-
ఈ వ్యాధి పిల్లలో అరుదుగా వస్తోంది జాగ్రత్తగా ఉండండి
-
తెలంగాణ ఆస్పత్రుల్లోనూ కరోనా విజృంభణ..
-
గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 44 మందికి, ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్గా తేలింది. గాంధీలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్ సర్జన్స్ కోవిడ్ బారిన పడ్డారు. అదే విధంగా ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా తెలంగాణలో సోమవారం 1,825 కోవిడ్ కేసులు నమోదయయాయి. ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855, మరణాల సంఖ్య 4,043కి చేరింది. ప్రస్తుతం 14, 995 యాక్టివ్ కేసులున్నాయి. చదవండి: కరీంనగర్లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్ కటౌట్ చదవండి: సీఎం కేసీఆర్తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ -
ఒమిక్రాన్ గుట్టు ‘గాంధీ’లో తేలుస్తారు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ప్రపంచ దేశాలను వణికిసున్న ఒమిక్రాన్ వైరస్పై గాంధీ వైద్య నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. వైద్య పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ (ద్రావకాలు) అందిన వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించి ఒమిక్రాన్ గుట్టు విప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి మైక్రోబయోలజీ విభాగంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాధితుని నుంచి సేకరించిన నమూనాలను రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ (ఆర్టీ పీసీఆర్) టెస్ట్ చేసిన తర్వాత వైరస్ కణ నిర్మాణానికి సంబం ధించి ఆర్ఎన్ఏ, డీఎన్ఏలతో పాటు యమినో యాసిడ్స్ సీక్వెన్స్ను పరిశీలిస్తారు. కణ నిర్మాణంలో హెచ్చుతగ్గులు, అదనపు కణాల నిర్మాణం, వాటి సంఖ్య ఆధారంగా రూపాంతరం (మ్యుటేషన్ ) జరిగిన తీరుతెన్నులతో పాటు రూపాంతరం చెందిన వైరస్ మరింత బలపడి విజృంభిస్తుందా లేక బలహీనంగా మారిందా అనేది నిర్ధారిస్తారు. ప్రారంభదినాల్లో పుణేకి పంపి... గాంధీ మైక్రోబయోలజీ విభాగం ఆధ్వర్యంలో జీనో మ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. రీ ఏజెంట్స్ టెండరు ప్రక్రియ ముగిసిందని, సంబంధిత ద్రావకాలు అందిన వెంటనే మైక్రోబయోలజీ ల్యాబ్ ఇన్చార్జి ప్రొఫెసర్ నాగమణి నేతృత్వంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు ప్రారంభి స్తామని తెలిపారు. ప్రారంభదినాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలను తుది పరిశీలన కోసం పుణెలోని సెంట్రల్ ల్యాబ్ కు పంపించి నిర్ధారించుకుంటామని, పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తర్వాత నివేదికలను నేరుగా వెల్లడిస్తామని వివరించారు. ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్తలు పాటించండి కరోనా వైరస్ ముప్పు తొలగిపోలేదని, ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు సూచించారు. రూపాంతరం చెందిన ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో నమోదైన నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, అర్హులంతా రెండు డోసుల టీకా వేయించుకోవాలని కోరారు. ప్రస్థుతం గాంధీలో 9 బ్లాక్ ఫంగస్, 18 కేసులకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. -
Black Fungus: 6 తప్పుడు కేసులను గుర్తించిన వైద్యులు
గాంధీ ఆస్పత్రి: ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడు నెల క్రితం కరోనా బారిన పడ్డాడు. కొద్దిరోజుల క్రితం పైదవడ దంతాల నొప్పితో పాటు కదులుతున్నట్లు అనిపించడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. స్కానింగ్లు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి బ్లాక్ఫంగస్ అని చెప్పడంతో సదరు యువకుడు తీవ్రభయాందోళనకు గురై వెంటనే అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రోజలు వైద్యం అందించి బ్లాక్ఫంగస్ మందులు తెచ్చుకోవాలని సూచించారు. సదరు మందులు ప్రైవేటులో అందుబాటులో లేక యువకుడు రిఫరల్పై గాంధీ ఆస్పత్రి బ్లాక్ఫంగస్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల స్కానింగ్లు, వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు బ్లాక్ ఫంగస్ కాదని, సాధారణ పిప్పిపన్ను అని నిర్ధారించి, డెంటల్ వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి డిశ్చార్జి చేశారు. ► పాతబస్తీకి చెందిన మహిళకు కరోరా పాజిటివ్, మూడు రోజుల క్రితం పక్షవాతం రావడంతో స్థాని క ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బ్లాక్ఫంగస్ లక్షణా లు ఉన్నాయని చెప్పడంతో భయాందోళనకు గురైంది. తెలిసిన వారి సలహా మేరకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్తోపాటు పెరాలసిస్ వచ్చిందని, బ్లాక్ఫంగస్ ఆనవాళ్లు లేవని చెప్పి, కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థత చేకూరిన తర్వాత డిశ్చార్జి చేశారు. ► బ్లాక్ఫంగస్ను బూచిగా చూపిస్తూ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను అడ్డంగా దోచు కుంటున్నాయి. పిప్పిపన్ను, పక్షవాతం వంటి రుగ్మతలను బ్లాక్ఫంగస్ ఖాతాలో వేయడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ► ఓల్డ్సిటీకి చెందిన మరోవ్యక్తికి కరోనా, బ్లాక్ఫంగస్ లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, బ్లాక్ఫంగస్ సోకిందని చెప్పారు. సదరు వ్యక్తి గాంధీఆస్పత్రిలో చేరగా, నిర్ధారణ పరీక్షల్లో కరోనా, బ్లాక్ఫంగస్ లేవని తేలింది. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి బ్లాక్ఫంగస్ వార్డులో రిఫరల్పై చేరిన ఆరుగురు బాధితులకు ఫంగల్ లక్షణాలు మచ్చుకైనా లేవని గుర్తించారు. ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించి బాధితులను డిశ్చార్జి చేశారు. ఆరుగురు బాధితులను గుర్తించి డిశ్చార్జి చేశాం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్పై గాంధీఆస్పత్రి బ్లాక్ఫంగస్ వార్డులో చేరిన ఆరుగురికి ఫంగల్ లక్షణాలు లేవు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డిశ్చార్జీ చేశాము. వీరిలో ముగ్గురు దంత సంబంధ సమస్యలతో... మరో ముగ్గురు పెరాలసిస్ (ఫిట్స్)తో బాధపడుతున్నారు. స్కానింగ్ చేసిన తర్వాత బ్లాక్ఫంగస్ సోకినట్లు భావించిన అవయవ భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ఫంగల్ కల్చర్ టెస్ట్కు మైక్రోబయోలజీ ల్యాబ్కు పంపిస్తాము. బయాప్సీ నివేదిక ఆధారంగా బ్లాక్ఫంగస్గా నిర్ధారిస్తాము. ప్రజలు భయాందోళనకు గురికావద్దు. గాంధీ, ఈఎన్టీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్లాక్ఫంగస్ నివారణకు వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement