తానికి సంబంధించి నల్లబాబులు’ పన్ను/సర్చార్జ్ల్ని మూడు విడతల్లో 2017 మార్చి నాటికి చెల్లించాల్సి ఉంది. మొదటి వాయిదా అయిన రూ.1125 కోట్లు చెల్లించలేక చేతులెత్తేయడంతోనే లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్నగర్లోని అతడి ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్ళపై దాడులు చేసి ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు’. మోసపోయినట్లు అనధికారిక నిర్థారణ... సోదాల నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయిన ఐటీ అధికారులు లక్ష్మణరావును విచారించారు. (బాణాపురం లక్ష్మణ్రావు ఇంట్లో చిల్లి గవ్వ కూడా దొరకలేదు) ఈ నేపథ్యంలోనే ఇతడు తాను ఓ బాబాతో పాటు మరికొందరి మాటలు నమ్మానంటూ ఐటీ అధికారులకు సినిమా చూపించాడు. రైల్ పుల్లింగ్ కాయిన్స్/బౌల్స్ను సేకరించి ఇస్తానని చెప్పిన ఓ బాబా మాటలు నమ్మానంటూ చెప్పుకొచ్చాడు. వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా రూ.10 వేల కోట్లు సంపాదించవచ్చంటూ వారు చెప్పిన నేపథ్యంలోనే ఆ మేరకు డిక్లేర్ చేశానంటూ ఐటీ అధికారులకు తెలిపాడు. దీన్ని గుడ్డిగా నమ్మిన ఐటీ అధికారులు సదరు బాబా ఎవరు? వీరికి దళారులుగా వ్యవహరించింది ఎవరు? తదితర అంశాలను గుర్తించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేయలేదు. ఆర్థిక చట్ట ప్రకారం ఇలాంటి బోగస్ డిక్లరేషన్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉన్నా... ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం లక్ష్మణరావు చెప్పిన మాటల్నే పరిగణలోకి తీసుకున్న ఐటీ అధికారులు అతడు మోసపోయినట్లు అనధికారంగా నిర్థారించేశారు. సీసీఎస్లు లేఖ రాసిన ఐటీ... లక్ష్మణరావు వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేయడం, అతడిపై ఆర్థిక చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయడాన్ని పక్కన పెట్టిన ఐటీ అధికారులు అతడి పైనే సానుభూతి చూపడం ప్రారంభించారు. రైస్ పుల్లింగ్ సహా ఇతర పేర్లతో లక్ష్మణరావును మోసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా సీసీఎస్ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖను చూసి అవాక్కైన అధికారులు బాధితుడు కాకుండా మూడో వ్యక్తి/సంస్థ రాసిన లేఖను ఫిర్యాదుగా స్వీకరించలేమని ఐటీ అధికారులకు స్పష్టం చేశారు. లక్ష్మణరావు మోసం చేశాడని భావిస్తే అతడిపై ఫిర్యాదు చేయాలని, మోసపోయాడనే అభిప్రాయం ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేలా సూచించాలని స్పష్టం చేశారు. బాధితుడే వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తేనే తదుపరి చర్యలు తీసుకోగలమని ఐటీ అధికారులకు చెప్పారు. దీంతో చేసేది లేక ఐటీ అధికారులు తిరిగి వెళ్ళినట్లు సమాచారం. ‘బడాబాబులకు’ బినామీ..! ఐడీఎస్ లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చిన తొలి రోజునే అనేక కథనాలు బయటకు వచ్చాయి. కొందరు ‘బడాబాబులకు’ ఇతడు బినామీ అని, వారి నల్లధనాన్నే మార్చేందుకు తనకు చెందినదిగా డిక్లేర్ చేశారని వినిపించింది. అయితే సెప్టెంబర్ 30తో ఐడీఎస్ స్కీమ్ ముగియగా... నవంబర్ 8న డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సదరు బడాబాబుల’ అంచనాలు తారుమారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పన్ను కట్టలేక లక్ష్మణరావును చేతులెత్తేయమని చెప్పారని తెలిసింది. అతడికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సహకరిస్తామంటూ హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. లక్ష్మణరావుకు సంబంధించి వినిపిస్తున్న కథనాలు, అతడి గత చరిత్రను పరిగణలోకి తీసుకోని ఐటీ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఓ బాబాతో పాటు కొందరి చేతిలో లక్ష్మణరావు మోసపోయాడని, వారి మాటలు నమ్మి రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడటం సానుభూతి చూపించడం ప్రారంభించారు. లక్ష్మణరావు కథలో ఐటీ విభాగం నుంచి ఈ ట్విస్ట్ రావడానికి బడాబాబులు’ తీసుకువచ్చిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. నిందితుడిగా చేర్చాల్సిన వ్యక్తిని బాధితుడిగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
లక్ష్మణ్రావు ఇంట్లో రెండోరోజూ సోదాలు
► ‘రూ.10 వేల కోట్ల’ వెల్లడికి కారణాలపై ఆరా ►48 డాక్యుమెంట్ల స్వాధీనం ►కంపెనీలన్నీ బోగస్ అని వెల్లడి హైదరాబాద్: ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్ల సంపద ఉన్నట్లు వెల్లడించిన బాణపురం లక్ష్మణ్రావు ఇంట్లో ఐటీ అధికారులు బుధవారం రెండోరోజూ విసృ్తతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ఫిలిం నగర్లోని ఆయన నివాసానికి రెండు బృందా లుగా వచ్చిన అధికారులు తొలుత లక్ష్మణ్రావు తోపాటు ఆయన భార్య రమాదేవిని విచారిం చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ వచ్చి ఆయన కుమారులను విచారించారు. రూ.10 వేల కోట్లు వెల్లడించడానికి గల కార ణాలపై లక్ష్మణ్రావును ప్రశ్నించారు. ఇంట్లో ప్రతి అంగుళం సోదా చేశారు. సుమారు 48 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాండూరుకు చెందిన ఓ పరిశ్రమ డాక్యుమెంట్లు, బీబీనగర్లో బీఎల్ఆర్ వెంచ ర్స్ డాక్యుమెంట్లు, తార్నాకలో రెండు భవనా ల పత్రాలు వెలుగు చూశాయి. లక్ష్మణ్రావు స్థాపించిన కంపెనీలన్నీ 2014లోనే ప్రారంభం కావడం, ఇప్పటి వరకు చెల్లించిన ఆదాయ పన్ను వివరాలపై ప్రశ్నించారు. ఆయన భార్య రమాదేవి, కొడుకులు ప్రమోద్, వెంకట సతీశ్లతో పాటు, ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లను కూడా వివిధ అంశాలపై విచారించారు. అయితే ఈ విచారణలో అధికారులకు కావాల్సిన సమాచారం లభించలేదని తెలిసింది. లక్ష్మణ్రావు వెనక ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారా అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. పలు కంపెనీలకు సంబంధించి ఆయన వెల్లడించిన అడ్రస్లన్నీ బోగస్వేనని తేలిపోయింది. ఆయనెవరో స్థానికులకే తెలియదు ఐటీ సోదాలతో వెలుగులోకి వచ్చిన లక్ష్మణ్రావు ఇప్పటి వరకు స్థానికులకు కూడా తెలియకపోవడం గమనార్హం. గతంలో రామంతపూర్ విశాల్ మెగా మార్కెట్ వెనుక ఉన్న అపార్ట్మెంట్ యమున బ్లాక్లోని 410 ఫ్లాట్లో లక్ష్మణ్రావు కొన్నాళ్లు అద్దెకున్నారు. అనంతరం బంజారాహిల్స్కు మకాం మార్చారు. గత అక్టోబర్లో ఫిలింనగర్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేశారు. చార్మినార్ బ్యాంకు చైర్మన్ మీర్ ఆగా పేరిట ఈ ఇల్లు ఉంది. ఆగా గతంలోనే దుండగుల కాల్పుల్లో మృతి చెందగా ఆయన భార్య షమీమ్ ఆగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ఇంటిని లక్ష్మణ్రావుకు విక్రయించారు. ఈ ఇల్లు లక్ష్మణ్రావుతో పాటు భార్య రమాదేవి, ఇద్దరి కొడుకుల పేరిట రిజిస్టర్ అయి ఉంది. -
ఐడీఎస్ జరిమానాను పాత నోట్లతోనే కట్టొచ్చు
నిరాకరించొద్దంటూ బ్యాంకులకు ఐబీఏ సూచన న్యూఢిల్లీ: నల్లధనానికి సంబంధించి ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద ప్రకటించిన సొమ్ముపై డిక్లరెంట్లు తొలి విడతగా కట్టే పన్నులు, జరిమానాలను పాత రూ.500 నోట్ల రూపంలోనూ స్వీకరించవచ్చని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సోమవారం బ్యాంకులకు సూచించింది. అలా చెల్లించిన నిధులకు సంబంధించిన మూలాల గురించి ప్రశ్నించరాదని పేర్కొంది. డిక్లరెంట్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చెల్లింపుల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని బ్యాంకులకు రాసిన లేఖలో సూచించింది. ఐడీఎస్ కింద ప్రకటించిన ఆదాయంపై పన్ను, పెనాల్టీలను పాత నోట్ల రూపంలో తీసుకునేందుకు బెంగళూరులోని ఓ బ్యాంకు శాఖ నిరాకరించిందంటూ ఒక డిక్లరెంటు చేసిన ఫిర్యాదును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి సీబీడీటీ తీసుకొచ్చిన అంశాన్ని ఐబీఏ ప్రస్తావిం చింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనల ప్రకారం ఐడీఎస్ 2016కు సంబంధించి నిర్దేశించిన పన్ను, సర్చార్జి, పెనాల్టీలో కనీసం 25 శాతాన్ని తొలి విడతగా నవంబర్ 30లోగా కట్టాల్సి ఉంటుంది. తదనుగుణంగానే నిధుల మూలం గురించి ప్రశ్నించకుండా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పాత రూ.500 నోట్లతో జరిపే చెల్లింపులను బ్యాంకులు స్వీకరించవచ్చునని ఐబీఏ పేర్కొంది. బ్లాక్మనీని వెలికితీసేందుకు ప్రభుత్వం జూన్లో ఐడీఎస్ను తెరపైకి తెచ్చింది. 45% పన్ను లు, పెనాల్టీలు కట్టడం ద్వారా నల్లధనాన్ని మార్చుకునేందుకు వన్ టైమ్ విండో కింద వెసులుబాటు కల్పించింది. అధికారిక గణాంకాల ప్రకారం 64,275 మంది ఐడీఎస్ కింద రూ.65,250 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు పన్నుల రూపంలో దఖలు పడనున్నారుు. నిబంధనల ప్రకారం పన్నులు, పెనాల్టీలను తొలి విడతగా నవంబర్ 30లోగా, రెండో విడతగా వచ్చే ఏడాది మార్చి 31లోగా పాతిక శాతం చొప్పున కట్టాల్సి ఉంటుంది. మిగతాది వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా చెల్లించాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement