-
పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులుగా మార్చేందుకు తరలిస్తున్న పిల్లలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కాపాడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), ఆర్పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీఓతో కలసి చేపట్టిన ఈ ఆపరేషన్లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టారు. వీరందరినీ హైదరాబాద్లోని వివిధ కర్మాగారాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు అధికారులకు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 374, 341ల కింద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను పశ్చిమ బెంగాల్కు చెందిన రంజాన్ మోల్లా, షేక్ సైదులు, ప్రియారుల్షేక్, జాకీర్ అలీ, సురోజిత్ సంత్రా, జార్ఖండ్కు చెందిన పింటుదాస్, హైదరాబాద్ చార్మినార్కు చెందిన సుసేన్ తుడు, అబ్దుల్ అల్మాని మోండేల్గా గుర్తించారు. కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్లోని ప్రభుత్వ హోమ్కు పంపినట్టు అధికారులు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అదనపు డీజీ శిఖాగోయల్ అభినందించారు. -
పీసీబీ తో సమావేశం అనవసరం
► కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ న్యూఢిల్లీ: పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో సమావేశమయ్యే అవసరం బీసీసీఐకి లేదని కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయ పడ్డారు. దుబాయ్ లో పీసీబీ అధికారులతో బీసీసీఐ సమావేశమవ్వడాన్ని గోయల్ తప్పుబట్టారు. వారు పీసీబీతో ఎందుకు సమావేశమయ్యారో అర్థం కావడం లేదన్నారు. పాక్ ఉగ్రవాద చర్యలు ఆపె వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగవని స్పష్టం చేశారు. సోమవారం బీసీసీఐ, పీసీబీల మధ్య జరిగిన సమావేశంపై మీడియా ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. గోయల్ మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలాను కలిసి ఈశాన్య రాష్ట్రల్లో క్రీడల అభివృద్ధి విషయంపై చర్చించారు. ఇప్పటికే రూ.4.5 కోట్లతో ఫుట్ బాల్ మైదానాన్ని మంజూరు చేశామని గోయల్ తెలిపారు. 2015-2023 లోఇరుదేశాల మధ్య ఐదు ద్వైపాక్షిక సిరీస్ ఒప్పందాలు జరిగాయి. అయితే పాక్ ఉగ్రవాద చర్యలు ప్రోత్సహించడంతో ఈ సీరిస్లకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పీసీబీ రూ.387 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటు బీసీసీఐకి లీగల్ నోటిసులు పంపించింది. ఈ విషయం చర్చించేందుకు సోమవారం బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ, సీఈవో రాహుల్ జోహ్రి, జీఎం ఎంవీ శ్రీధర్లు దుబాయ్లో పీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ద్వైపాక్షిక సిరీస్లు కొనసాగించలేమని వారు పీసీబీ అధికారులకు తేల్చి చెప్పారు. -
క్రికెట్ను క్రీడా నియమావళిలో చేర్చుతాం: గోయెల్
దేశంలోని అన్ని క్రీడల్లాగే క్రికెట్ కూడా ప్రభుత్వ క్రీడా నియమావళి పరిధిలోకి రావాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ అయినప్పటికీ క్రికెట్ను స్పోర్ట్స్ కోడ్లో చేర్చడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ‘క్రికెట్ను కూడా క్రీడా నియమావళిలో చేర్చుతాం. అన్ని క్రీడల్లాగే క్రికెట్ ఈ జాబితాలో ఉండాలనుకుంటున్నాం. లోధా కమిటీ నిబంధనల మేరకు స్పోర్ట్స్ కోడ్ను పునరుద్దరిస్తున్నాం. త్వరలో ప్రకటించబోయే ఈ జాబితాలో క్రికెట్ను చేరుస్తాం. త్వరలోనే దీనిపై స్పష్టతనిస్తాం’ అని గోయెల్ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement