బాలికపై మతాచార్యుడి అత్యాచారం
చిన్సురా: పశ్చిమబెంగాల్లో చిన్సురాలోని ఓ బాలికల పునరావాస కేంద్రంలో దారుణం జరిగింది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ఓ మైనర్ బాలికపై మతాచార్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిగా పునరావాస కేంద్రంలో ఉంటున్న ఆ అమ్మాయిని గత నెల రోజుల నుంచి చిత్రహింసలు పెడుతూ, లైంగిక దాడి చేశాడు. ఓ ఎన్జీవో ఫిర్యాదు మేరకు పోలీసులు మతాచార్యుడిపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాధితురాలిని ఇదే జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో నడిచే బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు.