first Chief Minister
-
అజిత్ జోగి కన్నుమూత
రాయ్పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి(74) రాయ్పూర్లోని శ్రీనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. అజిత్ జోగి భార్య రేణు ప్రస్తుతం కోట నియోజకవర్గ ఎమ్మెల్యే. అజిత్ జోగి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రకటించారు. జోగి అంత్యక్రియలను ఆయన స్వస్థలం మర్వాహీ జిల్లాలోని గౌరెలాలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ అజిత్ జోగి మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. పేదల ‘కలెక్టర్ సాబ్’ ఛత్తీస్గఢ్ ప్రజలు ‘కలెక్టర్ సాహెబ్’అని ముద్దుగా పిలుచుకునే అజిత్ జోగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్ నుంచి డిసెంబర్ 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన అజిత్ జోగి పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ జోగి. ఆదివాసీ సమాజంలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. 1946 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం భిలాస్పూర్ జిల్లాలోని జోగిసర్లో జన్మించారు. ఆయన తండ్రి కాశీ ప్రసాద్ జోగి, తల్లి కాంతిమణి. విద్యార్థి నాయకుడి నుంచి.. అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్ జోగి సొంతం. విద్యార్థి జీవితం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భోపాల్లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1967లో రాయ్పూర్లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. అజిత్ శాసనసభతోపాటు లోక్సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్ జోగి ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రారంభించారు. అజిత్ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ‘‘ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్’’, ‘‘అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఏరియాస్’’అనే పుస్తకాలు రాశారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజిత్ జోగి వీల్ఛైర్కు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జోగి భార్య రేణు, కొడుకు అమిత్ రాజకీయాల్లో ఉన్నారు. ప్రభుత్వ అధికారిగా... 1968లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్కి ఎంపికయ్యారు. కలెక్టర్గా పనిచేసిన నాలుగు జిల్లాల్లోనూ అధికార దర్పాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆయన ఇంట్లోకి సైతం ప్రజలకు నేరుగా ప్రవేశించే స్వేచ్ఛనిచ్చిన అరుదైన కలెక్టర్ సాహెబ్ అజిత్ జోగి. కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జాతీయ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. -
గజ్వేల్కు అరుదైన ఖ్యాతి
- తెలంగాణకు తొలి సీఎంను అందించిన ఘనత - పునర్నిర్మాణానికి ఇక కేంద్ర బిందువు గజ్వేల్, న్యూస్లైన్: గజ్వేల్ ప్రాంతం అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది. కేసీఆర్ ‘పునర్నిర్మాణం’ లక్ష్యానికి కేంద్రబిందువుగా మారబోతోంది. గజ్వేల్ రాజకీయ చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15సార్లు జరిగిన ఎన్నికల్లో 1989, 2004 ప్రాంతంలో డాక్టర్ జె.గీతారెడ్డి మంత్రి పదవులను దక్కించుకున్నారు. 1952లో పెండెం వాసుదేవ్, 1957లో జేబీ ముత్యాలరావు, ఆర్. నర్సింహారెడ్డి(ద్విసభ్య నియోజకవర్గం), 1958 ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఆర్. నర్సింహారెడ్డి, 1962, 1967, 1972, 1978లలో నాలుగు పర్యాయాలు గెలుపొందిన గజ్వేల్ సైదయ్య, 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1994లో డాక్టర్ విజయరామారావు, 1999లో సంజీవరావు, 2009లో తూంకుంట నర్సారెడ్డి ఎమ్మెల్యేలుగా పనిచేయగా.. తాజాగా 2014 ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం విశేషంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో సాదాసీదా నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అగ్రతాంబూలాన్ని అందుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త తరహా ఆలోచనలకు నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని ఫామ్హౌస్ కేంద్రబిందువుగా మారటం.. ఈ దశలోనే టీఆర్ఎస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయికి చేరుకుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పునర్నిర్మాణానికి వేదిక ‘కొత్త రాష్ట్రం-కొత్త నాయకత్వం-సరికొత్త పంథా’ పేరిట తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో.. ఆయన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ సహజంగానే ఈ లక్ష్యానికి కేంద్ర బిందువుగా మారబోతోంది. ప్రధానంగా వ్యవసాయరంగాభివృద్ధి ద్వారా కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయాలనుకుంటుండగా.. ముందు ఈ నియోజకవర్గం నుంచే కొత్త తరహా పథకాలకు అంకురార్పణ జరుగనుంది. ఇకపోతే దశాబ్దకాలంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న గజ్వేల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శాఖలవారీగా కేసీఆర్ నివేదికలకు ఆదేశించారు. ఈ నెల 4న స్థానిక ప్రజ్ఞా గార్డెన్స్లో ఈ వ్యవహారంపై సమగ్రంగా సమీక్ష జరిగి.. ఆ తదనంతరం నిధులు కూడా వరదలా వచ్చే అవకాశముంది. మొత్తానికి కేసీఆర్ గెలుపుతో గజ్వేల్కు కొత్త కళ రానుండటం నియోజకవర్గ ప్రజలను హర్షాతిరేకంలో ముంచెత్తుతోంది. -
‘పేట’తోనే మామ, అల్లుళ్లకు మహర్దశ !
సిద్దిపేట జోన్,న్యూస్లైన్: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమానికి బీజం నాటిన సిద్దిపేట పట్టణమే నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన మేనల్లుడు హరీష్రావును నియోజకవర్గం అక్కున చేర్చుకొని కోటగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా, కొంతకాలం కరువు సహాయక మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కొనసాగిన అనవాయితీని నేడు ఆయన మేనల్లుడు హరీష్రావు కొనసాగిస్తున్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్రావు నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నీటి పారుదల శాఖతో పాటు శాసన సభ వ్యవహరాల శాఖను పర్యవేక్షించనున్నారు. 2004 ఉప ఎన్నికల ద్వారా సిద్దిపేట నుంచి రాజకీయ ప్రవేశం చేసిన హరీష్రావు 2004లో ఉప ఎన్నికతో తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఐదుసార్లు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2010 ఉప ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలోనే 95.858 ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించిన హరీష్రావు, మొన్నటి ఎన్నికల్లో 93.354 ఓట్లతో తెలంగాణలో ద్వితీయ స్థానంలో నిలిచారు. 2004 ఉప ఎన్నికల్లో గెలుపొందిన హరీష్రావు అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో యువజన సర్వీసుల శాఖను నిర్వర్తించారు. ఈ క్రమంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, హరీష్రావు తొలివిడత మంత్రి వర్గంలో చోటు సంపాదించుకొనిని నీటి పారుదల శాఖ పగ్గాలు చేపట్డం ఆయన పనితనానికి నిదర్శనం. టీఆర్ఎస్ బలోపేతానికి పుష్కరకాలంగా కృషి చేస్తున్న హరీష్రావు 1996 నుంచి మామ కేసీఆర్కు సహాయకారిగా ఉంటూ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. తనకిష్టమైన నీటి పారుదల శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను పర్యవేక్షించనున్న హరీష్రావు తెలంగాణ ప్రాంతంలో జలవనరుల అభివృద్ధికి కృషి చేయగలరనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. 2004లోనే యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆయన నియోజకవర్గంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి పుష్కలంగా నిధులను మంజూరు చేయించుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ముందు రూపొందించిన పార్టీ మేనిపెస్టోకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని జలవనరులతో సస్యశ్యామలం చేసేందుకు హరీష్రావుకు నీటి పారుదల శాఖను కేటాయించినట్లు సమాచారం. -
చింతమడక నుంచి సీఎం పీఠం దాకా
దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది ప్రజల కల సాకారమైంది. సోమవారం 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తొలి గవర్నర్గా నరసింహన్, తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సాధన కోసం ఎందరో కాకలు తీరిన నాయకులు పోరాడారు. ఎన్నో పార్టీలు పుట్టాయి. తెరమరుగయ్యాయి. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాత్రం కే చంద్రశేఖర రావుదే. అందరూ కేసీఆర్గా పిలుచుకునే చంద్రశేఖర రావు 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో మాస్టర్ డిగ్రీ చేశారు. 1970ల్లో యూత్ కాంగ్రెస్ తరపున కేసీఆర్ రాజకీయాల్లో అరంగేట్రం చేసినా.. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి చవిచూసిన ఆయన ఆనక 1985 నుంచి సిద్దిపేట అసెంబ్లీ నియోజవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2001లో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ సాధన కోసం 13 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరకు తన లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 63 సీట్లు గెల్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజార్టీని సాధించింది. అయితే తెలంగాణను ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఎందరో సీనియర్లు మట్టికరిచారు. ఈ ఘనతంతా మాయల మరాఠీ కేసీఆర్దే. కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా, కుమారుడు కే తారక రామారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ పొలిటికల్ కెరీర్లో కీలక ఘట్టాలు... 1985-1999 : నాలుగుసార్లు ఎమ్మెల్యే 1987-88 : ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి 1997-99 : చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి 1999-2001: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఏప్రిల్ 27, 2001: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపన 2004 : లోకసభ సభ్యునిగా ఎన్నిక 2004-06 : కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి సెప్టెంబరు 23, 2006: లోక్సభ సభ్యత్వానికి రాజీనామా డిసెంబరు 7 , 2006 : ఉప ఎన్నికలో మళ్లీ ఎంపీగా ఎన్నిక మార్చి 3 , 2008 : లోక్సభ సభ్యత్వానికి రాజీనామా 2009 : 15 వ లోక్సభ సభ్యునిగా ఎన్నిక (రెండోసారి) 2014 : 16వ లోక్సభ సభ్యునిగా ఎన్నిక 2014 : గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక 2014 : టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకునిగా ఎన్నిక 2014, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం -
నేడే కేసీఆర్ ప్రమాణ స్వీకారం
-
నేడే కేసీఆర్ ప్రమాణ స్వీకారం
ముహూర్తం ఉదయం 8.15 - కేసీఆర్తో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులెవరనే దానిపై స్పష్టత కరువు - ఆయనతో పాటు ఆరుగురితో తొలి మంత్రివర్గం! - మిగతా ఖాళీలను కొద్దిరోజుల్లో పూరించే యోచనలో టీఆర్ఎస్ అధినేత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 8.15కు గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. కేసీఆర్తో పాటు తెలంగాణ కేబినెట్తో కూడా ఆయన ప్రమాణస్వీకా రం చేయిస్తారు. అనంతరం కేబినెట్ బృందానికి గవర్నర్ తేనీటి విందు ఇస్తారు. అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పరేడ్ మైదానంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా జరిగే ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, తెలంగాణ పునర్నిర్మాణం తదితరాలపై తన మనోగతాన్ని వివరిస్తారు. ఖరారు కాని మంత్రుల జాబితా... కేసీఆర్తో పాటు సోమవారం ఉదయం ఎంతమంది మంత్రులుగా ప్రమాణం చేస్తారనే విషయంలో ఆదివారం అర్ధరాత్రి దాటినా స్పష్టత రాలేదు. ఆదివారం రాత్రి 12 గంటలకు కూడా తాను తీసుకోబోయే మంత్రులెవరనే జాబితాను కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు పంపలేదు. తొలివిడత మంత్రివర్గంలోకి ఎంతమందిని తీసుకుంటారనే విషయంలో రెండురకాలుగా వినిపిస్తోంది. కేసీఆర్ లక్కీనంబర్ 6 కాబట్టి ఆయనతో పాటు సోమవారం మరో ఐదుగురితో మాత్రమే మంత్రివర్గం ఏర్పాటవుతుందనేది కేసీఆర్ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది. ఐదుగురినే తీసుకొనే పక్షంలో ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. అలాకాకుండా పదిమందికి అవకాశం కల్పిస్తే... పై ఐదుగురితో పాటు పోచారం శ్రీనివాస్రెడ్డి, టి.రాజయ్య, హరీష్రావు, కె.తారక రామారావులను తీసుకునే అవకాశాలున్నాయి. సి.లక్ష్మారెడ్డి లేదా పద్మారావులలో ఒకరికి అవకాశం ఇవ్వడం ద్వారా పదిమంది కోటా పూర్తవుతుందని సమాచారం. మంత్రివర్గంలో మిగిలిన ఖాళీలను రాబోయే నాలుగైదు రోజుల్లోనే భర్తీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తు ప్రకారం రూటు మార్పు ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్ వెళ్లే దారిని పండితుల సూచనల మేరకు కేసీఆర్ మార్చుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 నుంచి వెళ్లడం లేదు. దానికి బదులు వాస్తుకు అనుగుణంగా ఉంటుందని పండితులు సూచించిన మరో దారిలో రాజ్భవన్కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 7.20కి కేసీఆర్ నందినగర్లోని తన నివాసం నుంచి బయల్దేరతారు. భార్య శోభ ఆయనకు హారతిచ్చి, తిలకం దిద్ది సాగనంపుతారు. కుమార్తె కవిత ముందు నడవగా కేసీఆర్ కాన్వాయ్ ఎక్కుతారు. నందినగర్ గ్రౌండ్, జహిరానగర్ చౌరస్తా, కార్వీ చౌరస్తా, రెయిన్బో ఆస్పత్రి, సిటీసెంటర్ మాల్ చౌరస్తా, తాజ్కృష్ణా చౌరస్తా, ఎర్రమంజిల్ కాలనీ, ఆర్టీఏ చౌరస్తా, ప్రెస్ క్లబ్ మీదుగా ఖైరతాబాద్ చౌరస్తా నుంచి లక్డీకాపూల్ రవీంద్రభారతి నుంచి గన్పార్కుకు చేరుకుంటారు. అనంతరం రాజ్భవన్ వెళ్తారు. రాజ్భవన్ వద్ద గట్టి బందోబస్తు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్భవన్ పరిసరాలను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు ఏకంగా 1500 మంది సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగర జాయింట్ కమిషనర్ (కో ఆర్డినేషన్) సంజయ్కుమార్ జైన్, పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పాసులు ఉన్న వారిని మినహా రాజ్భవన్లోకి మరెవ్వరినీ అనుమతించరాదని ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీసు కమిషనర్ అనురాగ్శర్మ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ మహేశ్ భగవత్ భద్రతను పరిశీలించారు. ఇక ప్రమాణం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభకు కేసీఆర్ హాజరు కానుండటంతో అక్కడ కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పరేడ్గ్రౌండ్స్ పరిసరాల్లో దాదాపు రెండున్నర వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. -
జూన్ 3న తెలంగాణ విద్రోహ దినం
ఎమ్మెస్పీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొల్లాపూర్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలోని దళి తులందరినీ నమ్మించి మోసం చేశారని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన కొల్లాపూర్లో విలేకరులతో మాట్లాడారు. 2001లో టీఆర్ఎస్ ను స్థాపించిన కేసీఆర్ 2002 నుంచి దళిత ముఖ్యమంత్రి అనే నినాదాన్ని అందుకున్నారని గుర్తుచేశారు. దళితులను మోసం చేసిన కేసీఆర్ నైజం చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ 3న తెలంగాణ విద్రోహ దినం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మందకృష్ణ తెలిపారు. ప్ర తి సంవత్సరం జూన్ 3న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో ని ప్రతి గ్రామంలో కూడా విద్రోహ దినం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెస్పీ శ్రేణులకు సూచించారు. తెలంగాణ చరి త్ర ఉన్నంత కాలం దళితులకు కేసీఆర్ చేసిన మోసం ఆయనను నీడలా వెంటాడుతుంద న్నారు. తెలంగాణలో 20శాతం జనాభా ఉన్న దళితుల్లో 40శాతం మంది తెలంగాణ కోసం త్యాగాలు చేశారని, 90శాతానికి పైగా దళిత కళాకారులు ఉద్యమాన్ని ముందుండి నడిపించారని వివరించారు. వర్గీకరణపై ఉద్యమం ఆగదు వర్గీకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఆది వారం ఆయన కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్లలో ఓ వివాహ కార్యక్రమానికి హా జరయ్యారు. అనంతరం కొల్లాపూర్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీతోపాటు, ఆం ధ్రప్రదేశ్లో అధికారంలో కొచ్చిన టీడీపీలు వర్గీకరణకు అనుకూలమైన పార్టీలు అన్నారు. టీడీపీ హయాంలో వర్గీకరణ కొనసాగిందని వివరించారు. చంద్రబా బు తమకు సహజ మిత్రుడన్నారు. జూన్ మొదటి వారంలో వర్గీకరణ అంశంపై జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటుచేసి, ఉద్యమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలను వేయనున్నట్లు తెలిపా రు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ తమను మోసం చేసిందని, టీడీపీ, బీజేపీలు న్యాయం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోసంపై ఈనెల 27న హైదరాబాద్లో దళిత కుల సంఘాలతో, 31న దళిత మేధావులతో స మావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. టీ ఆర్ఎస్, కేసీఆర్ వైఖరి ని నిరసిస్తూ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. జూన్ 2 న అమరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుం టామని, జూన్ 3న కేసీఆర్ చేసిన మోసానికి నిరసనగా తెలంగాణ విద్రోహదినం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అందె రాంబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్,కోళ్ల వె ంకటేష్మాదిగ, ఎంఎస్పీ జిల్లా సమన్వయకర్త సింగిరెడ్డి పరమేశ్వర్మాదిగ, నాయకులు జంగయ్య, మధునాయుడు, కోళ్ల శివ, మంద నర్సింహ్మ, పుట్టపాగ రాము, నిరంజన్ పాల్గొన్నారు. -
మెదక్ లోక్సభకు కేసీఆర్ రాజీనామా
- ఆర్నెల్లలోపు ఉప ఎన్నిక - ఇంకా ఖరారుకాని టీఆర్ఎస్ అభ్యర్థిత్వం - 29 తర్వాత వెల్లడయ్యే అవకాశం సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్సభ సభ్యత్వానికి టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు సోమవారం రాజీనామా సమర్పించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన.. వ్యక్తిగత సహాయకుల ద్వారా లోక్సభ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్సభ స్థానాలలో అఖండ విజయం సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనల మేరకు ఒక అభ్యర్థి రెండు వేర్వేరు స్థానాల నుంచి ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఎన్నికైన నాటి నుంచి 18 రోజుల్లో ఒక స్థానానికి రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేసీఆర్ మెదక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు ఆమోదం లభించడం లాంఛనప్రాయమే. ఆ తర్వాత మెదక్ లోక్సభ స్థానంలో ఖాళీ ఏర్పడిందని పార్లమెంటు వ్యవహారాల శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. దీంతో ఆర్నెల్లలోపు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఇదిలా ఉండగా.. ఉప ఎన్నికల్లో మెదక్ లోక్సభ నుంచి బరిలో దిగే అభ్యర్థిని ఇంకా టీఆర్ఎస్ ఖరారు చేయలేదు. ఈ నెల 29 తర్వాత అభ్యర్థి ఎంపికపై స్పష్టత రావచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
టీఆర్ఎస్కే లోకల్ సర్కారు రావడంతో అనుకూలం
- హంగ్ మండలాల్లో అధికం గులాబీకే.. - మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి - జెడ్పీ పీఠంలో దొంతి నిర్ణయమే కీలకం సాక్షి ప్రతినిధి, వరంగల్ :తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో పుర, ప్రాదేశిక పీఠం పోరు రసవత్తరంగా మారింది. జిల్లా, మండల పరిషత్... మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల్లో కొత్త రాజకీయం మొదలైంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్తోపాటు మెజారిటీ మండల పరిషత్లు, మునిసిపల్ చైర్మన్ పదవులు గులాబీ దళానికే దక్కే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో మెజారిటీ పదవులను దక్కించుకునేందుకు టీఆర్ఎస్ అన్ని రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని కచ్చితంగా దక్కించుకునేలా రాజకీయాల జోరు పెంచింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా... కాంగ్రెస్కు 24, టీఆర్ఎస్కు 18, టీడీపీకి 6, బీజేపీకి ఒకటి దక్కారుు. స్వతంత్రులు ఒక మండలంలో గెలిచారు. కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా... ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కే పరిస్థితి లేదు. వరంగల్ జెడ్పీ పీఠం విషయంలో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులతోతో హైదరాబాద్లో క్యాంపు నిర్వహిస్తోంది. కాంగ్రెస్లోని కొందరిని తమ వైపునకు తిప్పుకునే వ్యూహానికి పదునుపెడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో ఇది జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్ సైతం జెడ్పీ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినా... సాధారణ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ క్యాంపు నిర్వహణ విషయంలో ముందుకు రావడంలేదు. అరుుతే టీ పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు ఆఖరు వరకు ప్రయత్నించే అవకాశం ఉంది. జెడ్పీ చైర్పర్సన్ పదవి ఎవరికి దక్కాలనే విషయంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిర్ణయం కీలకం కానుంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుల్లో నర్సంపేట నియోజకవర్గంలోని నర్సం పేట, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాల నుంచి గెలిచిన వారు దొంతికి విధేయులుగా ఉన్న వారే. గూడూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు, కొత్తగూడతోపాటు మరో ముగ్గురు... మొత్తం 9 మంది జెడ్పీటీసీలు దొంతి మాధవరెడ్డి శిబిరంలో ఉన్నారు. టీఆర్ఎస్కు చెందిన 18 మంది జెడ్పీటీసీలకు వీరు కలిస్తే ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కుతుంది. ఈ క్రమంలో దొంతి మాధవరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొన్నాల లక్ష్మయ్య తనకు టికెట్ రాకుండా చేశారని భావిస్తున్న దొంతి ఇదివరకే ఆయనపై ఫైర్ అయ్యూరు. ఈ నేపథ్యంలో టీ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల కొనసాగింనంత కాలం ఆయన కాంగ్రెస్లోకి మళ్లీ వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. దీన్ని అనుకూలంగా మార్చుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మండల పరిషత్లలో... జిల్లాలోని 50 మండల పరిషత్లకు సంబంధించి కాంగ్రెస్కు 18, టీఆర్ఎస్కు 14, టీడీపీకి 3, న్యూ డెమోక్రసీకి ఒకటి దక్కే పరిస్థితి ఉంది. మిగిలిన 14 మండల పరిషత్లలో ఎవరికీ మెజారిటీ రాలే దు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో వీటిలో ఎక్కువ మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఈ పార్టీకే దక్కనున్నాయి. హంగ్ పరిస్థితులు ఏర్పడిన కేసముద్రం, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్, మొగుళ్లపల్లి, రేగొండ, జఫర్గఢ్, లింగాలఘణపురం, హన్మకొండ మం డలాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. ఈ తొమ్మిది మండల పరిషత్లు టీఆర్ఎస్కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ఐదు మండల పరిషత్లనూ దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో... జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీతోపాటు పరకాల, భూపాలపల్లి, నర్సంపేట చైర్పర్సన్ పదవులను దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. జనగామ మునిసిపాలిటీలో కాంగ్రెస్కు మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. ఇక్కడ 28 వార్డులు ఉంటే కాంగ్రెస్ 14 గెలుచుకుంది. టీఆర్ఎస్ 6, బీజేపీ, స్వతంత్రులు, సీపీఎం కలిసి 14 గెలిచాయి. జనగామ ఎమ్మెల్యే స్థానం టీఆర్ఎస్ గెలవడంతో మునిసిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ లేకున్నా గత మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు టీఆర్ఎస్ అనుసరిస్తోంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన మహబూబాబాద్, భూపాలపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఈ రెండు మునిసిపాలిటీలు గులాబీ పార్టీకి దక్కనున్నాయి. పరకాలలో ఎక్కువ వార్డులో గెలిచిన టీఆర్ఎస్కు ఇప్పుడు ప్రభుత్వం రావడం అనుకూలంగా మారింది. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్గానికి మెజారిటీ సీట్లు వచ్చాయి. ప్రభుత్వం వచ్చినా ఇక్కడ టీఆర్ఎస్ తరఫున చైర్మన్ ఎన్నికయ్యే పరిస్థితి కనిపించడంలేదు. -
కేసీఆర్కు బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు
వరంగల్ లీగల్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావును శనివారం బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయవాదుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన ఉంటుందని కేసీఆర్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. కేసీఆర్ను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుడిమల్ల రవికుమార్, సూరం నర్సింహస్వామి, కార్యవర్గ సభ్యులు గురి, రంజిత్కుమార్, ఎన్.వసంతియాదవ్, సురేష్, న్యాయవాదులు ఉన్నారు. -
సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు
- కేంద్రంలోనూ జగన్ ఆధిపత్యం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా పుంగనూరు, న్యూస్లైన్: స్థానిక సంస్థల ఫలితాలను బట్టి సీమాంధ్రలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, వైఎస్.జగన్మోహన్రెడ్డి సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టిస్తారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్లతో పలు ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ముస్లిం మైనార్టీలు పూర్తి స్థాయిలో గుణపాఠం కలిగేలా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని తెలిపారు. ముస్లిం మైనార్టీల ఓట్లు స్థానిక సంస్థల్లో లభించిన ఓట్ల శాతం కన్నా అధికంగా వైఎస్సార్ సీపీకి లభించిందని, ఫలితంగా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గల్లంతు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సుమారు 120 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఇరవైకి పైగా లోక్సభ స్థానాలు వస్తాయని తెలిపారు. జిల్లాలో కుప్పంతో సహా 14 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజంపేట లోక్సభ స్థానంలో అత్యధిక మెజార్టీ సాధిస్తామని, కేంద్రంలో సైతం జగన్మోహన్రెడ్డి రాజకీయ ఆధిపత్యాన్ని చాటుతారని తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు జగన్మోహన్రెడ్డి అవసరం ఏర్పడుతుందని తెలిపారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబంపై రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి జగన్మోహన్రెడ్డికి పట్టం కట్టనున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీస్సులు వైఎస్సార్ సీపీకే ఉన్నాయన్నారు. అలాంటి ప్రజలకు వైఎస్సార్ సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. -
విద్య, వైద్యం, విద్యుత్కు పెద్దపీట
కోవూరు, న్యూస్లైన్: సీమాంధ్ర తొలి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైద్యం, విద్య, విద్యుత్ పథకాలపై ప్రత్యేక దృష్టిసారించి వాటికి పెద్దపీట వేస్తారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని ములమూడి వినోద్రెడ్డి నివాసంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదకు ఆరోగ్యం హక్కుగా చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్స్పెషాలిటీ వైద్యశాలను నిర్మిస్తారన్నారు. వైద్యం సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు పడకుండా రొటేషన్ పద్ధతిలో వైద్యులు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేలా చూస్తామన్నారు. ప్రభుత్వ వైద్యులు హెడ్క్వార్టర్లో ఉండేలా సౌకర్యం కల్పిస్తామన్నారు. మహిళలకు ప్రత్యేక లేబర్రూమ్లను ఏర్పాటు చేస్తామని ప్రసన్నకుమార్రెడ్డి చెప్పారు. కాన్పుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించేలా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను గుర్తించి కొత్తవి నిర్మిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ వసతిగృహాలకు సంబంధించిన పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారన్నారు. అలాంటి వాటికి స్వస్తి పలికి ప్రభుత్వ వసతిగృహాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి ఉత్తమ విద్యార్థులుగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు. సీమాంధ్రలో ఒక్క రాజధాని నగరంలోనే 20 సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలను కట్టించేందుకు జగన్ సిద్దంగా ఉన్నారన్నారు. విద్యుత్ సమస్య లేకుండా.. 2019 నాటికి జగన్ పాలనలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు పగటి పూట 7 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందించనున్నట్టు చెప్పారు. వీలైతే దానిని 9 గంటలకు పెంచేం దుకు ప్రయత్నిస్తామన్నారు. నెలకు 150 యూనిట్లకు రూ.100 మాత్రమే బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రాధాకృష్నారెడ్డి, నిరంజన్బాబురెడ్డి, మల్లికార్జునరెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, పడుగుపాడు సర్పంచ్ గడ్డం రమణమ్మ , అట్లూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి పదవి బీసీలకివ్వాలి
ఇప్పర్తి (మునుగోడు), న్యూస్లైన్ : ప్రత్యేక తెలంగాణం ఏర్పాటయ్యాక మొదటి ముఖ్యమంత్రిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. ఆదివారం మండలంలోని ఇప్పర్తిగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం చేపట్టిన తొలి, మలి దశ ఉద్యమాల్లో బీసీలు కీలక పాత్ర పోషించారన్నారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్చారి, కానిస్టేబుల్ కృష్ణయ్యలు బీసీలే అన్నారు. రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, సబ్ప్లాన్ ఎర్పాటుచేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అనేక ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టేలా దేశంలోని 118 మంది బీసీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. కిషోర్, ఓయూ జేఏసీ నాయకుడు తిరుమణి కొండల్, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూకంటి ప్రభాకర్, జిల్లా నాయకుడు జనగాం నర్సింహ్మగౌడ్, బూడిదలింగయ్యయాదవ్, జాజుల వెంకటేష్, జాజుల బాస్కర్గౌడ్, బడేసాయబ్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి పీఠంపై ఆశలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ జిల్లా కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఇక్కడి ప్రజల ఆకాంక్ష ..సుదీర్ఘమైన కల నెరవేరింది.దీంతో తెలంగాణ ముఖ్యపీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై కాంగ్రెస్ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. జిల్లాకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించటమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అందరి చూపు ఇందూరు పైన ఉన్న ట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి రేసులో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఉన్నట్లు పార్టీ శ్రేణు లు భావిస్తున్నాయి. జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు షబ్బీర్అలీ, కె.ఆర్.సురేష్రెడ్డిలకూ అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాగా ముఖ్యనేతల్లో అగ్రగణ్యుడుగా డీఎస్కు పేరుంది.ప్రస్తుతం పార్టీ సమన్వయ కమిటీ సభ్యునిగా, ఎమ్మెల్సీగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో ముఖ్య భూమికను ఆయన పోషిస్తున్నారు. రెండు పర్యాయాలు 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని డాక్టర్ వైఎస్ రాజ శేఖర్రెడ్డి జోడితో పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ విజయ పథంలోకి నడిపించి అధికారంలోనికి తీసుకువచ్చారని అధిష్టానం వద్ద ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఇరుప్రాం తాల ముఖ్యనేతలతో పాటు జాతీయ స్థాయిలో సత్సంబంధాలను డీఎస్ కొనసాగించారు. సోనియాగాంధీకి నమ్మకమైన నాయకుల్లో ఒకరిగా డీఎస్ పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా సోనియా కోటరీలోని అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్సింగ్ వంటి ముఖ్యనేతలతో ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆ పీఠాన్ని అధిరోహించే జాబితాలో డీఎస్ పేరు ప్రముఖంగా ప్రచారంలో వచ్చింది. ఆ తరువాత ముఖ్యమంత్రులు మారినప్పడు, పీసీసీ అధ్యక్షులను మార్చాల్సి వచ్చినప్పడు కూడా డీఎస్ పేరు వినిపించింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రెండు ప్రాంతాలకు చెందిన నాయకుడిగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో భాగంగా పీసీసీ హోదాలో తటస్థ వైఖరిని ప్రదర్శించి ఇక్కడి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, అధిష్టానవర్గం వద్ద మాత్రం గట్టిగా తెలంగాణ వాణి వినిపించటంలో తీవ్ర కృషి చేసినట్టు ఆయ న స్వయంగా పేర్కొంటున్న వాదనలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ సోనియా గాంధీ, పలువురు నేతలను కలిసినప్పడు తెలంగాణపై పట్టుబట్టి, అవశ్యకతను వివరించటంలో విజ యం సాధించానని ఆయనే పలు మార్లు మీడియాతో ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి.తెలంగాణ ప్రకటన తర్వాత సీఎం కిర ణ్ విభజనకు వ్యతిరేకంగా హైకమాండ్పై విమర్శలతో పాటు విద్యుత్తు, నీటి పంపకాలపై అనుమానాలు లేవనెత్తినప్పుడు డీఎస్ ఆయనపై ఘాటుగా స్పందించారు. తెలంగాణలో మరింతగా చాంపియన్ కావటం ద్వారా తొలి ముఖ్యమంత్రి పదవి సాధించే ప్రయత్నంలో భాగమేనన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వర్గాలతో పాటు జిల్లా రాజకీయ వాదుల్లో కూడా ఇదేవిషయంపై ప్రచారం జరుగుతోంది. సామాజిక కోటాపైనే షబ్బీర్, కేఆర్ల ఆశలు సామాజిక వర్గం నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి మాజీ మంత్రి, పార్టీ సమన్వయకర్త షబ్బీర్అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డిలకు దక్కవచ్చుననే అభిప్రాయం కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చెన్నారెడ్డి, కోట్లా విజయభాస్కర్రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో షబ్బీర్అలీ సభ్యుడుగా పనిచేశారు. సంక్షేమం, మైనార్టీ, విద్యుత్, బొగ్గు, సమాచార శాఖలను షబ్బీర్అలీ నిర్వహించారు. గతంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన గులాబినబీ ఆజాద్తో పాటు పలువురు జాతీయ నాయకులతో షబ్బీర్అలీకి సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మైనార్టీ వర్గానికి అవకాశం లభించినట్లయితే ఆ పీఠం దక్కవచ్చుననే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి కూడా సామాజిక వర్గంలో భాగంగానే సీఎం పీఠంపై ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించిన సందర్భంలో కాంగ్రెస్పార్టీ నుంచి సురేష్రెడ్డి ప్రతినిధిగా పాల్గొని తెలంగాణ వాణిని గట్టిగా వినిపించారు. అదే సామాజిక వర్గం నుంచి సీఎం రేసులో రాష్ట్ర సీనియర్ మంత్రి కె.జానారెడ్డితో పాటు అదే జిల్లాకుచెందిన మరో మంత్రి, గతంలో 610 జీవో అమలు కమిటీ చైర్మన్గా పనిచేసిన ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, పలువురు ముఖ్యనేతలు ఉండడం వల్ల సురేష్రెడ్డికి అవకాశాలు తక్కువేనన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతుంది.