-
జాను, రామ్ల పెళ్లి ఫోటో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు
కోలీవుడ్ హిట్ సినిమా '96'లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఈ సినిమాలో వారిద్దరి చిన్ననాటి పాత్రలో నటించిన గౌరీ కిషన్, ఆదిత్య కూడా చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా హీరో,హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. చిన్నప్పటి త్రిషగా జాను పాత్రలో గౌరీ కిషన్ మెప్పిస్తే.. చిన్నప్పటి విజయ్ సేతుపతి 'రామ్' పాత్రలో ఆదిత్య కనిపించి ప్రేక్షకులను ఫిదా చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో గౌరీ కిషన్ సినిమాలు చేస్తోంది. టాలీవుడ్లో సుస్మిత కొణిదెల నిర్మించిన ‘శ్రీదేవి శోభన్బాబు’లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆధిత్య కూడా కోలీవుడ్లో పలు సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి కోలీవుడ్లో 'హాట్ స్పాట్' అనే సినిమాలో నటించారు. తమిళంలో ఆ సినిమా నేడు (మార్చి 29) విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా గౌరీ కిషన్ కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఆ ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. వారిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారంటూ కోలీవుడ్లో నెట్టింట వార్తలు కూడా వచ్చేశాయ్. దీంతో నెటిజన్లు కూడా షాకయ్యారు. కొందరైతే ఏకంగా వారిద్దరికి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఆ ఫోటోలతో పాటు వారు ఇచ్చిన క్యాప్షన్ చూసిన కొందరు ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పడంతో కాస్త ఆ ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. సినిమా సెట్స్లో తీసిన ఫోటోలు అని తేలడంతో ఇలాంటి షాకులు ఇస్తే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన హాట్ స్పాట్ ట్రైలర్ కూడా కోలీవుడ్లో పెద్ద దుమారమే రేగింది. నేడు విడుదలైన ఈ సినిమా ఇంకెన్నీ వివాధాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) -
లక్ష సైనికుల కోటి కన్నుల కెమెరా!
నా చేతిలో కెమెరా ఉంటే నాకు భయమనేదే లేదు’ అనేది ఫొటోగ్రాఫర్ గౌరీ గిల్కు ఇష్టమైన మాట. ఈ కారణం వల్లే కావచ్చు ఆమె ఏ భయమూ లేకుండా మారుమూల పల్లెల నుంచి మహా అరణ్యాల వరకు వెళ్లింది. తన భుజాల మీద కెమెరా ఉంటే, తన చుట్టూ లక్షల సైన్యం ఉన్నట్లే. వర్తమాన చరిత్ర, సంస్కృతి, సంబరాన్ని తన కెమెరా కంటితో పట్టుకుంది గౌరీ గిల్. తన ఫొటో సిరీస్ ‘నోట్స్ ఫ్రమ్ ది డిజర్ట్’తో ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ పిక్టెట్ అవార్డ్ గెలుచుకుంది. స్విట్జర్లాండ్కు చెందిన మల్టీనేషనల్ ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పిక్టెట్ ‘ప్రిక్స్ పిక్టెట్’ (ఇంటర్నేషనల్ అవార్డ్ ఇన్ ఫొటోగ్రఫీ)కి 2008లో శ్రీకారం చుట్టింది... చండీగఢ్లో పుట్టిన గౌరి గిల్ దిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో బీఎఫ్ఏ చేసింది. న్యూయార్క్లోని ‘పార్సన్ స్కూల్ ఆఫ్ డిజైన్’లో ఫొటోగ్రఫీలో బీఎఫ్ఏ, స్టాన్ఫర్డ్ యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో ఎంఎఫ్ఏ చేసింది. అమెరికా, ఇండియాలో ఉన్న బంధువులను ఫొటోలు తీయడంతో తన ప్రయాణం మొదలైంది. రాజస్థాన్లోని అట్టడుగు వర్గాల జీవితాలను అధ్యయనం చేసిన తరువాత తాను చేసిన ఫొటో ప్రాజెక్ట్ ‘నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్’కు మంచి పేరు వచ్చింది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ‘జన్నత్’... మొదలైన ఎగ్జిబిషన్లు, ప్రాజెక్ట్లతో ప్రశంసలు అందుకుంది. నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే... ఈ ప్రాజెక్ట్ కోసం రాజస్థాన్లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఒక్కొక్క అడుగు వేస్తూ అక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. సంచారుల నుంచి రైతుల వరకు ఎంతోమందితో మాట్లాడింది. కాలాలతో పాటు మారే వ్యక్తుల జీవితాలను గమనించింది. తాను పరిశీలించిన జీవితాల గురించి డైరీలో రాసుకుంది. ఆ తరువాత తన కెమెరా ప్రయాణం రాజస్థాన్ మారుమూల ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ఆదివాసుల ఇళ్ల దగ్గరకు చేరింది. వర్లీ ఆర్ట్ను ఒడిసిపట్టుకుంది. ఫలానా ఊళ్లో ఫలానా ప్రత్యేకత ఉందనే మాట చెవికి సోకగానే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతుంది. మోహడా అనే ఊళ్లో గ్రామస్థులు పురాణ పాత్రల మాస్క్లను ధరించి పెద్ద ఊరేగింపు తీస్తారు. ఈ మాస్క్లనే సబ్జెక్ట్గా తీసుకొని ఫొటోప్రాజెక్ట్ చేసింది. ఒకరోజు ఒక గ్రామంలోని పశువుల ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్ లేడు. అయితే ఆ డాక్టర్ సీట్లో దోమ మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. పేషెంట్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఏదో మాస్క్ పెట్టుకున్నాడు. ఆ ఆస్పత్రిలోని పాత సామాను, గోడలకు వేసిన రంగులు, ఆస్పత్రి చుట్టుపక్కల రకరకాల ఆవులు, వాటిని కాచుకు కూర్చున్న రైతులు... ఈ అంశాలన్నీ వచ్చేలా ఫొటోలు తీసింది. ఈ ఫోటోల నుంచి ఆలోచించిన వారికి ఆలోచించినన్ని కోణాలు కనిపిస్తాయి. ఎవరి వ్యాఖ్యానాలూ అవసరం లేకుండానే సమాధానాలు దొరుకుతాయి. మొదట్లో ఒక పక్షపత్రికలో ఫొటోగ్రాఫర్గా పనిచేసింది గౌరి. తన ఆసక్తి గ్రామాలు, మారుమూల పల్లెల్లోని స్కూళ్లపై ఉండేది. అయితే తన ఉద్యోగం ద్వారా పల్లెలకు వెళ్లే అవకాశం రాలేదు. దీంతో పల్లెబాట పట్టడానికి ఉద్యోగాన్ని వదిలింది. ఎన్నో స్కూళ్ల చుట్టూ తిరిగింది. ‘ఇది స్కూల్ కాదు. ఇదే అసలు సిసలు ప్రపంచం’ అనుకుంది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ప్రాజెక్ట్తో ప్రభుత్వ పాఠశాలల్లోని గోడలపై ఉన్న రాతలు, చిత్రాలను డాక్యుమెంట్ చేసింది. ‘ట్రేసెస్’ పేరుతో సమాధులపై చేసిన ప్రాజెక్ట్ మరో అద్భుతం. నిజానికి గౌరీ గిల్ అద్భుతాలు సృష్టించడానికి కెమెరా పట్టుకోలేదు. భిన్న సంస్కృతులు, భౌగోళిక అందాలపై ఆసక్తే అద్భుతాలను సృష్టించి ఆమెను అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ని చేశాయి. 2011లో కెనడాలోని ప్రతిష్ఠాత్మకమైన ఫొటోగ్రఫీ అవార్డ్ గ్రాంజ్ గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గౌరికి వినడం ఇష్టమైన పని. విన్న విషయాలను విశ్లేషించుకొని తన కెమెరాకు ముడిసరుకుగా మార్చుకోవడం మరింత ఇష్టమైన పని. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
రంగస్థలం ఏడు ప్రపంచాలు
అక్షరాల్లోని రచనలను రంగస్థలం మీదికి తీసుకురావడం తేలిక కాదు. ఎందుకంటే, రచన చదివేటప్పుడు పాఠకుల మదిలో ఎన్నో రంగస్థలాలు ఆవిష్కారం అవుతాయి. తమ ఊహలకు, రంగస్థలానికి చెలిమి ఏర్పడాలి. ఈ విషయంలో నాటక సమాజం ‘థియేటర్ నిషా’ విజయం సాధించింది. స్త్రీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రచనలు చేసింది ప్రసిద్ధ హిందీ రచయిత్రి గౌర్ పంత్ (శివానీ) ఇది ఆమె శతజయంతి సంవత్సరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంత్ కథలను నాటకంగా మలిచి ప్రదర్శిస్తోంది థియేటర్ నిషా... గుజరాత్లోని రాజ్కోట్లో జన్మించింది గౌర్ పంత్. పన్నెండు సంవత్సరాల వయసులో పంత్ తొలి కథ ఒక పిల్లల పత్రికలో ప్రచురిత మైంది. టాగూర్ ‘శాంతినికేతన్’లో చదువుకోవడం తనలోని సృజనను మెరుగుపెట్టుకోవడానికి కారణం అయింది. శివానీ కలం పేరుతో రాసిన ‘మై ముర్గా హూ’ కథకు ఎంతో పేరు వచ్చింది. ‘లాల్ హవేలి’ పేరుతో తొలి నవల రాసింది. ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. అయితే ఆమె ఏది రాసినా స్త్రీ జీవితమే కేంద్రంగా ఉండేది. ఆ స్త్రీ తన కాల్పనిక ఊహాలోకం నుంచి దిగివచ్చిన స్త్రీ కాదు. తనకు పరిచయం ఉన్న స్త్రీలు, తాను చూసిన స్త్రీలు... ఇలా ఎందరో జీవితాల నుంచి ఎన్నో అద్భుతమైన పాత్రలు సృష్టించింది శివానీ. భర్త నుంచి హింసకు గురైన స్త్రీలు, అత్యాచార బాధితులు, కుటుంబ హింస బాధితులు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు... ఎంతోమంది బాధితులు ఆమె రచనల్లో కనిపిస్తారు. శివానీ కూతురు ఐరా పాండే తల్లి రాసిన కొన్ని కథలను ‘అపరాధి: ఉమెన్ వితౌట్ మెన్’ పేరుతో ఇంగ్లీష్లోకి తీసుకువచ్చింది. దీనికి రెండవ భాగం కూడా వచ్చింది. ‘అపరాధి’ రెండవ భాగంలోని కథలను థియేటర్ నిషా ‘బిన్ను’ పేరుతో నాటకీకరించింది. ఇందులో బిన్ను, నసీమ్, మిసెస్ ఘోష్, లలిత, పాగలియా, మధుబెన్తో పాటు ఒక తల్లి పాత్ర కూడా ఉంటుంది. ఏడుగురి జీవితాలు ఏడు ప్రపంచాలై కనిపిస్తాయి. బిన్ను నుంచి నసీమ్ వరకు ఎవరూ ఊహాల్లో పుట్టిన పాత్రలు కాదు. నిజజీవితంలోని మహిళలు. వారి జీవితాలను శివానీ దగ్గరి నుంచి చూసింది. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత, శైలి, పోరాటరూపం ఉంటాయి. ‘ఏడు పాత్రలను కలిపి నాటకానికి బిన్ను అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగితే ప్లే డైరెక్టర్ బాలక్రిష్ణన్ ఇచ్చిన సమాధానం ఇది... ‘శివానీ రచనల్లో నాకు బాగా నచ్చిన పాత్ర బిన్ను. అందుకే ఆ పేరు పెట్టాను. బిన్ను ఎక్కడా, ఎవరికీ తలవంచదు. పురుషులను సవాలు చేస్తుంది. అడ్డంకుల ముళ్లచెట్లను నరికేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె స్వరంలో ధిక్కారం, వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం కనిపిస్తాయి’ కేరళ నాటకోత్సవాలలో భాగంగా థియేటర్ నిషా ప్రదర్శించిన ‘బిన్ను’ నాటకానికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల్లో శివానీ రచనలతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారితోపాటు ఎంతమాత్రం పరిచయం లేని వారు కూడా ఉన్నారు. అయితే అందరికీ నాటకం నచ్చింది. ‘శివానీ రచనల గురించి తెలియని ఈ తరానికి బిన్ను నాటకం చూస్తే రచయిత్రి దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శతజయంతి సంవత్సరంలో శివానీకి ఒక ఘనమైన నివాళిగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు’ అంటుంది సీమా అనే ప్రేక్షకురాలు. ‘బిన్ను’ నాటకంలో... -
నటిని కావాలనుకోలేదు, సమంతతో పోలుస్తున్నారు: గౌరి
‘‘శ్రీదేవి శోభన్బాబు’లో నేను చేసిన జాను పాత్ర మోడ్రన్గా ఉంటుంది’’ అని హీరోయిన్ గౌరి జి. కిషన్ అన్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గౌరి జి. కిషన్ మాట్లాడుతూ– ‘‘నేను నటిని కావాలనుకోలేదు. జర్నలిస్ట్ అవుదామనుకున్నా. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తమిళ మూవీ ‘96’ ఆడిషన్స్కి వెళ్లి సెలక్ట్ అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’. ‘ఏమాయ చేసావె’ టైమ్లో సమంత ఎలా ఉన్నారో ఇప్పుడు నేను అలా ఉన్నానని చాలామంది అన్నారు. ఆమెలా నాకూ అన్ని భాషల్లో నటించాలనుంది. ఇండస్ట్రీలో మహిళా రచయితలు తక్కువగా ఉన్నారు.. ఎక్కువమంది రావాలి. నేను కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు. -
ఉన్నచోటే ఉండిపోకండి కొత్తవి నేర్చుకోండి
గౌరికి నది ఇరుకై పోయింది. సముద్రంలోకి వెళ్లింది. నది అంటే న్యూఢిల్లీ లోని ‘ఎయిమ్స్’. అందులో డెంటిస్ట్ గౌరి. సముద్రం అంటే న్యూయార్క్లోని డబ్ల్యూ.ఎం.ఎస్.! పన్నెండేళ్లుగా పసిఫిక్ మహా సముద్రం లాంటి ఆ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇష్టంగా ఈతకొడుతూ ఉన్నారు గౌరీ. అందులోని అన్ని డిపార్ట్మెంట్ల పని నేర్చుకుని, అన్ని డిపార్ట్మెంట్లకు టీమ్ లీడర్గా చేశారు. ఆపరేషన్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్సా్ఫర్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్.. అన్నీ నేర్చుకున్నారు. పసిఫిక్ సముద్రం అన్ని ఖండాలను టచ్ చేస్తూ ఉన్నట్లుగానే సముద్రం లాంటి తన కంపెనీలో అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు గౌరి. ప్రస్తుతం ఆమె ఆ కంపెనీలోనే హెల్త్ కేర్ విభాగానికి బిజినెస్ యూనిట్ లీడర్ గా ఉన్నారు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మనం నిరర్థకంగా ఒడ్డున పడ్డట్లేనని అంటారు గౌరి పురి. ఉన్నచోటే ఉండి పోవద్దంటారు. గౌరీపురి తన ఈడు పిల్లల్లో కాస్త భిన్నంగా ఉన్న అమ్మాయి. కనుక ఇప్పుడూ భిన్నంగానే ఉన్నారని అనుకోవచ్చు. పదేళ్ల వయసులోని ఆమె భిన్నత్వం గురించి మొదట తెలుసుకుందాం. పిల్లలు ఆటలు ఆడే వయసులో కిందపడటం, దెబ్బలు తగలడం, అప్పుడప్పుడు రక్తం వారి కంట పడటం సహజంగా జరిగేదే. అప్పుడు మిగతా పిల్లలు భయంతో కళ్లు మూసుకుంటే గౌరి మాత్రం ఏ మాత్రం బెదురు లేకుండా ఆ దెబ్బలు తగిలిన పిల్లలకు గాయం దగ్గర తుడిచి, శుభ్రం చేసేవారట. ‘‘ప్రాథమిక చికిత్స వంటిది అనుకోండి’’ అని ఇప్పుడా సంగతులను నవ్వుతూ గుర్తు చేసుకుంటారు గౌరి. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉంటుంది వాళ్ల కుటుంబం. గౌరి అక్కడే పుట్టి పెరిగారు. 21వ యేట న్యూఢిల్లీలోని ‘ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్’లో డెంటల్ సర్జన్గా తనకో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె అక్కడ పని చేసింది రెండున్నరేళ్లే. తర్వాత ఆర్నెల్లు సెలవు పెట్టి.. ‘నది కాదు నాకు కావలసింది, సముద్రం’ అని అనుకుని న్యూ ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లి డబ్లు్య.ఎన్.ఎస్. కంపెనీలో చేరిపోయారు! డబ్లు్య.ఎన్.ఎస్. అంటే వరల్డ్ నెట్వర్క్ సర్వీసెస్. బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్లు 1996లో ముంబైలో ప్రారంభించిన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ అది. ప్రపంచం అంతటా బ్రాంచీలు ఉన్నాయి. గౌరి కోరుకున్నట్లుగా నిజంగా అది సముద్రమే. 2007లో అందులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. డెంటల్ సర్జన్కి బిజినెస్ మేనేజ్మెంట్తో ఏం పని? యూఎస్ మార్కెట్లో హెల్త్ క్లెయిమ్లను చక్కబెట్టడానికి వాళ్లకొక ఇండియన్ మెడికల్ డాక్టర్ కావలసి వచ్చింది. అక్కడ ఆమె 60 మంది డాక్టర్ల బృందాన్ని నడిపించాలి. గౌరి వెంటనే యూఎస్ విమానం ఎక్కేశారు. ఆ తర్వాత ఆమె కెరీర్ అంతా అంత ఎత్తులోనే ఎగురుతూ ఉంది. నేర్చుకోవడం ఆమెకు ఇష్టం. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఏ సబ్జెక్టునూ తనది కాదు అనుకోరు. అక్కడ టీమ్ని నడుపుతూనే ఆపరేషన్ థియేటర్స్ అని, బోర్డ్ రూమ్స్ అని లేకుండా అన్ని విభాగాల విధాన నిర్ణయాల గురించి తెలుసుకున్నారు. నిర్ణయ విధానాలను గమనించారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా చేరగానే మొదట బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్కేర్ల నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు. మూడేళ్లకే ఆ సముద్రం కూడా బోర్ కొట్టేసింది గౌరికి! సముద్రంలో ఇంకా తనకు తెలియని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని గాలించారు. డబ్లు్య.ఎన్.ఎస్. ఒక పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ అన్ని ఖండాలకూ వ్యాపించినట్లు డబ్లు్య.ఎన్.ఎస్. ఖండాంతర శాఖలుగా విస్తరించి ఉంది. పైగా గౌరికి ఒకే సీట్లో హాయిగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మన కెరీర్ అక్కడితో ఆఖరు అంటారు. తను చేస్తున్న పని చేస్తూనే ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ఉన్న తమ కంపెనీ వ్యవహారాలను కూడా యూఎస్ నుంచే ఆమె నడిపించారు. రోజుకు కనీసం 18 నుండి 20 గంటలు పని చేస్తారు గౌరి. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ‘‘పనే నా శక్తి’’ అని నవ్వుతారు గౌరి. కష్టం ఊరికే పోతుందా? 2017లో ఆమెకు ఎవరూ ఊహించనంత పెద్ద ప్రమోషన్. డబ్లు్య.ఎన్.ఎస్.లోని హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్ యూనిట్లకు ఆమె బిజినెస్ లీడర్ అయ్యారు! ఈ మూడేళ్లలో మళ్లీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్స్ఫార్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్లో పట్టు సాధించారు. గౌరి హెల్త్ కేర్ యూనిట్ను చేపట్టినప్పుడు 7 శాతం మాత్రమే ఉన్న ఆ విభాగం రాబడి ఇప్పుడు ఆమె నేతృత్వంలో 20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆమె మొత్తం కలిపి 4 వేల మంది డాక్టర్లు, కోడర్స్, ఫార్మసిస్టులు, హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ను లీడ్ చేస్తున్నారు! వారిలో ఒక్క సీనియర్ కూడా ఇప్పటివరకు ఆమె టీమ్ నుంచి వెళ్లిపోలేదు. ఎందుకు వెళ్లిపోతారు? ఆమె దగ్గర పని చేయడమంటే ఆమెతో సమానంగా పని చేయడమేనన్న గొప్ప గుర్తింపును పొందుతున్నప్పుడు! ‘‘కొత్త విషయాలను నేర్చుకోడానికి యువ వృత్తి నిపుణులు చిన్నతనంగా భావించకూడదు. నేర్చుకోవడం అన్నది నన్ను ఈ వయసులోనూ యవ్వనోత్సాహంతో ఉంచుతోంది.’’ – గౌరి పురి (38), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డబ్లు్య.ఎన్.ఎస్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement