breaking news
furniture shop
-
ఐదుగురూ ఆహుతి!
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్లోని సాయి బిశ్వాస్ చాంబర్స్లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఆదివారం ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తంమీద బచ్చాస్ ఫర్నిచర్ సంస్థ 18 గంటల పాటు మండింది. సెల్లార్లో మొదలైన మంటలు సాయి బిశ్వాస్ చాంబర్స్ సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతోపాటు నాలుగు అంతస్తుల్లో నిర్మితమైంది. దీని గ్రౌండ్ ఫ్లోర్లో బచ్చాస్ దుకాణం ఎంట్రన్స్తోపాటు మరో ఫర్నిచర్ దుకాణం ఉంది. బచ్చాస్ ఫర్నిచర్ మూడు అంతస్తుల్లో విస్తరించి ఉండగా... సబ్–సెల్లార్, సెల్లార్లతోపాటు భవనం కుడి వైపు ఉండాల్సిన సెట్ బ్యాక్కు రేకులు వేసి గోదాములుగా వాడుతున్నారు. రెండు రోజుల క్రితం చైనా నుంచి భారీగా సరుకు వచ్చింది. వీటిని దుకాణంతోపాటు గోదాముల్లోనూ భద్రపరిచారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో బచ్చాస్ దుకాణం సెల్లార్ వెనుక వైపు మంటలు అంటుకున్నాయి. ఇవి గ్రౌండ్తోపాటు మొదటి అంతస్తుకు పాకాయి. రెండు, మూడు, నాలుగు అంతస్తులతో పాటు సబ్–సెల్లార్లోకి పొగ విస్తరించింది. సబ్–సెల్లార్లో ఉన్న సరుకు మాత్రం యథాతథంగా ఉంది.కెమికల్స్ కూడా ఉండటంతో... ఈ భవనం సెల్లార్లో బచ్చాస్ ఫర్నిచర్కు సంబంధించిన సరుకుతోపాటు పెయింట్స్, కొన్ని రసాయనాలు ఉన్నాయి. వీటి వల్లే మంటల ధాటి ఎక్కువై ప్రమాద తీవ్రత పెరిగింది. సెల్లార్లో వెనుక వైపు కుడి పక్కగా రెండు చిన్న గదులు ఉన్నాయి. మెట్లకు సమీపంలో రేకులతో పార్టిషన్ చేసి వీటిని నిర్మించారు. ఈ మెట్లతోపాటు మిగిలిన చోట్ల ఉన్న గ్రిల్స్కు యజమానులు తాళాలు వేశారు. చిన్న గదుల్లోని ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్గా పనిచేస్తున్న బేబి (46), మరో గదిలో వాచ్మన్ తోకల యాదయ్య, తన భార్య లక్ష్మి, కుమారులు ప్రణీత్ (11), అఖిల్ (8) ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యాదయ్య, లక్ష్మి బయటకు వెళ్లగా... 1.10 గంటలకు సెల్లార్ నుంచి మంటలు చెలరేగాయి. ఇవి అక్కడ ఉన్న సరుకుతోపాటు కెమికల్స్ కారణంగా వేగంగా విస్తరించాయి. కాపాడటానికి వెళ్లి...: సుభాన్నగర్కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ (28), శాస్త్రీపురం వాసి హబీబ్ (35) బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అర్టిప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న వీరిద్దరూ మంటల్ని చూసి అప్రమత్తమయ్యారు. సెల్లార్లో ఉన్న బేబీతోపాటు ప్రణీత్, అఖిల్లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తీసుకొని సెల్లార్లోకి వెళ్లారు. దీనికి ఎడమ చివరన ఎంట్రన్స్ ఉండగా, కుడి చివరన వీరు ఉన్న గదులు ఉన్నాయి. అక్కడ వరకు వెళ్లిన ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. బేబీని తీసుకొని గది నుంచి బయటకు వచ్చిన హబీబ్కు బయటపడే మార్గం కనిపించలేదు. మంటల ధాటి పెరిగిపోవడంతో తాను లోపలకు ప్రవేశించిన మార్గం వరకు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడం, గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్లే మెట్ల వద్ద ఉన్న గ్రిల్స్కు తాళం వేసి ఉండటంతో అక్కడే బేబీతో సహా పడిపోయాడు. మంటలతో ఇద్దరు... ఊపిరాడక ముగ్గురు ! కిందపడినపోయిన హబీబ్, బేబీ మంటలు అంటుకొని చనిపోయారని పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ఇంతియాజ్ వారు ఉన్న గదిలోకి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతం మొత్తం పొగ నిండిపోవడం, అది ప్లాస్టిక్, ఫైబర్తో పాటు కెమికల్స్ వల్ల వచి్చంది కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఈ గదిలోనే ఊపిరి ఆడక ఇందియాజ్ సహా ఇద్దరు చిన్నారులు చనిపోయి ఉండారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయినా పొగ తగ్గకపోవడం, సెల్లార్, సబ్–సెల్లార్ సామాన్లతో నిండిపోవడంతో లోపలకు ప్రవేశించడానికి రెస్క్యూ టీమ్స్ శ్రమించాల్సి వచి్చంది. మొత్తమ్మీద ఆదివారం ఉదయం 9.10 గంటలకు సెల్లార్లోకి ప్రవేశించిన బృందాలు 9.15 గంటలకు హబీబ్, బేబీల మృతదేహాలు గుర్తించారు. 9.45 గంటల సమయంలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు దొరికాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. బేబీ కుమారులు లాల్ఖాన్, సమీర్ ఖాన్లు బచ్చాస్లోనే పని చేస్తున్నారు. వీరికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు. చిన్నారులతోపాటు ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలను వారి కుటుంబీకులకు ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వీరంతా ఎలా చనిపోయారన్న పూర్తి వివరాలు తెలుస్తాయి. బిశ్వాస్ చాంబర్స్ను జేఎనీ్టయూకు చెందిన నిపుణుల బృందం ఆదివారం ఉదయం పరిశీలించింది. ప్రొఫెసర్ శ్రీధర్రెడ్డి నేతృత్వంలోని టీమ్ వివిధ కోణాల్లో పరిశీలించింది. వీరు అందించే నివేదిక ఆధారంగా భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లేనని అనుమానిస్తున్నాందుకాణ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానిస్తున్నాం. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దుకాణ యజమాని సతీశ్ బచ్చాను అరెస్టు చేశాం. రెండు రోజుల క్రితమే బిల్డింగ్ లిఫ్ట్నకు మరమ్మతు జరిగింది , అందులో వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చు.సెల్లార్లో ఫర్నిచర్ నిల్వ ఉంచడంతో మంటలు తొందరగా వ్యాప్తి చెందాయి. – అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా: మంత్రి పొంగులేటిబచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఆ పరిహారం అందే విధంగా చర్యలు తీసు కోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను ఆదేశించినట్టు రెవెన్యూ మంత్రి కార్యాలయ వ ర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు అమాయకు లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
అగ్నికీలల్లో ఐదుగురు
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు.వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. వివరాల్లోకి వెళ్తే.. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందీ ప్రచార సభ పక్కన ఉన్న ఐదంతస్తుల సాయి విశ్వాస్ చాంబర్లో బచాస్ ఫర్నిచర్ క్యాస్టిల్ పేరుతో వివిధ రకాల ఫర్నిచర్ వ్యాపారాలను సతీశ్ అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అకస్మాత్తుగా ఈ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. దీనిపై వెంటనే యజమాని సతీశ్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భవనంలో మంటలు, దట్టమైన పొగలు వస్తున్నాయని పోలీసులకు తెలపడంతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్కుమార్ కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని ముందుగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. నాంపల్లి స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్ని రహదారులను మూసివేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 ఫైరింజన్లను రప్పించి మంటలను ఆర్పించారు. అగ్నికీలలు, దట్టమైన పొగ క్షణ క్షణానికి పెరుగుతుండడంతో రాత్రి వరకు అందులో ఉన్న వారిని బయటకు తీసుకురాలేక పోయారు. కాగా, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు ఫర్నిచర్ దుకాణం భవనంలో ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. సెల్లార్ వాచ్మెన్ యాదయ్య, లక్ష్మి దంపతుల పిల్లలు ప్రణీత్, అఖిల్తో పాటు ఆటో డ్రైవర్ హబీబ్, ఇంతియాజ్, స్వీపర్ బీబీలు చిక్కుకున్నవారిలో ఉన్నారు. అయితే అఖిల్ (7), ప్రణీత్ (11)గన్¸ûండ్రీలోని ప్రభుత్వ ఆలియా పాఠశాలలో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లకపోవడంతో ఇద్దరు పిల్లలను సెల్లార్లోని ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు ఇద్దరు బయట ఉన్నారు. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఆ ఇద్దరు పిల్లలను తీసుకువచ్చేందుకు ఫర్నిచర్ షాపులో పనిచేసే ఇద్దరు వ్యక్తులు సెల్లార్లోకి వెళ్లారు. ఈ ఇద్దరితోపాటు అందులో పని చేసే మరో ఇద్దరు సెల్లార్లో చిక్కుకున్నట్లు తోటి వర్కర్లు వెల్లడించారు. వీరిలో ఒకరు తప్పించుకొని బయటపడ్డాడు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఫైర్ పోలీసు, ఇతర శాఖల అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సెల్లార్లో ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు, దట్టమైన పొగలు ఆర్పడంతో సెల్లార్ మొత్తం నీటితో నిండిపోయింది. ఐదుగురు వ్యక్తులను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోబోను పంపించినా... అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తేచ్చేందుకు పోలీసులతో పాటు హైడ్రా, డిజాస్టర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టాస్్కఫోర్స్ పోలీసులతో పాటు పలువురు అధికారులు అర్థరాత్రి వరకు శ్రమించారు. మంటలు అదుపులోకి వచి్చన్నప్పటికీ పొగ తీవ్రత ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్లో ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్ ముడిపదార్థాలు ఉండడంతో ఆరు గంటలైనా భవనం నుంచి దట్టమైన పొగ తగ్గలేదు. ఫైర్ ఉన్నతాధికారులు రోబోను కూడా భవనంలోకి మంటలను, పొగలను నివారించేందుకు పంపించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అర్థరాత్రి వరకు దట్టమైన పొగలు అదుపులోకి రాలేదు.రెస్క్యూ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రామ్టో ఫైర్ మిషన్తో.. ఫైర్ అధికారులు బ్రామ్టో ఫైర్ మిషన్తో మంటలను, దట్టమైన పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయతి్నంచారు. అతి పెద్దదైన బ్రామ్టో మిషన్లో ఫైర్ సిబ్బంది ఉండి భవనం పరిసరాల 4, 5 వ అంతస్థుల అద్దాలను పగలగొట్టి మంటలను, పొగలను అదపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. నిమిషంలో తప్పించుకొని.. నాంపల్లి అగ్నిప్రమాదం నుంచి నిమిషం వ్యవధిలో తప్పించుకున్నాడు సంతోష్ అనే వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో సంతోష్ బిల్డింగ్లోని నాలుగో అంతస్తులో ఉన్నాడు. సెల్లార్లో మంటలు చెలరేగిన నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తం వ్యాపించాయి. అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన సంతోష్ నిమిషాలలో మెట్లపై నుంచి వేగంగా బయటికి వచ్చేశాడు. క్షణం ఆలస్యమైనా మంటల్లో చిక్కుకునేవాడనని సంతోష్ పేర్కొన్నారు. మంటలను అదుపులోకి తెచ్చాం : రాష్ట్ర ఫైర్ విభాగం డీజీ విక్రమ్సింగ్ మాన్ ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురు చిక్కుకున్నారని తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ విక్రమ్సింగ్ మాన్ పేర్కొన్నారు. శనివారం రాత్రి సంఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు. ఫైర్, ఇతర అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం కింద రెండు సెల్లార్లు ఉన్నాయన్నారు. మొదటి సెల్లార్లో ఫర్నిచర్కు సంబంధించిన మెటీరియల్స్, ఇతర ముడి పదార్థాలు ఉండడంతోనే సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మంటలను అదుపులోకి తెచ్చామని, సెల్లార్లలో దట్టమైన పొగలు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకువచ్చి ఇందులో చిక్కుకున్న ఐదుగురిని బయటకు తెస్తామన్నారు. 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు. సజ్జనర్, కలెక్టర్ హరిచందన సందర్శన సంఘటన స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సీపీ సజ్జనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారన్నారు. అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తెచ్చేందుకు ఫైర్తో పాటు ఇతర శాఖల అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రోబో యంత్రాన్ని తొలిసారిగా వాడిన అగ్నిమాపక శాఖ నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్ని ప్రమాద సంఘటనలో పేలుళ్లను నిరోధించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక శాఖ రోబో ఫైర్ మిషన్ను హైదరాబాద్లో తొలిసారిగా ఉపయోగించింది. ఘటనా స్థలంలో జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టినా అగ్నికీలలు, దట్టమైన పొగ కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో అగ్నిమాపక శాఖ రోబో శకటాన్ని రంగంలోకి దింపింది. రోబో ఫైర్ మిషన్ అనేది అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు, అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయడానికి తయారు చేసిన సిస్టమ్. అగ్నిమాపక సిబ్బంది వెళ్లలేని పరిస్థితుల్లో ఈ రోబో ఫైర్ మిషన్ భవనం లోపలికి వెళ్లి మంటలను ఆర్పుతుంది. అలాగే సురక్షిత మార్గాన్ని అన్వేíÙంచి, బయట ఉన్న సిబ్బందికి మార్గాన్ని సూచిస్తుంది. -
ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం
-
ఐకియా క్యా కియా!.. సిబ్బందికి రూ.954 కోట్ల నజరానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐకియా బ్రాండ్ పేరుతో ఫర్నీచర్ రంగంలో ఉన్న నెదర్లాండ్స్కు చెందిన ఇంగ్కా గ్రూప్ ఔదార్యం చాటుకుంది. కోవిడ్–19 మహమ్మారి కాలంలోనూ శ్రమటోడ్చిన ఉద్యోగులకు రూ.954 కోట్ల నజరానా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకియా రిటైల్, ఇంగ్కా సెంటర్స్, ఇంగ్కా ఇన్వెస్ట్మెంట్స్ సిబ్బందికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందించనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 32 దేశాల్లో గ్రూప్నకు 1,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు విస్తరించింది. తాజాగా ఐకియా సంస్థ సిటీ స్టోర్ల పేరుతో మెట్రో నగరాల్లో అనేక అవుట్లెట్లను తెరిచే పనిలో ఉంది. -
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
-
ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగపురాలోని ఫర్నిచర్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి తీవ్రమై పక్కనే ఉన్న మరో రెండు గోదాములకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.10 లక్షల మేర నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఫర్నీచర్ షాపులో మంటలు
-
ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదం..భారీ నష్టం
హైదరాబాద్: పాతబస్తీ తలాబ్కట్టాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. స్థానిక రోడ్ నంబర్-2 జహంగీర్నగర్లోని షేక్ అన్వర్కు చెందిన ఫర్నిచర్ దుకాణంలో అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లిందని యాజమాన్యం చెబుతోంది. ఈ మేరకు భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
-
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రాయదుర్గంలోని ఓ ఫర్నీచర్ షాపులో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆసిఫ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: ఆసిఫ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఓ ఫర్నీచర్ షాపులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్వూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. -
హర్యానాలో భారీ అగ్నిప్రమాదం
-
8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
గుంటూరు(వినుకొండ): వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో ఆదివారం రహస్యంగా పేకాటాడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పెషల్ బ్రాంచి పోలీసులు తెలిపారు. -
కుషాయిగుడలో భారీ అగ్నిప్రమాదం


